logo

వైకాపా ర్యాలీతో రాకపోకలకు అంతరాయం

వైకాపా ఫ్లీనరీ కోసం ఫిరంగిపురం వచ్చిన ఎమ్మెల్యేలు సుచరిత, శ్రీదేవి ముందుగా రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి సొలస బస్టాండ్‌ సెంటర్‌ నుంచి ర్యాలీగా బయలుదేరి సభా వేదిక వద్దకు వెళ్లారు. ఆ సమయంలో

Published : 30 Jun 2022 05:17 IST

న్యూస్‌టుడే, ఫిరంగిపురం గ్రామీణం: వైకాపా ఫ్లీనరీ కోసం ఫిరంగిపురం వచ్చిన ఎమ్మెల్యేలు సుచరిత, శ్రీదేవి ముందుగా రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి సొలస బస్టాండ్‌ సెంటర్‌ నుంచి ర్యాలీగా బయలుదేరి సభా వేదిక వద్దకు వెళ్లారు. ఆ సమయంలో రోడ్డు కిక్కిరిసింది. సుమారు అరగంట సేపు రాకపోకలకు అంతరాయం కలిగింది. వాహనాలు భారీగా నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఫ్లీనరీలో పాల్గొనేందుకు ఫిరంగిపురం, మేడికొండూరు మండలాల్లోని డ్వాక్రా మహిళలు భారీగా అక్కడకు చేరుకున్నారు. ర్యాలీలో తిరుగుతూ పార్టీ జెండాలు పట్టుకుని కనిపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని