logo

బసవతారకం ట్రస్ట్‌కు రూ.10 లక్షల విరాళం

బసవతారకం ట్రస్ట్‌కు భాష్యం ప్రవీణ్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ప్రవీణ్‌ రూ.10 లక్షలు విరాళం అందజేశారు. ఇందుకు సంబంధించిన చెక్కును ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు గుంటూరు వచ్చిన సినీనటులు,

Updated : 22 May 2022 05:28 IST

పట్టాభిపురం, న్యూస్‌టుడే: బసవతారకం ట్రస్ట్‌కు భాష్యం ప్రవీణ్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ప్రవీణ్‌ రూ.10 లక్షలు విరాళం అందజేశారు. ఇందుకు సంబంధించిన చెక్కును ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు గుంటూరు వచ్చిన సినీనటులు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఇచ్చారు. ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల సందర్భంగా విరాళం ఇవ్వాలనుకున్నాం. ఈ నిధులను బసవ తారకం క్యాన్సర్‌ ఆసుపత్రికి వినియోగించాలని ప్రవీణ్‌ కోరారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు కుర్ర అప్పారావు, కొండ్రుగుంట శ్రీనివాసరావు, అర్తిమళ్ల విజయ్, చిట్టాబత్తిన చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని