రాయితీ పరికరాలకు దరఖాస్తు చేసుకోండి
పల్నాడు జిల్లాలో మెట్ట ప్రాంతం ఎక్కువగా ఉండటంతో బిందు, తుంపర సేద్యంలో పంటలు, పండ్ల తోటల సాగుకు రైతులు ఆసక్తి చూపిస్తుంటారు. గత మూడేళ్లుగా సూక్ష్మ సేద్యానికి ప్రోత్సాహాకాలు నిలిచిపోయాయి.
బిందు, తుంపర సేద్యానికి ప్రోత్సాహం
న్యూస్టుడే, ముప్పాళ్ల: పల్నాడు జిల్లాలో మెట్ట ప్రాంతం ఎక్కువగా ఉండటంతో బిందు, తుంపర సేద్యంలో పంటలు, పండ్ల తోటల సాగుకు రైతులు ఆసక్తి చూపిస్తుంటారు. గత మూడేళ్లుగా సూక్ష్మ సేద్యానికి ప్రోత్సాహాకాలు నిలిచిపోయాయి. ప్రస్తుత ఖరీఫ్ నుంచి రాయితీలను పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రైతుభరోసా కేంద్రాల్లో వివరాలు నమోదు చేయించుకున్న రైతులకే ప్రోత్సాహాకాల్ని వర్తింపజేయనున్నారు.
* పల్నాడు జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్లో 6,800 హెక్టార్లలో బిందు, తుంపర సేద్యం లక్ష్యంగా ఉంది. కొన్ని రోజులుగా ఆర్బీకేల్లో రైతుల వివరాల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు 1027 మంది రైతులు 1057 హెక్టార్లలో సాగుకు ప్రోత్సాహాకాలు అందించాలని వివరాలు నమోదు చేయించుకున్నారు. ఇంకా చాలామంది అన్నదాతలు నమోదుకు దూరంగా ఉన్నారు. వారంతా చైతన్యంతో ముందుకు రావాల్సిన తరుణమిదే.
* బిందు సేద్యానికి ఐదెకరాల్లోపు రైతులకు 90శాతం రాయితీతో పరికరాల్ని అందించనున్నారు. 5 నుంచి 12.5 ఎకరాలకు 50 శాతం రాయితీ వర్తిస్తుంది.
* తుంపర సేద్యానికి అన్నివర్గాల రైతులకు 50శాతం రాయితీతో పోర్టబుల్ స్ల్పింకర్లు అందించేలా నిర్ణయించారు.
* ఆర్బీకేల్లో ఏపీఎంఐపీ యాప్లో వివరాలు నమోదు చేస్తున్నారు. గతంలో రాయితీకి డీడీలు తీసి ప్రోత్సాహకం అందని వారికి ఇప్పుడు ప్రాధాన్యం ఇస్తున్నారు. పట్టాదారు పాసుపుస్తకం లేదా 1బీ అడంగల్, ఆధార్, చరవాణి వివరాలతో రైతులు ఆర్బీకేల్లో పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత క్షేత్ర పరిశీలన చేసి అర్హులకు అవసరమైన పరికరాల్ని పంపిణీ చేయనున్నారు.బిందు, తుంపర సేద్యంలో సాగుకు ముందుకొచ్చే అన్నదాతలు రాయితీ కోసం రైతుభరోసా కేంద్రాల్లో వివరాలు నమోదు చేయించుకోవాలని ఏపీఎంఐపీ పల్నాడు జిల్లా డీఎంఐవో ఆంజనేయులు సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు: నారా లోకేశ్
[ 25-04-2024]
ఓట్లు అడగడానికి వచ్చే వైకాపా నేతలను రాజధాని రైతులు నిలదీయాలని యువనేత, మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. -
చదువులమ్మ చెట్టుకు.. రాజకీయ చెద!
[ 25-04-2024]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేరెన్నికగన్న పురాతన విద్యాసంస్థల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఒకటి. దేశ, విదేశాల్లో ఎంతో ఖ్యాతినార్జించిన ఘనత దీని సొంతం. దాదాపు పది, పదిహేను దేశాల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకునేవారు. -
యూజీడీ మూలన.. మాటలు మరుగున
[ 25-04-2024]
నా ముస్లింలు.. నా మైనార్టీలు అంటూ మాటలతో మభ్యపెట్టడమే గానీ సీఎం జగన్కు వారిపై ఏమాత్రం ప్రేమలేదని చెప్పడానికి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తికాని ఉదంతమే నిదర్శనం. -
నాడు వాతలుండవని కోతలు.. నేడు ఛార్జీల మోతలు
[ 25-04-2024]
ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్రెడ్డి రాష్ట్రమంతా తిరిగి చంద్రబాబు పాలనలో కరెంటు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయని విమర్శించారు. తాను అధికారంలోకి వచ్చాక విద్యుత్తు ఛార్జీలు పెంచబోమని హామీనిచ్చారు. -
అభిమాన నీరాజనం
[ 25-04-2024]
జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ నామినేషన్ సందర్భంగా బుధవారం తెనాలిలో నిర్వహించిన ప్రదర్శనకు ప్రజలు భారీగా తరలివచ్చారు. -
పసుపుమయమైన రేపల్లె
[ 25-04-2024]
రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నామినేషన్ దాఖలు కార్యక్రమం బుధవారం కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది. -
అక్రమంగా తవ్వారు.. ప్రాణాలు తీస్తున్నారు!
[ 25-04-2024]
రెండేళ్ల కిందట ప్రత్తిపాడుకు చెందిన నలుగురు కళాశాల విద్యార్థులు ఈతకు బోయపాలెంలోని డైట్ సమీపంలో క్వారీ గుంత వద్దకు వెళ్లారు. -
చందా.. దందా
[ 25-04-2024]
ఎన్నికలంటే ఖర్చులు ఎలా ఉంటాయో మీకు తెలియంది కాదు. -
మిత్ర ద్రోహం
[ 25-04-2024]
పాదయాత్రలో అధికారంలోకి రాగానే గోపాల మిత్రలకు నెలకు రూ.16 వేల గౌరవవేతనం ఇస్తామని హామీ ఇచ్చి గత అయిదేళ్లుగా ఒక్క రూపాయి కూడా పెంచకుండా తమని సీఎం జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని గోపాల మిత్రలు వాపోతున్నారు. -
‘పది’లో ‘ప్రత్యేక’ విజయం
[ 25-04-2024]
అమ్మ ప్రోత్సాహం..అమ్మమ్మ పర్యవేక్షణ..భవిత కేంద్ర టీచర్ల కృషి...ప్రధానోపాధ్యాయురాలి తోడ్పాటు వెరసి 16 ఏళ్ల దివ్యాంగురాలైన జి.శ్రావ్య జోసెఫిన్ పదో తరగతి పూర్తిచేసింది. -
తెదేపా ప్రచార వాహన డ్రైవర్పై వైకాపా దాడి
[ 25-04-2024]
తెలుగుదేశం పార్టీ ప్రచార వాహన డ్రైవర్పై కొందరు వైకాపా నాయకులు దాడి చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. -
ప్రజల గొంతూ తడపలేరా?
[ 25-04-2024]
2018 మార్చి 14వ తేదీన ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి పొన్నూరులో నిర్వహించిన బహిరంగ సభలో పొన్నూరు పట్టణ ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని అప్పటి తెదేపా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. -
రాజీనామా చేయకుంటే అంతుచూస్తాం
[ 25-04-2024]
వాలంటీర్లుగా మీకు ప్రతి ఇంట్లో ఎంత మంది ఓటర్లున్నారు..ఎటు అనుకూలంగా ఉన్నారో తెలుసు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 25-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు రైల్వే అధికారి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు