పోటీ పరీక్షల కాలం.. ఒత్తిడి అధిగమిస్తేనే విజయం
జాతీయస్థాయిలో ఎన్టీఏ జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్, నీట్(యూజీ) పీజీ పరీక్షలు నిర్వహించి ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థల్లో బీటెక్, ఎంబీబీఎస్లో ప్రవేశాలు కోరుకునే విద్యార్థులకు ఫలితాల ఆధారంగా ర్యాంకులు ఇస్తుంది.
* నరసరావుపేటకు చెందిన ఒక విద్యార్థి గతంలో జేఈఈ ప్రధాన పరీక్షల్లో నూరు శాతం మార్కులు సాధించాడు. తర్వాత అడ్వాన్స్ పరీక్షలో శక్తి మేర రాణించలేకపోయాడు. ప్రతిభావంతుడైన విద్యార్థి రెండేళ్లు ఒకే లక్ష్యంతో ఒకే దినచర్యను అమలు చేశాడు. అయినా ఫలితం ఆశాజనకంగా లేదు. ఒత్తిడిని నియంత్రించుకునే క్రమంలో విఫలమయ్యాడు.
* గుంటూరుకు చెందిన ఒక కార్పొరేట్ కళాశాలలో నలుగురు విద్యార్థినులు నీట్ పరీక్ష కోసం కృషి చేశారు. పరీక్ష దగ్గరకు వస్తున్న సమయంలో ఒకే గదిలో ఉంటూ అప్పటికి వరకూ బాగా రాణిస్తున్న విద్యార్థినులు ఒక్కసారిగా వెనకబడ్డారు. తప్పనిసరిగా నీట్లో మంచి ర్యాంకు సాధించే సామర్థ్యం వారికి ఉంది. అయితే ఒక్కరికి కూడా బీ క్యాటగిరీలో సైతం సీట్లు రాలేదు.
న్యూస్టుడే, నరసరావుపేట అర్బన్: జాతీయస్థాయిలో ఎన్టీఏ జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్, నీట్(యూజీ) పీజీ పరీక్షలు నిర్వహించి ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థల్లో బీటెక్, ఎంబీబీఎస్లో ప్రవేశాలు కోరుకునే విద్యార్థులకు ఫలితాల ఆధారంగా ర్యాంకులు ఇస్తుంది. దీంతోనే ఐఐటీలు, ఎయిమ్స్, జిప్మర్ తదితర సంస్థల్లో ప్రవేశాలు దక్కుతాయి. ఏటా దేశవ్యాప్తంగా సుమారు 10 లక్షల మంది విద్యార్థులు ప్రవేశ పరీక్షలు రాస్తుంటారు. పరీక్ష ముందు వరకూ అత్యంత ప్రతిభ చూపిన విద్యార్థులు సైతం పోటీ పరీక్షల్లో శక్తి మేరకు రాణించలేక విఫలమవుతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో బైపీసీ ఏటా 30వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో దాదాపు 20వేల మంది వరకూ నీట్కు సన్నద్ధమవుతారు. వీరితో పాటు లాంగ్టర్మ్ శిక్షణ పొందే విద్యార్థులు మరో 2వేల వరకూ ఉంటారు. జేఈఈ పరీక్షకు కూడా అంతకుమించి విద్యార్థులు హాజరవుతారు. జేఈఈ ప్రధాన పరీక్షలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. నీట్ పరీక్ష జులై 17న జరగనుంది. జేఈఈ అడ్వాన్స్ పరీక్షలు ఆ తర్వాత నెలలో ఉంటాయి.
భావోద్వేగాల అదుపుతో..
విజేతలకు పరాజితులకు ఉన్న తేడా స్వల్పమే. తల్లిదండ్రుల అవగాహన లేమి, ఇతరులతో పోల్చుకునే లక్షణం, అధ్యాపకుల వ్యవహారశైలి ఇవన్నీ విద్యార్థులపై ఒత్తిడి పెంచుతాయి. దాన్ని ఆశావహ దృక్పథంతో అధిగమించి రాణించవచ్చని సైకాలజిస్టులు చెబుతున్నారు. బావోద్వేగాలను అదుపు చేసుకోవాలని సూచిస్తున్నారు. వారి సూచనలు..
* లక్ష్య సాధనకు పూర్తిస్థాయిలో మానసికంగా సిద్ధం కావాలి. విద్యార్థికి కమిట్మెంట్ ఉంటే ఒత్తిడి ఉండదు.
* విద్యార్థి వ్యక్తిగతంగా తయారు చేసుకున్న ప్రణాళికలను తప్పనిసరిగా పూర్తి చేయాలి.
* విషయపరంగా స్పష్టత ఉండాలి. తెలియని అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం అవసరం. స్పష్టత లోపిస్తే తర్వాత అంశాల్లో స్పష్టత ఉండదు. దీనివల్ల పరీక్షల్లో విఫలమవుతారు.
* ఎప్పుడూ ఆనందంగా ఉండాలి.
* నిత్యం అరగంట పాటు వ్యాయామం చేయాలి.
* తల్లిదండ్రులు, అధ్యాపకులు విద్యార్థులను ప్రోత్సహించి అభినందించాలి. తద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
* సైకాలజిస్టులు ఒత్తిడిని అధిగమించేందుకు ‘డోస్’ అనే శాస్త్రీయమైన విధానాన్ని అమలుకు ప్రతిపాదిస్తున్నారు. డోస్ అంటే విద్యార్థులను మానసికంగా ప్రేరేపించే నాలుగు రకాల హార్మోన్లుగా గురించారు. ఇది విద్యార్థులను అభినందించడం, తల్లిదండ్రుల స్పర్శతో హార్మోన్లు విడుదల అవుతాయి. డి- డొఫోమైన్, ఓ-ఆక్సిటోసిన్, ఎస్- సెరిటోలిం, ఈ- ఎండోఫిన్ ఈ నాలుగు హార్మోన్లతో ఒత్తిడి నుంచి దూరమై విద్యార్థి ఆశావహ దృక్పథంలోకి వస్తాడు.
సవాళ్లు అధిగమిస్తేనే..
-డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు, సైకాలజిస్టు, గుంటూరు
ఉన్నతమైన లక్ష్యాలను ఎంచుకున్న వారికి సవాళ్లు ఎదురవుతాయి. వాటిని అధిగమిస్తేనే విజయం దక్కుతుంది. భావోద్వేగాలను అదుపు చేసుకుంటే మంచి ఫలితాలు సాధించేందుకు అవసరమైన శక్తి సమకూరుతుంది. పరీక్ష సమయంలో భయపడడం, ఆందోళనకు గురవడంతో ఉపయోగం ఉండదు. ప్రశాంత చిత్తంతో పరీక్ష రాస్తే ఎక్కువ మార్కులు సాధించగలుగుతారు. లేకుంటే తెలిసిన సమాధానాలే గుర్తించలేక నష్టపోతారు. ఏడాది పాటు చదివిన చదువు సరిపోతుంది. పరీక్ష ముందు తప్పులు చేయకుండా ఎలా రాయాలన్న అంశంపై దృష్టి ఉండాలి. అందుకు తగిన సాధన చేయాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరోగ్యం చిదిమేసి.. బతుకుల్ని బుగ్గి‘జే’సి..
[ 19-04-2024]
మద్యపాన నిషేధం చేస్తామని జగన్మోహన్రెడ్డి ఓట్లు దండుకుని తీరా అధికారంలోకి వచ్చాక ఆ మాటే మరిచారు. స్వయంగా ప్రభుత్వమే మద్యం వ్యాపారానికి తెరతీసింది. నాసిరకం మద్యం పోసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడింది. -
అండ నేనన్నావు.. గుదిబండలా మార్చావు..
[ 19-04-2024]
జిల్లాలో వైకాపా ప్రభుత్వ అయిదేళ్ల పాలనలో ఒక్క కొత్త పరిశ్రమ రాకపోగా ఉన్నవి చాలా వరకు మూతపడ్డాయి. పత్తి ఆధారిత పరిశ్రమలైన జిన్నింగ్ పూర్తిగా ఎత్తేయగా.. స్పిన్నింగ్ మిల్లులు అదే దిశగా నడుస్తున్నాయి. -
యువనేతపై ఉప్పొంగిన అభిమానం
[ 19-04-2024]
లోకేశ్ తరఫున నామినేషన్ పత్రాల సమర్పణ సందర్భంగా గురువారం మంగళగిరిలో జనసేన, భాజపా, తెదేపా, ఎమ్మార్పీఎస్ శ్రేణులు భారీ ప్రదర్శన నిర్వహించారు. -
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వినియోగానికి ఆటంకాలు
[ 19-04-2024]
వైకాపా ప్రభుత్వంపై ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. ఇదే అదనుగా పోలింగ్ విధుల్లో పాల్గొనే ఉద్యోగులు అందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోకుండా వ్యూహాత్మకంగా ఉన్నతాధికారులు ఆటంకాలు కలిగిస్తున్నారని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఆరోపిస్తున్నాయి. -
కోన ఆస్తుల విలువ రూ.24.20 కోట్లు
[ 19-04-2024]
బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే కోన రఘుపతి తన కుటుంబ ఆస్తుల విలువను రూ.24.20 కోట్లుగా గురువారం దాఖలు చేసిన ఎన్నికల నామినేషన్ అఫిడవిట్లో పేర్కొన్నారు. -
నలిగిపోతున్న నాలుగో సింహం
[ 19-04-2024]
ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ కల్పించడంలో పోలీసులు పగలు, రాత్రి కష్టపడుతుంటారు. శాంతిభద్రతలను పరిరక్షించే క్రమంలో సంఘ విద్రోహశక్తుల చేతిలో ప్రాణత్యాగాలకు సైతం వెనకాడరు. -
కర్షకుల కష్టాలు కనిపించవా..?
[ 19-04-2024]
పెదవడ్లపూడి ఉన్నత వాహినిపై ఎత్తిపోతల పథకం పూర్తి చేసి రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే ఆర్కే హామీ ఇచ్చారు. కానీ అమలు చేయడం మర్చిపోయారు. -
వైకాపా ప్రభుత్వ నిర్ణయ లోపం.. విద్యార్థులకు శాపం
[ 19-04-2024]
‘మీ పిల్లలు బడిలో భోజనం చేయకపోతే మీకు వస్తున్న ప్రభుత్వ పథకాలు నిలిచేపోయే అవకాశం ఉంది’అని తల్లిదండ్రుల సమావేశాల్లో ఉపాధ్యాయులు చెబుతున్నా.. నాణ్యత లేకపోవడంతో చాలా మంది విద్యార్థులు -
‘అవినీతి పాలనకు చరమగీతం పాడుదాం’
[ 19-04-2024]
అసమర్థ, అవినీతి పాలనకు చరమగీతం పాడుదామని గుంటూరు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. కొల్లిపరలో గురువారం సాయంత్రం నిర్వహించిన రోడ్షోలో ఆయన మాట్లాడుతూ వైకాపా పాలకులకు పోలవరం పట్టలేదు, -
ఎప్పటికి తొలగిస్తారో!
[ 19-04-2024]
పట్టణ పరిధి జీబీసీ రహదారిలో విద్యుత్తు స్తంభానికి సీఎం జగన్, స్థానిక ఎమ్మెల్యే రోశయ్య, వైకాపా నేతల ఫొటోలతో కూడిన బోర్డు ఉంది. -
మొదలైన నామినేషన్ల పర్వం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో గురువారం నుంచి జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల పర్వం మొదలైంది. ఈ క్రమంలో నెల రోజులుగా పలు విధాలుగా ప్రచార కార్యక్రమాలు చేపట్టిన పార్టీలు ఇప్పటికే నామినేషన్ పత్రాలు పూర్తి చేసి మంచి ముహూర్తం కోసం వేచి ఉన్నారు. -
ఫోన్పే చేయమన్నాడు.. అదృశ్యమయ్యాడు!
[ 19-04-2024]
అద్దంకి పురపాలక కార్యాలయం వద్ద మంచినీటి కుళాయి రుసుం చెల్లించేందుకు వచ్చిన వృద్ధుడ్ని ఓ ఘరానా దొంగ మోసగించాడు. ఈ సంఘటన గురువారం ఉదయం పురపాలక పన్నుల విభాగం వద్ద జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు