నేరాలు నియంత్రించేలా.. ప్రమాదాలు నివారించేలా..
పల్నాడు జిల్లాలో శాంతిభద్రతల పర్యవేక్షణను పోలీసు శాఖ సవాలుగా తీసుకుంది. నేరాలు, రోడ్డు ప్రమాదాలు అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఆయా ఘటనల్లో నేరస్థులను పట్టుకునేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్నారు.
అన్ని పట్టణాల్లో ఏర్పాటుకు సన్నాహాలు
పల్నాడు జిల్లాలో శాంతిభద్రతల పర్యవేక్షణను పోలీసు శాఖ సవాలుగా తీసుకుంది. నేరాలు, రోడ్డు ప్రమాదాలు అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఆయా ఘటనల్లో నేరస్థులను పట్టుకునేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్నారు. జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణ ప్రాంతాన్ని పూర్తిగా మూడోనేత్రాల (సీసీకెమెరా) పరిధిలోకి తెచ్చారు. పట్టణంలోని ప్రతి ప్రదేశంలో ప్రతిక్షణం పోలీసు శాఖ పర్యవేక్షణ ఉంటోంది. ఈ నెల 14న ఎస్పీ రవిశంకర్రెడ్డి పట్టణంలో నిఘా కోసం సీసీ కెమెరాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రజల రక్షణ, భద్రతలో మూడో నేత్రం ఇక కీలకంగా వ్యవహరించనుంది.
జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో క్షణానికో వాహనం పరుగులు తీస్తుంది. ఇతర ప్రాంతాల నుంచి ప్రజల రాకపోకల రద్దీ పెరిగింది. పరిపాలన వ్యవహారాల నిమిత్తం జిల్లా వాసులతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధుల తాకిడి అధికమైంది. అదే సమయంలో గతం కంటే ఇప్పుడు నేరాలు, దొంగతనాలు, ప్రమాదాలు అధికంగా చోటుచేసుకుంటున్నాయి. సిబ్బంది సంఖ్య తక్కువగా ఉండడంతో పాటు ఉన్న వారిని ఉన్నతాధికారుల సేవలకు వినియోగిస్తున్నారు. గతి తప్పుతున్న నిఘాను పటిష్ఠ పరిచేందుకు చర్య చేపట్టారు. చిలకలూరిపేట, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, గురజాల, మాచర్ల, వినుకొండలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎస్పీ పోలీసు అధికారులను ఆదేశించారు.
ప్రతి కదలిక నిక్షిప్తం
జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణంలో రెండు పోలీసు స్టేషన్లు, శివారు ప్రాంతం గ్రామీణ పోలీసు స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. కోట సెంటర్, మల్లమ్మ సెంటర్, శివుడి బొమ్మ సెంటర్, గడియార స్తంభం, మయూరి సెంటర్, పురపాలక సంఘ కార్యాలయం, మార్కెట్, బ్యాంకులు, రైల్వే స్టేషన్, బస్టాండ్, బ్రాందీ షాపులు, బార్, రెస్టారెంట్లు వద్ద కెమెరాలను పెట్టించారు. చిలకలూరిపేట రోడ్డు, వినుకొండ రోడ్డు, సత్తెనపల్లి రోడ్డు, పిడుగురాళ్ల రోడ్డు, జొన్నలగడ్డ రోడ్డు, ఆర్కే జంక్షన్, యలమంద రోడ్డు ప్రవేశ మార్గంలో, కోటప్పకొండ పుణ్యక్షేత్రంలో వాహనాల రాకపోకలు, జనసంచారాన్ని పర్యవేక్షించేందుకు వీలుగా మొత్తం 130 కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇందులో నిక్షిప్తమైన దృశ్యాలు ఏడాది కాలం పాటు నిల్వ చేసుకునేందుకు అవకాశముంది.
పోలీసు స్టేషన్లో పర్యవేక్షణ
నరసరావుపేట ఒకటో, రెండో పట్టణం, గ్రామీణ పోలీసు స్టేషన్లోని మానిటర్స్కు కెమెరాలను అనుసంధానం చేశారు. ఇందులోని దృశ్యాలను సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు, నేరస్థుల కదలికలు, అనుమానాస్పద వ్యక్తుల సంచార దృశ్యాలను గుర్తించి సంబంధిత ప్రాంతాల్లోని పోలీసులకు సమాచారం చేరవేస్తున్నారు. దీంతో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని నేర ప్రభావ తీవ్రతను అరికట్టడడం, రోడ్డు ప్రమాద బాధితులకు సాయం చేసేందుకు వీలుపడుతుంది. ప్రమాదాలకు కారణమైన వాహనాలు పట్టుకోవడం, ట్రాఫిక్ రద్దీ మేరకు చర్యలు చేపడటం సులువవుతుంది. నేరస్థులు పారిపోకుండా పట్టుకునేందుకు ఇది సహాయపడుతుందని రెండో పట్టణ సీఐ వెంకట్రావు ‘న్యూస్టుడే’కి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కన్నేసి.. కబ్జా చేసి..!
[ 24-04-2024]
వైకాపా నేతలు అధికారం అండతో అయిదేళ్లు బరితెగించారు. యథేచ్ఛగా పేదల భూములు ఆక్రమించారు. దేవుడి మాన్యాలను వదల్లేదు. ఖాళీ స్థలాలు, ప్రభుత్వ, వాగులు, వంకలు, డొంక రోడ్లు కావేవి కబ్జాకు అనర్హం అన్నట్లు భూదందాలు సాగించారు. -
వైకాపా పాలనలో బాదుడే.. బాదుడు
[ 24-04-2024]
పొన్నూరు నియోజకవర్గంలో సుమారు 55,275 విద్యుత్తు సర్వీసులు ఉన్నట్లు విద్యుత్తుశాఖ అధికారక గణాంకాలు వెల్లడించాయి. -
నాడంతా నటన.. ఓటేశాక వంచన..
[ 24-04-2024]
చంద్రబాబు పాలనలో విద్యుత్తు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయి. మేం అధికారంలోకి వచ్చాక విద్యుత్తు ఛార్జీలు పెంచబోం. -
అంతా... మా ఇష్టం
[ 24-04-2024]
పొన్నూరు రిటర్నింగ్ కార్యాలయం మార్పు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల అధికారులు అవగాహన లోపంతో తీసుకున్న నిర్ణయంతో గుంటూరు-బాపట్ల ప్రధాన రహదారిలో రాకపోకలు సాగించే వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. -
ఇదేమి చోద్యం జగన్!
[ 24-04-2024]
విజయవాడ, గుంటూరు నగరాలతో పాటు శివారు ప్రాంతాలను కలిపితే జనాభా 30 లక్షలకుపైనే. ఈ రెండు నగరాల మధ్య జాతీయ రహదారి మీదుగా నిత్యం కొన్ని వేల వాహనాలు -
కోన రఘుపతి.. ఓ భూబకాసురుడు
[ 24-04-2024]
దొంగలు, భూబకాసురులు, అవినీతిపరులకు సీఎం జగన్ వైకాపా తరఫున ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. -
శివాలెత్తిన ఎస్సై నాగశివారెడ్డి
[ 24-04-2024]
ఎమ్మెల్యే ఏలూరి నామినేషన్ పత్రాలు అందజేసేందుకు మంగళవారం పర్చూరు ఆర్వో కార్యాలయానికి వచ్చిన సందర్భంలో అక్కడ విధుల్లో ఉన్న ఎస్సై నాగశివారెడ్డి తెదేపా పర్చూరు మండల అధ్యక్షుడు షేక్ షంషుద్దీన్ను అసభ్య పదజాలంతో దూషించారు. -
నాదెండ్ల మనోహర్ నామినేషన్
[ 24-04-2024]
జనసేన, తెదేపా, భాజపా కూటమి తెనాలి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ బుధవారం నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ఆయన కార్యాలయ వర్గాలు మంగళవారం తెలిపాయి. -
అట్టహాసంగా తెదేపా అభ్యర్థుల నామినేషన్
[ 24-04-2024]
తెదేపా బాపట్ల లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు తెన్నేటి కృష్ణప్రసాద్, వేగేశన నరేంద్రవర్మ నామినేషన్ల కార్యక్రమం మంగళవారం అట్టహాసంగా జరిగింది. -
రోడ్డుపై రోడ్డు
[ 24-04-2024]
ప్రజాధనం దుర్వినియోగానికి ఇది పరాకాష్ఠ. ఓ అధికార పార్టీ నాయకుడు చెప్పాడని..పదేపదే స్పందన, సీఎంవోకు ఫిర్యాదులు చేస్తున్నాడన్న కారణంతో అధికారులు గుంటూరు పలకలూరురోడ్డు సాయిబాబానగర్ ప్రధాన రోడ్డులో బాగున్న సీసీ రహదారిపైనే యథావిధిగా మరో రోడ్డు వేస్తున్నారు. -
పండగ చేస్తానన్నావ్.. ప్రాణాలు తీస్తున్నావ్
[ 24-04-2024]
వ్యవసాయం దండగ కాదు.. పండగ చేస్తామని ఊదరగొట్టిన ముఖ్యమంత్రి జగన్ ఆచరణలో రైతులను గాలికొదిలేశారు. సాగుకు బ్యాంకుల నుంచి రుణాలు అందక.. అధిక వడ్డీలకు తెచ్చి పంట పండిస్తే గిట్టుబాటు ధర దక్కక రైతు కునారిల్లాడు.. -
‘పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసిన సీఎం’
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్ మెడికల్ సీట్లను కూడా వదల్లేదని కేటగిరీల వారీగా విభజించి పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసి సీట్లను అమ్ముకున్నారని యువనేత, -
‘తెనాలిని గంజాయికి అడ్డాగా మార్చేశారు’
[ 24-04-2024]
ఆంధ్రా ప్యారిస్ను ఇక్కడి సిటింగ్ వైకాపా ఎమ్మెల్యే గంజాయి అడ్డాగా మార్చారని పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల ఆరోపించారు.