పెళ్లి పేరుతో యువతి టోకరా!
లక్షలాది రూపాయలు కట్నకానుకలు తీసుకొని పెళ్లి చేసుకొని మోసగించాడంటూ మహిళలు ఫిర్యాదు చేస్తుంటారు. అందుకు భిన్నంగా ఓ యువతిపై బాధితుడు సోమవారం పోలీసు కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు.
వీఆర్వో, ఆమె కుమార్తెపై ఎస్పీ కార్యాలయంలో బాధితుడి ఫిర్యాదు
బాధితులు ఎస్పీకి ఇచ్చిన శుభలేఖ
నెహ్రూనగర్ (గుంటూరు), న్యూస్టుడే : లక్షలాది రూపాయలు కట్నకానుకలు తీసుకొని పెళ్లి చేసుకొని మోసగించాడంటూ మహిళలు ఫిర్యాదు చేస్తుంటారు. అందుకు భిన్నంగా ఓ యువతిపై బాధితుడు సోమవారం పోలీసు కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. వివరాలు బాధితుల మాటల్లోనే.. ‘నేను బీటెక్ చదివాను. ప్రస్తుతం గుంటూరులో మోటార్ కంట్రోలర్ మెకానిక్గా పనిచేస్తున్నాను. తండ్రి పోలియోతో, తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఒక్కడినే కుమారుడి. రెవెన్యూశాఖలోని ఓ విశ్రాంత ఉద్యోగి పరిచయమై జిల్లాలోని ఓ వీఆర్వో కుమార్తెతో వివాహం కుదిర్చారు. తండ్రిలేరని తాను కట్నం ఇచ్చుకోలేనని తల్లి చెప్పడంతో పైసా కట్నంలేకుండా పెళ్లికి అంగీకరించాం. ఫిబ్రవరిలో వివాహమైంది. అమ్మాయికి రూ. 2 లక్షలతో ఆభరణాలు చేయించాం. మా ఊరులో రూ. 6 లక్షలతో రిసెప్షన్ చేశాం. వెంటనే ఆమె తన కుమార్తెను పుట్టింటికి తీసుకెళ్లింది. తొలిరాత్రి నుంచి యువతి నన్ను దూరంపెట్టింది. ఒక్కరోజు కూడా కాపురం చేయలేదు. నెలల తరబడిగా ఆమె పుట్టింటి నుంచి రావడంలేదు. మా పెద్దలు వెళ్లి అడిగితే గుంటూరులో ఇల్లు అద్దెకు తీసుకోమన్నారు. ఒకరోజు ఉండి తనను తాకవద్దంటూ రెండోరోజు పుట్టింటికి వెళ్లిపోయింది. గట్టిగా నిలదీయడంతో కట్నం ఇవ్వమంటున్నారని మాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ. 10 లక్షల డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ సమయంలోనే మాకు తెలిసింది మా అత్త వీఆర్వోగా పనిచేసిన గ్రామంలో గతేడాది ఓ ఎయిర్ఫోర్సు ఉద్యోగితో నిశ్చితార్థం చేశారట. ఆ విషయం దాచిపెట్టి మాతో వివాహమంటూ తతంగం నడిపారు. మరొకరితో పెళ్లి తంతు నడుపుతూ నా అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నారనిపిస్తోంది. మమ్మల్ని మోసగించిన వారిపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని కోరాం’ అని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రమాదవశాత్తు పేలిన ఏకే 47.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో సీఆర్పీఎఫ్కు చెందిన అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరిరావు మృతిచెందారు. -
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.
తాజా వార్తలు (Latest News)
-
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు
-
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
-
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు
-
యూట్యూబ్కు పోటీగా.. వీడియోల కోసం ‘ఎక్స్’ టీవీ యాప్!
-
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
-
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్