అర్బన్ చెరువుల బాగుకు అడుగులు
లక్ష జనాభా పైబడిన నగరాలు, పట్టణాల్లోని చెరువులకు మంచి రోజులొచ్చాయి. వాటిని కాలుష్యానికి, ఆక్రమణలకు దూరంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వాలు సంకల్పించాయి. అలాంటి వాటిని ఎంపిక చేసి, అభివృద్ధి పనుల అంచనాలు తయారు చేసి
తెనాలి(కొత్తపేట), న్యూస్టుడే: లక్ష జనాభా పైబడిన నగరాలు, పట్టణాల్లోని చెరువులకు మంచి రోజులొచ్చాయి. వాటిని కాలుష్యానికి, ఆక్రమణలకు దూరంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వాలు సంకల్పించాయి. అలాంటి వాటిని ఎంపిక చేసి, అభివృద్ధి పనుల అంచనాలు తయారు చేసి పంపించాలని ఇటీవల ‘ఇంజినీర్ ఇన్ చీఫ్’ నుంచి కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఆదేశాలు అందాయి. దాంతో ఇంజినీర్లు వాటిని గుర్తించి, అభివృద్ది పనుల అంచనాలను రూపొందించి పంపించేందుకు కసరత్తు చేస్తున్నారు.
ఎన్జీటీ నుంచి మార్గదర్శకాలు
జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) లక్ష కన్నా ఎక్కువ జనాభా ఉన్న నగర, పురపాలికల్లోని తటాకాల్లోకి మురుగునీరు చేరకుండా, అలాగే అవి ఆక్రమణలకు గురికాకుండా చేయాలని తలపోసింది. ఈ మేరకు మార్గదర్శకాలు ఇచ్చి అమలు చేయాలని పాలికలను ఆదేశించింది. అయితే వాటి అమలుకు కమిషనర్లు ఏదో సాకు చెబుతూ దాటవేస్తూ వస్తున్నారు. ఈసారి ఎన్జీటీ కచ్చితంగా అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. దాంతో అధికారులు పాలికల్లోని మురుగునీరు చేరని, ఆక్రమణలకు గురికాని చెరువులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.
వాటి కట్టుదిట్టం ఇలా..
ప్రభుత్వం వాటిని అమృత్ పథకం రెండో విడత నిధులతో అభివృద్ధి చేయించేందుకు రంగం సిద్ధంచేస్తోంది. వాటికి చుట్టూ గోడలు నిర్మిస్తారు. వాటిని నీటితో నింపడానికి, నిండినపుడు బయటకు పంపడానికి ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేస్తారు. చుట్టుపక్కలున్న ఆవాస గృహాల సెప్టిక్ ట్యాంకుల్లోని వ్యర్థ జలాలు చేరకుండా కట్టుదిట్టం చేస్తారు. చెత్తా చెదారం కలవకుండా ప్రత్యేక ఏర్పాట్లుంటాయి. ఇక వాటిపై నివాసాలు, చిల్లర దుకాణాలు, బడ్డీలు, టీబంకులు, మాంసం, చేపల విక్రయ స్టాళ్లు ఏర్పడకుండా ప్రత్యేక నిఘా ఉంచుతారు. నిర్ణీత సమయంలో ఆ తటాకాల్లోని నీటిని సంబంధిత పరీక్ష కేంద్రాలకు పంపించి, నీరు కలుషితం అయిందో లేదో కూడా తెలుసుకుంటుంటారు. ప్రభుత్వం ఈ విధంగా నీటి వనరులను కాలుష్యానికి దూరంగా ఉంచేందుకు ఓ చక్కటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
ఎంపిక సవాలే
ఎన్జీటీ మార్గదర్శకాల అమలులో భాగంగా నగర, పురపాలికల కమిషనర్లు మురుగునీరు చేరని, ఆక్రమణలు లేని చెరువులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఉన్న చెరువుల్లో కొన్ని ఏదోవిధమైన ఆక్రమణకు గురైనవే. పైగా అనేక కొలనుల్లోకి మురుగు నీరు చేరుతోంది. అలా కాని వాటిని గుర్తించడం మున్సిపల్ అధికారులకు ఒక సవాల్గా మారింది. ఉదాహరణకు తెనాలి మున్సిపాలిటీలో చినరావూరు, రజకపేట చెరువులను ఉద్యానాలుగా తీర్చిదిద్దారు. అలాగే ఐతానగర్ చెరువు చుట్టూ ఆక్రమణలు వెలిశాయి. ఈ నేపథ్యంలో అధికారులు ఇప్పటికే కొంత మేర అభివృద్ధి పనులను చేయించిన పినపాడు చెరువును ఎన్జీటీ మార్గదర్శకాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని సంకల్పించారు. దాని అభివృద్ధికి అంచనాలు తయారు చేసి, పంపించే పనిలో ఉన్నారు. గుంటూరు, మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్ల అధికారులు కూడా ఇదే పనిలో తలమునకలయ్యారు.
ఇదో మంచి అవకాశం
ఎన్జీటీ మార్గదర్శకాల ప్రకారం చెరువులను అభివృద్ధి చేసే అవకాశం దక్కింది. దీన్ని చక్కగా వినియోగించుకొని, తటాకాలను అభివృద్ధి పరుచుకోవచ్చు. ఈ మేరకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలూ అందాయి.
- కొడాలి నాగమల్లేశ్వరరావు, మున్సిపల్ ఇంజినీరు, తెనాలి పురపాలక సంఘం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుంటూరు జిల్లాలో ప్రబలిన డయేరియా.. 100 మందికి పైగా అస్వస్థత
[ 19-04-2024]
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం మంచాలలో డయేరియా ప్రబలింది. వాంతులు, విరేచనాలతో గ్రామంలో 100 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. -
దశ‘దిశ’లా.. ఆక్రందనలే..!
[ 19-04-2024]
వైకాపా ప్రభుత్వ పదవీకాలం ముగుస్తున్నా ఇప్పటికీ ఆ చట్టానికి కోరలు లేవు. దాన్ని పార్లమెంట్ ఆమోదించలేదు. ఉనికిలో లేని చట్టం గురించి పదేపదే ప్రచారం చేసుకోవడం జగన్ సర్కార్ తీరుగా మారింది. -
జీవితాన్ని కలరా‘జే’సింది..
[ 19-04-2024]
రేపల్లెకు చెందిన మధు ప్రభుత్వ మద్యం తాగి పక్షవాతానికి గురై మంచానికి పరిమితమయ్యాడు. చేతివృత్తి చేసుకుంటూ భార్య ఇద్దరు పిల్లలను పోషించుకునే అతను మద్యం తాగేవాడు. -
సమస్యలు విలీనమై.. బడికి దూరమై..
[ 19-04-2024]
పాఠశాలల విలీనం వల్ల లాభం లేకపోగా టీచర్లకు, పిల్లలకు బాగా అన్యాయం జరిగింది. కొందరు టీచర్లు దూరాన ఉన్న ఉన్నత పాఠశాలలకు వెళ్లలేక పదోన్నతులు వదులుకోవడంతో నష్టపోయారు. అదేవిధంగా పిల్లల పరంగా చూస్తే సర్కారీ బడులకు దూరమయ్యారు. -
ఆరోగ్యం చిదిమేసి.. బతుకుల్ని బుగ్గి‘జే’సి..
[ 19-04-2024]
మద్యపాన నిషేధం చేస్తామని జగన్మోహన్రెడ్డి ఓట్లు దండుకుని తీరా అధికారంలోకి వచ్చాక ఆ మాటే మరిచారు. స్వయంగా ప్రభుత్వమే మద్యం వ్యాపారానికి తెరతీసింది. నాసిరకం మద్యం పోసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడింది. -
అండ నేనన్నావు.. గుదిబండలా మార్చావు..
[ 19-04-2024]
జిల్లాలో వైకాపా ప్రభుత్వ అయిదేళ్ల పాలనలో ఒక్క కొత్త పరిశ్రమ రాకపోగా ఉన్నవి చాలా వరకు మూతపడ్డాయి. పత్తి ఆధారిత పరిశ్రమలైన జిన్నింగ్ పూర్తిగా ఎత్తేయగా.. స్పిన్నింగ్ మిల్లులు అదే దిశగా నడుస్తున్నాయి. -
యువనేతపై ఉప్పొంగిన అభిమానం
[ 19-04-2024]
లోకేశ్ తరఫున నామినేషన్ పత్రాల సమర్పణ సందర్భంగా గురువారం మంగళగిరిలో జనసేన, భాజపా, తెదేపా, ఎమ్మార్పీఎస్ శ్రేణులు భారీ ప్రదర్శన నిర్వహించారు. -
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వినియోగానికి ఆటంకాలు
[ 19-04-2024]
వైకాపా ప్రభుత్వంపై ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. ఇదే అదనుగా పోలింగ్ విధుల్లో పాల్గొనే ఉద్యోగులు అందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోకుండా వ్యూహాత్మకంగా ఉన్నతాధికారులు ఆటంకాలు కలిగిస్తున్నారని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఆరోపిస్తున్నాయి. -
కోన ఆస్తుల విలువ రూ.24.20 కోట్లు
[ 19-04-2024]
బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే కోన రఘుపతి తన కుటుంబ ఆస్తుల విలువను రూ.24.20 కోట్లుగా గురువారం దాఖలు చేసిన ఎన్నికల నామినేషన్ అఫిడవిట్లో పేర్కొన్నారు. -
నలిగిపోతున్న నాలుగో సింహం
[ 19-04-2024]
ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ కల్పించడంలో పోలీసులు పగలు, రాత్రి కష్టపడుతుంటారు. శాంతిభద్రతలను పరిరక్షించే క్రమంలో సంఘ విద్రోహశక్తుల చేతిలో ప్రాణత్యాగాలకు సైతం వెనకాడరు. -
కర్షకుల కష్టాలు కనిపించవా..?
[ 19-04-2024]
పెదవడ్లపూడి ఉన్నత వాహినిపై ఎత్తిపోతల పథకం పూర్తి చేసి రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే ఆర్కే హామీ ఇచ్చారు. కానీ అమలు చేయడం మర్చిపోయారు. -
వైకాపా ప్రభుత్వ నిర్ణయ లోపం.. విద్యార్థులకు శాపం
[ 19-04-2024]
‘మీ పిల్లలు బడిలో భోజనం చేయకపోతే మీకు వస్తున్న ప్రభుత్వ పథకాలు నిలిచేపోయే అవకాశం ఉంది’అని తల్లిదండ్రుల సమావేశాల్లో ఉపాధ్యాయులు చెబుతున్నా.. నాణ్యత లేకపోవడంతో చాలా మంది విద్యార్థులు -
‘అవినీతి పాలనకు చరమగీతం పాడుదాం’
[ 19-04-2024]
అసమర్థ, అవినీతి పాలనకు చరమగీతం పాడుదామని గుంటూరు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. కొల్లిపరలో గురువారం సాయంత్రం నిర్వహించిన రోడ్షోలో ఆయన మాట్లాడుతూ వైకాపా పాలకులకు పోలవరం పట్టలేదు, -
ఎప్పటికి తొలగిస్తారో!
[ 19-04-2024]
పట్టణ పరిధి జీబీసీ రహదారిలో విద్యుత్తు స్తంభానికి సీఎం జగన్, స్థానిక ఎమ్మెల్యే రోశయ్య, వైకాపా నేతల ఫొటోలతో కూడిన బోర్డు ఉంది. -
మొదలైన నామినేషన్ల పర్వం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో గురువారం నుంచి జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల పర్వం మొదలైంది. ఈ క్రమంలో నెల రోజులుగా పలు విధాలుగా ప్రచార కార్యక్రమాలు చేపట్టిన పార్టీలు ఇప్పటికే నామినేషన్ పత్రాలు పూర్తి చేసి మంచి ముహూర్తం కోసం వేచి ఉన్నారు. -
ఫోన్పే చేయమన్నాడు.. అదృశ్యమయ్యాడు!
[ 19-04-2024]
అద్దంకి పురపాలక కార్యాలయం వద్ద మంచినీటి కుళాయి రుసుం చెల్లించేందుకు వచ్చిన వృద్ధుడ్ని ఓ ఘరానా దొంగ మోసగించాడు. ఈ సంఘటన గురువారం ఉదయం పురపాలక పన్నుల విభాగం వద్ద జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి