పంచాయతీ నిధులు మింగేశారు..!
ఆడిట్ సిబ్బంది నుంచి ప్రత్యేక అధికారికి నోటీసులు
కొల్లిపర, న్యూస్టుడే
కొరవడిన అధికారుల పర్యవేక్షణ, సిబ్బంది చేతివాటం ఆ పంచాయతీని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టింది. కొల్లిపర మండలంలోని మున్నంగి మేజరు పంచాయతీ. ఆర్థిక పరిపుష్టికి లోటు లేదు. విలాసవంతమైన భవనాలు, ఆర్థిక వనరులు ఇక్కడ మెండు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.11.30 లక్షలు, 2020-21లో రూ.12 లక్షల మేర ఇంటిపన్నుల రూపంలో గ్రామస్థుల నుంచి వసూలు చేశారు. నూరుశాతం ఇంటిపన్ను వసూలు చేసిన పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది సంబంధిత నిధులను ప్రభుత్వ ఖాతాల్లో జమచేయలేదు.
రూ.లక్షల నిధులకు లెక్కలు చూపలేదాయె..: పంచాయతీకి ప్రజలు చెల్లించిన సొమ్ము, ప్రభుత్వ కేటాయింపుల వివరాలు తెలిపే పంచాయతీ క్యాష్బుక్, రికార్డుల జాడ లేకుండాపోయాయి. కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి గత సంవత్సరం నవంబరులో సెలవు పెట్టుకున్నారు. మరో మాసం గడువు అనంతరం సిబ్బంది జీతభత్యాలను గుట్టుగా చెల్లించేందుకు సంతకాలు పెట్టాడన్న విమర్శలున్నాయి. 2022 జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ మాసాల్లో సెలవులోనే ఉన్నారు. మండల స్థాయి అధికారులు మార్చి, ఏప్రిల్ మాసాల్లో కార్యదర్శిని విధులకు హాజరు కావాలంటూ నోటీసులు జారీచేసినా స్పందన లేకపోయింది. ఫిబ్రవరి 24న సంబంధిత పంచాయతీ నిర్వహణ నిమిత్తం మరో కార్యదర్శికి తాత్కాలిక బాధ్యతలను మండల స్థాయి అధికారులు అప్పగించారు. బాధ్యతలు తీసుకున్న కార్యదర్శికి గతంలో విధులు నిర్వహించిన కార్యదర్శి రికార్డులు, క్యాష్ పుస్తకాలు, ఇతర ఆర్థిక వివరాలను అప్పగించలేదు.
తాఖీదుల అందజేత
పంచాయతీకి ప్రత్యేక అధికారిగా బాధ్యతలు నిర్వహించిన మండల విద్యాశాఖాధికారికి ఆడిట్ అధికారుల నుంచి తాఖీదులు అందాయి. నిధుల వినియోగంపై సమగ్ర విచారణ జరపాలంటూ నోటీసులు అందచేశారు. వివరాలు తెలిపే పుస్తకాలు, విధులు నిర్వహించే కార్యదర్శి అందుబాటులో లేకపోవడంతో ప్రత్యేక అధికారిగా బాధ్యతులు నిర్వహించిన మండల విద్యాశాఖాధికారి విషయాన్ని ఉన్నతాధికారులకు మొరపెట్టుకోవాల్సి వచ్చింది.
కార్యదర్శి, సిబ్బంది చేతివాటం
రికార్డులను అప్పగించకుండా కార్యదర్శి సెలవుపై వెళ్లడంతో సిబ్బంది చేతివాటానికి అవకాశం దొరికింది. లక్షల్లో దోచుకున్నది పంచాయతీ కార్యదర్శా? సిబ్బందా అనే విషయం తేలాల్సి ఉంది. ఆడిట్ సమస్యలు తలత్తెడం, గుత్తేదారులు, పారిశుద్ధ్య సిబ్బందికి చెల్లింపులు నిలిచిపోవడంతో సమస్య వెలుగులోకి వచ్చింది. సుమారు 15 నుంచి 16 లక్షల రూపాయల నిధులు స్వాహా చేశారన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో పంచాయతీలో పనిచేస్తున్న సదరు ఉద్యోగి రూ.5.15 లక్షల నిధులు ఏకమొత్తంలో ట్రెజరీలో చెల్లింపులు చేయడం విమర్శలకు బలాన్ని చేకూర్చుతున్నాయి. 2019-20, 2020-21 ఆర్థిక సంవత్సరాల లెక్కలు తాలూకు సుమారు రూ.9 లక్షలు నిధులు ఇప్పటికీ జమకాలేదు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (25-06-2022)
-
World News
Antonio Guterres: ఆహార కొరత.. ప్రపంచానికి మహా విపత్తే : ఐరాస చీఫ్ హెచ్చరిక
-
India News
50 States: ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలు.. కర్ణాటక మంత్రి సంచలన వ్యాఖ్యలు
-
Sports News
Bizarre Dismissals: క్రికెట్లో విచిత్రమైన ఔట్లు.. వీటిపై ఓ లుక్కేయండి..!
-
General News
cardiac arrest: అకస్మాత్తుగా గుండె ఆగిపోయినపుడు ఏం చేయాలి..?
-
Politics News
Maharashtra Crisis: క్యాన్సర్ ఉన్నా.. శివసేన నన్ను పట్టించుకోలేదు: రెబల్ ఎమ్మెల్యే భావోద్వేగం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- US: అబార్షన్ హక్కుపై అమెరికా సుప్రీం సంచలన తీర్పు
- 50 States: ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలు.. కర్ణాటక మంత్రి సంచలన వ్యాఖ్యలు
- Triglycerides: ట్రైగ్లిజరైడ్ కొవ్వును కరిగించేదెలా అని చింతించొద్దు
- Google Play Store: ఫోన్లో ఈ ఐదు యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేసుకోండి!
- Covid Endemic: కరోనా మహమ్మారి ఎండెమిక్ దశకు వచ్చినట్లేనా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే
- Maharashtra: హోటల్ నుంచి పారిపోయి వచ్చా.. శివసేన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
- Maharashtra Crisis: క్యాన్సర్ ఉన్నా.. శివసేన నన్ను పట్టించుకోలేదు: రెబల్ ఎమ్మెల్యే భావోద్వేగం
- Social Look: నయన్- విఘ్నేశ్ల ప్రేమ ‘క్లిక్’.. వేదిక పంచ్!
- Pawan kalyan: బాలినేనీ.. మీ అనుచరులకు ఇది పద్ధతి కాదని చెప్పండి: పవన్ కల్యాణ్
- Droupadi Murmu: గృహహింసను దాటుకొని, అత్యున్నత పదవికి పోటీలో నిలిచి..!