logo

ఉప రాష్ట్రపతికి సత్కారం

సిరివెన్నెల సీతారామశాస్త్రి జయంతి సందర్భంగా తానా ప్రపంచ సాహిత్య వేదిక, సిరివెన్నెల కుటుంబం సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో శుక్రవారం రాత్రి నిర్వహించిన ‘సిరివెన్నెల సీతారామశాస్త్రి సమగ్ర సాహిత్యం

Updated : 22 May 2022 05:27 IST

న్యూస్‌టుడే, తెనాలి టౌన్‌: సిరివెన్నెల సీతారామశాస్త్రి జయంతి సందర్భంగా తానా ప్రపంచ సాహిత్య వేదిక, సిరివెన్నెల కుటుంబం సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో శుక్రవారం రాత్రి నిర్వహించిన ‘సిరివెన్నెల సీతారామశాస్త్రి సమగ్ర సాహిత్యం సంపుటి -1’ పుస్తకావిష్కరణ వేడుకకు ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమ స్పాన్సరర్‌గా వ్యవహరించిన తెనాలి ‘డబుల్‌ హార్స్‌ మినపగుళ్లు’ అధినేత మునగాల మోహన్‌శ్యామ్‌ప్రసాద్‌ను ఉప రాష్ట్రపతి అభినందించి, జ్ఞాపిక అందించారు. మోహన్‌శ్యాంప్రసాద్‌ ఉప రాష్ట్రపతిని ఘనంగా సత్కరించారు. ఈ వివరాలను డబుల్‌ హార్స్‌ ప్రతినిధులు శనివారం తెనాలిలో తెలిపారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని