కోడింగ్ తెలిస్తే కొలువే..!
ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని ఇంజినీరింగ్ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులకు కొలువుల జాతర మొదలైంది. ఒక్కో విద్యార్థికి కనీసం మూడు నుంచి ఐదు సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. రూ.4 లక్షల నుంచి రూ.45 లక్షల వరకూ ప్యాకేజీ అందుకుంటున్నారు. 250 నుంచి 300 ఐటీ సంస్థలు ఈ సారి కొలువులను అందించేందుకు పోటీ పడుతున్నాయి. గతంలో
రూ.4 లక్షలు - రూ.45 లక్షల వరకు ప్యాకేజీ
పోటీ పడి ఇస్తున్న ఐటీ సంస్థలు
ఈనాడు, అమరావతి
ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని ఇంజినీరింగ్ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులకు కొలువుల జాతర మొదలైంది. ఒక్కో విద్యార్థికి కనీసం మూడు నుంచి ఐదు సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. రూ.4 లక్షల నుంచి రూ.45 లక్షల వరకూ ప్యాకేజీ అందుకుంటున్నారు. 250 నుంచి 300 ఐటీ సంస్థలు ఈ సారి కొలువులను అందించేందుకు పోటీ పడుతున్నాయి. గతంలో కళాశాలకు ఆయా కంపెనీల ప్రతినిధులు వచ్చి క్యాంపస్ ప్లేస్మెంట్లు నిర్వహించేవారు. కొవిడ్ తర్వాత ఆ పంథా మార్చారు. ఆన్లైన్లోనే పరీక్ష, ఇంటర్వ్యూలు పూర్తి చేస్తున్నారు. ఆయా సంస్థలు ఆన్లైన్ లింక్ను ఇచ్చి.. దానిలో విద్యార్థులే నేరుగా తమ ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) అనుమతి ఉన్న ఇంజినీరింగ్ కళాశాలల్లో చదివే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆయా సంస్థలు అడిగే అర్హతల ఆధారంగా పరీక్షలకు హాజరు కావొచ్చు.
కొవిడ్కు ముందు వరకూ ఇంజినీరింగ్ ఉత్తీర్ణులై బయటకొచ్చే వారిలో 15 నుంచి 20 శాతం మందికి మాత్రమే కొలువులు వచ్చేవి. ఈ ఏడాది ఆయా సంస్థల పరీక్షలను రాస్తున్న విద్యార్థులందరికీ ఉద్యోగాలొస్తున్నాయి. కంపెనీలు నిర్వహించే పరీక్షల్లో విద్యార్థులు చూపించే ప్రతిభ ఆధారంగానే ప్యాకేజీలు ఇస్తున్నారు. ఇంజినీరింగ్లో గ్రూపులతో సంబంధం లేకుండా ప్రధానంగా అర్హత పరీక్షలో కోడింగ్ స్కిల్స్ ఆధారంగా కంపెనీల ప్యాకేజీలు ఉంటున్నాయి. కోడింగ్ ఉంటే రూ.3.6 లక్షలు, మీడియం రూ.7 లక్షలు, హైకోడింగ్కు రూ.10 లక్షలు ఇస్తున్నారు. గతంలో ఇంగ్లిష్ పరిజ్ఞానం, కమ్యూనికేషన్ లాంటి వాటిని అర్హతగా చూసేవారు. ప్రస్తుతం అంతా కోడింగ్ ఆధారంగానే నడుస్తోంది.
ఒక్కొక్కరికీ 3-4 అవకాశాలు
ప్రస్తుతం పెద్ద ఐటీ సంస్థల మధ్య కూడా పోటీ పెరిగింది. ఒక్కో విద్యార్థికి కనీసం మూడు నుంచి ఐదు కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు రావడంతో ఎక్కువ ప్యాకేజీలు ఇచ్చే వారి వైపు వెళుతున్నారు. దీంతో విద్యార్థులను ఆకర్షించేందుకు గతంలో ఇచ్చే ప్యాకేజీలను కంపెనీలు ప్రస్తుతం పెంచాయి. గతంలో కనీస ప్యాకేజీ రూ.2.4 లక్షలుండేది.. ప్రస్తుతం రూ.4 లక్షలకు పెరిగింది. విద్యార్థి ఎంపికవగానే.. వర్క్ ఫ్రం హోంకు అవసరమైన ల్యాప్టాప్, డెస్క్టాప్ పంపించేస్తున్నాయి. ఫర్నిచర్ కోసం మరో రూ.11 వేలు ఇస్తున్నారు. వచ్చే ఆగస్టు నుంచి కంపెనీలకు వచ్చి పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని ప్రస్తుతం విద్యార్థులకు లెటర్లు వచ్చాయి.
పాత వారికి..
రెండు జిల్లాల్లోని విద్యాసంస్థల్లో గత రెండేళ్లలో 25 వేల నుంచి 30 వేల కొలువులు వచ్చాయి. 2021, 2022, 2023 ఏడాదిలో చదివిన వారికి ఎక్కువగా అవకాశాలొస్తున్నాయి. ఒకసారి కళాశాల నుంచి ఇంజినీరింగ్ పూర్తిచేసి వెళ్లిపోయిన వారిని మరుసటి ఏడాది పిలిచి కొలువు ఇవ్వడం గతంలో జరిగేది కాదు. కానీ ప్రస్తుతం ఎక్కువ మంది ఉద్యోగులు కావాల్సి ఉండడంతో గత ఏడాది పూర్తిచేసిన వారిని, వచ్చే ఏడాది బయటకు రాబోతున్న వారిని కూడా తీసుకుంటున్నారు.
ఉద్యోగాలతో కంపెనీలు ఎదురుచూస్తున్నాయ్
- ఎన్.వి.సురేంద్రబాబు, ఏపీటీపీవో కన్సార్టియం ప్రధాన కార్యదర్శి
ఉమ్మడి కృష్ణా, గుంటూరుల్లోని ఇంజినీరింగ్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ప్రస్తుతం కొలువుల జాతరే ఉంది. విప్రో, టీసీఎస్, అమెజాన్, గూగుల్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ లాంటి అనేక సంస్థలు విద్యార్థుల కోసం అవకాశాలతో ఎదురుచూస్తున్నాయి. ప్రస్తుతం మూడో ఏడాది చదువుతున్న వారికి కూడా ఇచ్చేస్తున్నారు. వీరికి కళాశాలలో ఉండగానే శిక్షణ పూర్తిచేయించి, వారు బయటకు రాగానే ఉద్యోగంలో చేరిపోయేలా ప్రణాళికతో వెళుతున్నాయి. కళాశాలల ప్రాజెక్ట్ వర్క్గా, ఇంటర్న్షిప్గా సదరు కంపెనీల్లోనే పూర్తిచేసేలా ముందే విద్యార్థులకు రూ.20 వేల వరకూ అందజేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిణామాల నేపథ్యంలోనే కంపెనీలకు ప్రాజెక్ట్లు అధికంగా రావడంతో మన విద్యార్థులకు అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి. మెకానికల్ చదివే విద్యార్థులకు ఐటీ కంపెనీల్లో కనీసం రూ.4 లక్షల ప్యాకేజీతో ఈ ఏడాది ఉద్యోగాలు రావడం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పట్టాలెక్కించలేదు.. పట్టించుకోలేదు
[ 29-03-2024]
కృష్ణా పశ్చిమ డెల్టాలోని గుంటూరు, బాపట్ల జిల్లాల పరిధిలో 5 లక్షలకుపైగా ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. ఏటా లక్షల బస్తాల ధాన్యాన్ని రైతులు పండిస్తున్నారు. -
మీ పనులకో దండం!
[ 29-03-2024]
గుంటూరు నగరపాలికలో గడప గడపకు మన ప్రభుత్వం కింద చేసిన అభివృద్ధి పనులకు పది నెలల నుంచి బిల్లులు చెల్లించలేదు. ఇవి రూ.కోట్లలో పేరుకుపోవడంతో వారు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. -
భారీ ఎత్తున సరకుల దిగుమతిపై నిఘా
[ 29-03-2024]
ఎన్నికల కోడ్ నేపథ్యంలో పెద్ద మొత్తాల్లో సరకుల లావాదేవీలు నిర్వహించే సంస్థలపై నిఘా ముమ్మరం చేసినట్లు వాణిజ్య పన్నుల శాఖ గుంటూరు-2 జాయింట్ కమిషనర్ మధుబాబు తెలిపారు. -
మౌనానికి వెలకట్టి.. ముడుపులు మూటకట్టి..
[ 29-03-2024]
ఆ అధికార పార్టీ నేత లక్ష్యం రూ.కోట్లు సంపాదించడమే.. వ్యాపారుల నుంచి వసూళ్లు సాగిస్తున్న వైనంపై ప్రతిపక్ష నేత వేసిన సూటి ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పలేకపోయారు. -
పాలకా.. ఇది తగునా?
[ 29-03-2024]
పొన్నూరు పురపాలక సంఘంలో ఎన్నికల కోడ్ సరిగా అమలు కావడం లేదు. అధికార పార్టీకి ఒక లాగా... ప్రతిపక్ష పార్టీకి మరోలా అమలు చేస్తూ అధికారులు వివక్ష చూపుతున్నారు. -
నిబంధన.. పాటించకుంటే దండన
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) అమల్లోకి వచ్చింది. దీన్ని ఎన్నికల సంఘం చూస్తుంది. జిల్లాలో కలెక్టర్ పర్యవేక్షిస్తుంటారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ఉద్యోగులు ప్రవర్తనా నియమావళి పరిధిలోకి వస్తారు. -
ప్రభుత్వం మారితేనే యువతకు భవిత
[ 29-03-2024]
ప్రజలకు తాగు నీటిని అందించలేని వైకాపా ప్రభుత్వం గంజాయి, మత్తు పదార్థాలను మాత్రం విచ్చలవిడిగా అందుబాటులోకి తీసుకొచ్చి యువతకు తీరని నష్టాన్ని కలిగిస్తోందని ఎన్డీయే గుంటూరు పార్లమెంటు అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శించారు. -
అనుమతి ఒకచోట..ప్రచారం మరోచోట
[ 29-03-2024]
ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రతి ఒక్కరూ పాటించాలని యంత్రాంగం చెబుతుంటే.. అధికార పార్టీకి చెందిన వారు ఉల్లంఘిస్తూనే ఉన్నారు. -
ఎన్నికల ప్రచారంలో వాలంటీరు హల్చల్పై ఫిర్యాదు
[ 29-03-2024]
మండలంలోని కారంపూడిపాడు గ్రామంలో ఈ నెల 22న వైకాపా అభ్యర్థి బలసాని కిరణ్కుమార్కు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వాలంటీరు కె.నరసింహరావు పాల్గొన్నారు. -
రోడ్డునే మింగేసిన ఇసుకాసురులు
[ 29-03-2024]
జనం ఇబ్బంది పడితే మాకేంటి? మా ప్రయోజనం నెరవేరితే చాలనేలా అధికార పార్టీ నేతలు వ్యవహరించారు. అక్రమార్జనకు ఉన్న ఏ అవకాశాన్ని వారు వదులుకోలేదు. -
కోడ్ ఉన్నా.. చోద్యం చూస్తున్నారు!
[ 29-03-2024]
ఈ చిత్రం చూశారా.. కృష్ణా తీరంలోని అమరావతి మండలం మల్లాది రీచ్లో గురువారం రాత్రి వేళ భారీ యంత్రాలతో ఇసుక తవ్వి లారీలకు నింపుతున్నారు. అనుమతి ఉన్న రీచ్లలో సైతం సూర్యాస్తమయం తర్వాత కూలీల చేత కూడా ఇసుక తవ్వకాలు చేయకూడదు. -
బల్లికురవ ఎస్సైపై విచారణకు ఆదేశం
[ 29-03-2024]
అధికార వైకాపా నేతల మెప్పు పొందాలని చూసినా.. బాధితులపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలనుకునే పోలీసు అధికారులు తగు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని చెప్పడానికి తాజాగా బల్లికురవ ఎస్సై నాగశివారెడ్డి ఉదంతమే ఓ నిదర్శనం. -
ఓటరు జాబితాలో మీ పేరుందా?
[ 29-03-2024]
‘సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది... త్వరలో జరగబోయే ఎన్నికల్లో 18 ఏళ్లు నిండిన వారి దగ్గర నుంచి ఓటున్న ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకోవాలి... ఎవరికి వారు తాము వేయకపోతే ఏమవుతుందనే భావన విడనాడాలి. -
నియమావళి అమలు ఇలాగేనా?
[ 29-03-2024]
ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చి 12 రోజులు గడిచింది. అమలుకు సంబంధించి ప్రత్యేకాధికారులను నియమించినా కొన్నిచోట్ల కోడ్ ఉల్లంఘనలు కనపడుతూనే ఉన్నాయి. -
గుండ్లకమ్మ జలాశయంలో మొసలి కలకలం
[ 29-03-2024]
గుండ్లకమ్మ జలాశయంలో మత్స్యకారుడి వలకు మొసలి చిక్కడంతో స్థానికంగా కలకలం రేగింది. అటవీశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. -
కన్ను పడితే కబ్జానే..
[ 29-03-2024]
తిమ్మాయిపాలెం గ్రామంలోని 7.05 ఎకరాలు నక్కలవాగు పేరుతో వాగు పోరంబోకు స్థలం ఉంది. ఇది జాతీయ రహదారికి పక్కనే రోడ్డుకు ఆనుకొని ఉండటంతో దీనిపై వైకాపా నేత గద్దలా వాలిపోయారు. -
వైకాపా ప్రచారంలో క్షేత్ర సహాయకుడు
[ 29-03-2024]
ఎన్నికల కోడ్ వచ్చినా కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు, ఒప్పంద సిబ్బంది ఇంకా వైకాపా ప్రజాప్రతినిధులతో కలిసి ప్రచారంలో పాల్గొంటున్నారు. -
మరెందుకు ఆలస్యం.. రాజీనామా చేయండి..
[ 29-03-2024]
రాజీనామా చేసేయండి.. హాయిగా పార్టీ ప్రచారంలో పాల్గొనండి అంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు వాలంటీర్లకు ఫోన్లు చేస్తున్నారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని, మళ్లీ తీసుకుంటామని ప్రస్తుతానికి అంతా చూసుకుంటామంటూ చెప్పుకొస్తున్నారు. -
ఎత్తిపోతల పథకాలు హుళక్కే
[ 29-03-2024]
పల్నాడు జిల్లాలో వైకాపా పాలన ఐదేళ్లలో కొత్తగా ఒక్క ఎత్తిపోతల పథకం నిర్మించలేదు. నీటి అనుమతులిచ్చి నిధులివ్వకుండా మొండిచెయ్యి చూపారు. -
12 మంది వైకాపా కౌన్సిలర్ల వేరు బాట
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రభావం పురపాలక సంఘంలోని పాలకపక్షంపై పడింది. చిలకలూరిపేట శాసనసభ స్థానంలో అధికార వైకాపా నియోజకవర్గ సమన్వయకర్తల మార్పు వ్యవహారం కౌన్సిలర్ల మధ్య చీలికకు దారి తీసింది. -
పక్కదారి పట్టిన రేషన్ బియ్యం
[ 29-03-2024]
రేషన్ బియ్యం పక్కదారి పట్టడంతో నరసరావుపేటకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. నెల నెలా పేదలకు బియ్యం సక్రమంగా పంపిణీ చేస్తున్నామని చెప్పే అధికారులు ఆ బియ్యం పక్కదారి పడుతున్నా పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఎన్నికల నిబంధనలు బేఖాతర్
[ 29-03-2024]
ఎన్నికల కోడ్ అమలై పదిరోజులు దాటినా నేటికీ పలు చోట్ల అధికారపార్టీ ఆగడాలకు అదుపు లేకుండా ఉంది. క్రోసూరు ఎస్టీ కాలనీ, గాదెవారిపాలెంలోని మంచినీటి పథకం ట్యాంకులకు వైకాపా రంగులు కనిపిస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: అతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..