మాగాణి సాగుపై అనాసక్తి
పుడమి తల్లిని నమ్ముకున్న అన్నదాతకు ఏటేటా నష్టాలు పెరుగుతున్నాయి. కర్షకునికి భూమికి వీడదీయరాని బంధం ఉన్నప్పటికీ పెరుగుతున్న పెట్టుబడులు, చుట్టుముడుతున్న చీడపీడలు, దక్కని మద్దతు ధరలు ఊపిరి సలపనీయడం లేదు.
ఖర్చులు పెరిగి గిట్టుబాటు కావడం లేదంటున్న అన్నదాతలు
న్యూస్టుడే, పిడుగురాళ్ల, రొంపిచర్ల
పుడమి తల్లిని నమ్ముకున్న అన్నదాతకు ఏటేటా నష్టాలు పెరుగుతున్నాయి. కర్షకునికి భూమికి వీడదీయరాని బంధం ఉన్నప్పటికీ పెరుగుతున్న పెట్టుబడులు, చుట్టుముడుతున్న చీడపీడలు, దక్కని మద్దతు ధరలు ఊపిరి సలపనీయడం లేదు. ఈ నేపథ్యంలో సాగుకు వెనకడుగు వేస్తున్నాడు. ఈ పరిస్థితి పల్నాడు ప్రాంతంలో ఎక్కువగా ఉంది. ఒకప్పుడు మాగాణి పొలాలకు మంచి డిమాండ్ ఉండేది. వరి పండించే ప్రాంతాలు అభివృద్ధి చెందినవిగా, మెట్ట పంటలు పండించేవి వెనకబడిన ప్రాంతాలుగా పరిగణించే వారు. రానురాను కాలం మారుతోంది. మాగాణిలో ఖర్చులు పెరిగి పెట్టుబడులు కూడా రాని పరిస్థితులు ఎదురవుతున్నాయి. వరిసాగులో నష్టాలు వస్తున్నాయని కౌలు రైతులు కూడా పొలాలను కౌలుకు తీసుకోకుండా కూలీ చేసుకుని కాలం వెళ్లదీస్తున్నారు.
బీళ్లుగా పొలాలు
జిల్లాలో కరవు కాటకాలు లేకున్నా వ్యవసాయంలో మిగులు కానరాని పరిస్థితి. ఎరువులు, పురుగు మందులు, డీజిల్, కూలి ఖర్చులు పెరిగిపోవడం వల్ల పెట్టుబడి వ్యయం రెట్టింపైంది. దీంతో వరి సేద్యానికి రైతులు వెనకడుగు వేస్తున్నారు. కొన్నిచోట్ల కౌలుకు కూడా పొలాలు తీసుకోవటం లేదు. ప్రస్తుతం చాలాచోట్ల 5 నుంచి 3 బస్తాలకు కౌలు పడిపోయింది. ఈ క్రమంలో కొందరు భూ యజమానులు సొంతంగా సాగు చేసుకోవాల్సిన పరిస్థితి. ఇలా చేసుకోలేని వారు భూములను బీళ్లుగా వదిలేస్తున్నారు.
పెరిగిన వ్యవసాయ ఖర్చులు
వరి సాగులో ఏటికేటికి ఖర్చులు పెరిగిపోతున్నాయి. దీంతో మిగులుదల ఉండడం లేదు. ఆరుగాలం శ్రమించినా పెట్టుబడులు కూడా రాని పరిస్థితి ఎదురవుతోంది. దీంతో మాగాణి సాగుకు వెనకడుగు వేస్తున్నారు. నాట్లు వేసే కూలీలకు గతంలో ఎకరాకు రూ.2500 ఉండగా, నిరుడు ఆ ఖర్చు రూ.3500కు చేరింది. డీజిల్ ధరలు పెరగటంతో ట్రాక్టర్తో గొర్రు తోలటం, దమ్ము చేయటం వంటి వాటికి ధరలు పెంచారు. వ్యవసాయ, ఎరువులు, పురుగు మందులు, కూలీల ఖర్చులు మొత్తం కలిపితే ఎకరానికి రూ.42 వేల వరకు ఖర్చవుతుందని రైతుల అంచనా. ఎకరానికి 30బస్తాల దిగుబడి వచ్చినా బస్తా ధర రూ.1200కు మించి పలకటం లేదు. ఈ లెక్కన 30 బస్తాల ధాన్యం అమ్మితే రూ. 36,000 వస్తున్నాయి. కౌలు పక్కన పెడితే పెట్టుబడి కూడా దక్కే పరిస్థితి లేదు. దీంతో వరి సాగు అంటేనే రైతు ఆలోచించాల్సి వస్తోంది.
వరి సాగు చేయని పొలం..
మొక్కజొన్న వైపు మొగ్గు
గత ఏడాది మొక్కజొన్న సాగు చేసిన రైతులకు దిగుబడులు ఆశాజనకంగా ఉండడం, మంచి ధర ఉండటంతో ఈ ఏడాది కూడా కర్షకులు మొక్కజొన్న సాగుకు మొగ్గు చూపుతున్నారు. మొక్కజొన్న సాగుకు కౌలు ధర కూడా హెచ్చుగానే ఉంది. పల్నాడు ప్రాంతంలోని పలు గ్రామాల్లో రూ.15వేలు చొప్పున ఎకరానికి చెల్లిస్తున్నారు.
అప్పుల పాలయ్యా.. - తమ్మినేడి ప్రకాశరావు, రైతు
20 ఏళ్లకు పైగా వ్యవసాయం చేశా. 15 ఎకరాలను కౌలుకు తీసుకొని వరిసాగు చేశా. కొన్నేళ్లుగా వ్యవసాయ ఖర్చులు, కూలీల రేట్లు, ఎరువుల ధరలు పెరిగాయి. ఏటా పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించక నష్టాలు వచ్చి రూ.15 లక్షల వరకు అప్పులపాలయ్యా. సాగు చేసి వాటిని తీర్చలేని పరిస్థితుల్లో ఉన్న ఎకరన్నర భూమిని అమ్ముకున్నా. మాగాణి సాగుకు ఎవరూ ముందుకు రావటం లేదు. ఎకరానికి నాలుగైదు బస్తాల కౌలు ఇచ్చి సాగుచేసుకోమంటున్నా ధైర్యం చాలడం లేదు. వ్యవసాయం మానేసి ప్రస్తుతం కూలీ పనికి వెళుతున్నా.
కూలిచేసుకుంటూ జీవిస్తున్నాం - బండ్ల అప్పారావు, గుత్తికొండ
గతంలో ఏటా ఏడు ఎకరాలు కౌలుకు తీసుకొని సాగుచేశా. నాలుగు ఎకరాలు మాగాణి, మూడు ఎకరాలు పత్తి, మిరప పంటలు సాగు చేశా. నష్టాలు వచ్చి అప్పులు పాలయ్యాను. ఏటికేడు అప్పులు పెరిగి పోతున్నాయి తప్పితే తీరటం లేదు. దీంతో పొలాలు కౌలుకు తీసుకోవడం మానేశా. అప్పులు తీర్చడానికి కుటుంబ సభ్యులందరం కూలీకి వెళుతున్నాం. చాలావరకు అప్పులు తీర్చాం. మాగాణి భూములు తక్కువ కౌలుకు ఇస్తామంటున్నా పంట వేయడానికి ఆసక్తి ఉండడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం: సినీ నటుడు నిఖిల్
[ 25-04-2024]
బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్థి ఎం.ఎం కొండయ్య గురువారం అట్టహాసంగా నామినేషన్ వేశారు. -
ఏపీలో ముగిసిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ
[ 25-04-2024]
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. -
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు: నారా లోకేశ్
[ 25-04-2024]
ఓట్లు అడగడానికి వచ్చే వైకాపా నేతలను రాజధాని రైతులు నిలదీయాలని యువనేత, మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. -
చదువులమ్మ చెట్టుకు.. రాజకీయ చెద!
[ 25-04-2024]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేరెన్నికగన్న పురాతన విద్యాసంస్థల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఒకటి. దేశ, విదేశాల్లో ఎంతో ఖ్యాతినార్జించిన ఘనత దీని సొంతం. దాదాపు పది, పదిహేను దేశాల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకునేవారు. -
యూజీడీ మూలన.. మాటలు మరుగున
[ 25-04-2024]
నా ముస్లింలు.. నా మైనార్టీలు అంటూ మాటలతో మభ్యపెట్టడమే గానీ సీఎం జగన్కు వారిపై ఏమాత్రం ప్రేమలేదని చెప్పడానికి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తికాని ఉదంతమే నిదర్శనం. -
నాడు వాతలుండవని కోతలు.. నేడు ఛార్జీల మోతలు
[ 25-04-2024]
ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్రెడ్డి రాష్ట్రమంతా తిరిగి చంద్రబాబు పాలనలో కరెంటు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయని విమర్శించారు. తాను అధికారంలోకి వచ్చాక విద్యుత్తు ఛార్జీలు పెంచబోమని హామీనిచ్చారు. -
అభిమాన నీరాజనం
[ 25-04-2024]
జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ నామినేషన్ సందర్భంగా బుధవారం తెనాలిలో నిర్వహించిన ప్రదర్శనకు ప్రజలు భారీగా తరలివచ్చారు. -
పసుపుమయమైన రేపల్లె
[ 25-04-2024]
రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నామినేషన్ దాఖలు కార్యక్రమం బుధవారం కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది. -
అక్రమంగా తవ్వారు.. ప్రాణాలు తీస్తున్నారు!
[ 25-04-2024]
రెండేళ్ల కిందట ప్రత్తిపాడుకు చెందిన నలుగురు కళాశాల విద్యార్థులు ఈతకు బోయపాలెంలోని డైట్ సమీపంలో క్వారీ గుంత వద్దకు వెళ్లారు. -
చందా.. దందా
[ 25-04-2024]
ఎన్నికలంటే ఖర్చులు ఎలా ఉంటాయో మీకు తెలియంది కాదు. -
మిత్ర ద్రోహం
[ 25-04-2024]
పాదయాత్రలో అధికారంలోకి రాగానే గోపాల మిత్రలకు నెలకు రూ.16 వేల గౌరవవేతనం ఇస్తామని హామీ ఇచ్చి గత అయిదేళ్లుగా ఒక్క రూపాయి కూడా పెంచకుండా తమని సీఎం జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని గోపాల మిత్రలు వాపోతున్నారు. -
‘పది’లో ‘ప్రత్యేక’ విజయం
[ 25-04-2024]
అమ్మ ప్రోత్సాహం..అమ్మమ్మ పర్యవేక్షణ..భవిత కేంద్ర టీచర్ల కృషి...ప్రధానోపాధ్యాయురాలి తోడ్పాటు వెరసి 16 ఏళ్ల దివ్యాంగురాలైన జి.శ్రావ్య జోసెఫిన్ పదో తరగతి పూర్తిచేసింది. -
తెదేపా ప్రచార వాహన డ్రైవర్పై వైకాపా దాడి
[ 25-04-2024]
తెలుగుదేశం పార్టీ ప్రచార వాహన డ్రైవర్పై కొందరు వైకాపా నాయకులు దాడి చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. -
ప్రజల గొంతూ తడపలేరా?
[ 25-04-2024]
2018 మార్చి 14వ తేదీన ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి పొన్నూరులో నిర్వహించిన బహిరంగ సభలో పొన్నూరు పట్టణ ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని అప్పటి తెదేపా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. -
రాజీనామా చేయకుంటే అంతుచూస్తాం
[ 25-04-2024]
వాలంటీర్లుగా మీకు ప్రతి ఇంట్లో ఎంత మంది ఓటర్లున్నారు..ఎటు అనుకూలంగా ఉన్నారో తెలుసు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 25-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు రైల్వే అధికారి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు