డీఈవో గైర్హాజరుపై అసంతృప్తి
జిల్లాపరిషత్తు స్థాయీ సంఘ సమావేశానికి గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి శైలజ గైర్హాజరుపై జడ్పీ సీఈవో శ్రీనివాసరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. జడ్పీ ఛైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా అధ్యక్షతన 1, 2, 4, 7వ స్థాయీ సంఘాల సమావేశాలు శుక్రవారం
ఉపాధ్యాయుల డిప్యుటేషన్ల రద్దుకు ఎమ్మెల్సీ లక్ష్మణరావు డిమాండ్
సమావేశంలో పాల్గొన్న జడ్పీ ఛైర్పర్సన్ కత్తెర హెనీ
క్రిస్టినా, ఎమ్మెల్సీ లక్ష్మణరావు, జడ్పీటీసీ సభ్యులు
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులుగా చేరిన వారు వెంటనే పీజీ విద్య కోసం వెళ్లటంతో రోగులకు వైద్యం చేసేవారు లేకుండా పోతున్నారన్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని డీఎంహెచ్వోలకు లక్ష్మణరావు సూచించారు.
కాకుమానులోని బీఆర్ అంబేడ్కర్ గురుకుల బాలికల పాఠశాలలో 400 మంది విద్యార్థినులు చదువుతున్నా వారికి తాగునీటి వసతి లేక ఇబ్బందులు పడుతున్నారని జడ్పీటీసీ సభ్యురాలు గుల్జార్ బేగం అన్నారు. ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈని పంపి నివేదిక తెప్పించుకుంటామని సీఈవో చెప్పారు. వడ్లమూడి క్వారీ వద్ద జడ్పీకి చెందిన 45 ఎకరాల భూమిని గత ప్రభుత్వ హయాంలో మట్టిని తవ్వడంతో గుంతలు ఏర్పడినందున వాటిని సరి చేసి వడ్లమూడి- సంగం జాగర్లమూడి గ్రామాల ప్రజలకు తాగునీరు అందించేలా.. సాగునీటి కాలువలు నిర్మించేలా ప్రణాళికలు తయారు చేయాలని ఎమ్మెల్యే కిలారి వెంకటరోశయ్య జల వనరుల శాఖ అధికారులను కోరారు.
భట్టిప్రోలులోని జగనన్న ఇళ్ల కాలనీల్లో 1600 మందికి గృహాలు మంజూరు చేసినా స్థలాలు 5 అడుగుల పల్లంలో ఉండటంతో లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకోవడానికి ముందుకు రావడం లేదని జడ్పీటీసీ సభ్యురాలు తిరువీధుల ఉదయభాస్కరి అన్నారు. మెరక చేయాలని విజ్ఞప్తి చేశారు. లేఔట్ని సందర్శించి నివేదిక ఇవ్వాలని గృహనిర్మాణసంస్థ ఏఈకి సీఈవో చెప్పారు.
నూతన జడ్పీ భవనానికి రూ.15 కోట్లు
జిల్లాపరిషత్తు కార్యాలయ భవనం 1954లో నిర్మించడంతో శిథిలావస్థకు చేరడంతో నూతన భవనం నిర్మించేందుకు సీఎం జగన్మోహన్రెడ్డి అనుమతి ఇచ్చారని ఛైర్పర్సన్ క్రిస్టినా చెప్పారు. తాను రూ.10 కోట్లతో అంచనా ప్రతిపాదనలు సీఎంకు అందజేయగా రూ.15 కోట్లు కేటాయించారన్నారు. త్వరలోనే ఉత్తర్వులు జారీ అవుతాయన్నారు. 3, 6వ కమిటీలు జడ్పీ ఉపాధ్యక్షులు శొంఠిరెడ్డి నర్సిరెడ్డి, బత్తుల అనురాధ, 5వ కమిటీ తెనాలి జడ్పీటీసీ సభ్యురాలు పిల్లి ఉమా ప్రణతి అధ్యక్షతన జరిగాయి. ఆయా కమిటీలకు మూడు జిల్లాల అధికారులు హాజరయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు: నారా లోకేశ్
[ 25-04-2024]
ఓట్లు అడగడానికి వచ్చే వైకాపా నేతలను రాజధాని రైతులు నిలదీయాలని యువనేత, మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. -
చదువులమ్మ చెట్టుకు.. రాజకీయ చెద!
[ 25-04-2024]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేరెన్నికగన్న పురాతన విద్యాసంస్థల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఒకటి. దేశ, విదేశాల్లో ఎంతో ఖ్యాతినార్జించిన ఘనత దీని సొంతం. దాదాపు పది, పదిహేను దేశాల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకునేవారు. -
యూజీడీ మూలన.. మాటలు మరుగున
[ 25-04-2024]
నా ముస్లింలు.. నా మైనార్టీలు అంటూ మాటలతో మభ్యపెట్టడమే గానీ సీఎం జగన్కు వారిపై ఏమాత్రం ప్రేమలేదని చెప్పడానికి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తికాని ఉదంతమే నిదర్శనం. -
నాడు వాతలుండవని కోతలు.. నేడు ఛార్జీల మోతలు
[ 25-04-2024]
ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్రెడ్డి రాష్ట్రమంతా తిరిగి చంద్రబాబు పాలనలో కరెంటు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయని విమర్శించారు. తాను అధికారంలోకి వచ్చాక విద్యుత్తు ఛార్జీలు పెంచబోమని హామీనిచ్చారు. -
అభిమాన నీరాజనం
[ 25-04-2024]
జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ నామినేషన్ సందర్భంగా బుధవారం తెనాలిలో నిర్వహించిన ప్రదర్శనకు ప్రజలు భారీగా తరలివచ్చారు. -
పసుపుమయమైన రేపల్లె
[ 25-04-2024]
రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నామినేషన్ దాఖలు కార్యక్రమం బుధవారం కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది. -
అక్రమంగా తవ్వారు.. ప్రాణాలు తీస్తున్నారు!
[ 25-04-2024]
రెండేళ్ల కిందట ప్రత్తిపాడుకు చెందిన నలుగురు కళాశాల విద్యార్థులు ఈతకు బోయపాలెంలోని డైట్ సమీపంలో క్వారీ గుంత వద్దకు వెళ్లారు. -
చందా.. దందా
[ 25-04-2024]
ఎన్నికలంటే ఖర్చులు ఎలా ఉంటాయో మీకు తెలియంది కాదు. -
మిత్ర ద్రోహం
[ 25-04-2024]
పాదయాత్రలో అధికారంలోకి రాగానే గోపాల మిత్రలకు నెలకు రూ.16 వేల గౌరవవేతనం ఇస్తామని హామీ ఇచ్చి గత అయిదేళ్లుగా ఒక్క రూపాయి కూడా పెంచకుండా తమని సీఎం జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని గోపాల మిత్రలు వాపోతున్నారు. -
‘పది’లో ‘ప్రత్యేక’ విజయం
[ 25-04-2024]
అమ్మ ప్రోత్సాహం..అమ్మమ్మ పర్యవేక్షణ..భవిత కేంద్ర టీచర్ల కృషి...ప్రధానోపాధ్యాయురాలి తోడ్పాటు వెరసి 16 ఏళ్ల దివ్యాంగురాలైన జి.శ్రావ్య జోసెఫిన్ పదో తరగతి పూర్తిచేసింది. -
తెదేపా ప్రచార వాహన డ్రైవర్పై వైకాపా దాడి
[ 25-04-2024]
తెలుగుదేశం పార్టీ ప్రచార వాహన డ్రైవర్పై కొందరు వైకాపా నాయకులు దాడి చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. -
ప్రజల గొంతూ తడపలేరా?
[ 25-04-2024]
2018 మార్చి 14వ తేదీన ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి పొన్నూరులో నిర్వహించిన బహిరంగ సభలో పొన్నూరు పట్టణ ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని అప్పటి తెదేపా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. -
రాజీనామా చేయకుంటే అంతుచూస్తాం
[ 25-04-2024]
వాలంటీర్లుగా మీకు ప్రతి ఇంట్లో ఎంత మంది ఓటర్లున్నారు..ఎటు అనుకూలంగా ఉన్నారో తెలుసు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 25-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు రైల్వే అధికారి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్