గస్తీకి సుస్తీ
జిల్లాల విభజన జరిగి గుంటూరు జిల్లాకు నూతన ఎస్పీ నియమితులైన తర్వాత గత నెలలో నేరాల అదుపునకు రాత్రి గస్తీకి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. సబ్ డివిజన్లలో డీఎస్పీల మొదలు సీఐలు, ఎస్సైలు, ఇతర సిబ్బంది అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము
అటకెక్కిన రాత్రి తనిఖీలు
తెనాలి నెహ్రూ రోడ్డులో రాత్రి సమయంలో ఆగిపోయిన వాహనాలు
తెనాలి టౌన్, న్యూస్టుడే: జిల్లాల విభజన జరిగి గుంటూరు జిల్లాకు నూతన ఎస్పీ నియమితులైన తర్వాత గత నెలలో నేరాల అదుపునకు రాత్రి గస్తీకి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. సబ్ డివిజన్లలో డీఎస్పీల మొదలు సీఐలు, ఎస్సైలు, ఇతర సిబ్బంది అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు రోడ్ల మీద ఉండి తనిఖీలు చేశారు. ప్రధాన కూడలి ప్రాంతాలతో పాటు శివార్లలోనూ ఈ కార్యక్రమం జిల్లా అంతటా కొనసాగింది. దీంతో కొంతమేర రాత్రి నేరాలు అదుపులోకి వచ్చాయి. ఇదంతా మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలింది. ఈ నెలలో పరిస్థితి ఏమిటంటే రాత్రి కాదు కదా, పగలు విజువల్ పోలీసింగ్కు కూడా దిక్కులేని స్థితి కళ్ల ముందు ఉంది.
* జిల్లా పరిధిలో ముఖ్యమంత్రి నివాసం, సచివాలయం వంటి ముఖ్య కేంద్రాలు ఉండటం ఆయా చోట్ల ముఖ్యుల రాకపోకలు కొనసాగటం, ఆయా సందర్భాల్లో బందోబస్తు అవసరాలు పెరిగాయి. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు, వివిధ సంఘాల ఆందోళనలు వంటివి కూడా పలుమార్లు జరిగాయి. ఇటువంటి ప్రతి సందర్భంలోనూ సబ్ డివిజన్ల నుంచి ఆయా ప్రాంతాలకు పోలీసులను పంపడం రివాజుగా మారింది. ఈ నెల వరకు చూసుకుంటే దాదాపు 15 రోజులకు పైగా సిబ్బంది తమ స్టేషన్ల పరనిధిలో కాకుండా ఇతర చోట్ల బందోబస్తులకు వెళ్లారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గుంటూరు కలక్టరేట్ వద్ద ఆందోళనల సందర్భంగా ఇతర డివిజన్ల నుంచి పోలీసులను పంపించారు. క్షేత్ర స్థాయిలో పోలీసులు లేకపోవడంతో గతంలో మాదిరి తిరిగి అన్ని చోట్ల అసాంఘిక కార్యక్రమాలు పెరిగిపోయాయి. బహిరంగ మద్యపానం తిరిగి తీవ్రస్థాయికి చేరింది. తుదకు ట్రాఫిక్ రద్దీని పర్యవేక్షించే వారు లేకపోవడంతో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోతూ ప్రజల సహనానికి పరీక్ష పెడుతున్నాయి.
* ఉదాహరణకు తెనాలి సబ్ డివిజన్ను తీసుకుంటే పోలీస్ కంట్రోల్ రూంతో సహా మొత్తం 9 పోలీస్ స్టేషన్లను పర్యవేక్షించాల్సి ఉంది. ఈ మొత్తానికి 15 ఏళ్ల క్రితం మంజూరైన సిబ్బంది 330 మంది కాగా.. క్రమానుగతంగా పోలీసులు విధులు, అవసరాలు పెరిగినా సిబ్బంది కేటాయింపులు పెరగలేదు. ఈ విషయం అటు ఉంచితే మొత్తం 330 మంది సిబ్బందిలో గత కొన్నేళ్ల నుంచి 163 మంది ఇతర ప్రాంతాల్లో అంటే ఎస్పీ కార్యాలయం, ఎస్బీ, తదితర చోట్ల విధులు నిర్వహిస్తున్నారు. మిగిలిన వారు 167 మంది. వీరిలో కనీసం పది మంది వివిధ ఆరోగ్య, ఇతర కారణాలతో సెలవుల్లో ఉంటారు. అంతిమంగా కనిపించేది 157 మంది. వీరే 24 గంటలూ విధులు నిర్వహించాల్సిన క్రమంలో అప్పటికప్పుడు అందుబాటులో ఉండే వారు వీరిలో సగం మంది. ఈ కాస్త సిబ్బందిలోనూ ప్రతిసారి 60 నుంచి 70 మందిని ఇతర ప్రాంతాలకు పంపుతున్నారు. అంటే పోలీస్ స్టేషన్లలో ఒకరిద్దరు తప్ప ఇంకెవరు ఆయా చోట్ల ఉండరన్న మాట. అంతేకాక కొన్నిసార్లు తమ పోలీస్ స్టేషన్ నుంచి ఇతర ప్రాంతాలకు విధుల నిర్వహణకు వెళ్లిన వారిని, కనీసం ఆ పని అయిన తర్వాత ఇంటికి కూడా పంపకుండా అటు నుంచి అటే మరో డ్యూటీకి వెళ్లమంటున్నారు. ఈ తీరుతో పోలీస్ యంత్రాంగం కూడా తీవ్ర ఆవేదన చెందుతోంది. దీనికితోడు నిరంతర పర్యవేక్షణ కొరవడటంతో కేసుల దర్యాప్తు మందగించింది.
ప్రత్యేక కేటాయింపులు అవసరం: ముఖ్యమంత్రి నివాసం, సచివాలయం, ఇతర ప్రధాన కేంద్రాలు ఇతర జిల్లాల్లో ఉండవు. అందువల్ల భద్రత పరంగా గుంటూరు జిల్లాకు పని అధికంగా ఉంటుంది, ఆ మేర సిబ్బంది కేటాయింపులు జరగాలి. కానీ ఆ విధంగా లేకపోవటంతో ఉన్న సిబ్బందితోనే అందరూ తంటాలు పడుతున్నారు. పోలీస్ ఉన్నతాధికారులు వాస్తవాలను స్వయంగా సమీక్షించి, పరిశీలించి సమస్య శాశ్వత పరిష్కారానికి చొరవ చూపాలి. బందోబస్తు విధులకు ప్రత్యేక దళాలను ఏర్పాటు చేసుకోవాలి. లేకుంటే ప్రతి నెలలో ఇలానే 20 రోజులు పోలీసులు తమ, తమ స్టేషన్ల పని కాకుండా ఇతర విధులు నిర్వహించాల్సి వస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
[ 24-04-2024]
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ పోలీస్ కమిషనర్గా పీహెచ్డీ రామక్రిష్ణను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
పింఛన్లు ఇంటివద్దే ఇచ్చేలా ఆదేశించండి: ఈసీకి చంద్రబాబు లేఖ
[ 24-04-2024]
పింఛన్దారులకు మే నెల పింఛను వారి ఇంటి వద్దే ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు కోరారు. -
వైకాపా ఎంపీ నందిగం సురేశ్పై వాలంటీర్ ఆనంద్బాబు పోటీ
[ 24-04-2024]
వైకాపా ఎంపీ నందిగం సురేశ్పై ఓ వాలంటీరు పోటీకి దిగుతున్నారు. -
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
[ 24-04-2024]
పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామంలో 50, జంగమేశ్వరపాడు గ్రామంలో 30 కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
[ 24-04-2024]
ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. -
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
[ 24-04-2024]
సీఎం జగన్పై గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ను కస్టడీకి అనుమతిస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
వైఎస్ఆర్ను తిట్టిన బొత్స.. జగన్కు తండ్రి సమానులా?: షర్మిల
[ 24-04-2024]
మంత్రి బొత్స సత్యనారాయణ తండ్రి సమానులంటూ సీఎం జగన్ (YS Jagan) చేసిన వ్యాఖ్యలపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) స్పందించారు. -
కన్నేసి.. కబ్జా చేసి..!
[ 24-04-2024]
వైకాపా నేతలు అధికారం అండతో అయిదేళ్లు బరితెగించారు. యథేచ్ఛగా పేదల భూములు ఆక్రమించారు. దేవుడి మాన్యాలను వదల్లేదు. ఖాళీ స్థలాలు, ప్రభుత్వ, వాగులు, వంకలు, డొంక రోడ్లు కావేవి కబ్జాకు అనర్హం అన్నట్లు భూదందాలు సాగించారు. -
వైకాపా పాలనలో బాదుడే.. బాదుడు
[ 24-04-2024]
పొన్నూరు నియోజకవర్గంలో సుమారు 55,275 విద్యుత్తు సర్వీసులు ఉన్నట్లు విద్యుత్తుశాఖ అధికారక గణాంకాలు వెల్లడించాయి. -
నాడంతా నటన.. ఓటేశాక వంచన..
[ 24-04-2024]
చంద్రబాబు పాలనలో విద్యుత్తు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయి. మేం అధికారంలోకి వచ్చాక విద్యుత్తు ఛార్జీలు పెంచబోం. -
అంతా... మా ఇష్టం
[ 24-04-2024]
పొన్నూరు రిటర్నింగ్ కార్యాలయం మార్పు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల అధికారులు అవగాహన లోపంతో తీసుకున్న నిర్ణయంతో గుంటూరు-బాపట్ల ప్రధాన రహదారిలో రాకపోకలు సాగించే వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. -
ఇదేమి చోద్యం జగన్!
[ 24-04-2024]
విజయవాడ, గుంటూరు నగరాలతో పాటు శివారు ప్రాంతాలను కలిపితే జనాభా 30 లక్షలకుపైనే. ఈ రెండు నగరాల మధ్య జాతీయ రహదారి మీదుగా నిత్యం కొన్ని వేల వాహనాలు -
కోన రఘుపతి.. ఓ భూబకాసురుడు
[ 24-04-2024]
దొంగలు, భూబకాసురులు, అవినీతిపరులకు సీఎం జగన్ వైకాపా తరఫున ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. -
శివాలెత్తిన ఎస్సై నాగశివారెడ్డి
[ 24-04-2024]
ఎమ్మెల్యే ఏలూరి నామినేషన్ పత్రాలు అందజేసేందుకు మంగళవారం పర్చూరు ఆర్వో కార్యాలయానికి వచ్చిన సందర్భంలో అక్కడ విధుల్లో ఉన్న ఎస్సై నాగశివారెడ్డి తెదేపా పర్చూరు మండల అధ్యక్షుడు షేక్ షంషుద్దీన్ను అసభ్య పదజాలంతో దూషించారు. -
నాదెండ్ల మనోహర్ నామినేషన్
[ 24-04-2024]
జనసేన, తెదేపా, భాజపా కూటమి తెనాలి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ బుధవారం నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ఆయన కార్యాలయ వర్గాలు మంగళవారం తెలిపాయి. -
అట్టహాసంగా తెదేపా అభ్యర్థుల నామినేషన్
[ 24-04-2024]
తెదేపా బాపట్ల లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు తెన్నేటి కృష్ణప్రసాద్, వేగేశన నరేంద్రవర్మ నామినేషన్ల కార్యక్రమం మంగళవారం అట్టహాసంగా జరిగింది. -
రోడ్డుపై రోడ్డు
[ 24-04-2024]
ప్రజాధనం దుర్వినియోగానికి ఇది పరాకాష్ఠ. ఓ అధికార పార్టీ నాయకుడు చెప్పాడని..పదేపదే స్పందన, సీఎంవోకు ఫిర్యాదులు చేస్తున్నాడన్న కారణంతో అధికారులు గుంటూరు పలకలూరురోడ్డు సాయిబాబానగర్ ప్రధాన రోడ్డులో బాగున్న సీసీ రహదారిపైనే యథావిధిగా మరో రోడ్డు వేస్తున్నారు. -
పండగ చేస్తానన్నావ్.. ప్రాణాలు తీస్తున్నావ్
[ 24-04-2024]
వ్యవసాయం దండగ కాదు.. పండగ చేస్తామని ఊదరగొట్టిన ముఖ్యమంత్రి జగన్ ఆచరణలో రైతులను గాలికొదిలేశారు. సాగుకు బ్యాంకుల నుంచి రుణాలు అందక.. అధిక వడ్డీలకు తెచ్చి పంట పండిస్తే గిట్టుబాటు ధర దక్కక రైతు కునారిల్లాడు.. -
‘పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసిన సీఎం’
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్ మెడికల్ సీట్లను కూడా వదల్లేదని కేటగిరీల వారీగా విభజించి పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసి సీట్లను అమ్ముకున్నారని యువనేత, -
‘తెనాలిని గంజాయికి అడ్డాగా మార్చేశారు’
[ 24-04-2024]
ఆంధ్రా ప్యారిస్ను ఇక్కడి సిటింగ్ వైకాపా ఎమ్మెల్యే గంజాయి అడ్డాగా మార్చారని పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల ఆరోపించారు.