కౌలుకార్డులు మూడోవంతు
ఒకప్పుడు భూమి కలిగి ఉన్నవారిని రైతులుగా భావించేవారు. పంటరుణాలతోపాటు అనేక రకాలైన రాయితీ పథకాలు వీరికే అందించేవారు. అయితే పలు కారణాల వల్ల భూమి కలిగిన రైతులు సాగు నుంచి దూరమవుతున్నారు.
ఈనాడు-అమరావతి: ఒకప్పుడు భూమి కలిగి ఉన్నవారిని రైతులుగా భావించేవారు. పంటరుణాలతోపాటు అనేక రకాలైన రాయితీ పథకాలు వీరికే అందించేవారు. అయితే పలు కారణాల వల్ల భూమి కలిగిన రైతులు సాగు నుంచి దూరమవుతున్నారు. చాలాచోట్ల నీటివసతి కలిగి సారవంతమైన భూములు సైతం సాగుకు నోచుకోవడం లేదు. ఈపరిస్థితి అటు పల్నాడు.... ఇటు డెల్టాలోనూ ఉంది. రెండు పంటలు పండించేచోట ఒకటి పండించి సరిపెట్టుకుంటున్నారు. అయితే గత దశాబ్దకాలం నుంచి వ్యవసాయంలోకి ప్రవేశిస్తున్న కౌలుదారుల సంఖ్య పెరుగుతుండటం కొంత సానుకూల పరిణామం. వీరి భాగస్వామ్యం దాదాపు అన్ని పంటలు పండించడంలోనూ ఉంటోంది. 2011 కౌలుకార్డుల మంజూరు తర్వాత వరుసగా కొన్ని సంస్కరణలు చేస్తూ కౌలుదారులకు పెద్దపీట వేసేలా నిర్ణయాలు తీసుకున్నారు. కానీ వాస్తవంగా క్షేత్రస్థాయిలో కార్డులు మంజూరు మాత్రం చాలా తీసికట్టుగా ఉంటోంది. ఫలితంగా ప్రభుత్వం లక్ష్యం నెరవేరడం లేదు. వాస్తవంగా భూములు సాగుచేసేవారికే సాయం అందించాలని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఇటీవల పలు విధాన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ-పంట నమోదు మొదలు పంటలబీమా, రాయితీ పథకాలు, పంటరుణాలు, రైతుభరోసా ఇలా అన్నింటిలో వారికి అవకాశాలు కల్పిస్తోంది. వాస్తవసాగులో కౌలుదారుల సంఖ్య 60శాతంపైగా ఉండగా కార్డులు పొందుతున్నవారి సంఖ్య మూడో వంతుకు మించడం లేదు. భూమి సాగుచేస్తున్న వారిని కౌలుదారులుగా గుర్తించాలని ఉన్నతాధికారులు పదేపదే ఆదేశిస్తున్నా క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు. ఈఏడాది ఖరీఫ్ సీజన్ మొదలైన నేపథ్యంలో కౌలురైతుల సంక్షేమానికి పెద్దపీట వేసేలా జరిగే కసరత్తులో జాప్యం జరుగుతోంది. రెండు నెలల నుంచి కౌలు రైతుల గుర్తింపు, కార్డులు మంజూరు వంటి ప్రక్రియ మొదలైనప్పుటికీ లక్ష్యం దిశగా సాగడం లేదు. చాలావరకు ఈపాటికే పచ్చిరొట్ట విత్తనాలు రాయితీపై పంపిణీ పూర్తయింది. వరి, అపరాల విత్తనాలు అందించాల్సి ఉంది. పంటరుణాల మంజూరు ప్రక్రియ మొదలైన నేపథ్యంలో కౌలుకార్డులు కీలకమయ్యాయి.
లక్ష్యం బారెడు... ఆచరణ మూరెడు
గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో ఈఏడాది 90,459 కార్డులు ఇవ్వాలని లక్ష్యం పెట్టుకోగా ఇప్పటివరకు 33,299 కార్డులు మాత్రమే మంజూరుచేశారు. చాలాచోట్ల భూయజమానులు అంగీకరించి పత్రాలు ఇవ్వకపోవడం, ప్రభుత్వం నుంచి వచ్చే సాయం కౌలుదారులకు ఇవ్వడానికి యజమానులు ఇష్టపడకపోవడం, ఇప్పటికే పంటరుణాలు భూయజమానులు తీసుకుని ఉండటం వల్ల కౌలుదారులకు కార్డులు ఇవ్వడానికి వారు ఒప్పుకోవడం లేదు. కృష్ణా పశ్చిమడెల్టాలో మాత్రం కౌలుదారులు భూములు తీసుకోవడానికి ముందుకురాకుండా కార్డులు తీసుకోవడానికి అంగీకరించే రైతుల భూములు కౌలుకు తీసుకుంటామని చెబుతుండటంతో అక్కడ పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. 11నెలల కాలవ్యవధితో పంటసాగు ధ్రువీకరణ పత్రాలు(సీసీఆర్సీ) మంజూరుచేస్తున్నా యజమానులు అంగీకరించడం లేదు. పంటరుణాలు, రైతుభరోసా, బీమా వంటివి నేరుగా కౌలుదారుల ఖాతాలకు జమచేస్తే తమకు భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. రైతుభరోసా సాయం అందాలంటే జూన్ 30లోపు కౌలుకార్డు పొంది ఉండాలి. ఈలెక్కన మరో రెండు రోజుల్లో గడువు ముగుస్తున్నందున మెజారిటీ కౌలుదారులకు లబ్ధి అందేలా చూడాల్సి ఉంది. ఇందుకు ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి యంత్రాంగానికి దిశానిర్దేశం చేయడంతోపాటు అప్రమత్తం చేయాల్సిన తరుణమిదే. కౌలురైతులు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఉమ్మడి గుంటూరు పేరుపొందింది. మిర్చి, ప్రత్తి, వరి, కూరగాయల పంటల్లో ఎక్కువమంది కౌలుదారులు నిమగ్నమై ఉన్నారు. ఏడాది పొడవునా పూలు, ఆకుకూరలు పండించే సాగుదారుల్లో సింహభాగం వీరే ఉన్నారు. ఎకరం ఏడాది రూ.లక్షపైగా కౌలు ధర పలికే భూములు కూడా ఉన్నాయి. ఇందులో ఏడాది పొడవునా ఆకుకూరలు పండించి విజయవాడ, గుంటూరు నగరాలు, సమీప మున్సిపల్ పట్టణాల్లో రోజువారీగా విక్రయిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం జగన్పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు
[ 19-04-2024]
ఏప్రిల్ 16న భీమవరంలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. -
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
[ 19-04-2024]
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. -
గుంటూరు జిల్లాలో ప్రబలిన డయేరియా.. 100 మందికి పైగా అస్వస్థత
[ 19-04-2024]
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం మంచాలలో డయేరియా ప్రబలింది. వాంతులు, విరేచనాలతో గ్రామంలో 100 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. -
దశ‘దిశ’లా.. ఆక్రందనలే..!
[ 19-04-2024]
వైకాపా ప్రభుత్వ పదవీకాలం ముగుస్తున్నా ఇప్పటికీ ఆ చట్టానికి కోరలు లేవు. దాన్ని పార్లమెంట్ ఆమోదించలేదు. ఉనికిలో లేని చట్టం గురించి పదేపదే ప్రచారం చేసుకోవడం జగన్ సర్కార్ తీరుగా మారింది. -
జీవితాన్ని కలరా‘జే’సింది..
[ 19-04-2024]
రేపల్లెకు చెందిన మధు ప్రభుత్వ మద్యం తాగి పక్షవాతానికి గురై మంచానికి పరిమితమయ్యాడు. చేతివృత్తి చేసుకుంటూ భార్య ఇద్దరు పిల్లలను పోషించుకునే అతను మద్యం తాగేవాడు. -
సమస్యలు విలీనమై.. బడికి దూరమై..
[ 19-04-2024]
పాఠశాలల విలీనం వల్ల లాభం లేకపోగా టీచర్లకు, పిల్లలకు బాగా అన్యాయం జరిగింది. కొందరు టీచర్లు దూరాన ఉన్న ఉన్నత పాఠశాలలకు వెళ్లలేక పదోన్నతులు వదులుకోవడంతో నష్టపోయారు. అదేవిధంగా పిల్లల పరంగా చూస్తే సర్కారీ బడులకు దూరమయ్యారు. -
ఆరోగ్యం చిదిమేసి.. బతుకుల్ని బుగ్గి‘జే’సి..
[ 19-04-2024]
మద్యపాన నిషేధం చేస్తామని జగన్మోహన్రెడ్డి ఓట్లు దండుకుని తీరా అధికారంలోకి వచ్చాక ఆ మాటే మరిచారు. స్వయంగా ప్రభుత్వమే మద్యం వ్యాపారానికి తెరతీసింది. నాసిరకం మద్యం పోసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడింది. -
అండ నేనన్నావు.. గుదిబండలా మార్చావు..
[ 19-04-2024]
జిల్లాలో వైకాపా ప్రభుత్వ అయిదేళ్ల పాలనలో ఒక్క కొత్త పరిశ్రమ రాకపోగా ఉన్నవి చాలా వరకు మూతపడ్డాయి. పత్తి ఆధారిత పరిశ్రమలైన జిన్నింగ్ పూర్తిగా ఎత్తేయగా.. స్పిన్నింగ్ మిల్లులు అదే దిశగా నడుస్తున్నాయి. -
యువనేతపై ఉప్పొంగిన అభిమానం
[ 19-04-2024]
లోకేశ్ తరఫున నామినేషన్ పత్రాల సమర్పణ సందర్భంగా గురువారం మంగళగిరిలో జనసేన, భాజపా, తెదేపా, ఎమ్మార్పీఎస్ శ్రేణులు భారీ ప్రదర్శన నిర్వహించారు. -
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వినియోగానికి ఆటంకాలు
[ 19-04-2024]
వైకాపా ప్రభుత్వంపై ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. ఇదే అదనుగా పోలింగ్ విధుల్లో పాల్గొనే ఉద్యోగులు అందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోకుండా వ్యూహాత్మకంగా ఉన్నతాధికారులు ఆటంకాలు కలిగిస్తున్నారని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఆరోపిస్తున్నాయి. -
కోన ఆస్తుల విలువ రూ.24.20 కోట్లు
[ 19-04-2024]
బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే కోన రఘుపతి తన కుటుంబ ఆస్తుల విలువను రూ.24.20 కోట్లుగా గురువారం దాఖలు చేసిన ఎన్నికల నామినేషన్ అఫిడవిట్లో పేర్కొన్నారు. -
నలిగిపోతున్న నాలుగో సింహం
[ 19-04-2024]
ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ కల్పించడంలో పోలీసులు పగలు, రాత్రి కష్టపడుతుంటారు. శాంతిభద్రతలను పరిరక్షించే క్రమంలో సంఘ విద్రోహశక్తుల చేతిలో ప్రాణత్యాగాలకు సైతం వెనకాడరు. -
కర్షకుల కష్టాలు కనిపించవా..?
[ 19-04-2024]
పెదవడ్లపూడి ఉన్నత వాహినిపై ఎత్తిపోతల పథకం పూర్తి చేసి రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే ఆర్కే హామీ ఇచ్చారు. కానీ అమలు చేయడం మర్చిపోయారు. -
వైకాపా ప్రభుత్వ నిర్ణయ లోపం.. విద్యార్థులకు శాపం
[ 19-04-2024]
‘మీ పిల్లలు బడిలో భోజనం చేయకపోతే మీకు వస్తున్న ప్రభుత్వ పథకాలు నిలిచేపోయే అవకాశం ఉంది’అని తల్లిదండ్రుల సమావేశాల్లో ఉపాధ్యాయులు చెబుతున్నా.. నాణ్యత లేకపోవడంతో చాలా మంది విద్యార్థులు -
‘అవినీతి పాలనకు చరమగీతం పాడుదాం’
[ 19-04-2024]
అసమర్థ, అవినీతి పాలనకు చరమగీతం పాడుదామని గుంటూరు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. కొల్లిపరలో గురువారం సాయంత్రం నిర్వహించిన రోడ్షోలో ఆయన మాట్లాడుతూ వైకాపా పాలకులకు పోలవరం పట్టలేదు, -
ఎప్పటికి తొలగిస్తారో!
[ 19-04-2024]
పట్టణ పరిధి జీబీసీ రహదారిలో విద్యుత్తు స్తంభానికి సీఎం జగన్, స్థానిక ఎమ్మెల్యే రోశయ్య, వైకాపా నేతల ఫొటోలతో కూడిన బోర్డు ఉంది. -
మొదలైన నామినేషన్ల పర్వం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో గురువారం నుంచి జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల పర్వం మొదలైంది. ఈ క్రమంలో నెల రోజులుగా పలు విధాలుగా ప్రచార కార్యక్రమాలు చేపట్టిన పార్టీలు ఇప్పటికే నామినేషన్ పత్రాలు పూర్తి చేసి మంచి ముహూర్తం కోసం వేచి ఉన్నారు. -
ఫోన్పే చేయమన్నాడు.. అదృశ్యమయ్యాడు!
[ 19-04-2024]
అద్దంకి పురపాలక కార్యాలయం వద్ద మంచినీటి కుళాయి రుసుం చెల్లించేందుకు వచ్చిన వృద్ధుడ్ని ఓ ఘరానా దొంగ మోసగించాడు. ఈ సంఘటన గురువారం ఉదయం పురపాలక పన్నుల విభాగం వద్ద జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి