పీఎఫ్ క్లెయిమ్స్కు మోక్షమెప్పుడో!
ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉపాధ్యాయ, పంచాయతీరాజ్ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్), ఉద్యోగ విరమణ ప్రయోజనాలకు సంబంధించిన క్లెయిమ్స్ పరిష్కారానికి నోచుకోక పెద్ద సంఖ్యలో పేరుకుపోయాయి. దీనికి నిధుల లేమి కారణమని తెలుస్తోంది. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, గృహాల కొనుగోలు కోసం దాచుకున్న భవిష్య నిధి రుణాలు (పీఎఫ్) అవసరానికి అక్కరకు రాకుండా పోతున్నాయనే భావన ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. ఈ రుణాలను ప్రభుత్వం లాగేసుకోవడం వల్లే ఈ పరిస్థితి అని, బాధ్యులైన అధికారులు మాత్రం సీఎఫ్ఎంఎస్లో బిల్లులు పెండింగ్ పడుతున్నాయని చెబుతున్నారు.
వేలదరఖాస్తులు పెండింగులో
ఈనాడు, అమరావతి
తెనాలి పెదరావూరుకి చెందిన సెకండరీ గ్రేడ్ టీచర్ ఒకరు తన భార్యకు హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేయించుకోవడానికి సిద్ధమయ్యారు. దీనికి ఈహెచ్ఎస్ వర్తించదని, ముందే చెల్లింపులు చేయాలని గుంటూరులో ప్రైవేటు ఆస్పత్రులు సూచించడంతో పీఎఫ్ రుణం పొంది హైదరాబాద్లో చేయించుకోవాలనుకున్నారు. ఇప్పటికీ క్లెయిమ్ మంజూరు కాలేదు. దీంతో శస్త్రచికిత్స వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.
ఎన్నో అవసరాలతో దరఖాస్తు చేసుకున్న వేల మంది ఉద్యోగుల పరిస్థితి ఇదే...
ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉపాధ్యాయ, పంచాయతీరాజ్ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్), ఉద్యోగ విరమణ ప్రయోజనాలకు సంబంధించిన క్లెయిమ్స్ పరిష్కారానికి నోచుకోక పెద్ద సంఖ్యలో పేరుకుపోయాయి. దీనికి నిధుల లేమి కారణమని తెలుస్తోంది. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, గృహాల కొనుగోలు కోసం దాచుకున్న భవిష్య నిధి రుణాలు (పీఎఫ్) అవసరానికి అక్కరకు రాకుండా పోతున్నాయనే భావన ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. ఈ రుణాలను ప్రభుత్వం లాగేసుకోవడం వల్లే ఈ పరిస్థితి అని, బాధ్యులైన అధికారులు మాత్రం సీఎఫ్ఎంఎస్లో బిల్లులు పెండింగ్ పడుతున్నాయని చెబుతున్నారు. వాటికి దరఖాస్తు చేసుకుని నెలల తరబడి ఎదురుచూసినా అవి బిల్లులకు నోచుకోవడం లేదని, అసలు ఎప్పుడొస్తాయో కూడా తెలియకుండా ఉన్నాయని ఉద్యోగులు వాపోతున్నారు. ప్రతి నెలా వందల సంఖ్యలో ఈ రుణాల కోసం ఉద్యోగులు దరఖాస్తు చేసుకుంటున్నారు. అవన్నీ నెలల తరబడి అపరిష్కృతంగా ఉండడంతో పరిష్కరించాల్సిన క్లెయిమ్స్ మొత్తాలు ఒక్క ఉమ్మడి గుంటూరులోనే సుమారు రూ.100 కోట్లు దాకా ఉండొచ్చని సమాచారం.
చివరిగాడిసెంబరులో...
చివరిగా గతేడాది డిసెంబరులో మాత్రమే ఒక చెక్కు పాసైందని, ఆ తర్వాత అనేక చెక్కులు రాసి పంపినా సీఎఫ్ఎంఎస్లో ఆమోదానికి నోచుకోక పెండింగ్ పడ్డాయని జడ్పీ ప్రావిడెంట్ ఫండ్ విభాగం ఉద్యోగులు తెలిపారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు సుమారు 1500 వరకు పీఎఫ్ పార్టు, ఫుల్ పేమెంట్లు కోరుతూ దరఖాస్తులు వచ్చాయి. వీటిల్లో మరికొన్ని డెత్ క్లెయిమ్స్ ఉన్నాయి. రుణాల కోసం దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్న మాట వాస్తవమేనని ధ్రువీకరించారు. జిల్లా, మండల పరిషత్ పాఠశాలల్లో పనిచేసే ఉపాద్యాయులు, నాన్ టీచింగ్ ఉద్యోగులు, పంచాయతీరాజ్ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు జడ్పీ ప్రావిడెంట్ విభాగం నుంచి పీఎఫ్ రుణాలు మంజూరవుతాయి. ఇప్పటికే రాసిన మూడు చెక్కుల్లో సుమారు 400-500 ఉద్యోగులకు చెందిన క్లెయిమ్స్ ఉంటాయి. అవి మంజూరు కాగానే మిగిలిన క్లెయిమ్స్కు చెక్కులు రాయాలనే యోచనలో జడ్పీ పావిడెంట్ ఫండ్ విభాగం ఉద్యోగులు ఉన్నారు. 20 ఏళ్ల సర్వీసు, 50 ఏళ్ల వయస్సు పైబడిన ఉద్యోగులు ఈ రుణాలను తీసుకుని తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఆ ఉద్దేశంతోనే పీఎఫ్ రుణాల కోసం ఎక్కువ మంది ఉద్యోగులు దరఖాస్తు చేస్తున్నారు.
దాచుకున్న రుణాలు ఇవ్వకపోవడం దుర్మార్గం
భవిష్యత్తు అసవరాలను దృష్టిలో పెట్టుకుని ఉపాధ్యాయులు తమ నెలవారీ జీతం నుంచి నిర్దేశిత మొత్తంలో పీఎఫ్ రుణం మినహాయించుకుని జీతాలు పొందుతున్నారు. ఈ దాచుకున్న రుణాలను అవసరానికి తీసుకోలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొనడం దురదృష్టకరం. గడిచిన రెండేళ్ల నుంచి అనేకసార్లు ఉన్నతాధికారులను కలిసి మా రుణాలు మాకివ్వడానికి నెలల తరబడి జాప్యం చేయటం ఏమిటని నిలదీసినా మార్పు రాలేదు. జడ్పీ ఖాతాలో నిధులు ఏ అవసరాలకు మళ్లించారో చెప్పడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్లో ఉన్న వేల దరఖాస్తులను పరిష్కరించకుంటే జడ్పీ పీఎఫ్ విభాగాన్ని ముట్టడిస్తాం.
- బసవలింగారావు, అధ్యక్షుడు, ఏపీటీఎఫ్, గుంటూరు
చాలా ఇబ్బంది పడుతున్నారు
కరోనా నేపథ్యంలో చేబదుళ్లు పుట్టడం లేదు. మార్కెట్లో అప్పులకు వెళితే నూటికి రూ.5 నుంచి రూ.10 వడ్డీ వసూలు చేస్తున్నారు. అంత వెచ్చించే పరిస్థితి ఉపాధ్యాయ, ఉద్యోగులకు ఉండదు. అందుకే ఏ అవసరం వచ్చినా పీఎఫ్ రుణం కోసమే ఎదురుచూస్తాం. ఇది ఇవ్వకుండా నెలల తరబడి తొక్కిపెట్టడం సరికాదు.
- పెదబాబు, అధ్యక్షుడు, ఎస్టీయూ, గుంటూరు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మంగళగిరిలో నారా లోకేశ్ నామినేషన్.. తెదేపా శ్రేణుల భారీ ర్యాలీ
[ 18-04-2024]
గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ స్థానానికి తెదేపా అభ్యర్థిగా నారా లోకేశ్ నామినేషన్ దాఖలు చేశారు. -
చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరిన భీమిలి, జీడీ నెల్లూరు వైకాపా నేతలు
[ 18-04-2024]
భీమిలి, జీడీ నెల్లూరు నియోజకవర్గాలకు చెందిన పలువురు వైకాపా నేతలు తెదేపా అధినేత చంద్రబాబు సమక్షంలో గురువారం ఆ పార్టీలో చేరారు. -
నీరివ్వలేని నీరో!
[ 18-04-2024]
సీఎం జగన్... పేదల పక్షపాతినంటారు.. ఎన్నికల్లో వారే తన స్టార్ క్యాంపెయినర్లంటారు.. వారి జీవితాలను బాగు చేసేది తనొక్కడేనంటూ గొప్పలకు పోతుంటారు.. కానీ.. తన నివాసానికి కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఉన్న మంగళగిరి ఎయిమ్స్లోని నిరుపేద రోగుల గొంతు తడపలేకపోతున్నారు. -
నారీ గళంతో జగన్ వెన్నులో వణుకు
[ 18-04-2024]
నారీ గళంతో జగన్ వెన్నులో వణుకు పుట్టాలని తెదేపా గుంటూరు ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు పశ్చిమ అభ్యర్థి గళ్లా మాధవి, తెలుగు మహిళ నాయకురాలు మాగంటి రూప, తెలంగాణ తెదేపా నాయకులు నన్నూరి నర్సిరెడ్డి పిలుపునిచ్చారు. -
కీలక ఘట్టానికి వేళాయె
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టం నేటి నుంచి ఆరంభం కాబోతోంది. గురువారం నుంచి అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేయనున్నారు. జిల్లాలో నామినేషన్ల స్వీకరణకు ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. -
నాడు ఆశల కేంద్రం.. నేడు విధ్వంసానికి నిలయం
[ 18-04-2024]
రాష్ట్ర విభజన తర్వాత తుళ్లూరు మండలంలో ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. గత తెదేపా ప్రభుత్వంలో రాత్రీ పగలు తేడా లేకుండా వేల మంది కార్మికులతో కళకళలాడిన అమరావతి వైకాపా పాలనలో విధ్వంసానికి చిరునామాగా మారింది. -
జీతాలకూ ఎదురుచూపులే..
[ 18-04-2024]
జిల్లాలోని ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి ఫిబ్రవరి, మార్చి జీతాలు రాలేదు. ఏప్రిల్ నెల జీతంతో కలిపి రెండు నెలల బకాయిలు విడులవుతాయన్న నమ్మకం లేదు. -
గుంటూరువాసికి క్రికెట్ సైట్ స్క్రీన్పై పేటెంట్
[ 18-04-2024]
జోసెల్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, జేకేసీ కళాశాల కార్యదర్శి, గుంటూరు జిల్లా మెన్, ఉమెన్ క్రికెట్ అసోసియేషన్ పూర్వ అధ్యక్షుడు, ఏసీఏ ఉమెన్స్ అకాడమీ పూర్వ ఛైర్మన్ జాగర్లమూడి మురళీమోహన్ నూతన ఆవిష్కరణకు పేటెంట్ లభించింది. -
శిరోముండనం కేసులో శిక్ష విధించడం హర్షణీయం
[ 18-04-2024]
శిరోముండనం కేసుల్లో నిందితులకు ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు జైలుశిక్ష, జరిమానా విధించడం హర్షణీయమని భీమ్ భారత్ రాష్ట్ర అధ్యక్షుడు పాగళ్ల ప్రకాష్ అన్నారు. -
ప్రాణం తీసిన ఈత సరదా
[ 18-04-2024]
స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన ఇంజినీరింగ్ విద్యార్థి నీట మునిగి మృతి చెందిన విషాదకర సంఘటన మండలంలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. -
సార్వత్రిక ఎన్నికలు సజావుగా నిర్వహిద్దాం
[ 18-04-2024]
పల్నాడు జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు హింస, రీపోలింగ్ లేకుండా విజయవంతం చేసేందుకు అధికారులు, సిబ్బంది సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శివశంకర్ కోరారు. -
విశ్రాంతిలోనూ.. మనశ్శాంతి లేదయ్యా!
[ 18-04-2024]
రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగి ప్రసాద్కు గతంలో ఒకటో తేదీనే పింఛన్ సొమ్ము బ్యాంకు ఖాతాలో జమ అయ్యేది. బీపీ, మధుమేహం సమస్యతో బాధపడుతున్న ఆయన నెల రోజులకు సరిపడా ఒకేసారి ఔషధాలు తెచ్చుకునేవారు. -
అయిదేళ్లుగా చోద్యం చూశారు!
[ 18-04-2024]
ఆంగ్లేయుల కాలంలో నిర్మించిన వంతెన ఇది. శిథిలావస్థకు చేరి అడుగు భాగం దిమ్మెలు పగుళ్లిచ్చాయి. ఇనుప రాడ్ల ఆధారంగా నిలబడింది. భారీ వాహనాలు ప్రయాణిస్తే దిమ్మెలు కదులుతున్నాయి. -
పోలీసు.. వైకాపాకు వత్తాసు
[ 18-04-2024]
సాధారణంగా ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసే తనిఖీ కేంద్రాలు(చెక్పోస్టులు) వద్ద ప్రత్యేకంగా సిబ్బందికి విధులు కేటాయిస్తారు. కానీ జిల్లాలో పోలీసుస్టేషన్లలో ఉండాల్సిన సీఐ, ఎస్సైలకు చెక్పోస్టు డ్యూటీలకు పంపడం చర్చనీయాంశమవుతుంది.
తాజా వార్తలు (Latest News)
-
సినిమాల్లేక ఖాళీగా కూర్చొనే వాళ్లే అలా ఆలోచిస్తారు: విశాల్
-
స్వదేశంలో జోఫ్రా ఆర్చర్ వరల్డ్ కప్ ఆడటం కష్టమేనా..?
-
లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం: కేసీఆర్
-
ఆ దేశమంతా వర్క్ ఫ్రమ్ హోమ్.. కారణమేమిటంటే..?
-
ఆర్థికంగా ఇబ్బంది పడ్డా.. కమల్ స్క్రిప్ట్ మార్చేసేవారు: లింగుస్వామి కామెంట్స్
-
బాలీవుడ్ నటుడు రణ్వీర్సింగ్ ఏఐ వీడియో వైరల్