రిక్తహస్తం
పాడిరైతుకు జీవనాధారమైన పశువులు మరణిస్తే నష్ట పోయిన రైతుకు తక్షణమే ప్రభుత్వం వైఎస్ఆర్ పశు నష్ట పరిహార పథకం ద్వారా ఆర్థిక సాయం అందించాలి. మేలుజాతి, దేశవాళీ పశువులకు రూ.30వేలు, నాటు పశువులకైతే రూ.15వేలు వంతున పశుసంవర్థక
అన్నదాతకు అందని పశునష్ట పరిహారం
జిల్లాలో 325కి పైగా దస్త్రాలు పెండింగ్
పాడిరైతుకు జీవనాధారమైన పశువులు మరణిస్తే నష్ట పోయిన రైతుకు తక్షణమే ప్రభుత్వం వైఎస్ఆర్ పశు నష్ట పరిహార పథకం ద్వారా ఆర్థిక సాయం అందించాలి. మేలుజాతి, దేశవాళీ పశువులకు రూ.30వేలు, నాటు పశువులకైతే రూ.15వేలు వంతున పశుసంవర్థక శాఖ సహాయాన్ని అందించి పాడి రైతును ఆదుకోవాలి.
న్యూస్టుడే, తుళ్లూరు
2019లో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏ ఉద్దేశంతోనైతే రాష్ట్ర ప్రభుత్వం పథకాన్ని తీసుకొచ్చిందో అదిప్పుడు నెరవేరడం లేదు. గడిచిన ఏడాదిన్నర నుంచి నష్టపోయిన పశు యజమానులకు పరిహారం అందడం లేదు. ప్రకృతి వైపరీత్యాలు, అనుకోనిరీతిలో పాడిపశువు మరణించినప్పుడు రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. జీవనాధారం ప్రశ్నార్థకమవుతోంది. 2020లో గుంటూరు జిల్లాలో 415 పశువులు వివిధ కారణాలతో మృతి చెందాయి. ప్రభుత్వం లబ్ధిదారులకు రూ.1.17కోట్లను ఆర్థిక సాయంగా అందించింది. 2021, 2022 సంవత్సరాలకు సంబంధించి ఉమ్మడి గుంటూరు జిల్లాలో 325 పశువులను పాడి రైతులు నష్టపోయారు. వారికి సంవత్సరంన్నర గడిచినా సాయం అందలేదు. తరచూ పశుసంవర్థక శాఖ కార్యాలయాలకు వెళ్లినా అదుగో ఇదుగో అంటున్నారే కానీ ఆర్థిక సాయం అందలేదంటూ లబ్ధిదారులు వాపోతున్నారు.
పథకం లబ్ధి ఇలా...
అన్నదాతలకు ఆసరాగా ఉండే పాడిపశువులు ఎంతో ప్రయోజనాన్ని కల్పిస్తున్నాయి. పంటల సాగుతో పాటు, పాడిపశువుల పెంపంకం ప్రధాన్యతను సంతరించుకొంది.2-10 సంవత్సరాల వయస్సు కలిగిన ఆవులు, 3-12 సంవత్సరాల వయస్సు కలిగిన గేదెలకు వైఎస్ఆర్ పథకం కింద పరిహారం పొందడానికి అర్హత ఉంటుంది. చెవి పోగు వేయించుకొని వాటి వివరాలను నమోదు చేసుకొన్న పశువులు మాత్రమే ఈ పథకం కిందకు వస్తాయి. ఎటువంటి రుసుం లేకుండా నష్ట పరిహారాన్ని ఆయా రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. ఏడాదిలో గరిష్ఠంగా ఒక్కో రైతు కుటుంబానికి ఐదు పశువులకు మాత్రమే నష్ట పరిహారాన్ని అందిస్తారు.
ఏడాదిన్నరగా ఎదురుచూస్తున్నాం
పాడిపశువులే మాకు జీవనాధారం. గతేడాది రూ.లక్ష విలువైన పశువు అనుకోని రీతిలో మృతి చెందింది. ఈ విషయం స్థానిక పశువైద్యాధికారికి వివరించి మృతి చెందిన పాడిపశువు వివరాలను నమోదు చేయించా.పరిహారం కోసం ఎదురుచూస్తూనే ఉన్నా. ఏడాదిన్నర గడుస్తున్నా లబ్ధి చేకూరలేదు.ప్రభుత్వం పాడిరైతులకు అండగా ఉండేందుకే ఈ పథకాన్ని పెట్టామని గొప్పలు చెబుతోంది. పరిహారం అమలు చేయడంలో అధికారులు పట్టనట్లుగా ఉంటున్నారు. - జమ్ముల ఏడుకొండలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కూలేదాకా.. కళ్లప్పగిస్తారా!
[ 20-04-2024]
బీటలు వారిన స్తంభాలు.. పడిపోయిన రెయిలింగ్లు.. కూలిన పిట్టగోడలు.. తుప్పుపట్టి బయటకు కనిపిస్తున్న ఇనుప చువ్వలు, వంతెనలపైనే గోతులు.. ఇలా శిథిలావస్థకు చేరిన వారథులు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రమాదాలకు కారణమవుతున్నాయి -
ఉడకని జీడిపప్పు
[ 20-04-2024]
వేటపాలెం అంటేనే జీడిపప్పు పరిశ్రమకు పెట్టింది పేరు. ఈ ప్రాంతంలో వ్యాపారులు ఒకప్పుడు స్థానికంగా దొరికే జీడిపిక్కలను కొనుగోలు చేసి వాటిని కాల్చి పప్పుగా తయారు చేసి విక్రయించేవారు. -
నేరచరిత్ర లేని సచ్ఛీలుడు తెన్నేటి
[ 20-04-2024]
బాపట్ల లోక్సభ స్థానం తెదేపా ఎంపీ అభ్యర్థి తెన్నేటి కృష్ణప్రసాద్ తనకు రూ.15.93 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు శుక్రవారం దాఖలు చేసిన ఎన్నికల నామినేషన్ అఫిడవిట్లో ప్రకటించారు -
మందులో ముంచేసి.. పీల్చి పిప్పి చేసి..
[ 20-04-2024]
రాష్ట్రంలో దశల వారీగా మద్యపాన నిషేధం విధిస్తాం. మూడు విడతల్లో మద్యం దుకాణాలు తగ్గించుకుంటూ వెళ్లి పూర్తిగా ఎత్తేస్తాం. మందు ముట్టుకోవాలంటేనే షాక్ కొట్టేలా ధరలు పెంచుతాం. మద్యపాన నిషేధం చేశాకే 2024లో ఓట్లు అడగడానికి వస్తాను. -
ఎంపీ 1, ఎమ్మెల్యేకు 19 నామినేషన్లు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమరంలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. రెండో రోజున గుంటూరు పార్లమెంట్ స్థానానికి కిలారి వెంకటరోశయ్య వైకాపా తరఫున నామినేషన్ను దాఖలు చేశారు -
కొనసాగుతున్న ఒత్తిళ్లతో వాలంటీర్ల రాజీనామా
[ 20-04-2024]
ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమానులో 20 మంది వాలంటీర్లు రాజీనామా చేసినట్లు పంచాయతీ కార్యదర్శి పూర్ణచంద్రరావు తెలిపారు. -
అట్టహాసంగా శ్రావణ్కుమార్ నామినేషన్
[ 20-04-2024]
తాడికొండ నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ శుక్రవారం తాడికొండ ఆర్వో గంగరాజుకు నామినేషన్ పత్రాలు అందజేశారు -
ఎన్నికల వేళా.. ఆగని దోపిడీ
[ 20-04-2024]
అధికారం అండగా ఉందని ఏం చేసినా అడ్డుకునేవారు లేరని వైకాపా నేతలు బరితెగించారు. కృష్ణానదిలో రాత్రివేళ అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు చేస్తూ తరలించి జేబులు నింపుకొంటున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా వారికి అడ్డంకి లేకుండా పోయింది. -
ఏళ్లుగా ఉద్యోగులకు శిక్షే
[ 20-04-2024]
అనేక సంస్కరణలు తీసుకొచ్చామంటూ ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చే సీఎం జగన్ మాటలు ఎండమావులుగానే మిగిలిపోతున్నాయి. 2019 ఎన్నికలకు ముందు సమగ్ర శిక్షాలో పని చేస్తున్న ఉద్యోగులకు ఎంటీఎస్, హెచ్ఆర్ పాలసీ అమలు చేస్తామని.. పలు హామీలు ఇచ్చి వాటిని గాలికొదిలేశారు. -
తాగునీరివ్వకపోతే బతికేదెలా..?
[ 20-04-2024]
తమకు తాగునీటిని కుళాయిల ద్వారా సరఫరా చేయడం లేదని ప్రత్తిపాడులోని మహబూబ్ నగర్ కాలనీ వాసులు శుక్రవారం గుంటూరు- పర్చూరు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. -
విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యంతో జేఎల్ఎం మృతి
[ 20-04-2024]
విద్యుత్తు శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా జేఎల్ఎం (జూనియర్ లైన్మెన్) మృతి చెందిన ఘటన ఇది. విద్యుత్తు శాఖ ఉద్యోగులు, బాధితుల కథనం ప్రకారం... పెదకాకాని మండలం వెంకటకృష్ణాపురానికి చెందిన అడుసుమల్లి సుబ్రహ్మణ్యం, చిలకమ్మ దంపతుల పెద్దకుమారుడు రాజేశ్ (27) ఇదే గ్రామంలో జేఎల్ఎంగా పనిచేస్తున్నారు. -
కలగా మినీ రైతుబజార్లు
[ 20-04-2024]
నాడు అలా...గత ప్రభుత్వంలో వినియోగదారులకు తక్కువ ధరకు నాణ్యమైన కూరగాయలు అందించేందుకు 2018లో పొన్నూరు పట్టణం నిడుబ్రోలు రైల్వేస్టేషన్కు వెళ్లే మార్గంలో రైతుబజార్ను అందుబాటులోకి తెచ్చారు. ఆ రైతుబజార్లో 22 దుకాణాలను ఏర్పాటు చేశారు. -
ఓటు హక్కు వినియోగానికి కార్మికులకు సెలవు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో మే 13న జరగనున్న పోలింగ్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి కార్మికులకు సెలవు ప్రకటించినట్లు మూడో జోన్ కార్మిక శాఖ ఇన్ఛార్జి సంయుక్త కమిషనర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు -
మద్యం మత్తు.. కుటుంబాలు చిత్తు
[ 20-04-2024]
గత నెల 18వ తేదీన తెనాలి మున్సిపల్ కార్యాలయం చెంతనే నిర్మాణంలో ఉన్న మార్కెట్ భవంతిలో రవికిరణ్ (37) అనే వ్యక్తి సజీవ దహనమయ్యాడు. కారణం మద్యం మత్తు. మద్యం తాగి చెంతనే దోమల కాయిల్ వెలిగించుకుని నిద్రపోయిన అభాగ్యుడు కాయిల్ దుప్పటికి తగిలి మంటలు చెలరేగినా మత్తు వల్ల లేవలేక కాలిపోయాడు
తాజా వార్తలు (Latest News)
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
-
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు