దర్శకేంద్రునికి ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కారం
శకపురుషుడు ఎన్టీఆర్కు చాలా మంది భారతరత్న పురస్కారం ఇవ్వాలని అంటుంటారని, కానీ ఆయనే ఒక ప్రపంచరత్నమని ప్రముఖ సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలోని ఎన్వీఆర్ కల్యాణ మండపంలో
కె.రాఘవేంద్రరావును గజమాలతో సత్కరిస్తూ...
తెనాలి(కొత్తపేట), న్యూస్టుడే: శకపురుషుడు ఎన్టీఆర్కు చాలా మంది భారతరత్న పురస్కారం ఇవ్వాలని అంటుంటారని, కానీ ఆయనే ఒక ప్రపంచరత్నమని ప్రముఖ సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలోని ఎన్వీఆర్ కల్యాణ మండపంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయనకు ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కారం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రాఘవేంద్రరావు మాట్లాడుతూ తెనాలిలో శతజయంతి మహోత్సవాలను ఏడాది పాటు నిర్వహించుకోవడం అసాధారణమని పేర్కొన్నారు. ఎన్టీఆర్ నటుడుగా ప్రపంచంలో ఎవరూ చేయనన్ని పాత్రలను ధరించి, మెప్పించారని, అలాంటి మహానటుడు పురస్కారాన్ని అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. తనకు జన్మనిచ్చిన వారు తల్లిదండ్రులైతే, సినీ జన్మను ఇచ్చింది శకపురుషుడేనని తెలిపారు. తాను అసిస్టెంటు డైరక్టర్గా 1963లో భీముని పాత్ర ధరించిన ఎన్టీఆర్పై తొలిసారిగా క్లాప్ కొట్టానని గుర్తు చేసుకున్నారు. ప్రేక్షకులు అడవి రాముడు సినిమా ప్రదర్శన సమయంలో డబ్బులు చల్లి ఆయనపై అభిమానాన్ని చాటి చెప్పారని, ఆ ఖ్యాతి ఎన్టీఆర్కే దక్కిందన్నారు. పురస్కార ప్రదాత నందమూరి దీపికా జానకిరామ్, మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, నక్కా ఆనందబాబు, మహిళా కమిషన్ మాజీ ఛైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, సినీ సంభాషణల రచయిత బుర్రా సాయిమాధవ్, డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి, కోవెలమూడి రవీంద్ర, ప్రముఖ నిర్మాత కె.ఎల్.నారాయణ, పారిశ్రామిక వేత్త కె.వి.రావు, రాజారావు, వేద గంగోత్రి పౌండేషన్ నిర్వాహకుడు వరప్రసాద్, జడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు వడ్లమూడి పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!