మీరో మాట చెబితే చాలు..!
ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల్లో సిఫార్సు లేఖలు.. నేతల మాటలే ప్రాతిపదికగా మారాయని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం ఖాళీగా ఉన్న ప్రాంతాలను ఎంపిక చేసుకుని
సిఫార్సు లేఖయినా ఇవ్వండి
ఉద్యోగుల బదిలీల్లో ఇదీ సంగతి
కలెక్టరేట్(గుంటూరు), న్యూస్టుడే: ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల్లో సిఫార్సు లేఖలు.. నేతల మాటలే ప్రాతిపదికగా మారాయని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం ఖాళీగా ఉన్న ప్రాంతాలను ఎంపిక చేసుకుని ఉద్యోగులు బదిలీపై వెళాల్సి ఉంది. ఒకేచోట ఐదేళ్లు సర్వీసు పూర్తయినవారు తప్పనిసరిగా బదిలీపై ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంది. అయితే ప్రజాప్రతినిధులు సిఫార్సులతో వారికి నచ్చిన చోటుకు వెళ్లేందుకు ఉద్యోగులు వారికి ఉన్న అన్ని అస్త్రాలను ఉపయోగిస్తున్నారు. ప్రజాప్రతినిధుల అండదండలతో ఇప్పటికే అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులను మరోచోటకి పంపి అక్కడికి వెళ్లేందుకు పావులు కదుపుతున్నారు. జిల్లా పంచాయతీ కార్యాలయంలో ఎక్కువమంది డిప్యుటేషన్పై పని చేస్తున్నారు. వీరందరి డిప్యుటేషన్లు రద్దు చేయడంతో ఇద్దరు ఉద్యోగులే మిగిలారు. వీరు ఐదేళ్ల కంటే ఎక్కువకాలం ఇక్కడ పనిచేయడంతో వారికి బదిలీ తప్పనిసరి అయింది. దీంతో ఈ కార్యాలయంలో ఉద్యోగులందరూ ఇతర ప్రాంతాల నుంచి రావాల్సి ఉంది. ఇక్కడికి ఎవరు వస్తారన్న విషయం చర్చనీయాంశమైంది. ఉమ్మడి జిల్లా కేంద్రంగా పంచాయతీ కార్యదర్శుల బదిలీలు చేపడుతున్నారు. గుంటూరు, బాపట్ల జిల్లాలకు వెళ్లేందుకు కొందరు పంచాయతీ కార్యదర్ళులు ఆసక్తి కనబరుస్తున్నారు. నిబంధనల ప్రకారం మేజర్ పంచాయతీలకు గ్రేడ్-1 కార్యదర్శులను నియమించాలి. ఇందుకు భిన్నంగా మైనర్ పంచాయతీలకు బదిలీ చేయాలని కొందరు గ్రేడ్-1 కార్యదర్శులు కోరుతున్నట్లు తెలిసింది. అందుకు ప్రజాప్రతినిధుల సిఫార్సులు ఉండటంతో అధికారులు అంగీకరించక తప్పడం లేదన్న వాదన వినిపిస్తుంది. గ్రేడ్-4 కార్యదర్శులు మేజర్ పంచాయతీలను కోరుకుంటుండటం గమనార్హం. బదిలీల్లో నేతల ప్రమేయం ఎక్కువగా ఉండటంతో అధికార యంత్రాంగం ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటోంది.
రెవెన్యూ శాఖలో.. రెవెన్యూ శాఖలో బదిలీలపై ఇప్పటికే జాబితా సిద్ధమైనట్లుగా ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గ్రామ స్థాయిలో పనిచేసే వీఆర్వో నుంచి మండల స్థాయి తహసీల్దార్ల వరకు ఎవరి స్థాయిలో వారు ప్రయత్నాలు చేసి వారు అనుకున్న ప్రాంతాలకు వెళ్లడానికి సిద్ధమయ్యారు. ఈక్రమంలో ఒకరిపై ఒకరు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టుకోవడం చర్చనీయాంశమైంది. ఐదేళ్లు పూర్తికాకపోయినా వారి స్థానాలను కూడా ఇతరులు కోరుకుని సిఫార్సు లేఖలు తెచ్చుకోవడం ఇబ్బందికర పరిణామాలకు దారితీసింది. ఒక మండలంలో పనిచేస్తున్న తహసీల్దారుకు తెలియకుండానే మరొకరు నేతల సిఫార్సులతో రావడానికి ప్రయత్నించడంతో అప్పటి వరకు పని చేస్తున్న తహసీల్దారు ఒకరు అవాక్కయ్యారు. ఏ కారణంతో నన్ను నేతలు వద్దనుకుంటున్నారో చెబితే మరో మండలానికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని, చివరి క్షణంలో ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని తోటి ఉద్యోగుల వద్ద వాపోయినట్లు సమాచారం. గురువారం సాయంత్రానికి బదిలీల జాబితాలు బయటికి వచ్చేవరకు తమ స్థానం పదిలంగా ఉంటుందో లేదోనన్న సందిగ్ధం ఆయా ఉద్యోగుల్లో ఉత్కంఠకు కారణమవుతోంది.
చివరి వరకు లేఖలు.. గురువారం జాబితాలు విడుదలకు చివరిరోజు అయినప్పటికీ బుధవారం రాత్రి వరకు ఉద్యోగులు నేతల సిఫార్సు లేఖలు తీసుకుని ఉన్నతాధికారులను కలుస్తూనే ఉన్నారు. బదిలీలకు గడువు సమీపించడంతో ఉద్యోగులు పలువురు కలెక్టరేట్కు చేరుకుని తమకు ఎక్కడ పోస్టింగ్ వస్తుందన్న విషయమై చర్చించుకోవడం కనిపించింది. నేతల లేఖలు తీసుకువస్తే తమను ఎక్కడ మార్పు చేస్తారోనన్న ఆందోళనలో ఐదేళ్లు పూర్తికాని వారు ఉన్నారు. బుధవారం రోజంతా ఉద్యోగులు ఎక్కడ కలిసినా బదిలీలపైనే చర్చ నడిచింది. కార్యాలయాల్లో కూడా ఎవరు ఎక్కడికి వెళ్తున్నారన్న సమాచారంపై ఆరా తీయడం కనిపించింది. మొత్తంమీద గురువారం జాబితాలు విడుదలయ్యే వరకు ఉత్కంఠ తప్పదని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోడ్ ఉన్నా.. అంబటికి లేనట్లే!
[ 28-03-2024]
ఎన్నికల నిబంధనలు అధికార పార్టీకి వర్తించవా.. ప్రతిపక్ష పార్టీలకే వర్తిస్తాయా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సాక్షాత్తు వైకాపా అభ్యర్థి నిబంధనలు ఉల్లంఘించి సమావేశాలు ఏర్పాటు చేశారు. -
ప్రవర్తన నియమావళి అమలుకు ప్రాధాన్యం : కలెక్టర్
[ 28-03-2024]
జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుకు ప్రాధాన్యం ఇచ్చి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ శివశంకర్ తెలిపారు. -
‘వైకాపాకు ఓటేస్తే అభివృద్ధిని అడ్డుకున్నట్లే’
[ 28-03-2024]
వైకాపా అరాచక పాలనతో ప్రజలు విసిగి పోయారని తాడికొండ నియోజకవర్గం తెదేపా మహిళా అధ్యక్షురాలు మైని గిరిజ పేర్కొన్నారు. -
‘వైకాపా నుంచి విముక్తికి ఎదురుచూస్తున్న ప్రజలు’
[ 28-03-2024]
వైకాపా ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని గుంటూరు పార్లమెంట్ తెదేపా ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. -
మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం విఫలం
[ 28-03-2024]
పట్టణ ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ పేర్కొన్నారు -
పట్టుతప్పితే.. ప్రాణాలు గల్లంతే
[ 28-03-2024]
దారుణంగా దెబ్బతిన్న రహదారి. పాదచారులే ప్రాణాలు అరచేత పట్టుకుని రాకపోకలు సాగించాల్సిన చోట ఇక వాహనదారుల సంగతి చెప్పాల్సిన పనే లేదు. ఎదురుగా ద్విచక్ర వాహనం వచ్చినా దిక్కుతోచని స్థితి వాహనదారులది -
నిధులు దోచేయ్
[ 28-03-2024]
అద్దంకి నియోజకవర్గంలోని ఓ మండలంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ చేతివాటం ప్రదర్శించి, అధికార వైకాపా నాయకుల అండదండలతో పనులు చేయకుండా భారీగా బిల్లులు మింగేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. -
ఆగని వాలంటీర్ల ప్రచారం
[ 28-03-2024]
పోటీలో ఉన్న అభ్యర్థుల తరఫున ప్రచారం చేయకూడదని ఎన్నికల సంఘం ఎంతచెప్పినా పలు గ్రామాల్లో వాలంటీర్లు ప్రచారం చేస్తూనే ఉన్నారు. -
మరో 52 మంది వాలంటీర్ల తొలగింపు
[ 28-03-2024]
ఈనెల 16న ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి అంబటి మురళీకృష్ణ చేబ్రోలు, పెదకాకానిలో వాలంటీర్లతో సమావేశం నిర్వహించారు -
ఆర్టీసీ నగరబాట హామీ.. నగుబాటేనోయి!
[ 28-03-2024]
గుంటూరు నగరంలో 11 లక్షల మంది నివసిస్తున్నారు. రోజు వారీగా లక్ష మందికి పైగా రాకపోకలు సాగిస్తుంటారు. 159 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో నగరం విస్తరించింది -
నేతలకు లబ్డబ్బు
[ 28-03-2024]
ఉమ్మడి గుంటూరు జిల్లాలో జనవరి నెల నుంచి ఎన్నికల సందడి మొదలైంది. టికెట్ల ఖరారు కాక ముందే ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారాలు మొదలుపెట్టారు. -
లక్ష్మీకటాక్షం ఉంటేనే దస్త్రం కదిలేది
[ 28-03-2024]
జిల్లాలో కీలకమైన రెవెన్యూ డివిజన్ ఇది. రూ.కోట్ల విలువైన భూముల దస్త్రాలు పరిష్కారానికి వస్తుంటాయి. వాటిని పరిశీలించి దరఖాస్తుదారులకు అనుకూలంగా రాయాలన్నా.. అన్నీ సక్రమంగా ఉన్నా ఉన్నతాధికారికి పంపాలన్నా పైకం ముట్టజెప్పితే కానీ ముందుకు కదలని పరిస్థితి
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ