logo

భర్త కళ్లెదుట భార్య మృతి

అందరూ ప్రేమగా చూసుకునే యువకుడు కన్నుమూయగా అతని చివరిచూపునకు ఆమె భర్తతో బయలుదేరారు. గమ్యస్థానానికి సమీపంలో వెనుక వచ్చిన టిప్పర్‌ వారి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.దీంతో కింద పడటంతో భర్త కళ్ల ముందే భార్య మృతి చెందారు.

Published : 25 Jun 2022 05:35 IST

ప్రమాద విషయాన్ని ఫోన్‌లో తెలియజేస్తున్న భర్త

మాదల (ముప్పాళ్ల), న్యూస్‌టుడే: అందరూ ప్రేమగా చూసుకునే యువకుడు కన్నుమూయగా అతని చివరిచూపునకు ఆమె భర్తతో బయలుదేరారు. గమ్యస్థానానికి సమీపంలో వెనుక వచ్చిన టిప్పర్‌ వారి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.దీంతో కింద పడటంతో భర్త కళ్ల ముందే భార్య మృతి చెందారు. ఈ విషాద ఘటన సత్తెనపల్లి- నరసరావుపేట రోడ్డు మార్గంలో మాదల పెట్రోలు బంకు సమీపంలో శుక్రవారం రాత్రి జరిగింది. ఎస్సై పట్టాభిరామయ్య వివరాల మేరకు.. గుంటూరులోని కొరిటెపాడుకు చెందిన పరుచూరి రంగనాథబాబు, కిరణ్‌జ్యోతి (38) దంపతులు. ఆయన లయోలా స్కూల్‌లో, ఆమె మాంటిస్సోరి పాఠశాలలో ఉపాధ్యాయులు. ఆమె బాబాయి అయ్యగారు ముప్పాళ్లలో ఉంటున్నారు. ఆయన మనవడు, మానసిక దివ్యాంగుడైన రాజీవ్‌ (24) అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందాడు. అతనిని చివరిసారి చూసేందుకు దంపతులు గుంటూరు నుంచి ద్విచక్ర వాహనంపై ముప్పాళ్ల బయలుదేరారు. మాదల పెట్రోలు బంకు సమీపంలో వెనుక వచ్చిన టిప్పర్‌ ఢీకొట్టింది. రోడ్డుపై పడిపోవడంతో ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. భార్యను బతికించుకోవాలని 108 వాహనానికి ఫోన్‌ చేశారు. అత్యవసర వైద్య సేవలకు సత్తెనపల్లి ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలకు తరలిస్తుండగా మృతి చెందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని