ఒకటి, రెంటికి బిగపట్టుకోవాల్సిందేనా..!
దావోస్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల గురించి గొప్పగా చెప్పుకొచ్చారు. ఇద్దరు వైద్యులను నియమించామని, గ్రామీణులకు చక్కని వైద్యం అందుతోందని,
కాకుమానులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం
దావోస్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల గురించి గొప్పగా చెప్పుకొచ్చారు. ఇద్దరు వైద్యులను నియమించామని, గ్రామీణులకు చక్కని వైద్యం అందుతోందని, సౌకర్యాలు బాగా ఉన్నాయన్నారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితి వేరుగా ఉంది. సీఎం నివసిస్తున్న గుంటూరు జిల్లాలోని కాకుమాను ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దాదాపు రెండేళ్లుగా చుక్క వాడుక నీరు రావడం లేదు. తాగు నీరు అసలే లేదు. సీఎం చెప్పినట్లు ఇద్దరు వైద్యులను నియమించినా, ప్రధాన వైద్యుడు ఆయన ఇష్టం వచ్చినప్పుడు ఆసుపత్రికి వస్తారు. వాడుక నీరు లేకపోవడంతో మరుగుదొడ్డికి వెళ్లాలంటే మహిళా వైద్య సిబ్బంది నరకయాతన పడుతున్నారు. ఆస్పత్రిలో పని చేసే ఆయాతో వాడుక నీటిని దూరం నుంచి ఓ డబ్బాలో తెప్పించుకొని మలమూత్ర విసర్జనకు పొదుపు వాడుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఆసుపత్రిలో ఉంటున్న పది మంది మహిళా సిబ్బందితో పాటు ఏవైనా సమావేశాలు జరిగినప్పుడు దాదాపు 56 మంది వరకు వస్తుంటారు. ఆ రోజు వారంతా ఒకటికి, రెంటికి ఇబ్బందులు పడాల్సిందే. ఇక రోగుల పరిస్థితి చెప్పేది కాదు. వారు మరుగుదొడ్డికి వెళ్లే అవకాశం లేక బిగపట్టుకుని కూర్చోవాల్సిందే.
తాగు నీటికీ అవస్థలే..
ఇక తాగునీటి విషయమైతే సరేసరి. రక్త పరీక్షలు చేయాలన్నా, ప్రసవాలు జరపాలన్నా నీరు కావాలి. ఆరోగ్య కేంద్రానికి నీరు సరఫరా చేసే పైపులైను పాడైంది. ఆరోగ్య కేంద్రం ప్రధాన వైద్యుడు ఆ పనులు చేయించలేదు. ఆయన ఆసుపత్రికి వస్తే కదా సమస్యలు తెలిసేది. ఉన్నతాధికారులూ పట్టించుకోవడం లేదు. ప్రధాన వైద్యుడు నెల రోజులకు పైగా ఆసుపత్రికి రాలేదు. న్యూస్టుడే ఈ విషయాన్ని ప్రస్తావించగా సెలవు లేఖ ఇవ్వలేదని చెప్పారు. తర్వాత కొన్ని రోజులకు దీర్ఘకాలిక సెలవు లేఖ ఇచ్చినట్లు డీఎంహెచ్వో శోభారాణి తెలిపారు. ప్రస్తుతమున్న ప్రసాద్ అనే వైద్యుడికి నిధులు డ్రా చేసే అధికారం ఇవ్వలేదు. పంచాయతీ వారికి సమస్య తెలిపినా పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని పక్కనున్న చిలకలూరిపేట నియోజకవర్గంలో ఉంటున్నారు. సీఎం, వైద్యారోగ్య శాఖ మంత్రి ఉన్న జిల్లాలోనే ఇలాంటి పరిస్థితి నెలకొనడం విచారకరం. మరో చిత్రమేమంటే కొన్ని నెలల క్రితం ఈ ఆసుపత్రిని నాడు-నేడు పథకం కింద రూ.18 లక్షలతో పలు పనులు ప్రారంభించి మధ్యలో నిలిపివేశారు.
- న్యూస్టుడే, కాకుమాను
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
[ 24-04-2024]
ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. -
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
[ 24-04-2024]
సీఎం జగన్పై గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ను కస్టడీకి అనుమతిస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
వైఎస్ఆర్ను తిట్టిన బొత్స.. జగన్కు తండ్రి సమానులా?: షర్మిల
[ 24-04-2024]
మంత్రి బొత్స సత్యనారాయణ తండ్రి సమానులంటూ సీఎం జగన్ (YS Jagan) చేసిన వ్యాఖ్యలపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) స్పందించారు. -
కన్నేసి.. కబ్జా చేసి..!
[ 24-04-2024]
వైకాపా నేతలు అధికారం అండతో అయిదేళ్లు బరితెగించారు. యథేచ్ఛగా పేదల భూములు ఆక్రమించారు. దేవుడి మాన్యాలను వదల్లేదు. ఖాళీ స్థలాలు, ప్రభుత్వ, వాగులు, వంకలు, డొంక రోడ్లు కావేవి కబ్జాకు అనర్హం అన్నట్లు భూదందాలు సాగించారు. -
వైకాపా పాలనలో బాదుడే.. బాదుడు
[ 24-04-2024]
పొన్నూరు నియోజకవర్గంలో సుమారు 55,275 విద్యుత్తు సర్వీసులు ఉన్నట్లు విద్యుత్తుశాఖ అధికారక గణాంకాలు వెల్లడించాయి. -
నాడంతా నటన.. ఓటేశాక వంచన..
[ 24-04-2024]
చంద్రబాబు పాలనలో విద్యుత్తు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయి. మేం అధికారంలోకి వచ్చాక విద్యుత్తు ఛార్జీలు పెంచబోం. -
అంతా... మా ఇష్టం
[ 24-04-2024]
పొన్నూరు రిటర్నింగ్ కార్యాలయం మార్పు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల అధికారులు అవగాహన లోపంతో తీసుకున్న నిర్ణయంతో గుంటూరు-బాపట్ల ప్రధాన రహదారిలో రాకపోకలు సాగించే వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. -
ఇదేమి చోద్యం జగన్!
[ 24-04-2024]
విజయవాడ, గుంటూరు నగరాలతో పాటు శివారు ప్రాంతాలను కలిపితే జనాభా 30 లక్షలకుపైనే. ఈ రెండు నగరాల మధ్య జాతీయ రహదారి మీదుగా నిత్యం కొన్ని వేల వాహనాలు -
కోన రఘుపతి.. ఓ భూబకాసురుడు
[ 24-04-2024]
దొంగలు, భూబకాసురులు, అవినీతిపరులకు సీఎం జగన్ వైకాపా తరఫున ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. -
శివాలెత్తిన ఎస్సై నాగశివారెడ్డి
[ 24-04-2024]
ఎమ్మెల్యే ఏలూరి నామినేషన్ పత్రాలు అందజేసేందుకు మంగళవారం పర్చూరు ఆర్వో కార్యాలయానికి వచ్చిన సందర్భంలో అక్కడ విధుల్లో ఉన్న ఎస్సై నాగశివారెడ్డి తెదేపా పర్చూరు మండల అధ్యక్షుడు షేక్ షంషుద్దీన్ను అసభ్య పదజాలంతో దూషించారు. -
నాదెండ్ల మనోహర్ నామినేషన్
[ 24-04-2024]
జనసేన, తెదేపా, భాజపా కూటమి తెనాలి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ బుధవారం నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ఆయన కార్యాలయ వర్గాలు మంగళవారం తెలిపాయి. -
అట్టహాసంగా తెదేపా అభ్యర్థుల నామినేషన్
[ 24-04-2024]
తెదేపా బాపట్ల లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు తెన్నేటి కృష్ణప్రసాద్, వేగేశన నరేంద్రవర్మ నామినేషన్ల కార్యక్రమం మంగళవారం అట్టహాసంగా జరిగింది. -
రోడ్డుపై రోడ్డు
[ 24-04-2024]
ప్రజాధనం దుర్వినియోగానికి ఇది పరాకాష్ఠ. ఓ అధికార పార్టీ నాయకుడు చెప్పాడని..పదేపదే స్పందన, సీఎంవోకు ఫిర్యాదులు చేస్తున్నాడన్న కారణంతో అధికారులు గుంటూరు పలకలూరురోడ్డు సాయిబాబానగర్ ప్రధాన రోడ్డులో బాగున్న సీసీ రహదారిపైనే యథావిధిగా మరో రోడ్డు వేస్తున్నారు. -
పండగ చేస్తానన్నావ్.. ప్రాణాలు తీస్తున్నావ్
[ 24-04-2024]
వ్యవసాయం దండగ కాదు.. పండగ చేస్తామని ఊదరగొట్టిన ముఖ్యమంత్రి జగన్ ఆచరణలో రైతులను గాలికొదిలేశారు. సాగుకు బ్యాంకుల నుంచి రుణాలు అందక.. అధిక వడ్డీలకు తెచ్చి పంట పండిస్తే గిట్టుబాటు ధర దక్కక రైతు కునారిల్లాడు.. -
‘పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసిన సీఎం’
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్ మెడికల్ సీట్లను కూడా వదల్లేదని కేటగిరీల వారీగా విభజించి పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసి సీట్లను అమ్ముకున్నారని యువనేత, -
‘తెనాలిని గంజాయికి అడ్డాగా మార్చేశారు’
[ 24-04-2024]
ఆంధ్రా ప్యారిస్ను ఇక్కడి సిటింగ్ వైకాపా ఎమ్మెల్యే గంజాయి అడ్డాగా మార్చారని పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
-
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
-
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
-
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు