వరుడి ఇంటి ముందు వధువు బంధువుల ధర్నా
‘వరుడిపై కేసులు నమోదయ్యాయి. ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశంలేదు. కుదుర్చుకున్న వివాహం రద్దు చేసుకుందాం. ముందుగా ఇచ్చిన కట్నం నగదు రూ.2.25 లక్షలు ఇవ్వాలంటూ’ వధువు బంధువులు వరుడి ఇంటి వద్ద రహదారిపై ధర్నాకు
ధర్నా చేస్తున్న వారితో మాట్లాడుతున్న ఎస్సై సత్యనారాయణ
పాతరెడ్డిపాలెం(చేబ్రోలు), న్యూస్టుడే: ‘వరుడిపై కేసులు నమోదయ్యాయి. ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశంలేదు. కుదుర్చుకున్న వివాహం రద్దు చేసుకుందాం. ముందుగా ఇచ్చిన కట్నం నగదు రూ.2.25 లక్షలు ఇవ్వాలంటూ’ వధువు బంధువులు వరుడి ఇంటి వద్ద రహదారిపై ధర్నాకు దిగారు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం పాతరెడ్డిపాలెం గ్రామానికి చెందిన పవన్ కుమార్కు బాపట్ల జిల్లా చుండూరు మండలం ఆలపాడు గ్రామానికి చెందిన యువతితో పెళ్లి సంబంధం కుదుర్చుకుని సోమవారం ఉదయం వివాహ ముహూర్తం పెట్టుకున్నారు. పవన్ కుమార్ అప్పటికే అదే ప్రాంతానికి చెందిన మైనర్ బాలికతో ప్రేమ వ్యవహారం నడుపుతున్నారు. విషయం తెలుసుకున్న ప్రేమికురాలు పవన్ కుమార్ను నిలదీశారు. ఇంట్లో వారు తమ వివాహానికి ఒప్పుకోవడం లేదని, ఇద్దరు కలసి పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. శనివారం గుంటూరు సమీపంలోని పెదపలకలూరు ఇంజినీరింగ్ కళాశాలలో తను ఇంటర్మీడియట్ పరీక్ష రాసే కేంద్రం వద్దకు రావాలని కబురు చేసింది. అతను ఎంతసేపటికీ రాకపోవడంతో భవనంపై నుంచి ఆత్యహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో ఆదివారం నల్లపాడు పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. సోమవారం ఆలపాడు నుంచి వధువు వారి బంధు వర్గం పాతరెడ్డిపాలెం చేరుకున్నారు. పవన్ కుమార్ బంధువులు పెళ్లి సమయానికి తీసుకువస్తామని నచ్చజెబుతూ మధ్యాహ్నం వరకు కాలయాపన చేశారు. అతడిపై పలు సెక్షన్లతో కేసులు నమోదు అయ్యాయని తెలుసుకుని వివాహం రద్దు చేసుకుందామని వధువు బంధువర్గం కోరారు. ముందుగా ఇచ్చిన కట్నం నగదు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పవన్ కుమార్ తల్లిదండ్రులు తమ వద్ద లేవని చెప్పడంతో ఆగ్రహించిన బంధువులు ముట్లూరు రోడ్డులో ధర్నాకు దిగారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై సత్యనారాయణ ఇరువర్గాలకు నచ్చ చెప్పి ధర్నాను విరమింపజేశారు. అతడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ప్రేమ పేరిట వంచన: నిందితుడిపై కేసు
గ్రామీణ గుంటూరు: ప్రేమ పేరిట యువతిని మోసం చేసిన యువకుడిపై నల్లపాడు పోలీసులు 376 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన మేరకు.. చేబ్రోలు మండలంలలోని పాతరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పవన్ కుమార్ అదే మండలానికి చెందిన ఓ యువతిని కొన్నేళ్లుగా ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. చివరికి అతను తనను వంచనకు గురిచేశాడని తెలుసుకున్న బాధితురాలు మూడు రోజుల క్రితం గుంటూరు శివారులోని ఓ ప్రైవేటు కళాశాల భవనం పైనుంచి కిందికి దూకి ఆత్మహత్యకు యత్నించింది. ఆమె జీజీహెచ్లో చికిత్స పొందుతోంది. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పల్నాడు జిల్లాలో 342 నామినేషన్లు
[ 26-04-2024]
నామినేషన్ల స్వీకరణలో ఆఖరి రోజైన గురువారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 89 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తా
[ 26-04-2024]
వైకాపాను వీడి తెదేపాలో చేరతావా? ఎన్నికల రోజు ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తానంటూ వైకాపా నాయకులు తెదేపా సానుభూతిపరుడిపై దాడికి పాల్పడిన ఘటన గురువారం పల్నాడు జిల్లా కారంపూడి మండలం చింతపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. -
పోస్టల్ బ్యాలట్ వినియోగానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు
[ 26-04-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహిస్తూ మే 13న పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు వేసే అవకాశం లేని అధికారులు, ఉద్యోగులు పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.