నీటి నాణ్యతలో లోపాలు..!
నగర, పురపాలికల్లో వార్డు ఎమినిటీస్ కార్యదర్శులు నిత్యం సేకరిస్తున్న తాగునీటి నమూనాలను విశ్లేషిస్తే కొన్నిచోట్ల క్లోరిన్ శాతాలు తగ్గుముఖం పట్టడం వంటి లోపాలు బయటపడుతున్నాయి. కానీ ప్రజలు మాత్రం తమకు సరఫరా అవుతున్న నీరు బురదగా వస్తున్నాయని, నీళ్లు
ప్రాంతీయ ప్రయోగశాల అధికారుల పరిశీలనలో వెల్లడి
ఈనాడు, అమరావతి
శీతలపానీయాల సీసాలో నీళ్లు పట్టుకురాగా పరీక్ష చేయబోమని తిరస్కరిస్తున్న సిబ్బంది
నగర, పురపాలికల్లో వార్డు ఎమినిటీస్ కార్యదర్శులు నిత్యం సేకరిస్తున్న తాగునీటి నమూనాలను విశ్లేషిస్తే కొన్నిచోట్ల క్లోరిన్ శాతాలు తగ్గుముఖం పట్టడం వంటి లోపాలు బయటపడుతున్నాయి. కానీ ప్రజలు మాత్రం తమకు సరఫరా అవుతున్న నీరు బురదగా వస్తున్నాయని, నీళ్లు రుచిగా ఉండటం లేదని, నలకలు ఉంటున్నాయని ఇలా అనేక కారణాలు చెబుతున్నారు. దీంతో గుంటూరులోని ప్రాంతీయ నీటి ప్రయోగశాల (రీజనల్ టెస్టింగ్ ల్యాబ్) అధికారులు నమూనాలు సేకరించి నాణ్యతను పరిశీలిస్తే మరికొన్ని నాణ్యత లోపాలు వెలుగులోకి వచ్చాయి.
పైపుల లీకేజీతో సరఫరా అయిన పచ్చని నీటి నమూనాలు పరీక్షలకు సిద్ధంగా...
* గుంటూరు నగరపాలకలో బీఆర్ స్టేడియం, కోర్టు రోడ్లో మెడికల్ కాలేజీ వద్ద, లక్ష్మీపురం రిజర్వాయర్ల ప్రాంతాల్లో పైపులకు లీకులు ఏర్పడి నీళ్లు బురదగా వస్తున్నాయని గుర్తించి నగరపాలక ఇంజినీరింగ్ విభాగాన్ని అప్రమత్తం చేశారు. స్పందించిన నగరపాలక అధికారులు ఇటీవల రెండు రోజులు నగరం అంతటా నీటి సరఫరా నిలుపుదల చేసి ఆ లీకులకు మరమ్మతులు నిర్వహించి లోపాలను సరిదిద్దుకున్నారు. ఒక్క గుంటూరులోనే కాదు.. పొన్నూరు పురపాలికలో సమ్మర్ స్టోరేజీ ట్యాంకులో నీళ్లు మొత్తం పచ్చగా మారిపోయాయి. వాటినే సరఫరా చేస్తున్నారు. అక్కడి నుంచి నమూనాలు పట్టుకొచ్చి పరీక్షించారు. పాచి ఎక్కువగా పేరుకుపోవడంతో రంగు మారిపోతోందని, ఆ నీళ్లు తాగితే వ్యాధులు వస్తాయని హెచ్చరించడంతో ఆ ట్యాంకును ఇటీవల కాఫర్ సల్ఫేట్తో శుభ్రపరిచారు. సమస్య పరిష్కారమైంది.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో గుంటూరు, మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సహా తెనాలి, పొన్నూరు, నరసరావుపేట పట్టణాల్లో ఇప్పటి వరకు నమూనాలు సేకరించామని ప్రాంతీయ ప్రయోగశాల విశ్లేషకులు తెలిపారు. ఇంకా రేపల్లె, బాపట్ల, సత్తెనపల్లి, చిలకలూరిపేట, నరసరావుపేట, పిడుగురాళ్ల, వినుకొండ, మాచర్ల పురపాలికల నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించాల్సి ఉందన్నారు. వర్షాలు పడి నేరుగా కృష్ణా నది, సాగర్, పులిచింతల నుంచి పంపింగ్ అయి నీళ్లు వచ్చే వరకు ఇంజినీరింగ్ విభాగం నిత్యం జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని సూచించారు. అధికారులు, ప్రజలు ఎవరైనా నీటి నమూనాలను స్టెరిలైజ్ చేసిన నీటి క్యాన్లలో కనీసం లీటర్కు తగ్గకుండా తీసుకురావాలి. కొందరు శీతల పానీయాల సీసాలు, కెమికల్స్ బాటిళ్లలో నింపి తీసుకొస్తున్నారు. వాటిల్లో తెస్తే కచ్చితమైన ఫలితాలు రావని అధికారులు పేర్కొన్నారు.
క్లోరిన్ తగ్గకూడదు
గుంటూరు, మంగళగిరి-తాడేపల్లి నగరపాలికల్లో కొన్ని శివారు కాలనీల్లో క్లోరిన్ శాతం బాగా తగ్గుతోందని ఎమినిటీస్ సెక్రటరీల పరిశీలనలో తేలింది. సాధారణంగా చివరి వినియోగదారుడి (యండ్ యూజర్) ఇంటి వద్దకు వెళ్లే సరికి క్లోరిన్ అనేది 0.2 నుంచి 0.5 మధ్య ఉండాలి. అంతకన్నా తగ్గితే ఆ నీటిలో నాణ్యత లోపాలు చోటుచేసుకుంటాయి. బ్యాక్టీరియా వంటి క్రిములు నీళ్లల్లో కలిసి ప్రవహిస్తాయి. ఇది ప్రమాదకరమని అధికారులు చెబుతున్నారు. ‘ప్రస్తుతం ప్రతి వార్డు ఎమినిటీస్ సెక్రటరీ వద్ద క్లోరిన్ శాతాలు వెంటనే తెలుసుకోవటానికి మీటర్లు ఉన్నాయి. ఎక్కడైనా క్లోరిన్ శాతాలు తగ్గితే వెంటనే సమస్యను అధిగమించటానికి ఎమినిటీస్ సెక్రటరీలు ప్రతి రోజూ నివేదిక ఇస్తున్నారు. గుంటూరు నగరపాలకలో నిత్యం సగటున 800 నుంచి 1000 నమూనాలు సేకరిస్తున్నాం. క్లోరిన్, ఆమ్లం వంటివి లోపించినట్లు చాలా తక్కువ నమూనాల్లోనే వస్తున్నాయని’ ఇంజినీరింగ్ వర్గాలు తెలిపాయి.
ఇన్నర్ రింగ్రోడ్లో ఫ్లోరైడ్...
గుంటూరు మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్రోడ్, గోరంట్ల, రెడ్డిపాలెం ప్రాంతాల్లో ఫ్లోరైడ్ శాతాలు వెలుగులోకి వచ్చాయి. ఇక్కడ ఎలాంటి నీటి వనరులు లేవు. భూగర్భ జలాలే దిక్కు. ఇటీవల ఆ ప్రాంతం నుంచి బోర్లు వేయించుకోవడానికి నమూనాలు తీసుకొచ్చి పరీక్షలు చేయిస్తే లీటర్ నీటిలో ఫ్లోరైడ్ శాతం 2.6 మిల్లీ గ్రాములు ఉంది. ఇది చాలా ప్రమాదకరమని, ఈ నీళ్లు కనీసం ఇంట్లో బియ్యం, పప్పులు వంటివి కడుక్కోవటానికి కూడా పనికిరావని హెచ్చరించారు. సాధారణంగా లీటర్ నీటిలో ఫ్లోరైడ్ కంటెంట్స్ గరిష్ఠంగా 1.5 మిల్లీ గ్రాములకు లోపు ఉండాలి. కానీ ఇన్నర్ రింగ్రోడ్లో ఈ శాతాలు ఏకంగా 2.5 మిల్లీ గ్రాములకు పైగా ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు
[ 23-04-2024]
రాష్ట్రంలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. -
జగన్.. దేనికి సిద్ధం? మళ్లీ రూ.7లక్షల కోట్లు అప్పు చేయడానికా: షర్మిల
[ 23-04-2024]
ఐదేళ్లలో ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వలేని జగన్.. మళ్లీ ప్రజల్ని మోసం చేయడానికి సిద్ధం అంటున్నారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఎద్దేవా చేశారు. -
తెదేపా నేతపై ఎస్ఐ అనుచిత వ్యాఖ్యలు.. ఎస్పీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే
[ 23-04-2024]
బాపట్ల జిల్లా పర్చూరులో కూటమి అభ్యర్థి ఏలూరి సాంబశివరావు నామినేషన్ సందర్భంగా ఎస్సై శివనాగిరెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించారు. -
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
[ 23-04-2024]
శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. -
వైకాపాకు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ రాజీనామా
[ 23-04-2024]
వైకాపాకు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ చిరంజీవి రెడ్డి రాజీనామా చేశారు. -
జగనన్న సమర్పించు.. గోతుల రాజ్యం!
[ 23-04-2024]
జగనన్న పాపాలు ఎన్నని చెప్పేది.. ఎందెందు వెతికినా.. అన్నింటా లోపాలే.. అన్నిచోట్లా అసమర్థ పాలనే! రోడ్లను చూడండి... రాళ్లు తేలి.. గుంతలు పడి... బీటలువారి.. కనీసం ద్విచక్ర వాహనమైనా ముందుకు కదల్లేని దుస్థితి. -
పదిలో పైచేయి అమ్మాయిలదే
[ 23-04-2024]
పదో తరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లా విద్యార్థులు 88.19 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో బాలికల హవా స్పష్టంగా కనిపించింది. బాలికలు 90.1 శాతం ఉత్తీర్ణులు కాగా, బాలురు 86.32 శాతం ఉత్తీర్ణులయ్యారు. -
అమ్మఒడి సాయంలో మామ కోతలు
[ 23-04-2024]
ప్రజాధనాన్ని పేదలకు పంచుతుంటే విపక్షాలకు ఎందుకంత కడుపుమంట? వారి సంక్షేమానికి ప్రజాధనం వెచ్చించటం తప్పేనా అంటూ బహిరంగసభల్లో బీరాలు పలికే జగన్ ఆ పంపిణీ మాటునే తిరిగి దోచుకుంటున్నారు. -
మురుగున పడ్డ డబ్బులెక్కడ.. మామ?
[ 23-04-2024]
భట్టిప్రోలు మండలం ఐలవరం ఉన్నతపాఠశాలలో 400 మంది విద్యార్థులు విద్యా బుద్ధులు నేర్చుకుంటున్నారు. వీరికి పాఠశాలలో రెండు మరుగుదొడ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. -
సమర్థ్ యాప్తో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపు
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమయంలో పోలీసుశాఖ సమర్థంగా విధులు నిర్వర్తించేలా వేగవంతమైన పోలీసు సేవల కోసం కొత్తగా సమర్థ్ మొబైల్ యాప్ను రూపొందించినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. -
ఉప్పొంగిన ప్రజాభిమానం
[ 23-04-2024]
ప్రజాభిమానం ఉప్పొంగింది. వైకాపా ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో జనం కసితో కదిలి కదం తొక్కారు. తెలుగుదేశం, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా ముందుకు సాగారు. ఆ ప్రాంతమంతా పసుపు, తెలుపు, కాషాయ వర్ణాలమయమైంది. ఎమ్మార్పీస్ దండు సైతం వారి జెండాలతో కదిలారు. -
అలా..చతికిలపది!
[ 23-04-2024]
పదో తరగతి పరీక్ష ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా ర్యాంకు గతేడాది కంటే 10 స్థానాలు దిగజారి వెనుకబడింది. 2022- 23 సంవత్సరంలో జిల్లా ఆరో స్థానంలో నిలవగా ఈ ఏడాది 16వ స్థానానికి దిగజారింది. -
జోరుగా నామినేషన్లు
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. గుంటూరు పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. -
పని భారం పెంచేశారు.. పోస్టులు భర్తీ చేయరు..
[ 23-04-2024]
జిల్లా బీసీ సంక్షేమ శాఖ కార్యాలయం: ఇక్కడ ఐదు పోస్టులే ఉన్నాయి. అందులో ఒక సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, సబార్డినేట్, డేటా ఎంట్రీ ఆపరేటర్. -
రూ.46 కోట్లు నష్టపోయాం
[ 23-04-2024]
గుంటూరు సర్వజనాసుపత్రిలో ఆరోగ్యశ్రీ కేసుల నమోదు ప్రక్రియలో సరైన కోణంలో పని చేయనందున ఆసుపత్రికి రావాల్సిన సుమారు రూ.46 కోట్లు ఆర్థికంగా నష్టపోయామని సూపరిôటెండెంట్ కిరణ్కుమార్ తెలిపారు. -
వసతి గృహ విద్యార్థుల ఉత్తీర్ణత మెరుగు
[ 23-04-2024]
జిల్లాలోని సంక్షేమ శాఖల వసతి గృహాల్లో ఉండి పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఎక్కువ మంది ఉత్తీర్ణులయ్యారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల నుంచి 93 మంది పరీక్షలకు హాజరు కాగా 76 మంది ఉత్తీర్ణులయ్యారు. -
స్పందించేందుకు ఇప్పుడు సమయం దొరికిందా..?
[ 23-04-2024]
రాజధాని అమరావతి శంకుస్థాపన ప్రాంతంలో నమూనా గ్యాలరీ ధ్వంసంపై సీఆర్డీఏ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. -
‘మంగళగిరి రూపురేఖలు మారుస్తాం’
[ 23-04-2024]
ముఖ్యమంత్రి జగన్ మాదిరిగా తాము శవ రాజకీయాలు చేయమని యువనేత, కూటమి అభ్యర్థి నారా లోకేశ్ అన్నారు. -
ప్రత్తిపాడును అగ్రగామిగా నిలుపుతా: బూర్ల
[ 23-04-2024]
నియోజకవర్గాన్ని అభివృద్ధి, సంక్షేమంలో అగ్రగామిగా నిలుపుతానని ప్రత్తిపాడు కూటమి అభ్యర్థి డాక్టరు బూర్ల రామాంజనేయులు హామీ ఇచ్చారు. సోమవారం ఆయన నామినేషన్ దాఖలు కార్యక్రమం విజయోత్సవాన్ని తలపించింది. -
మేలు సంగతి తర్వాత.. ముందు నీళ్లివ్వండి
[ 23-04-2024]
‘మేం అధికారంలోకి రాగానే ఈ ప్రాంతాన్ని అభివృద్ధికి చిరునామాగా మారుస్తాం. సకల సౌకర్యాలు కల్పించి ప్రజల కష్టాలు తీరుస్తాం.’ ఇవీ వైకాపా నేతలు సమయం చిక్కినప్పుడల్లా ప్రజలకు ఇచ్చిన హామీలు.‘ -
పదిలో పెరిగిన ఉత్తీర్ణత
[ 23-04-2024]
పదోతరగతి పరీక్షల్లో పల్నాడు జిల్లా విద్యార్థులు నిరుటి కంటే 16 శాతం అదనంగా ఉత్తీర్ణత సాధించారు. కాగా రాష్ట్రస్థాయిలో జిల్లా 18వ స్థానంలో నిలిచింది. జిల్లాలో మొత్తం 24959 మందికి గాను 21477 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. -
వివాదాల అగ్గిరాజేస్తున్న వైకాపా
[ 23-04-2024]
‘అగ్గి’రాజేస్తూ వివాదాలకు వైకాపా నాయకులు కాలుదువ్వుతున్నారు. మాచర్ల, గురజాలను మించిపోయేలా పెదకూరపాడులో ఇటీవల వరుస ఘటనలు భయకంపితులను చేస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!