బండికే కాదు.. వెన్నెముకకూ దెబ్బే
పర్చూరు నుంచి బాపట్ల వెళ్లే మార్గం చూస్తే కిలోమీటరు పరిధిలో ఎనిమిది పెద్ద గుంతలు.. 35 చిన్న చిన్న గోతులతో ఉంది. ఈ రహదారిలో ప్రయాణం ఎలా ఉంటుంది.. అదో నరకం.. ఇక నిత్యం అదే మార్గంలో తిరిగేవారి పరిస్థితి దారుణంగా
పర్చూరు, చీరాల పట్టణం, న్యూస్టుడే
పర్చూరు-బాపట్ల రహదారిలో కొమర్నేనివారిపాలెం వద్ద దారుణంగా దెబ్బతిన్న రోడ్డు.. గుంతలలో వాహనదారుల కష్టాలు
పర్చూరు నుంచి బాపట్ల వెళ్లే మార్గం చూస్తే కిలోమీటరు పరిధిలో ఎనిమిది పెద్ద గుంతలు.. 35 చిన్న చిన్న గోతులతో ఉంది. ఈ రహదారిలో ప్రయాణం ఎలా ఉంటుంది.. అదో నరకం.. ఇక నిత్యం అదే మార్గంలో తిరిగేవారి పరిస్థితి దారుణంగా ఉంటుంది. అదే సరే.. ద్విచక్ర వాహనంపై వెళ్లేవారిలో చాలామంది ఎదురుగా గుంత వచ్చిన బండిని పోనిస్తారు. ఇలా బండి గుంతలో పడి మళ్లీ పైకి ఎక్కే క్రమంలో బైక్కే కాదు.. వెన్నెముకకూ సమస్యలు ఏర్పడతాయని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. కాలక్రమంలో ఇవి పెద్దవిగా మారే అవకాశం ఉందంటున్నారు.
జిల్లా కేంద్రానికి వెళ్లే ప్రధాన రహదారి అడుగడుగునా గుంతలు, కుంగిన రోడ్డులో ప్రయాణం ప్రమాదాల అంచున సాగుతుంది. పర్చూరు నుంచి చెరుకూరు సమీపంలో నల్లమడలాకుల వరకు (ఉమ్మడి జిల్లా ప్రకాశం సరిహద్దు) సింగిల్ రోడ్డు ఉంది. రహదారిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయకుండా ఎప్పటికప్పుడు బిట్లు..బిట్లుగా చేస్తున్నారు. దీనివల్ల ఒక చోట బాగు చేసే సరికి మిగిలిన ప్రాంతం గోతులమయంగా మారుతుంది. రహదారి అంచున కాలువలు ఉండడం తక్కువ కాలంలో నిర్మాణం దెబ్బతినడానికి ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు. రోడ్డు విస్తరణ చేపట్టాలనే ప్రతిపాదనలు ఆమోదానికి లభించకపోవడం గమనార్హం. జిల్లా కేంద్రంగా బాపట్లను ఏర్పాటు చేసిన తర్వాత రోడ్డు ప్రాధాన్యం మరింత పెరిగింది. అద్దంకి నుంచి బాపట్లకు కొత్తగా బస్ సర్వీసులు ఏర్పాటు చేశారు. పర్చూరు-బాపట్ల మధ్య బస్ సర్వీసులున్నాయి. నిత్యం ఆటోలలో ప్రయాణికుల రాకపోకలు పర్చూరు-చెరుకూరు మధ్య సాగుతుంటాయి. వ్యవసాయ ఉత్పత్తుల రవాణా ఇదే మార్గంలో జరుగుతుంది. 17.5 కి.మి. రోడ్డును పర్చూరు నుంచి నల్లమడలాకుల వరకు 7 మీటర్ల రోడ్డుగా విస్తరించి, 3 మీటర్ల అంచులు వేసేందుకు రూ.20 కోట్లు మంజూరు చేయాలని ఆర్ అండ్ బీ అధికారులు ప్రతిపాదనలు పంపారు. వీటికి ఆమోదం లభిస్తేనే ప్రయాణికుల కష్టాలు తీరి జిల్లా కేంద్రానికి రాకపోకలకు సౌకర్యంగా ఉంటుంది. పాత గుంటూరు జిల్లా పరిధిలో నల్లమడ లాకుల నుంచి బాపట్ల వరకు విస్తరించి అభివృద్ధి చేశారు. పాత ప్రకాశం జిల్లా పరిధిలో మాత్రం సింగిల్ రోడ్డును అరకొరగా అభివృద్ధి చేయడం మినహా పూర్తి స్థాయిలో జరగలేదు.
రహదారిలో గ్రామాలు: ఉప్పుటూరు, వీరన్నపాలెం, పోతుకట్ల, కొమర్నేనివారిపాలెం, రమణాయపాలెం, చెరుకూరు, కొత్తపాలెం. అద్దంకి నియోజకవర్గం, పర్చూరు నియోజకవర్గంలోని మార్టూరు, ఇంకొల్లు, యద్దనపూడి తదితర గ్రామాల నుంచి జిల్లా కేంద్రానికి రాకపోకలు.
దీర్ఘకాలిక సమస్యలు
- డాక్టర్ విజయ్కుమార్, ఎముకల వైద్య నిపుణుడు, చీరాల ప్రాంతీయ ఆసుపత్రి
తరచూ గుంతలు పడిన రహదారుల్లో ద్విచక్ర వాహనాలపై ప్రయాణించటం వల్ల వాహనాలు అదుపుతప్పి వాహనచోదకులకు, వెనుక కూర్చున్న వారికి గాయాలవుతుంటాయి. వాహనం వేగంగా వెళ్తున్న సమయంలో గుంత కనపడకపోవటంతో తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఇటువంటి మార్గాల్లో ప్రయాణిస్తూ ఉంటే వెన్నెముక సమస్యతో పాటు డిస్క్లు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇవి దీర్ఘకాలిక సమస్యలుగా మారతాయి. వైద్యం చేయించుకున్నా పూర్తిగా నయం కాని పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉంటుంది. కొన్ని సందర్భాలలో శస్త్ర చికిత్స చేయించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది.
వాహనాలకు తరచూ మరమ్మతులు
- మీరావలి, సీనియర్ మెకానిక్, చీరాల
గుంతలు పడిన రోడ్లపై ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తుంటే తరచూ మరమ్మతులు చేయించుకోవాల్సిందే. ప్రధానంగా వాహనానికి ఫోర్క్ కప్పులు, షాక్ అబ్జార్బర్ మరమ్మతులకు గురవుతాయి. వీటిని బాగు చేయించుకోవాలంటే బండిని బట్టి సుమారు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు ఖర్చవుతాయి. వాహనచోదకులకు చేతి, భుజాల నొప్పులు వస్తాయి. మహిళలు నడిపే స్కూటీలకు వీటితోపాటు ఇంజిన్లో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఒకవేళ వాహనానికి గాలి తక్కువగా ఉంటే టైర్లు పగిలిపోయి వాహనం అదుపుతప్పుతుంది. వీటిని వెంటనే మరమ్మతులు చేయించుకోకపోతే ఒకదానికి మరొకటి వాహనానికి సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ డీజీపీని బదిలీచేయండి: ఎన్నికల సంఘానికి భాజపా ఫిర్యాదు
[ 25-04-2024]
డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డిని బదిలీ చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయంలో భాజపా నేతలు మరోమారు ఫిర్యాదు చేశారు. -
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం: సినీ నటుడు నిఖిల్
[ 25-04-2024]
బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్థి ఎం.ఎం కొండయ్య గురువారం అట్టహాసంగా నామినేషన్ వేశారు. -
ఏపీలో ముగిసిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ
[ 25-04-2024]
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. -
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు: నారా లోకేశ్
[ 25-04-2024]
ఓట్లు అడగడానికి వచ్చే వైకాపా నేతలను రాజధాని రైతులు నిలదీయాలని యువనేత, మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. -
చదువులమ్మ చెట్టుకు.. రాజకీయ చెద!
[ 25-04-2024]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేరెన్నికగన్న పురాతన విద్యాసంస్థల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఒకటి. దేశ, విదేశాల్లో ఎంతో ఖ్యాతినార్జించిన ఘనత దీని సొంతం. దాదాపు పది, పదిహేను దేశాల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకునేవారు. -
యూజీడీ మూలన.. మాటలు మరుగున
[ 25-04-2024]
నా ముస్లింలు.. నా మైనార్టీలు అంటూ మాటలతో మభ్యపెట్టడమే గానీ సీఎం జగన్కు వారిపై ఏమాత్రం ప్రేమలేదని చెప్పడానికి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తికాని ఉదంతమే నిదర్శనం. -
నాడు వాతలుండవని కోతలు.. నేడు ఛార్జీల మోతలు
[ 25-04-2024]
ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్రెడ్డి రాష్ట్రమంతా తిరిగి చంద్రబాబు పాలనలో కరెంటు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయని విమర్శించారు. తాను అధికారంలోకి వచ్చాక విద్యుత్తు ఛార్జీలు పెంచబోమని హామీనిచ్చారు. -
అభిమాన నీరాజనం
[ 25-04-2024]
జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ నామినేషన్ సందర్భంగా బుధవారం తెనాలిలో నిర్వహించిన ప్రదర్శనకు ప్రజలు భారీగా తరలివచ్చారు. -
పసుపుమయమైన రేపల్లె
[ 25-04-2024]
రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నామినేషన్ దాఖలు కార్యక్రమం బుధవారం కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది. -
అక్రమంగా తవ్వారు.. ప్రాణాలు తీస్తున్నారు!
[ 25-04-2024]
రెండేళ్ల కిందట ప్రత్తిపాడుకు చెందిన నలుగురు కళాశాల విద్యార్థులు ఈతకు బోయపాలెంలోని డైట్ సమీపంలో క్వారీ గుంత వద్దకు వెళ్లారు. -
చందా.. దందా
[ 25-04-2024]
ఎన్నికలంటే ఖర్చులు ఎలా ఉంటాయో మీకు తెలియంది కాదు. -
మిత్ర ద్రోహం
[ 25-04-2024]
పాదయాత్రలో అధికారంలోకి రాగానే గోపాల మిత్రలకు నెలకు రూ.16 వేల గౌరవవేతనం ఇస్తామని హామీ ఇచ్చి గత అయిదేళ్లుగా ఒక్క రూపాయి కూడా పెంచకుండా తమని సీఎం జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని గోపాల మిత్రలు వాపోతున్నారు. -
‘పది’లో ‘ప్రత్యేక’ విజయం
[ 25-04-2024]
అమ్మ ప్రోత్సాహం..అమ్మమ్మ పర్యవేక్షణ..భవిత కేంద్ర టీచర్ల కృషి...ప్రధానోపాధ్యాయురాలి తోడ్పాటు వెరసి 16 ఏళ్ల దివ్యాంగురాలైన జి.శ్రావ్య జోసెఫిన్ పదో తరగతి పూర్తిచేసింది. -
తెదేపా ప్రచార వాహన డ్రైవర్పై వైకాపా దాడి
[ 25-04-2024]
తెలుగుదేశం పార్టీ ప్రచార వాహన డ్రైవర్పై కొందరు వైకాపా నాయకులు దాడి చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. -
ప్రజల గొంతూ తడపలేరా?
[ 25-04-2024]
2018 మార్చి 14వ తేదీన ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి పొన్నూరులో నిర్వహించిన బహిరంగ సభలో పొన్నూరు పట్టణ ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని అప్పటి తెదేపా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. -
రాజీనామా చేయకుంటే అంతుచూస్తాం
[ 25-04-2024]
వాలంటీర్లుగా మీకు ప్రతి ఇంట్లో ఎంత మంది ఓటర్లున్నారు..ఎటు అనుకూలంగా ఉన్నారో తెలుసు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 25-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు రైల్వే అధికారి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?