logo

నిమిషాల వ్యవధిలో.. తండ్రీకుమార్తె హఠాన్మరణం

తండ్రీకుమార్తె నిమిషాల వ్యవదిలో వేర్వేరుగా మృత్యుఒడికి చేరిన హృదయవిదారక సంఘటన నగరం మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు అందించిన సమాచారం మేరకు వివరాలు.. మండల పరిధిలోని కారంకివారిపాలెం గ్రామానికి చెందిన

Published : 25 Jun 2022 05:35 IST

కారంకివారిపాలెంలో విషాదం

ఆరేపల్లి మనోజ (పాతచిత్రం)

నగరం, న్యూస్‌టుడే: తండ్రీకుమార్తె నిమిషాల వ్యవదిలో వేర్వేరుగా మృత్యుఒడికి చేరిన హృదయవిదారక సంఘటన నగరం మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు అందించిన సమాచారం మేరకు వివరాలు.. మండల పరిధిలోని కారంకివారిపాలెం గ్రామానికి చెందిన యార్లగడ్డ వెంకటేశ్వరరావు (60) ఉదయం సుమారు 7గంటల సమయంలో గుండె పట్టేసిందంటూ ఇంటి వద్దనే కుప్పకూలి ప్రాణాలు విడిచారు. గుంటూరు వైద్యశాలలో చికిత్స పొందుతున్న ఆయన కుమార్తె ఆరేపల్లి మనోజ (35) తండ్రి మరణ వార్త తెలియకుండానే ఉదయం 7.30 సమయంలో మృతి చెందారు. ఈమెకు ఆరేపల్లి గ్రామానికి చెందిన సునీల్‌తో దాదాపు ఏడేళ్ల క్రితం వివాహమైంది. ఇప్పటి వరకు పిల్లలు కలగక పోవడంతో ఈ దంపతులు గుంటూరులో మందులు వాడుతున్నారు. వాటి ప్రభావంతో అస్వస్థతతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. కారణాలు ఏవైనా తండ్రికుమార్తె ఒకేరోజు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.

వెంకటేశ్వరరావు (పాతచిత్రం)​​​​​​​

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని