ఆటో ఎక్కి మృత్యుఒడికి చేరి
చిలకలూరిపేట మండలం రామచంద్రాపురం అడ్డరోడ్డు బైపాస్ రహదారి మలుపు ప్రాంతంలో బుధవారం చోటుచేసుకున్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల
కారు ఢీకొట్టడంతో ఇద్దరి దుర్మరణం
ఆరుగురికి తీవ్ర గాయాలు
రోడ్డు పక్కన బోల్తా పడిన ఆటో
చిలకలూరిపేట గ్రామీణ, న్యూస్టుడే: చిలకలూరిపేట మండలం రామచంద్రాపురం అడ్డరోడ్డు బైపాస్ రహదారి మలుపు ప్రాంతంలో బుధవారం చోటుచేసుకున్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు బాపట్ల జిల్లా మార్టూరు నుంచి ప్రయాణికులతో చిలకలూరిపేట బయలుదేరిన ఆటో రామచంద్రాపురం సర్వీస్ రోడ్డు నుంచి జాతీయ రహదారికి ఎక్కే క్రమంలో నెల్లూరు నుంచి విజయవాడ వెళ్తున్న కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఆటో రోడ్డు పక్కన బోల్తా పడగా, కారు పక్కకు దూసుకెళ్లి జాతీయ రహదారిపై అడ్డంగా పడిపోయింది. ఆటోలో ప్రయాణిస్తున్న బొప్పూడి గ్రామానికి చెందిన షేక్ ఖాశింపీరా (60), మార్టూరుకు చెందిన ఆటో డ్రైవర్ కరీమ్బాషా, అదే మండలం నాగరాజుపల్లి గ్రామానికి చెందిన అత్తా కోడళ్లు గల్లా పేరమ్మ (60), శౌరమ్మ తీవ్రంగా గాయపడ్డారు. వారిని చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ షేక్ ఖాశింపీరా, గల్లా పేరమ్మ(60) మృతి చెందారు. కారులో ప్రయాణిస్తూ ప్రమాదంలో గాయపడిన నలుగురు గుంటూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చిలకలూరిపేట గ్రామీణ ఎస్సై రాజేష్ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మిన్నంటిన రోదనలు.. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతి చెందిన ఇద్దరూ పేద కుటుంబానికి చెందిన వారే. చిలకలూరిపేట మండలం బొప్పూడి గ్రామానికి చెందిన ఖాశింపీరా మార్టూరు సమీపంలోని ఒక గ్రానైట్ ఫ్యాక్టరీలో కూలి పనులు చేసేవాడు. మంగళవారం రాత్రి విధులకు హాజరైన అతను బుధవారం ఉదయం ఆటో ఎక్కి బొప్పూడికి వస్తున్నాడు. ఒకటిన్నర కిలోమీటరు దూరం వస్తే అతను దిగవలసిన స్టేజీ వస్తుంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి తుదిశ్వాస విడిచాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. కొద్దిసేపటికే కన్నుమూయడంతో వారు కన్నీరుమున్నీరయ్యారు. మార్టూరు మండలం నాగరాజుపల్లికి చెందిన గల్లా పేరమ్మ, శౌరమ్మ అత్తా కోడళ్లు. చిలకలూరిపేట మండలంలోని కావూరు గ్రామంలో బంధువుల ఇంట్లో వివాహానికి హాజరయ్యేందుకు మార్టూరులో ఆటో ఎక్కారు. పేరమ్మ చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గ్రామంలో ఆమె నివాస ప్రాంతం, కావూరులో పెళ్లి ఇంట విషాదం అలముకుంది. చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రి వద్ద బంధువుల రోదనలు మిన్నంటాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నామినేషన్ల స్వీకరణకు వేళాయే.. సన్నద్ధమవుతున్న రాజకీయ పార్టీలు
[ 17-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ గురువారం విడుదల కానుంది. -
నారా లోకేశ్ సమక్షంలో తెదేపాలోకి భారీగా చేరికలు
[ 17-04-2024]
గుంటూరు జిల్లాల్లోని పలు నియోజకవర్గాలకు చెందిన వైకాపా నేతలు బుధవారం లోకేశ్ సమక్షంలో తెదేపాలో చేరారు. -
ఉన్మాది అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో అమరావతే ఉదాహరణ: పెమ్మసాని
[ 17-04-2024]
ఏపీ రాజధాని అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని సీఎం జగన్ అబద్ధాలు చెప్పారని, ఐదేళ్లలో ఒక్కటి కూడా నిరూపించలేకపోయారని తెదేపా గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. -
వలసలు, పస్తులు లేని వికసిత ఏపీ మనందరి బాధ్యత: పవన్
[ 17-04-2024]
అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే జనసేన అభ్యర్థులకు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ బీఫామ్లు అందజేశారు. -
తాడేపల్లిలో ఇల్లన్నావు.. తోడేళ్లకు తోడున్నావు..
[ 17-04-2024]
ఇసుక.. సహజ వనరు. జిల్లా వాసులు అందరికీ చెందాల్సిన సహజ సంపద. పాలకుడు సచ్ఛీలుడైతే ఆ ఫలాలను ప్రజలు అందరికీ పంచుతాడు. కానీ పాలకుడే దోపిడీ చేస్తుంటే.. అనుచరగణం ఆగుతుందా? అధికారమే అండగా ఇసుక మాఫియా పేట్రేగిపోతోంది. -
పట్టుదలతో శ్రమించి.. విజేతలుగా నిలిచి
[ 17-04-2024]
ప్రజాసేవ చేయాలనే సంకల్పమే వారి విజయానికి ఇంధనం. లక్ష్య సాధనలో ఎదురైన వైఫల్యాలను గెలుపునకు సోపానాలుగా మార్చుకుని ప్రతిష్ఠాత్మక సివిల్స్లో మెరిశారు. -
‘రా’క్షస రాజ్యం పారదోలుదా‘మా’
[ 17-04-2024]
రాముడు సకల గుణాభిసోముడు.. పితృవాక్య పరిపాలకుడు. తండ్రికి ఇచ్చిన మాట కోసం పదవిని గడ్డిపోచలా వదిలేశాడు. పద్నాలుగేళ్లు వనవాసం చేశాడు. ప్రకృతిని ప్రేమించాడు. -
అల్లరిమూకల అరాచకం..!
[ 17-04-2024]
గుంటూరు జిల్లా పెదనందిపాడు స్టేషన్ పరిధిలో ఉప్పలపాడుకు చెందిన కొందరు యువకులతో కూడిన ఆకతాయిల గ్యాంగ్ ఒకటి స్థానికంగా దౌర్జన్యాలకు పాల్పడుతోంది. ఆ గ్రామం మీదుగా రాత్రిపూట ప్రయాణించే వాహనాలకు అడ్డుతగిలి వాహనదారుల్ని దుర్భాషలాడి కొట్టడం, గాయపరచటం వంటివి చేస్తున్నారు. -
మేము దాచుకుంది.. నీ నవరత్నాల కోసం కాదు
[ 17-04-2024]
ప్రతి ఉద్యోగి తన సర్వీసులో ఎంతో కొంత పొదుపు చేసి విశ్రాంత జీవితం సాఫీగా సాగిద్దామనుకుంటారు. సరెండర్ లీవ్, డీఏ, జీపీఎఫ్.. ఇలా పలు రకాల అవకాశాలను పొదుపునకు పెట్టుబడిగా మలచుకుంటారు. -
‘చేనేత కుటుంబాలపై ఎమ్మెల్యే ఆర్కే కక్షసాధింపు’
[ 17-04-2024]
ఎమ్మెల్యే ఆర్కే తొలి నుంచి చేనేత కుటుంబాలపై విషం కక్కుతున్నారని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ విమర్శించారు. మంగళగిరి మండలం ఎర్రబాలెంలో తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేశ్ను గెలిపించాలని కోరుతూ మంగళవారం సాయంత్రం స్థానిక తెలుగు మహిళా నాయకులతో కలసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
నదీ గర్భాన్ని తోడేస్తూ.. నిలువునా దోచేస్తూ
[ 17-04-2024]
అనుమతులకు మించి అడ్డగోలుగా కృష్ణానదిలో ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నాయి. సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్ నివాసం ఉండే తాడేపల్లి మండలం గుండిమెడ నుంచి రేయింబవళ్లు ఇసుకను భారీ యంత్రాల ద్వారా తవ్వకాలు చేస్తూ భారీ వాహనాలతో తరలించుకుపోతున్నారు. -
కంచు మోతలే.. సరైన వసతులేవి మామ!
[ 17-04-2024]
‘నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటూ ఊదరగొట్టే సీఎం జగన్ వారి సంక్షేమం కోసం ఎవరూ చేయనంతగా చేస్తున్నానని గొప్పలు చెబుతుంటారు. -
రీయింబర్స్మెంట్ లేదు.. చేయూత నిధులు అందలా..
[ 17-04-2024]
వాలంటీర్ల ద్వారా ఇంటింటికే పథకాలు అందించాం కదా! నాడి ఎలా ఉందో తెలుసుకుందాం అనుకుంటున్న వైకాపాకు ఎదురుదెబ్బ తగులుతోంది. -
పోలీసుల చూపు ఒక వైపే..!
[ 17-04-2024]
జిల్లాలో ఇప్పటికీ ఎవరేమనుకున్నా అధికార వైకాపాకు జీ హుజూర్ అంటోంది పోలీసు యంత్రాంగం. ప్రసుత్తం సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. కనీసం ఇప్పుడైనా యంత్రాంగం పారదర్శకంగా.. నిష్పక్షపాతంగా పని చేస్తుందని విపక్షాలు భావించాయి.
తాజా వార్తలు (Latest News)
-
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్
-
ఇంటినే చక్కదిద్దలేరు.. ఇక రాష్ట్రాన్ని ఎలా?: అనురాగ్ ఠాకూర్
-
బందరుకు ఏం చేశారో చెప్పే ధైర్యం నీతుల నానికి ఉందా?: చంద్రబాబు
-
గుజరాత్ను వణికించిన దిల్లీ
-
దేశ సరిహద్దులు పూర్తిగా సురక్షితమే: రాజ్నాథ్ సింగ్
-
అవును.. ‘ఎక్స్’ను నిలిపివేశాం: పాక్