నాడు-నేడు..ఏనాడో
పాఠశాలల్లో నాడు-నేడు రెండోవిడత పనుల నిర్వహణకు సిమెంటు లభ్యతే పెద్ద అవరోధంగా మారింది. కొన్ని పాఠశాలల్లో అయితే సిమెంట్తో సంబంధం లేని ఎలక్ట్రికల్ పనులు, మోటార్లు ఏర్పాటు వంటివి తొలుత చేయిస్తున్నారు. ఇప్పటికే చాలా
పాఠశాలల్లో నాడు-నేడు రెండోవిడత పనుల నిర్వహణకు సిమెంటు లభ్యతే పెద్ద అవరోధంగా మారింది. కొన్ని పాఠశాలల్లో అయితే సిమెంట్తో సంబంధం లేని ఎలక్ట్రికల్ పనులు, మోటార్లు ఏర్పాటు వంటివి తొలుత చేయిస్తున్నారు. ఇప్పటికే చాలా చోట్ల తరగతి గదులను కూల్చేశారు. వేసవి సెలవుల అనంతరం జులై 5 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఆ వ్యవధి మరో వారం మాత్రమే ఉంది. రెండోవిడత కింద ఎంపికైన పాఠశాలల్లో 90 శాతం దాకా సిమెంటు లేక తరగతి గదుల నిర్మాణం దిశగా పనులు ప్రారంభించనే లేదు.
ఉన్న తరగతి గదులను కూల్చేసి సకాలంలో కొత్తవి నిర్మించుకోలేక ప్రధానోపాధ్యాయులు సతమతమవుతున్నారు. మొత్తంగా సిమెంటుతో పాటు స్టీల్ అందుబాటులో లేవు. గతంలో ప్రభుత్వమే సిమెంటు, స్టీల్ సరఫరా చేసేది. దీంతో మొదటిదశలో చేపట్టిన పనులకు పెద్దగా ఇబ్బందులు రాలేదు. అదే అనుభవంతో రెండో విడత పనులకు శ్రీకారం చుట్టాలని గతేడాది డిసెంబరులోనే ఆదేశించింది. పనులు జాప్యమయ్యాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో రెండో విడత కింద 1379 పాఠశాలలు ఎంపికయ్యాయి. వాటిల్లో అదనపు తరగతి గదులు, ఇప్పటికే ఉన్నవి మరమ్మతులకు గురైతే వాటి పునరుద్ధరణకు సంబంధించి మొత్తం 1984 గదుల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. రెండో విడత పనులకు రూ.469.93 కోట్లతో అంచనాలు రూపొందించారు. నిర్దేశిత మొత్తానికి తొలుత పనుల ప్రారంభానికి పాఠశాల తల్లిదండ్రుల కమిటీ ఖాతాలకు రివాల్వింగ్ఫండ్ కింద రూ.60.12 కోట్లు విడుదల చేసింది. ఈ మొత్తంలో ఇప్పటి వరకు కేవలం రూ.7.52 కోట్లే ఖర్చయింది. పనుల నిర్వహణకు నిధులు ఉన్నా ఆయా మెటీరియల్ కొరత కారణంగా పనులు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది.
మార్కెట్లో కొనుగోలు చేసుకోవాలని ఆదేశం
బహిరంగ మార్కెట్లో షాపుల నుంచి ప్రధానోపాధ్యాయులు, తల్లిదండ్రుల కమిటీనే కొనుగోలు చేసుకుని సమకూర్చుకోవాలని ఆదేశాలు వచ్చాయి. సిమెంట్ ధరలు ప్రస్తుతం మార్కెట్లో చుక్కలనంటాయి. ప్రభుత్వం సూచించిన తక్కువ ధరలకు సరఫరా చేయలేమని ప్రభుత్వ ఏజెన్సీలు చేతులెత్తేయటంతో ప్రధానోపాధ్యాయులే షాపుల చుట్టూ తిరిగి వాటిని కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గుంటూరు, తెనాలి, నరసరావుపేట తదితర ప్రధాన పట్టణాల్లో నిల్వలు బాగానే ఉన్నాయి. మిగిలిన చిన్న పట్టణాలు, మండల కేంద్రాల్లోని వ్యాపారులు తొలుత ఎంత మొత్తంలోకావాలో ఇండెంట్ పెట్టండి. ఆతర్వాత 10-15 రోజుల్లో డెలివరీ ఇస్తామని చెబుతున్నారని కొందరు హెచ్ఎంలు గుర్తు చేశారు.
* బహిరంగ విపణిలో స్టీల్ ధరలకు అమాంతంగా రెక్కలొచ్చాయి. స్టీల్ ఆన్ కాల్ పేరుతో ఆన్లైన్లో పాఠశాలకు అవసరమైన ఇనుము బుక్ చేసుకుంటే ఆ మొత్తాన్ని పాఠశాలకు పంపిణీ చేయటం లేదు. గతంలో సరఫరా చేసేవారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు తాము సరఫరా చేయలేమని స్టీల్ వ్యాపారులు చేతులేత్తేశారు. ప్రత్యామ్నాయంగా బహిరంగ మార్కెట్లో ప్రధానోపాధ్యాయుల్ని కొనుగోలు చేసి సమకూర్చుకోవాలని ఇటీవల సూచించారు.
-సత్తెనపల్లి డివిజన్కు చెందిన ప్రధానోపాధ్యాడు
* సిమెంట్ బుకింగ్కు సమగ్రశిక్ష అధికారులు సూచించిన లాగిన్లో సాంకేతిక లోపాలు ఉన్నాయి. కనీసం ఆర్డర్ కూడా అది స్వీకరించటం లేదు. ఈవిషయాన్ని సంబంధిత మండల ఈఏలకు తెలియజేసినా ఆ సాంకేతిక సమస్యలను పరిష్కరించలేదు. ఇలా సిమెంట్ బుకింగ్ చేసుకోవటానికి అవకాశం లేకుండా పోయింది. చాలా పాఠశాలల్లో ఇటుక, మట్టి, కంకరు వంటివి అందుబాటులో ఉన్నా కీలకమైన సిమెంట్, స్టీల్ లేక పనులు మొదలు పెట్టలేదు.
-గుంటూరు డివిజన్కు చెందిన ఓ ప్రధానోపాధ్యాయుడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ రాజీనామా
[ 23-04-2024]
వైకాపాకు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ చిరంజీవి రెడ్డి రాజీనామా చేశారు. -
జగనన్న సమర్పించు.. గోతుల రాజ్యం!
[ 23-04-2024]
జగనన్న పాపాలు ఎన్నని చెప్పేది.. ఎందెందు వెతికినా.. అన్నింటా లోపాలే.. అన్నిచోట్లా అసమర్థ పాలనే! రోడ్లను చూడండి... రాళ్లు తేలి.. గుంతలు పడి... బీటలువారి.. కనీసం ద్విచక్ర వాహనమైనా ముందుకు కదల్లేని దుస్థితి. -
పదిలో పైచేయి అమ్మాయిలదే
[ 23-04-2024]
పదో తరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లా విద్యార్థులు 88.19 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో బాలికల హవా స్పష్టంగా కనిపించింది. బాలికలు 90.1 శాతం ఉత్తీర్ణులు కాగా, బాలురు 86.32 శాతం ఉత్తీర్ణులయ్యారు. -
అమ్మఒడి సాయంలో మామ కోతలు
[ 23-04-2024]
ప్రజాధనాన్ని పేదలకు పంచుతుంటే విపక్షాలకు ఎందుకంత కడుపుమంట? వారి సంక్షేమానికి ప్రజాధనం వెచ్చించటం తప్పేనా అంటూ బహిరంగసభల్లో బీరాలు పలికే జగన్ ఆ పంపిణీ మాటునే తిరిగి దోచుకుంటున్నారు. -
మురుగున పడ్డ డబ్బులెక్కడ.. మామ?
[ 23-04-2024]
భట్టిప్రోలు మండలం ఐలవరం ఉన్నతపాఠశాలలో 400 మంది విద్యార్థులు విద్యా బుద్ధులు నేర్చుకుంటున్నారు. వీరికి పాఠశాలలో రెండు మరుగుదొడ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. -
సమర్థ్ యాప్తో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపు
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమయంలో పోలీసుశాఖ సమర్థంగా విధులు నిర్వర్తించేలా వేగవంతమైన పోలీసు సేవల కోసం కొత్తగా సమర్థ్ మొబైల్ యాప్ను రూపొందించినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. -
ఉప్పొంగిన ప్రజాభిమానం
[ 23-04-2024]
ప్రజాభిమానం ఉప్పొంగింది. వైకాపా ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో జనం కసితో కదిలి కదం తొక్కారు. తెలుగుదేశం, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా ముందుకు సాగారు. ఆ ప్రాంతమంతా పసుపు, తెలుపు, కాషాయ వర్ణాలమయమైంది. ఎమ్మార్పీస్ దండు సైతం వారి జెండాలతో కదిలారు. -
అలా..చతికిలపది!
[ 23-04-2024]
పదో తరగతి పరీక్ష ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా ర్యాంకు గతేడాది కంటే 10 స్థానాలు దిగజారి వెనుకబడింది. 2022- 23 సంవత్సరంలో జిల్లా ఆరో స్థానంలో నిలవగా ఈ ఏడాది 16వ స్థానానికి దిగజారింది. -
జోరుగా నామినేషన్లు
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. గుంటూరు పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. -
పని భారం పెంచేశారు.. పోస్టులు భర్తీ చేయరు..
[ 23-04-2024]
జిల్లా బీసీ సంక్షేమ శాఖ కార్యాలయం: ఇక్కడ ఐదు పోస్టులే ఉన్నాయి. అందులో ఒక సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, సబార్డినేట్, డేటా ఎంట్రీ ఆపరేటర్. -
రూ.46 కోట్లు నష్టపోయాం
[ 23-04-2024]
గుంటూరు సర్వజనాసుపత్రిలో ఆరోగ్యశ్రీ కేసుల నమోదు ప్రక్రియలో సరైన కోణంలో పని చేయనందున ఆసుపత్రికి రావాల్సిన సుమారు రూ.46 కోట్లు ఆర్థికంగా నష్టపోయామని సూపరిôటెండెంట్ కిరణ్కుమార్ తెలిపారు. -
వసతి గృహ విద్యార్థుల ఉత్తీర్ణత మెరుగు
[ 23-04-2024]
జిల్లాలోని సంక్షేమ శాఖల వసతి గృహాల్లో ఉండి పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఎక్కువ మంది ఉత్తీర్ణులయ్యారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల నుంచి 93 మంది పరీక్షలకు హాజరు కాగా 76 మంది ఉత్తీర్ణులయ్యారు. -
స్పందించేందుకు ఇప్పుడు సమయం దొరికిందా..?
[ 23-04-2024]
రాజధాని అమరావతి శంకుస్థాపన ప్రాంతంలో నమూనా గ్యాలరీ ధ్వంసంపై సీఆర్డీఏ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. -
‘మంగళగిరి రూపురేఖలు మారుస్తాం’
[ 23-04-2024]
ముఖ్యమంత్రి జగన్ మాదిరిగా తాము శవ రాజకీయాలు చేయమని యువనేత, కూటమి అభ్యర్థి నారా లోకేశ్ అన్నారు. -
ప్రత్తిపాడును అగ్రగామిగా నిలుపుతా: బూర్ల
[ 23-04-2024]
నియోజకవర్గాన్ని అభివృద్ధి, సంక్షేమంలో అగ్రగామిగా నిలుపుతానని ప్రత్తిపాడు కూటమి అభ్యర్థి డాక్టరు బూర్ల రామాంజనేయులు హామీ ఇచ్చారు. సోమవారం ఆయన నామినేషన్ దాఖలు కార్యక్రమం విజయోత్సవాన్ని తలపించింది. -
మేలు సంగతి తర్వాత.. ముందు నీళ్లివ్వండి
[ 23-04-2024]
‘మేం అధికారంలోకి రాగానే ఈ ప్రాంతాన్ని అభివృద్ధికి చిరునామాగా మారుస్తాం. సకల సౌకర్యాలు కల్పించి ప్రజల కష్టాలు తీరుస్తాం.’ ఇవీ వైకాపా నేతలు సమయం చిక్కినప్పుడల్లా ప్రజలకు ఇచ్చిన హామీలు.‘ -
పదిలో పెరిగిన ఉత్తీర్ణత
[ 23-04-2024]
పదోతరగతి పరీక్షల్లో పల్నాడు జిల్లా విద్యార్థులు నిరుటి కంటే 16 శాతం అదనంగా ఉత్తీర్ణత సాధించారు. కాగా రాష్ట్రస్థాయిలో జిల్లా 18వ స్థానంలో నిలిచింది. జిల్లాలో మొత్తం 24959 మందికి గాను 21477 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. -
వివాదాల అగ్గిరాజేస్తున్న వైకాపా
[ 23-04-2024]
‘అగ్గి’రాజేస్తూ వివాదాలకు వైకాపా నాయకులు కాలుదువ్వుతున్నారు. మాచర్ల, గురజాలను మించిపోయేలా పెదకూరపాడులో ఇటీవల వరుస ఘటనలు భయకంపితులను చేస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
-
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
-
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!