అర కోటి వెచ్చించినా..!
గుంటూరు మిర్చియార్డులో రూ.50 లక్షల వ్యయంతో నాణ్యత ప్రయోగశాల ఏర్పాటు చేసి రెండేళ్లవుతోంది. మొదట్లో కొన్ని పరికరాలు అమర్చడంలో జాప్యం వల్ల వినియోగంలోకి రాలేదు. ఇప్పుడు అన్నీ సిద్ధం చేసి ఉంచినా రైతులు, వ్యాపారులు నాణ్యత
ప్రయోగశాల వైపు తొంగి చూడని రైతులు, వ్యాపారులు
మిర్చియార్డు, న్యూస్టుడే
గుంటూరు మిర్చియార్డులో రూ.50 లక్షల వ్యయంతో నాణ్యత ప్రయోగశాల ఏర్పాటు చేసి రెండేళ్లవుతోంది. మొదట్లో కొన్ని పరికరాలు అమర్చడంలో జాప్యం వల్ల వినియోగంలోకి రాలేదు. ఇప్పుడు అన్నీ సిద్ధం చేసి ఉంచినా రైతులు, వ్యాపారులు నాణ్యత పరీక్షల కోసం అటువైపు తొంగి చూడటం లేదు. ఆరుగాలం శ్రమించి పండించిన మిర్చి నాణ్యత లేదని రైతులు నష్టపోయే అవకాశం ఉండకూడదన్న ఉద్దేశంతో ఇక్కడ ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. నాణ్యత సాకు చూపి వ్యాపారులు ధరలో కోత పెట్టడం యార్డులో సర్వసాధారణం. రైతులు ఎంతో కొంతకు మిర్చిని తెగనమ్ముకోవాల్సిన పరిస్థితులు దాపురించకుండా ఉండేందుకు మిర్చియార్డులో నాణ్యత ప్రయోగశాల ఏర్పాటుకు లక్షలాది రూపాయలు వెచ్చించినా ఆశించిన ప్రయోజనం చేకూరడం లేదు.
మిర్చియార్డులో ఏర్పాటు చేసిన ప్రయోగశాల
ఆసియా ఖండంలోనే పేరెన్నికగన్న మిర్చియార్డుకు ఒక్క గుంటూరు జిల్లా నుంచే గాకుండా కృష్ణా, ప్రకాశం, కర్నూలు జిల్లాలతో పాటు పొరుగునే ఉన్న తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం, వరంగల్ జిల్లాల నుంచి కూడా రైతులు మిర్చిని తరలించి విక్రయాలు జరుపుతుంటారు. విదేశాలకు ఎగుమతి చేసేటంత నాణ్యత లేదంటూ మిర్చి ధరను తగ్గించి క్రయవిక్రయాలు సాగిస్తుంటారు. దూరాభారం నుంచి వచ్చిన రైతులు మళ్లీ సరకును వెనక్కి తీసుకెళ్లలేక ఎంతో కొంత ధరకు విక్రయించుకుంటూ కొంతమేర నష్టపోవాల్సి వస్తుంది. ఆ విధంగా జరగకుండా ఉండేందుకు పరిపాలనా భవనంలో మిర్చి నాణ్యత ప్రయోగశాలను సిద్ధం చేశారు. లక్షలాది రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసినా ఆశించిన ప్రయోజనం చేకూరకపోవడంతో సొమ్మంతా బూడిదలో పోసిన పన్నీరైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
నాణ్యత ఇలా..
ఎగుమతులు ప్రధానంగా మిర్చి ఘాటు, రంగుపై ఆధారపడి ఉంటాయి. మిర్చి నాణ్యత ఏమేరకు ఉందో ఈ రెండింటి ఆధారంగానే తెలుసుకుంటారు. విదేశాలకు మిర్చిని ఎగుమతి చేసే వ్యాపారులు స్పైసెస్ బోర్డులో మిర్చి నాణ్యత చేయించి ధ్రువపత్రం తీసుకుని ఆ తర్వాత ఎగుమతి చేస్తున్నారు. సరిగ్గా ఈ తరహా ప్రయోగశాలనే ఇప్పుడు యార్డులో ఏర్పాటు చేస్తున్నారు. రూ.50 లక్షలు వెచ్చించి హై ప్రొఫైల్ లిక్విడ్ క్రోమెటోగ్రఫీ (హెచ్.పి.ఎల్.సి) పరికరాన్ని ప్రయోగశాలలో అమర్చారు. మిర్చి ఘాటును స్కోపెల్ హీట్ యూనిట్్స (ఎస్.హెచ్.యు)ల్లో, మిర్చి రంగును ఆస్టా యూనిట్్స (ఎ.యు)ల్లో లెక్కిస్తారు.
మొదట్లో అన్ని పరికరాలు రాకపోవడం వల్ల మిర్చి రంగు ఎంత మేరకు ఉందో తెలుసుకునే పరీక్షలను మాత్రమే చేశారు. కొన్ని పరికరాలతో పాటు స్టాండర్డ్ కెమికల్ లేకపోవడంతో మిర్చి ఘాటు పరీక్షలు అప్పట్లో చేయలేదు. ఇప్పుడు అన్నీ వచ్చినా అటు రైతులు, ఇటు వ్యాపారులు వినియోగించుకోవడం లేదు. వ్యాపారులకు మిర్చిని ఎగుమతి చేసేందుకు నాణ్యత ప్రమాణాలకు సంబంధించిన ధ్రువపత్రం అవసరం. ఆ తరహా ధ్రువీకరణపత్రం స్పైసెస్ బోర్డులోనే ఇస్తున్నారు. మిర్చియార్డులో ఇచ్చే పత్రం వల్ల వారికి అంతగా ఉపయోగం ఉండదు. దీంతో ఎగుమతి వ్యాపారులు ఇక్కడ పరీక్షలు చేయించడం లేదు. నాణ్యత నిర్ధారణ పరీక్షలకు నగదు తీసుకుంటున్నారని రైతులు రావడం లేదని సిబ్బంది చెబుతున్నారు. ఘాటు నిర్ధారించే పరీక్షలకు రూ.1400, రంగు తెలుసుకునే పరీక్షలకు రూ.400 వంతున వసూలు చేస్తున్నారు. డబ్బు వెచ్చించి ఎక్కడ పరీక్షలు చేయిస్తామని రైతులు రావడం లేదని యార్డు అధికారులు పేర్కొంటున్నారు. నాణ్యత పరీక్షలు చేస్తారని రైతులకు తెలియకపోవడం, అవగాహన లేకపోవడంతో రావడంలేదని ఇంకొందరు చెబుతున్నారు.
అవగాహన కల్పించేందుకు చర్యలు
- వెంకటేశ్వరరెడ్డి, కార్యదర్శి
మిర్చి ఘాటు, రంగు పరీక్షల నిమిత్తం ఇక్కడ ప్రయోగశాల ఏర్పాటు చేశాం. దీనివల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. పరీక్షలు చేయించడం వల్ల డిమాండ్ చేసి మంచి ధరకు రైతులు అమ్ముకొనే అవకాశం ఉంటుంది. ఆ దిశగా రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. దీనిని రైతులు ఉపయోగించుకునేలా చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోడ్ ఉన్నా.. అంబటికి లేనట్లే!
[ 28-03-2024]
ఎన్నికల నిబంధనలు అధికార పార్టీకి వర్తించవా.. ప్రతిపక్ష పార్టీలకే వర్తిస్తాయా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సాక్షాత్తు వైకాపా అభ్యర్థి నిబంధనలు ఉల్లంఘించి సమావేశాలు ఏర్పాటు చేశారు. -
ప్రవర్తన నియమావళి అమలుకు ప్రాధాన్యం : కలెక్టర్
[ 28-03-2024]
జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుకు ప్రాధాన్యం ఇచ్చి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ శివశంకర్ తెలిపారు. -
‘వైకాపాకు ఓటేస్తే అభివృద్ధిని అడ్డుకున్నట్లే’
[ 28-03-2024]
వైకాపా అరాచక పాలనతో ప్రజలు విసిగి పోయారని తాడికొండ నియోజకవర్గం తెదేపా మహిళా అధ్యక్షురాలు మైని గిరిజ పేర్కొన్నారు. -
‘వైకాపా నుంచి విముక్తికి ఎదురుచూస్తున్న ప్రజలు’
[ 28-03-2024]
వైకాపా ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని గుంటూరు పార్లమెంట్ తెదేపా ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. -
మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం విఫలం
[ 28-03-2024]
పట్టణ ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ పేర్కొన్నారు -
పట్టుతప్పితే.. ప్రాణాలు గల్లంతే
[ 28-03-2024]
దారుణంగా దెబ్బతిన్న రహదారి. పాదచారులే ప్రాణాలు అరచేత పట్టుకుని రాకపోకలు సాగించాల్సిన చోట ఇక వాహనదారుల సంగతి చెప్పాల్సిన పనే లేదు. ఎదురుగా ద్విచక్ర వాహనం వచ్చినా దిక్కుతోచని స్థితి వాహనదారులది -
నిధులు దోచేయ్
[ 28-03-2024]
అద్దంకి నియోజకవర్గంలోని ఓ మండలంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ చేతివాటం ప్రదర్శించి, అధికార వైకాపా నాయకుల అండదండలతో పనులు చేయకుండా భారీగా బిల్లులు మింగేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. -
ఆగని వాలంటీర్ల ప్రచారం
[ 28-03-2024]
పోటీలో ఉన్న అభ్యర్థుల తరఫున ప్రచారం చేయకూడదని ఎన్నికల సంఘం ఎంతచెప్పినా పలు గ్రామాల్లో వాలంటీర్లు ప్రచారం చేస్తూనే ఉన్నారు. -
మరో 52 మంది వాలంటీర్ల తొలగింపు
[ 28-03-2024]
ఈనెల 16న ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి అంబటి మురళీకృష్ణ చేబ్రోలు, పెదకాకానిలో వాలంటీర్లతో సమావేశం నిర్వహించారు -
ఆర్టీసీ నగరబాట హామీ.. నగుబాటేనోయి!
[ 28-03-2024]
గుంటూరు నగరంలో 11 లక్షల మంది నివసిస్తున్నారు. రోజు వారీగా లక్ష మందికి పైగా రాకపోకలు సాగిస్తుంటారు. 159 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో నగరం విస్తరించింది -
నేతలకు లబ్డబ్బు
[ 28-03-2024]
ఉమ్మడి గుంటూరు జిల్లాలో జనవరి నెల నుంచి ఎన్నికల సందడి మొదలైంది. టికెట్ల ఖరారు కాక ముందే ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారాలు మొదలుపెట్టారు. -
లక్ష్మీకటాక్షం ఉంటేనే దస్త్రం కదిలేది
[ 28-03-2024]
జిల్లాలో కీలకమైన రెవెన్యూ డివిజన్ ఇది. రూ.కోట్ల విలువైన భూముల దస్త్రాలు పరిష్కారానికి వస్తుంటాయి. వాటిని పరిశీలించి దరఖాస్తుదారులకు అనుకూలంగా రాయాలన్నా.. అన్నీ సక్రమంగా ఉన్నా ఉన్నతాధికారికి పంపాలన్నా పైకం ముట్టజెప్పితే కానీ ముందుకు కదలని పరిస్థితి
తాజా వార్తలు (Latest News)
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం