పల్లె ఖాతా నిండుకుంది!
నిధుల కొరతతో పంచాయతీలు ఈసురోమంటున్నాయి. పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా గ్రామాల్లో మురుగు కాల్వలు, తాగునీటి ట్యాంకులు, కొళాయిల చుట్టూ శుభ్రం చేసి తరచూ బ్లీచింగ్ పౌడరు చల్లాలి.
బ్లీచింగ్ కొనుగోలుకూ నిధులు కరవే
పడకేస్తున్న పారిశుద్ధ్యం
రేపల్లె అర్బన్, బాపట్ల అర్బన్, న్యూస్టుడే: నిధుల కొరతతో పంచాయతీలు ఈసురోమంటున్నాయి. పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా గ్రామాల్లో మురుగు కాల్వలు, తాగునీటి ట్యాంకులు, కొళాయిల చుట్టూ శుభ్రం చేసి తరచూ బ్లీచింగ్ పౌడరు చల్లాలి. వర్షాకాలం నేపథ్యంలో దోమల నివారణకు ముందస్తు చర్యల్లో భాగంగా ఫాగింగ్ చేయాలి. ప్రభుత్వ నిబంధనల మేరకు 15 రోజులకోసారి టాం్యకులు శుభ్రం చేయాలి. బ్లాక్ బోర్డు ఏర్పాటు చేసి శుభ్రం చేసిన తేదీ నమోదు చేయాలి. ఈ ప్రక్రియ సజావుగా సాగాలంటే పంచాయతీల ఖాతాల్లో నిధులుండాలి. కానీ ఖాతాలు ఖాళీగా ఉండటంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి.
బిల్లులు మంజూరుకాక లబోదిబో..
పంచాయతీల్లో నూతన పాలకవర్గాలు ఏర్పడి ఏడాది దాటినా ఇంతవరకు పంచాయతీల ఖాతాలకు ఏ రూపంలోనూ నిధులు జమ కాలేదు. కేంద్రం మంజూరు చేసిన 14, 15వ ఆర్థిక సంఘాల నిధులను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఫలితంగా సాధారణ నిధులు మినహా గ్రామ పంచాయతీలకు ఆదాయ వనరులు లేవు. సాధారణ నిధుల కింద ఇంటి, నీటి కొళాయి పన్ను, చెరువుల వేలంపాట ద్వారా వచ్చే సొమ్ము మాత్రమే ఖాతాల్లో జమవుతోంది. అవి కూడా బిల్లులు సక్రమంగా పాస్కాక సర్పంచులు అల్లాడుతున్నారు. ఈ క్రమంలో బ్లీచింగ్ పౌడరు కొనలేని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు పర్యటించేటప్పుడు మాత్రమే వీధుల్లో చెత్తను తొలగించి అప్పోసొప్పో చేసి తూతూమంత్రంగా బ్లీచింగ్ చల్లిస్తున్నారు.
పొంచి ఉన్న వ్యాధుల ముప్పు
సాధారణంగా జూన్, జులైలో వానలు కురిసి వాతావరణంలో మార్పుతో అంటువ్యాధులు విజృంభిస్తుంటాయి. ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. అయితే, నిధుల లేమితో ఇబ్బంది ఎదురవుతోంది. మురుగు కాల్వల్లో రోజులతరబడి మురుగు తిష్ఠ వేయడంతో దోమల ఉత్పత్తికి నిలయంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో పారిశుద్ధ్య సమస్య ఉత్పన్నమవుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే వర్షాకాలంలో సమస్యలు ఎదుర్కోక తప్పదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ప్రత్యేక దృష్టి పెట్టాం
- తాతా శివశంకరరావు, డీఎల్పీవో
పంచాయతీల్లో నిధుల కొరత ఉన్న మాట వాస్తవమే. పారిశుద్ధ్య సమస్య ఉత్పన్నం కాకుండా ప్రత్యేక దృష్టి సారించాం. సాధారణ నిధులు వెచ్చించి సమస్య అధిగమిస్తున్నాం. పలుచోట్ల కొందరు సర్పంచులు, కార్యదర్శులు సొంత సొమ్ముతో పనులు చేయిస్తున్నారు. వ్యాధులు ప్రబలకుండా మురుగు కాల్వల్లో పూడిక తీయించి, చెత్తాచెదారం పేరుకోకుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నాం.
ఆదాయం మూరెడు.. ఖర్చు బారెడు
పంచాయతీల పరిస్థితి ఆదాయం మూరెడు.. ఖర్చు బారెడు అన్న చందాన ఉంది. అయిదు వేలకుపైగా జనాభా కలిగిన మేజరు పంచాయతీల్లో పారిశుద్ధ్యానికి, క్లాప్మిత్ర, క్లాప్షెడ్ మిత్ర (గ్రీన్ అంబాసిడర్లు) వేతనాలకు నెలకు సగటున రూ.1.50 లక్షలు, రెండు వేల జనాభా కంటే తక్కువ ఉన్న మైనరు పంచాయతీల్లో రూ.40 వేల మేరకు ఖర్చవుతోంది. ఇంటి, నీటి కొళాయి పన్ను కింద మేజరు పంచాయతీకి జనాభా ప్రాతిపదికన రూ.8 లక్షల నుంచి రూ.12 లక్షలు, వెయ్యి నుంచి ఐదు వేల జనాభా ఉన్న మైనరు పంచాయతీకి రూ.80 వేల నుంచి రూ.4 లక్షల ఆదాయం సమకూరుతుంది. సాధారణ నిధులను పూర్తిగా పారిశుద్ధ్య నిర్వహణకే వినియోగించినా సరిపోని పరిస్థితి నెలకొంది. ఇంటింటికీ చెత్తపన్ను వసూలు చేస్తున్నా రూ.20 వేల నుంచి రూ.50 వేలు మించి రావడం లేదని సిబ్బంది చెబుతున్నారు. చాలా పంచాయతీల్లో సర్పంచులు గౌరవం కాపాడుకోవడానికి అప్పులు చేసి బ్లీచింగ్ పౌడరు కొంటున్నారు. మరికొందరు సొంత సొమ్ముతో తాగునీటి పైపుల మరమ్మతులు తదితర పనులు చేయించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి బ్లీచింగ్ కొనాలంటూ రూ.వేలు వెచ్చించాల్సి వస్తోందని వాపోతున్నారు. గతేడాది నవంబరు నుంచి పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు రావడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం జగన్పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు
[ 19-04-2024]
ఏప్రిల్ 16న భీమవరంలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. -
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
[ 19-04-2024]
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. -
గుంటూరు జిల్లాలో ప్రబలిన డయేరియా.. 100 మందికి పైగా అస్వస్థత
[ 19-04-2024]
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం మంచాలలో డయేరియా ప్రబలింది. వాంతులు, విరేచనాలతో గ్రామంలో 100 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. -
దశ‘దిశ’లా.. ఆక్రందనలే..!
[ 19-04-2024]
వైకాపా ప్రభుత్వ పదవీకాలం ముగుస్తున్నా ఇప్పటికీ ఆ చట్టానికి కోరలు లేవు. దాన్ని పార్లమెంట్ ఆమోదించలేదు. ఉనికిలో లేని చట్టం గురించి పదేపదే ప్రచారం చేసుకోవడం జగన్ సర్కార్ తీరుగా మారింది. -
జీవితాన్ని కలరా‘జే’సింది..
[ 19-04-2024]
రేపల్లెకు చెందిన మధు ప్రభుత్వ మద్యం తాగి పక్షవాతానికి గురై మంచానికి పరిమితమయ్యాడు. చేతివృత్తి చేసుకుంటూ భార్య ఇద్దరు పిల్లలను పోషించుకునే అతను మద్యం తాగేవాడు. -
సమస్యలు విలీనమై.. బడికి దూరమై..
[ 19-04-2024]
పాఠశాలల విలీనం వల్ల లాభం లేకపోగా టీచర్లకు, పిల్లలకు బాగా అన్యాయం జరిగింది. కొందరు టీచర్లు దూరాన ఉన్న ఉన్నత పాఠశాలలకు వెళ్లలేక పదోన్నతులు వదులుకోవడంతో నష్టపోయారు. అదేవిధంగా పిల్లల పరంగా చూస్తే సర్కారీ బడులకు దూరమయ్యారు. -
ఆరోగ్యం చిదిమేసి.. బతుకుల్ని బుగ్గి‘జే’సి..
[ 19-04-2024]
మద్యపాన నిషేధం చేస్తామని జగన్మోహన్రెడ్డి ఓట్లు దండుకుని తీరా అధికారంలోకి వచ్చాక ఆ మాటే మరిచారు. స్వయంగా ప్రభుత్వమే మద్యం వ్యాపారానికి తెరతీసింది. నాసిరకం మద్యం పోసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడింది. -
అండ నేనన్నావు.. గుదిబండలా మార్చావు..
[ 19-04-2024]
జిల్లాలో వైకాపా ప్రభుత్వ అయిదేళ్ల పాలనలో ఒక్క కొత్త పరిశ్రమ రాకపోగా ఉన్నవి చాలా వరకు మూతపడ్డాయి. పత్తి ఆధారిత పరిశ్రమలైన జిన్నింగ్ పూర్తిగా ఎత్తేయగా.. స్పిన్నింగ్ మిల్లులు అదే దిశగా నడుస్తున్నాయి. -
యువనేతపై ఉప్పొంగిన అభిమానం
[ 19-04-2024]
లోకేశ్ తరఫున నామినేషన్ పత్రాల సమర్పణ సందర్భంగా గురువారం మంగళగిరిలో జనసేన, భాజపా, తెదేపా, ఎమ్మార్పీఎస్ శ్రేణులు భారీ ప్రదర్శన నిర్వహించారు. -
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వినియోగానికి ఆటంకాలు
[ 19-04-2024]
వైకాపా ప్రభుత్వంపై ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. ఇదే అదనుగా పోలింగ్ విధుల్లో పాల్గొనే ఉద్యోగులు అందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోకుండా వ్యూహాత్మకంగా ఉన్నతాధికారులు ఆటంకాలు కలిగిస్తున్నారని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఆరోపిస్తున్నాయి. -
కోన ఆస్తుల విలువ రూ.24.20 కోట్లు
[ 19-04-2024]
బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే కోన రఘుపతి తన కుటుంబ ఆస్తుల విలువను రూ.24.20 కోట్లుగా గురువారం దాఖలు చేసిన ఎన్నికల నామినేషన్ అఫిడవిట్లో పేర్కొన్నారు. -
నలిగిపోతున్న నాలుగో సింహం
[ 19-04-2024]
ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ కల్పించడంలో పోలీసులు పగలు, రాత్రి కష్టపడుతుంటారు. శాంతిభద్రతలను పరిరక్షించే క్రమంలో సంఘ విద్రోహశక్తుల చేతిలో ప్రాణత్యాగాలకు సైతం వెనకాడరు. -
కర్షకుల కష్టాలు కనిపించవా..?
[ 19-04-2024]
పెదవడ్లపూడి ఉన్నత వాహినిపై ఎత్తిపోతల పథకం పూర్తి చేసి రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే ఆర్కే హామీ ఇచ్చారు. కానీ అమలు చేయడం మర్చిపోయారు. -
వైకాపా ప్రభుత్వ నిర్ణయ లోపం.. విద్యార్థులకు శాపం
[ 19-04-2024]
‘మీ పిల్లలు బడిలో భోజనం చేయకపోతే మీకు వస్తున్న ప్రభుత్వ పథకాలు నిలిచేపోయే అవకాశం ఉంది’అని తల్లిదండ్రుల సమావేశాల్లో ఉపాధ్యాయులు చెబుతున్నా.. నాణ్యత లేకపోవడంతో చాలా మంది విద్యార్థులు -
‘అవినీతి పాలనకు చరమగీతం పాడుదాం’
[ 19-04-2024]
అసమర్థ, అవినీతి పాలనకు చరమగీతం పాడుదామని గుంటూరు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. కొల్లిపరలో గురువారం సాయంత్రం నిర్వహించిన రోడ్షోలో ఆయన మాట్లాడుతూ వైకాపా పాలకులకు పోలవరం పట్టలేదు, -
ఎప్పటికి తొలగిస్తారో!
[ 19-04-2024]
పట్టణ పరిధి జీబీసీ రహదారిలో విద్యుత్తు స్తంభానికి సీఎం జగన్, స్థానిక ఎమ్మెల్యే రోశయ్య, వైకాపా నేతల ఫొటోలతో కూడిన బోర్డు ఉంది. -
మొదలైన నామినేషన్ల పర్వం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో గురువారం నుంచి జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల పర్వం మొదలైంది. ఈ క్రమంలో నెల రోజులుగా పలు విధాలుగా ప్రచార కార్యక్రమాలు చేపట్టిన పార్టీలు ఇప్పటికే నామినేషన్ పత్రాలు పూర్తి చేసి మంచి ముహూర్తం కోసం వేచి ఉన్నారు. -
ఫోన్పే చేయమన్నాడు.. అదృశ్యమయ్యాడు!
[ 19-04-2024]
అద్దంకి పురపాలక కార్యాలయం వద్ద మంచినీటి కుళాయి రుసుం చెల్లించేందుకు వచ్చిన వృద్ధుడ్ని ఓ ఘరానా దొంగ మోసగించాడు. ఈ సంఘటన గురువారం ఉదయం పురపాలక పన్నుల విభాగం వద్ద జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!