నేతల సిఫార్సు బదిలీలు!
ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగులకు సాధారణ బదిలీలు జరుగుతున్నాయి. అవి నెలాఖరుతో ముగియనున్నాయి. ఆ వెంటనే ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ బదిలీలు నిర్వహిస్తారని ఉపాధ్యాయవర్గం ఎంతో ఆశగా ఉంది.
కౌన్సెలింగ్కు ముందే తూట్లు
మండిపడుతున్న సంఘాలు
ఈనాడు, అమరావతి: ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగులకు సాధారణ బదిలీలు జరుగుతున్నాయి. అవి నెలాఖరుతో ముగియనున్నాయి. ఆ వెంటనే ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ బదిలీలు నిర్వహిస్తారని ఉపాధ్యాయవర్గం ఎంతో ఆశగా ఉంది. వారి ఆశలపై నీళ్లు చల్లేలా ప్రభుత్వం అంతకన్నా ముందు సిఫార్సు బదిలీలకు తెరలేపింది. దీనిపై ఉపాధ్యాయ వర్గం మండిపడుతోంది. సిఫార్సులు లేని సాధారణ ఉపాధ్యాయులు, ఒకే పాఠశాలలో 8 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకుని ఈసారి బదిలీల్లో కేటగిరి 1, 2(దగ్గర స్కూళ్లు) ప్రదేశాలకు చేరుకుంటామని ఆశపడ్డ ఉపాధ్యాయులు అందరూ ప్రస్తుతం జరుగుతున్న సిఫార్సు బదిలీలు చూసి మరోసారి తమకు అన్యాయం జరిగిపోయినట్లేనని ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 205 మంది ఉపాధ్యాయుల బదిలీలకు సీఎంఓ ఆమోదం తెలపగా వాటిల్లో ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి 19 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. గతంలో ఏ ప్రజాప్రతినిధి సిఫార్సు చేశారనేది తెలిసేది కాదు. ఈసారి ఫలానా టీచర్ బదిలీకి సిపార్సు చేసిన ప్రజాప్రతినిధి పేరుతో సహా జాబితాలు బయటకు వచ్చాయంటే ఎంతగా బరితెగించారో ఊహించుకోవచ్చు. కౌన్సెలింగ్ బదిలీల్లో అయితే కోరుకున్న పాఠశాల దక్కదని, ఎక్కడ ఖాళీలు ఉంటే అక్కడకు వెళ్లాల్సి ఉంటుందని కొందరు ఉపాధ్యాయులు పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టుకుని సిఫార్సు బదిలీలు తెచ్చుకుంటున్నారని సంఘాల నాయకులు తెలిపారు. కౌన్సెలింగ్తో సంబంధం లేకుండా ప్రభుత్వ అనుమతితో చేసే బదిలీలు అని వీటిని అంటారు. బదిలీల్లో దూర ప్రాంతాల్లోని పాఠశాలలకు వెళ్లకుండా తప్పించుకోవటానికి ఇదో రాచమార్గమని అంటున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీపీలు సైతం జిల్లాలోని కొందరు టీచర్ల బదిలీలకు సిఫార్సు చేసిన వారిలో ఉన్నారు. ప్రస్తుతం ఈ సిఫార్సు బదిలీలు ఉపాధ్యాయవర్గంలో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఇప్పటి దాకా 19 మంది ఉపాధ్యాయులకు సంబంధించిన దరఖాస్తులపై రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ రిమార్క్స్ కోరిందని, ఇంకా మరికొందరి జాబితా సీఎంఓలో ఉందని చెబుతున్నారు. ఇప్పటికే గుంటూరు, పల్నాడు జిల్లాల విద్యాశాఖ అధికారులు రిమార్క్స్ రాసి పంపారు. ఒకేచోట ఎనిమిదేళ్ల నుంచి పనిచేస్తున్న ఉపాధ్యాయులు త్వరలో జరిగే కౌన్సెలింగ్ బదిలీల్లో తప్పనిసరిగా కదలాల్సి ఉంటుంది. అప్పుడు ఎక్కడో సుదూరాన ఉండే పాఠశాలకు వెళ్లాల్సి ఉంటుందని ముందుగానే ప్రభుత్వ అనుమతితో కోరుకున్న స్కూల్కు ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలతో ప్రయత్నాలు చేసుకుంటున్నారు. వీటిని ముఖ్యమంత్రి కార్యాలయం ఆమోదించడం విమర్శలకు దారితీస్తోంది.
కౌన్సెలింగ్ విధానానికి తూట్లు పొడవటమే
ఉపాధ్యాయుల బదిలీలకు పారదర్శకమైన కౌన్సెలింగ్ విధానాన్ని ఉపాధ్యాయులు, సంఘాలు, విద్యారంగం నిపుణులు ఎన్నో ఏళ్లుగా ఉద్యమాలు చేసి సాధించుకున్నాం. దానికి తూట్లు పొడిచేలా మధ్యలో ప్రభుత్వం సిఫార్సు బదిలీలకు పూనుకోవటం అత్యంత దుర్మార్గం. దీనివల్ల బదిలీలకు అర్హులైన ఉపాధ్యాయులకు అన్యాయం జరుగుతుంది. ఇప్పటికే అనేక ఏళ్లుగా దూర ప్రాంతాల్లో పనిచేస్తున్న వారు కౌన్సెలింగ్ బదిలీలు నిర్వహిస్తే వారు దగ్గరి ప్రాంతాలకు రావటానికి ఆస్కారం ఉంటుంది. ఆలోపే సిఫార్సు బదిలీలతో దగ్గరి స్కూళ్లల్లోని ఖాళీలను భర్తీ చేస్తే మరోసారి దూర ప్రాంతాల్లో ఉంటున్న వారికి అన్యాయం జరిగినట్లే. ఈ విధానం సరైంది కాదు. వెంటనే సిఫార్సు బదిలీలు రద్దు చేయాలి. - కేఎస్ లక్ష్మణరావు, విద్యారంగం నిపుణులు, ఎమ్మెల్సీ
ఇలాగైతే ఖాళీలు ఇంకెక్కడ ఉంటాయి?
ఒకవైపు సిఫార్సు బదిలీలు, మరోవైపు జీవో నంబరు 117 ప్రకారం పాఠశాలల కుదింపు, పోస్టుల హేతుబద్ధీకరణ వంటి వాటితో ఇప్పటికే పాఠశాలల్లో ఖాళీ పోస్టులు అనేవి తగ్గిపోయాయి. మరోవైపు డీఎస్సీ-98 వాళ్లకు పోస్టింగ్లు ఇవ్వనుండటంతో అసలు ఖాళీలు అనేవి లేకుండా పోతాయి. సిఫార్సు బదిలీలు చేయటం వల్ల అంతిమంగా సాధారణ ఉపాధ్యాయులు నష్టపోతారు. ఇప్పటికే వీరంతా ఆందోళనలో ఉన్నారు. ఆ ప్రభావం బోధనపై పడుతుంది. గతంలో ఎప్పుడూ ఏ ప్రజాప్రతినిధి సిఫార్సు చేశారో తెలిసేది కాదు. ఈసారి సిఫార్సు చేసిన ప్రజాప్రతినిధి పేరుతో సహా జాబితాలు బయటకు వచ్చాయి. ఏం చేస్తారో చేసుకోండి అన్నట్లు ప్రజాప్రతినిధుల తీరు ఉంది. ఇలా సిఫార్సు చేయటం అంటే అవినీతిని ప్రోత్సహించడమే. ఈ బదిలీలను చూస్తూ ఊరుకోం. మిగిలిన సంఘాలను కలుపుకుని ఉద్యమిస్తాం. - కె.బసవలింగారావు, అధ్యక్షుడు, ఏపీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం: సినీ నటుడు నిఖిల్
[ 25-04-2024]
బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్థి ఎం.ఎం కొండయ్య గురువారం అట్టహాసంగా నామినేషన్ వేశారు. -
ఏపీలో ముగిసిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ
[ 25-04-2024]
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. -
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు: నారా లోకేశ్
[ 25-04-2024]
ఓట్లు అడగడానికి వచ్చే వైకాపా నేతలను రాజధాని రైతులు నిలదీయాలని యువనేత, మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. -
చదువులమ్మ చెట్టుకు.. రాజకీయ చెద!
[ 25-04-2024]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేరెన్నికగన్న పురాతన విద్యాసంస్థల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఒకటి. దేశ, విదేశాల్లో ఎంతో ఖ్యాతినార్జించిన ఘనత దీని సొంతం. దాదాపు పది, పదిహేను దేశాల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకునేవారు. -
యూజీడీ మూలన.. మాటలు మరుగున
[ 25-04-2024]
నా ముస్లింలు.. నా మైనార్టీలు అంటూ మాటలతో మభ్యపెట్టడమే గానీ సీఎం జగన్కు వారిపై ఏమాత్రం ప్రేమలేదని చెప్పడానికి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తికాని ఉదంతమే నిదర్శనం. -
నాడు వాతలుండవని కోతలు.. నేడు ఛార్జీల మోతలు
[ 25-04-2024]
ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్రెడ్డి రాష్ట్రమంతా తిరిగి చంద్రబాబు పాలనలో కరెంటు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయని విమర్శించారు. తాను అధికారంలోకి వచ్చాక విద్యుత్తు ఛార్జీలు పెంచబోమని హామీనిచ్చారు. -
అభిమాన నీరాజనం
[ 25-04-2024]
జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ నామినేషన్ సందర్భంగా బుధవారం తెనాలిలో నిర్వహించిన ప్రదర్శనకు ప్రజలు భారీగా తరలివచ్చారు. -
పసుపుమయమైన రేపల్లె
[ 25-04-2024]
రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నామినేషన్ దాఖలు కార్యక్రమం బుధవారం కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది. -
అక్రమంగా తవ్వారు.. ప్రాణాలు తీస్తున్నారు!
[ 25-04-2024]
రెండేళ్ల కిందట ప్రత్తిపాడుకు చెందిన నలుగురు కళాశాల విద్యార్థులు ఈతకు బోయపాలెంలోని డైట్ సమీపంలో క్వారీ గుంత వద్దకు వెళ్లారు. -
చందా.. దందా
[ 25-04-2024]
ఎన్నికలంటే ఖర్చులు ఎలా ఉంటాయో మీకు తెలియంది కాదు. -
మిత్ర ద్రోహం
[ 25-04-2024]
పాదయాత్రలో అధికారంలోకి రాగానే గోపాల మిత్రలకు నెలకు రూ.16 వేల గౌరవవేతనం ఇస్తామని హామీ ఇచ్చి గత అయిదేళ్లుగా ఒక్క రూపాయి కూడా పెంచకుండా తమని సీఎం జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని గోపాల మిత్రలు వాపోతున్నారు. -
‘పది’లో ‘ప్రత్యేక’ విజయం
[ 25-04-2024]
అమ్మ ప్రోత్సాహం..అమ్మమ్మ పర్యవేక్షణ..భవిత కేంద్ర టీచర్ల కృషి...ప్రధానోపాధ్యాయురాలి తోడ్పాటు వెరసి 16 ఏళ్ల దివ్యాంగురాలైన జి.శ్రావ్య జోసెఫిన్ పదో తరగతి పూర్తిచేసింది. -
తెదేపా ప్రచార వాహన డ్రైవర్పై వైకాపా దాడి
[ 25-04-2024]
తెలుగుదేశం పార్టీ ప్రచార వాహన డ్రైవర్పై కొందరు వైకాపా నాయకులు దాడి చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. -
ప్రజల గొంతూ తడపలేరా?
[ 25-04-2024]
2018 మార్చి 14వ తేదీన ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి పొన్నూరులో నిర్వహించిన బహిరంగ సభలో పొన్నూరు పట్టణ ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని అప్పటి తెదేపా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. -
రాజీనామా చేయకుంటే అంతుచూస్తాం
[ 25-04-2024]
వాలంటీర్లుగా మీకు ప్రతి ఇంట్లో ఎంత మంది ఓటర్లున్నారు..ఎటు అనుకూలంగా ఉన్నారో తెలుసు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 25-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు రైల్వే అధికారి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్