నల్లమడ..రైతుకు దడ
నల్లమడ వాగు పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో 168 కి.మీ. దూరం ప్రవహించి సూర్యలంక సమీపంలోని పొగురు వద్ద సముద్రంలో కలుస్తుంది. 2013 అక్టోబరులో వాగుకు భారీ వరద వచ్చింది. అంచనాలకు మించి 42 వేల క్యూసెక్కుల వరద నీరు
అటకెక్కిన వాగుఆధునికీకరణ పనులు
ముంపుతో ఏటా వేల ఎకరాల్లో పంట నష్టం
వాగు పరిధిలో నీట మునిగిన వరి పంట (పాతచిత్రం)
బాపట్ల, న్యూస్టుడే : నల్లమడ వాగు పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో 168 కి.మీ. దూరం ప్రవహించి సూర్యలంక సమీపంలోని పొగురు వద్ద సముద్రంలో కలుస్తుంది. 2013 అక్టోబరులో వాగుకు భారీ వరద వచ్చింది. అంచనాలకు మించి 42 వేల క్యూసెక్కుల వరద నీరు ప్రవహించడంతో జలవనరుల శాఖ అధికారులు సైతం ఆందోళన చెందారు. వాగులో నీరు పొంగి పొర్లి కొమ్మమూరు కాలువ, ఇతర సాగునీటి కాలువల కట్టలు కొట్టుకుపోయాయి. వాగు కట్టలు తెగి వందల సంఖ్యలో గండ్లు పడ్డాయి. వేల ఎకరాల్లో పంట మునిగి రైతులకు తీరని నష్టం జరిగింది. అప్పటి నుంచి ఏటా ముప్పు పొంచి ఉన్నా, యంత్రాంగానికి మాత్రం కనువిప్పు కలగడం లేదు. రైతుల కష్టాలను పట్టించుకోవాల్సిన పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
జలవనరుల శాఖ అధికారులు ప్రైవేటు కన్సల్టెన్సీ ద్వారా సర్వే చేయించి వాగును 350 సీ వాల్యూ నుంచి 500 సీ వాల్యూ వరకు విస్తరించడానికి 438 ఎకరాల భూమి కావాలని ప్రతిపాదనలు రూపొందించి అప్పటి ఉమ్మడి గుంటూరు జిల్లా కలెక్టర్కు అందజేశారు. 2019 మే 30న వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నెల రోజుల్లోనే పనులు రద్దు చేసింది. నల్లమడ రైతు సంఘం ప్రతినిధులు మంత్రులు, ప్రజాప్రతినిధులను కలిసి వాగు ఆధునికీకరణ పనులు చేపట్టాలని వినతి పత్రాలు అందజేశారు. మూడేళ్లు గడిచినా పనుల ఊసే ఎత్తడం లేదు. 2020, 2021 నవంబరులో తుపాను, వాయుగుండాల ప్రభావంతో భారీవర్షాలు కురిశాయి. వాగు, మురుగు కాలువలు అధ్వానంగా ఉండటం వల్ల పొలాల్లో నుంచి వారం, పది రోజుల వరకు నీరు బయటకు వెళ్లలేదు. నీట మునిగి ధాన్యం రంగు మారడంతో రైతులు రూ.కోట్లలో నష్టపోయారు. బాపట్ల మండలం జిల్లెళ్లమూడి, తూర్పు, పడమర పిన్నిబోయినవారిపాలెం వద్ద వాగు కట్టలు చాలా బలహీనంగా ఉన్నాయి. పెదనందిపాడు, కాకుమాను మండలాల్లో మట్టి కోసం అక్రమ తవ్వకాలతో కట్టలకు తూట్లు పొడుస్తున్నారు. భారీ వరదలు మరోసారి వస్తే బలహీనంగా ఉన్న కట్టలు కొట్టుకుపోతాయి. పంట నష్టం భారీగా జరిగి రైతులకు కోలుకోలేని నష్టం జరుగుతుంది. ఆధునికీకరణ పనుల ఆవశ్యకతను ప్రభుత్వం గుర్తించి వెంటనే భూసేకరణ చేపట్టి వాగును విస్తరించి ముంపు సమస్యను పరిష్కరించాలని అన్నదాతలు కోరుతున్నారు.
వరద సమయంలో వాగులో నీటి పరవళ్లు
నల్లమడ వాగు పనులు రూ.360 కోట్ల వ్యయంతో చేపట్టేందుకు గత ప్రభుత్వ హయాంలో పాలనాపరమైన ఆమోదం లభించింది. భూసేకరణ దశలో ప్రభుత్వం మారి వైకాపా అధికారంలోకి వచ్చింది. 2019 జూన్లో ఆధునికీకరణ పనులను రద్దు చేసింది. మూడేళ్లుగా భూసేకరణ దస్త్రం మూలనపడింది. నిధులు కేటాయించలేదు. పనుల ఊసే ఎత్తడం లేదు. వరుసగా రెండేళ్ల పాటు నవంబరు నెలలో వచ్చిన తుపాన్ల ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు పొలాల నుంచి నీరు వారం రోజులు బయటకు పోలేదు. వేల ఎకరాల్లో వరి పైరు ముంపు బారినపడి కంకులకు మొలకలు వచ్చాయి. ధాన్యం రంగుమారి అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. బాపట్ల శివారునున్న జిల్లెళ్లమూడి గ్రామం నాలుగు రోజులు జలదిగ్బంధనంలో చిక్కుకుంది. బాపట్ల పట్టణంలో 40 శాతం కాలనీలు ముంపు బారినపడ్డాయి. లక్షన్నర ఎకరాల్లో వరి, మిరప, పత్తి పంటలు తుడిచిపెట్టుకుపోయాయి. 2016లో మరోసారి వరదలు వచ్చి కట్టలు తెగి గండ్లు పడ్డాయి. 2017లో అప్పటి ప్రభుత్వం ఆధునికీకరణ పనులకు పచ్చజెండా ఊపి, భూసేకరణ నిమిత్తం తొలి విడతలో రూ.180 కోట్లు మంజూరు చేస్తూ పాలనాపరమైన ఆమోదం తెలిపింది.
నిధులు కేటాయించగానే పనులు
ప్రభుత్వం నిధులు కేటాయించగానే నల్లమడ వాగు ఆధునికీకరణ పనులు చేపడతాం. రెవెన్యూ శాఖ భూసేకరణ చేపట్టాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తయితే పనులు ప్రారంభించవచ్ఛు గతంలో రూపొందించిన అంచనా వ్యయం పెరిగే అవకాశం ఉంది. వాగు కట్టలు బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో పటిష్ఠతకు చర్యలు చేపడతాం. - మురళీకృష్ణ, జిల్లా జలవనరుల శాఖాధికారి
నల్లమడ వాగు గరిష్ఠ వరద నీటి ప్రవాహ సామర్థ్యం : 24 వేల క్యూసెక్కులు
ఆధునికీకరణ పనులుపూర్తి చేస్తే గరిష్ఠ వరద నీటి ప్రవాహ సామర్థ్యం : 42 వేల క్యూసెక్కులు
భూసేకరణకు కావాల్సిన భూమి : 438 ఎకరాలు
మూడు జిల్లాల్లోవాగు ముంపుప్రభావిత ఆయకట్టు : లక్షన్నర ఎకరాలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ డీజీపీని బదిలీచేయండి: ఎన్నికల సంఘానికి భాజపా ఫిర్యాదు
[ 25-04-2024]
డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డిని బదిలీ చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయంలో భాజపా నేతలు మరోమారు ఫిర్యాదు చేశారు. -
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం: సినీ నటుడు నిఖిల్
[ 25-04-2024]
బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్థి ఎం.ఎం కొండయ్య గురువారం అట్టహాసంగా నామినేషన్ వేశారు. -
ఏపీలో ముగిసిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ
[ 25-04-2024]
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. -
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు: నారా లోకేశ్
[ 25-04-2024]
ఓట్లు అడగడానికి వచ్చే వైకాపా నేతలను రాజధాని రైతులు నిలదీయాలని యువనేత, మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. -
చదువులమ్మ చెట్టుకు.. రాజకీయ చెద!
[ 25-04-2024]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేరెన్నికగన్న పురాతన విద్యాసంస్థల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఒకటి. దేశ, విదేశాల్లో ఎంతో ఖ్యాతినార్జించిన ఘనత దీని సొంతం. దాదాపు పది, పదిహేను దేశాల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకునేవారు. -
యూజీడీ మూలన.. మాటలు మరుగున
[ 25-04-2024]
నా ముస్లింలు.. నా మైనార్టీలు అంటూ మాటలతో మభ్యపెట్టడమే గానీ సీఎం జగన్కు వారిపై ఏమాత్రం ప్రేమలేదని చెప్పడానికి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తికాని ఉదంతమే నిదర్శనం. -
నాడు వాతలుండవని కోతలు.. నేడు ఛార్జీల మోతలు
[ 25-04-2024]
ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్రెడ్డి రాష్ట్రమంతా తిరిగి చంద్రబాబు పాలనలో కరెంటు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయని విమర్శించారు. తాను అధికారంలోకి వచ్చాక విద్యుత్తు ఛార్జీలు పెంచబోమని హామీనిచ్చారు. -
అభిమాన నీరాజనం
[ 25-04-2024]
జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ నామినేషన్ సందర్భంగా బుధవారం తెనాలిలో నిర్వహించిన ప్రదర్శనకు ప్రజలు భారీగా తరలివచ్చారు. -
పసుపుమయమైన రేపల్లె
[ 25-04-2024]
రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నామినేషన్ దాఖలు కార్యక్రమం బుధవారం కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది. -
అక్రమంగా తవ్వారు.. ప్రాణాలు తీస్తున్నారు!
[ 25-04-2024]
రెండేళ్ల కిందట ప్రత్తిపాడుకు చెందిన నలుగురు కళాశాల విద్యార్థులు ఈతకు బోయపాలెంలోని డైట్ సమీపంలో క్వారీ గుంత వద్దకు వెళ్లారు. -
చందా.. దందా
[ 25-04-2024]
ఎన్నికలంటే ఖర్చులు ఎలా ఉంటాయో మీకు తెలియంది కాదు. -
మిత్ర ద్రోహం
[ 25-04-2024]
పాదయాత్రలో అధికారంలోకి రాగానే గోపాల మిత్రలకు నెలకు రూ.16 వేల గౌరవవేతనం ఇస్తామని హామీ ఇచ్చి గత అయిదేళ్లుగా ఒక్క రూపాయి కూడా పెంచకుండా తమని సీఎం జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని గోపాల మిత్రలు వాపోతున్నారు. -
‘పది’లో ‘ప్రత్యేక’ విజయం
[ 25-04-2024]
అమ్మ ప్రోత్సాహం..అమ్మమ్మ పర్యవేక్షణ..భవిత కేంద్ర టీచర్ల కృషి...ప్రధానోపాధ్యాయురాలి తోడ్పాటు వెరసి 16 ఏళ్ల దివ్యాంగురాలైన జి.శ్రావ్య జోసెఫిన్ పదో తరగతి పూర్తిచేసింది. -
తెదేపా ప్రచార వాహన డ్రైవర్పై వైకాపా దాడి
[ 25-04-2024]
తెలుగుదేశం పార్టీ ప్రచార వాహన డ్రైవర్పై కొందరు వైకాపా నాయకులు దాడి చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. -
ప్రజల గొంతూ తడపలేరా?
[ 25-04-2024]
2018 మార్చి 14వ తేదీన ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి పొన్నూరులో నిర్వహించిన బహిరంగ సభలో పొన్నూరు పట్టణ ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని అప్పటి తెదేపా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. -
రాజీనామా చేయకుంటే అంతుచూస్తాం
[ 25-04-2024]
వాలంటీర్లుగా మీకు ప్రతి ఇంట్లో ఎంత మంది ఓటర్లున్నారు..ఎటు అనుకూలంగా ఉన్నారో తెలుసు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 25-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు రైల్వే అధికారి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?