మద్యానికి బానిసలు కావొద్దు
మద్యం తాగి ఆరోగ్యం పాడుచేసుకోవద్దని, కేసుల్లో ఇరుక్కొని సమాజానికి ఇబ్బందికరంగా మారవద్దని జిల్లా జడ్జి పార్థసారథి హితబోధ చేశారు. జాతీయ లోక్అదాలత్ సందర్భంగా ఆదివారం స్థానిక జిల్లా కోర్టు ప్రాగంణంలోని
జిల్లా జడ్జి పార్థసారథి
లోక్అదాలత్లో 5,315 కేసుల పరిష్కారం
గుంటూరు లీగల్, న్యూస్టుడే: మద్యం తాగి ఆరోగ్యం పాడుచేసుకోవద్దని, కేసుల్లో ఇరుక్కొని సమాజానికి ఇబ్బందికరంగా మారవద్దని జిల్లా జడ్జి పార్థసారథి హితబోధ చేశారు. జాతీయ లోక్అదాలత్ సందర్భంగా ఆదివారం స్థానిక జిల్లా కోర్టు ప్రాగంణంలోని మొబైల్ కోర్టు వద్ద ఎక్కువ మంది కక్షిదారులు ఉన్నారు. వారిని గమనించిన జడ్జి పోలీసులను ఆరా తీయగా వారంత మద్యం కేసుల్లో నిందితులుగా ఉన్నారని తెలిపారు. దీంతో ఆయన వారికి మద్యంపై అవగాహన కల్పించారు. మద్యపాన వ్యసనానికి గురైన వ్యక్తుల ప్రభావం వారి పిల్లలపై కూడా పడుతుందన్నారు. వారి ఉన్నతికి ఆటంకం ఏర్పడుతుందన్నారు. అంతకు ముందు న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో జరిగిన మరో సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమాజంలో మానవత్వం దిగజారిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి, మద్యం తదితర మత్తుపదార్థాల కారణంగా విచక్షణ కోల్పోయి, సొంత బిడ్డలపైనే అఘాయిత్యాలకు పాల్పడుతున్నారన్నారు. వ్యవస్థలో మార్పు తీసుకువచ్చేందుకు అందరూ ప్రయత్నించాలని ఆకాంక్షించారు.
రూ.30 కోట్ల కేసుకు సామరస్య పరిష్కారం : దశాబ్ధం కిందట గుంటూరు నగర శివారులోని శివారెడ్డిపాలెంలోని ఓ కుటుంబానికి చెందిన మూడెకరాల భూమి వివాదంలో చిక్కుకుంది. కుటుంబ సభ్యులు కేసులు దాఖలు చేసుకున్నారు. తర్వాత కేసు దాఖలు చేసిన వ్యక్తి మృతి చెందడంతో ఆయన వారసులు కేసులోకి వచ్చారు. 9 మంది కుటుంబ సభ్యులు పలు ప్రాంతాల్లో స్థిరపడ్డారు. వారి మధ్య పదేళ్లుగా సత్ససంబధాలు లేవు. ఆదివారం జరిగిన లోక్అదాలత్లో ఈ సమస్యకు సామరస్య పరిష్కారం జరిగి, కుటుంబసభ్యుల మధ్య శాంతి నెలకొంది. జడ్జి ఏడుకొండలు ప్రత్యేక చొరవ తీసుకొని వారితో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. దీని విలువ ప్రస్తుతం రూ.30 కోట్లు ఉంటుందని అంచనా కాగా, తమ సమస్య లోక్అదాలత్ ద్వారా పరిష్కారం కావటం ఆనందంగా ఉందని వారు సంతోషం వ్యక్తం చేశారు.
రూ.3కోట్లకు వాహన ప్రమాదాల పరిహారం : వాహన ప్రమాదాల్లో కుటుంబసభ్యులను కోల్పోయి, అంగవైకల్యం కలిగిన వ్యక్తులకు ఆదివారం జరిగిన మెగా లోక్అదాలత్లో ఉపశమనం కలిగింది. ఒకటో అదనపు జిల్లా జడ్జి వి. గోపాలకృష్ణారావు ఆధ్వర్యంలో వివిధ బీమా సంస్థలకు చెందిన వంద వాహన ప్రమాద కేసులను పరిష్కరించారు. బాధితులకు సుమారు రూ.3 కోట్ల నష్టపరిహారం మంజూరు చేశారు. కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జిలు అర్చన, రాంగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
* ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆదివారం జరిగిన మెగా జాతీయ లోక్అదాలత్లో 5315 కేసులు పరిష్కరించారు. 4429 క్రిమినల్ కేసులు, 275 సివిల్ కేసులు పరిష్కరించివాటిలో ఉన్నాయి. జాతీయ లోక్అదాలత్ కోసం నెలరోజుల ముందు నుంచే ప్రత్యేక చర్యలు చేపట్టారు. పోలీసు, రెవెన్యూ, బీమా ఇతర అధికారులతో జిల్లా జడ్జి పార్థసారథి ప్రత్యేక సమావేశాలు నిర్వహించి అధిక కేసులు పరిష్కరించేందుకు పలు సూచనలు చేశారు. ఉదయం నుంచి ఆయన నగరంలోని కోర్టులన్నింటిల్లో జరుగుతున్న కేసులను పరిశీలించి న్యాయమూర్తులకు, కక్షిదారులకు పలు సూచనలు చేశారు. ఆయనతో పాటు లోక్అదాలత్ కార్యదర్శి రత్నకుమార్ పాల్గొన్నారు. లోక్అదాలత్కు సహకరించిన కక్షిదారులకు న్యాయవాదులకు, సిబ్బందికి న్యాయమూర్తులు కృతజ్ఞతలు తెలిపారు.
రాజీకోసం అమెరికా నుంచి వచ్చా.. : ఆదివారం గుంటూరులో జరిగిన జాతీయ లోక్అదాలత్లో హాజరైందుకు అమెరికా నుంచి ఓ ఎన్ఆర్ఐ వచ్చారు. నరసరావుపేటకు చెందిన బొక్కిసం నాగమల్లేశ్వరరావు అనే అతను 2005లో సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం అమెరికా వెళ్లి అక్కడ స్థిరపడ్డారు. ఆయనకు తన కుటుంబసభ్యులతో ఆస్తివివాదం నెలకొంది. దీనిని పరిష్కరించుకునేందుకు కుటుంబ సభ్యులు కూడా ముందుకు రావడంతో ఆయన అమెరికా నుంచి వచ్చారు. ఆదివారం జరిగిన లోకఅదాలత్కు ఆయన రాగా కుటుంబసభ్యులు హాజరు కాలేదని న్యాయమూర్తుల దృష్టికి తీసుకెళ్లారు. వారి కోసం ప్రయత్నించమని న్యాయమూర్తులు సిబ్బందికి సూచించారు. వారి నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో కేసును మంగళవారానికి వాయిదా వేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం
[ 18-04-2024]
గుంటూరు జిల్లా పొన్నూరు వైకాపా అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఎన్నికల కమిషన్ ఆదేశించింది. -
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
[ 18-04-2024]
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేసింది. -
మంగళగిరిలో నారా లోకేశ్ నామినేషన్.. తెదేపా శ్రేణుల భారీ ర్యాలీ
[ 18-04-2024]
గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ స్థానానికి తెదేపా అభ్యర్థిగా నారా లోకేశ్ నామినేషన్ దాఖలు చేశారు. -
చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరిన భీమిలి, జీడీ నెల్లూరు వైకాపా నేతలు
[ 18-04-2024]
భీమిలి, జీడీ నెల్లూరు నియోజకవర్గాలకు చెందిన పలువురు వైకాపా నేతలు తెదేపా అధినేత చంద్రబాబు సమక్షంలో గురువారం ఆ పార్టీలో చేరారు. -
నీరివ్వలేని నీరో!
[ 18-04-2024]
సీఎం జగన్... పేదల పక్షపాతినంటారు.. ఎన్నికల్లో వారే తన స్టార్ క్యాంపెయినర్లంటారు.. వారి జీవితాలను బాగు చేసేది తనొక్కడేనంటూ గొప్పలకు పోతుంటారు.. కానీ.. తన నివాసానికి కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఉన్న మంగళగిరి ఎయిమ్స్లోని నిరుపేద రోగుల గొంతు తడపలేకపోతున్నారు. -
నారీ గళంతో జగన్ వెన్నులో వణుకు
[ 18-04-2024]
నారీ గళంతో జగన్ వెన్నులో వణుకు పుట్టాలని తెదేపా గుంటూరు ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు పశ్చిమ అభ్యర్థి గళ్లా మాధవి, తెలుగు మహిళ నాయకురాలు మాగంటి రూప, తెలంగాణ తెదేపా నాయకులు నన్నూరి నర్సిరెడ్డి పిలుపునిచ్చారు. -
కీలక ఘట్టానికి వేళాయె
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టం నేటి నుంచి ఆరంభం కాబోతోంది. గురువారం నుంచి అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేయనున్నారు. జిల్లాలో నామినేషన్ల స్వీకరణకు ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. -
నాడు ఆశల కేంద్రం.. నేడు విధ్వంసానికి నిలయం
[ 18-04-2024]
రాష్ట్ర విభజన తర్వాత తుళ్లూరు మండలంలో ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. గత తెదేపా ప్రభుత్వంలో రాత్రీ పగలు తేడా లేకుండా వేల మంది కార్మికులతో కళకళలాడిన అమరావతి వైకాపా పాలనలో విధ్వంసానికి చిరునామాగా మారింది. -
జీతాలకూ ఎదురుచూపులే..
[ 18-04-2024]
జిల్లాలోని ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి ఫిబ్రవరి, మార్చి జీతాలు రాలేదు. ఏప్రిల్ నెల జీతంతో కలిపి రెండు నెలల బకాయిలు విడులవుతాయన్న నమ్మకం లేదు. -
గుంటూరువాసికి క్రికెట్ సైట్ స్క్రీన్పై పేటెంట్
[ 18-04-2024]
జోసెల్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, జేకేసీ కళాశాల కార్యదర్శి, గుంటూరు జిల్లా మెన్, ఉమెన్ క్రికెట్ అసోసియేషన్ పూర్వ అధ్యక్షుడు, ఏసీఏ ఉమెన్స్ అకాడమీ పూర్వ ఛైర్మన్ జాగర్లమూడి మురళీమోహన్ నూతన ఆవిష్కరణకు పేటెంట్ లభించింది. -
శిరోముండనం కేసులో శిక్ష విధించడం హర్షణీయం
[ 18-04-2024]
శిరోముండనం కేసుల్లో నిందితులకు ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు జైలుశిక్ష, జరిమానా విధించడం హర్షణీయమని భీమ్ భారత్ రాష్ట్ర అధ్యక్షుడు పాగళ్ల ప్రకాష్ అన్నారు. -
ప్రాణం తీసిన ఈత సరదా
[ 18-04-2024]
స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన ఇంజినీరింగ్ విద్యార్థి నీట మునిగి మృతి చెందిన విషాదకర సంఘటన మండలంలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. -
సార్వత్రిక ఎన్నికలు సజావుగా నిర్వహిద్దాం
[ 18-04-2024]
పల్నాడు జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు హింస, రీపోలింగ్ లేకుండా విజయవంతం చేసేందుకు అధికారులు, సిబ్బంది సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శివశంకర్ కోరారు. -
విశ్రాంతిలోనూ.. మనశ్శాంతి లేదయ్యా!
[ 18-04-2024]
రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగి ప్రసాద్కు గతంలో ఒకటో తేదీనే పింఛన్ సొమ్ము బ్యాంకు ఖాతాలో జమ అయ్యేది. బీపీ, మధుమేహం సమస్యతో బాధపడుతున్న ఆయన నెల రోజులకు సరిపడా ఒకేసారి ఔషధాలు తెచ్చుకునేవారు. -
అయిదేళ్లుగా చోద్యం చూశారు!
[ 18-04-2024]
ఆంగ్లేయుల కాలంలో నిర్మించిన వంతెన ఇది. శిథిలావస్థకు చేరి అడుగు భాగం దిమ్మెలు పగుళ్లిచ్చాయి. ఇనుప రాడ్ల ఆధారంగా నిలబడింది. భారీ వాహనాలు ప్రయాణిస్తే దిమ్మెలు కదులుతున్నాయి. -
పోలీసు.. వైకాపాకు వత్తాసు
[ 18-04-2024]
సాధారణంగా ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసే తనిఖీ కేంద్రాలు(చెక్పోస్టులు) వద్ద ప్రత్యేకంగా సిబ్బందికి విధులు కేటాయిస్తారు. కానీ జిల్లాలో పోలీసుస్టేషన్లలో ఉండాల్సిన సీఐ, ఎస్సైలకు చెక్పోస్టు డ్యూటీలకు పంపడం చర్చనీయాంశమవుతుంది.
తాజా వార్తలు (Latest News)
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
-
భారత వ్యతిరేకి.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు విడుదల
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
వైకాపా అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం
-
విధుల్లో అలసత్వం.. ఆరుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు