పురపాలికల్లో పనులకు.. గుత్తేదారుల రాంరాం..
పూర్తయిన పనులకు బిల్లులు చెల్లించడం లేదు.. చేపట్టాల్సిన పనులకు అవసరమైన మేరకు సిమెంటు ఇవ్వకుండా యంత్రాంగం గుత్తేదారులను ఇబ్బంది పెడుతోంది. రహదారుల నిర్మాణాలకు
సిమెంటు ఇవ్వరు, బిల్లులు చెల్లించరని ఆవేదన
విజిలెన్స్ భయం!
ఈనాడు, అమరావతి
గుంటూరులోని రామనాథక్షేత్రం రహదారి పనులు అసంపూర్తిగా..
పూర్తయిన పనులకు బిల్లులు చెల్లించడం లేదు.. చేపట్టాల్సిన పనులకు అవసరమైన మేరకు సిమెంటు ఇవ్వకుండా యంత్రాంగం గుత్తేదారులను ఇబ్బంది పెడుతోంది. రహదారుల నిర్మాణాలకు ఏమాత్రం వినియోగించని రెండో రకం సిమెంట్ ఇచ్చి పనులు నిర్వహించాలని కోరడంపై గుత్తేదారుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇలాగైతే పనులు చేయలేమని చెప్పి ఏకంగా వారు పనుల జోలికి వెళ్లడం లేదు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో చాలా వరకు నగర, పురపాలికల్లో అభివృద్ది పనులు నిలిచిపోవటంతో ఇంజినీరింగ్ అధికారులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. అసలు రానున్నది వర్షాకాలం కావడంతో ఆ సీజన్లో పల్లపు ప్రాంతాలు ముంపునకు గురికాకుండా.. డ్రెయిన్లలో పూడికలు తీసే పనులకు ప్రస్తుతం టెండర్లు పిలిచారు. ఆ పనులను సైతం నిలుపుదల చేయడంతో వర్షాలు వచ్చే వేళ నగర, పట్టణాలపై ప్రభావం పడుతుందని ఇంజినీరింగ్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.
రహదారుల నిర్మాణ పనులకు ఓపీసీ 53 గ్రేడ్ సిమెంట్ వాడతారు. దానికి బదులు పీపీసీ సిమెంట్ సరఫరా చేస్తామంటున్నారు. దీంతో రహదారులు నిర్మిస్తే నాణ్యత లోపిస్తుంది. ఇది సాకుగా చూపి బిల్లులు ఆపేయటం, విజిలెన్స్ విచారణకు ఆదేశించటం వంటివి చేస్తారని ముందుగానే గుత్తేదారులు అప్రమత్తమయ్యారు. ఓపీసీ సిమెంటు సరఫరా చేయకపోతే పనులు చేయలేమని తమ అభిప్రాయాన్ని అధికారులకు తెలియజేశారు. పీపీసీ సిమెంటు అనేది డ్రెయిన్లు, బెడ్ కింద పనుల్లోనే వాడతారని చెబుతున్నారు. ‘ఈ నెల 17 నుంచి ఓపీపీ సిమెంటు ధరలు పెంచారు. అయినా తాము అంగీకరించి అదే సిమెంటు కోరుతూ డిమాండ్ డ్రాఫ్ట్లు తీసి పంపుతున్నాం. కానీ సరకు మాత్రం రావటం లేదు. ప్రత్యామ్నాయంగా పీపీసీ సిమెంటు తీసుకుని దాంతో నిర్మాణ పనులు చేయాలని అధికారులు కోరుతున్నారని’ గుత్తేదారవర్గాలు అంటున్నాయి.
గుంటూరులో మరీ విచిత్రం
* గుంటూరు నగరపాలకలో భూగర్భ డ్రైనేజీ పనులు(యూజీడీ) పూర్తికాక రోడ్లు ఎక్కడిక్కడ తవ్వి వదిలేశారు. దీంతో వర్షాలు పడితే నగరం అంతా బురదమయమవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని వర్షాలు రాక మునుపే కనీసం కొన్ని రహదారులైనా నిర్మించి ప్రజలకు అసౌకర్యం లేకుండా చూడాలని, ప్రధాన డ్రెయిన్లలో పూడికతీత పనులు ఈ సీజన్లో చేపట్టాల్సి ఉంది. ఆ పనులు చేయటానికి గుత్తేదారులు ముందుకు రావడం లేదు. వీటికి సంబంధించి కొన్ని పనులకు రెండు, మూడుసార్లు టెండర్లు పిలిచినా గుత్తేదారులు పాల్గొనటం లేదు. దీంతో ఇంజినీరింగ్ వర్గాల్లో ఆందోళన నెలకొంది.
* పనులు నిర్వహించిన తర్వాత ఎంబుక్కు రికార్డు చేయాలి. తర్వాత మరోసారి ఆ పనుల నాణ్యతను పరిశీలించి బిల్లులు చెల్లించడానికి సిఫార్సు చేయాలి. సెక్టోరియల్ అధికారులతో (ఇంజినీరింగ్ యేతర) కమిటీ వేసి ఆ మేరకు బిల్లులు చెల్లించాలని కమిషనర్ నిర్ణయించారు. ఈ విధానంతో బిల్లుల చెల్లింపు బాగా ఆలస్యమవుతోంది. తమకు నాణ్యత గురించి ఏం తెలుస్తుందని, తామెలా సిఫార్సు చేస్తామంటూ సెక్టోరియల్ అధికారులు బిల్లులపై సంతకాలు చేయటం లేదు. ఈ కారణాలతో సుమారు రూ.6-7 కోట్ల బిల్లులు రావాల్సి ఉందని కాంట్రాక్టర్స్ అసోసియేషన్ వర్గాలు తెలిపాయి. ‘రహదారుల నిర్మాణానికి వినియోగించాల్సిన ఓపీసీ 53 గ్రేడ్కు బదులు పీపీసీ సిమెంటు ఇచ్చి పనులు చేయమంటున్నారు. వాటితో పనులు చేస్తే నాణ్యత లోపించి చివరకు గుత్తేదారులను బ్లాక్ లిస్టులో పెట్టి ఇబ్బందులకు గురిచేస్తారని’ జిల్లా వ్యాప్తంగా పురపాలికల్లో పనులు నిలిపివేశామని కాంట్రాక్టర్లు ధ్రువీకరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోడ్ ఉన్నా.. అంబటికి లేనట్లే!
[ 28-03-2024]
ఎన్నికల నిబంధనలు అధికార పార్టీకి వర్తించవా.. ప్రతిపక్ష పార్టీలకే వర్తిస్తాయా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సాక్షాత్తు వైకాపా అభ్యర్థి నిబంధనలు ఉల్లంఘించి సమావేశాలు ఏర్పాటు చేశారు. -
ప్రవర్తన నియమావళి అమలుకు ప్రాధాన్యం : కలెక్టర్
[ 28-03-2024]
జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుకు ప్రాధాన్యం ఇచ్చి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ శివశంకర్ తెలిపారు. -
‘వైకాపాకు ఓటేస్తే అభివృద్ధిని అడ్డుకున్నట్లే’
[ 28-03-2024]
వైకాపా అరాచక పాలనతో ప్రజలు విసిగి పోయారని తాడికొండ నియోజకవర్గం తెదేపా మహిళా అధ్యక్షురాలు మైని గిరిజ పేర్కొన్నారు. -
‘వైకాపా నుంచి విముక్తికి ఎదురుచూస్తున్న ప్రజలు’
[ 28-03-2024]
వైకాపా ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని గుంటూరు పార్లమెంట్ తెదేపా ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. -
మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం విఫలం
[ 28-03-2024]
పట్టణ ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ పేర్కొన్నారు -
పట్టుతప్పితే.. ప్రాణాలు గల్లంతే
[ 28-03-2024]
దారుణంగా దెబ్బతిన్న రహదారి. పాదచారులే ప్రాణాలు అరచేత పట్టుకుని రాకపోకలు సాగించాల్సిన చోట ఇక వాహనదారుల సంగతి చెప్పాల్సిన పనే లేదు. ఎదురుగా ద్విచక్ర వాహనం వచ్చినా దిక్కుతోచని స్థితి వాహనదారులది -
నిధులు దోచేయ్
[ 28-03-2024]
అద్దంకి నియోజకవర్గంలోని ఓ మండలంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ చేతివాటం ప్రదర్శించి, అధికార వైకాపా నాయకుల అండదండలతో పనులు చేయకుండా భారీగా బిల్లులు మింగేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. -
ఆగని వాలంటీర్ల ప్రచారం
[ 28-03-2024]
పోటీలో ఉన్న అభ్యర్థుల తరఫున ప్రచారం చేయకూడదని ఎన్నికల సంఘం ఎంతచెప్పినా పలు గ్రామాల్లో వాలంటీర్లు ప్రచారం చేస్తూనే ఉన్నారు. -
మరో 52 మంది వాలంటీర్ల తొలగింపు
[ 28-03-2024]
ఈనెల 16న ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి అంబటి మురళీకృష్ణ చేబ్రోలు, పెదకాకానిలో వాలంటీర్లతో సమావేశం నిర్వహించారు -
ఆర్టీసీ నగరబాట హామీ.. నగుబాటేనోయి!
[ 28-03-2024]
గుంటూరు నగరంలో 11 లక్షల మంది నివసిస్తున్నారు. రోజు వారీగా లక్ష మందికి పైగా రాకపోకలు సాగిస్తుంటారు. 159 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో నగరం విస్తరించింది -
నేతలకు లబ్డబ్బు
[ 28-03-2024]
ఉమ్మడి గుంటూరు జిల్లాలో జనవరి నెల నుంచి ఎన్నికల సందడి మొదలైంది. టికెట్ల ఖరారు కాక ముందే ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారాలు మొదలుపెట్టారు. -
లక్ష్మీకటాక్షం ఉంటేనే దస్త్రం కదిలేది
[ 28-03-2024]
జిల్లాలో కీలకమైన రెవెన్యూ డివిజన్ ఇది. రూ.కోట్ల విలువైన భూముల దస్త్రాలు పరిష్కారానికి వస్తుంటాయి. వాటిని పరిశీలించి దరఖాస్తుదారులకు అనుకూలంగా రాయాలన్నా.. అన్నీ సక్రమంగా ఉన్నా ఉన్నతాధికారికి పంపాలన్నా పైకం ముట్టజెప్పితే కానీ ముందుకు కదలని పరిస్థితి
తాజా వార్తలు (Latest News)
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం