logo

కోర్టుకు రాజధాని రైతుల హాజరు

రాజధాని అమరావతి రైతులు సోమవారం మంగళగిరి కోర్టుకు హాజరయ్యారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని మల్కాపురం గ్రామంలో 2020 డిసెంబర్‌ 20న

Published : 24 May 2022 04:45 IST


మంగళగిరిలోని కోర్టు వద్ద అన్నదాతలు

మంగళగిరి, న్యూస్‌టుడే: రాజధాని అమరావతి రైతులు సోమవారం మంగళగిరి కోర్టుకు హాజరయ్యారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని మల్కాపురం గ్రామంలో 2020 డిసెంబర్‌ 20న రాత్రి అన్నదాతలు 144 సెక్షన్‌, 30 పోలీస్‌ యాక్ట్‌ను ఉల్లంఘించారంటూ పోలీసులు క్రైం నెంబర్‌ 563, 2020 కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో 15 మంది రైతులను నిందితులుగా చేర్చారు. ఈ నేపథ్యంలో కర్షకులు వాకచర్ల వీరాంజనేయులు, పువ్వాడ సుధాకర్‌, ధనేకుల వెంకటసుబ్బారావు, కంచర్ల గాంధీతో పాటు మిగిలిన వారు కోర్టుకు వచ్చారు. న్యాయమూర్తి కేసును జూన్‌ 21వ తేదీకి వాయిదా వేసినట్లు రైతుల తరపు న్యాయవాది లంకా శివరామ్‌ప్రసాద్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని