చక్కని తిండి... తక్కువ తినండి..!
ప్రతి మనిషి నిత్యం 20 గ్రాముల నూనె వాడాలి. కానీ దీనికి రెట్టింపుస్థాయిలో నూనెల వాడకం జరుగుతుంది. ఇదే అసలు సమస్యగా ఉంది...
న్యూస్టుడే- అమరావతి ఫీచర్స్
‘తక్కువ తినండి... ఎక్కువ పని చేయండి... ఎక్కువ పనిచేసి ఎక్కువకాలం బతకండి’
- చాలా ఏళ్ల క్రితం వచ్చిన సినిమాలో డైలాగ్ ఇది.
అందులోని సందర్భం... భావన వేరే అయినా ఇప్పటి పరిస్థితులకు సానుకూలంగా అన్వయించుకుంటే ఈ డైలాగ్ అతికినట్లు సరిపోతుంది. రుచిగా ఉందని నాణ్యతలేని తిండి అతిగా తింటే వచ్చే అనర్థాలు, మితంగా తిని పెద్ద వయసులోనూ ఉమ్మడి జిల్లాలో ఆరోగ్యంగా ఉండేవారి అనుభవాలను తెలుసుకుందాం.
20 గ్రాములే..
ప్రతి మనిషి నిత్యం 20 గ్రాముల నూనె వాడాలి. కానీ దీనికి రెట్టింపుస్థాయిలో నూనెల వాడకం జరుగుతుంది. ఇదే అసలు సమస్యగా ఉంది.
సీజనల్గా లభించే పండ్లను చిన్నారులకు అలవాటు చేయాలి. పండ్లలో పీచు పదార్థం ఉంటుంది. దీంతో బరువు పెరిగే సమస్య ఉండదు. పైగా అనారోగ్య సమస్యల్ని పండ్లు దరిచేరనివ్వవు.
25 దాటొద్దు..
* వ్యక్తి బరువు కేజీల్లో.. ఎత్తును మీటర్లలో తీసుకోవాలి. బరువు, ఎత్తుతో భాగిస్తే వచ్చే అంకెలు మన శరీరస్థితిని తెలియజేస్తాయి. 18.5 కంటే తక్కువగా ఉంటే పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లు. 25 కంటే ఎక్కువ ఉంటే ఊబకాయం ఉచ్చులో పడినట్లే. 30 కంటే ఎక్కువ ఉంటే అత్యంత ప్రమాదంలో ఉన్నట్లు.
* ఉదహరణకు ఒక వ్యక్తి ఎత్తు 165 సెంటిమీటర్లు.. బరువు 65 కేజీలు అనుకుంటే బీఎంఐ పద్ధతిలో భాగింపు ద్వారా 23.9 వస్తుంది. ఇది సాధారణస్థాయిలో లావు ఉన్నట్లు. అదే 165 సెంటిమీటర్లు పొడవు.. 68 కేజీల బరువు ఉంటే 25.0 వస్తుంది. ఇది ఊబకాయంలో ఉన్నట్లు సూచిస్తుంది.
30%
ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో సుమారు 20 లక్షల మంది వరకు ఊబకాయంతో బాధపడుతున్నారనేది నిపుణుల భావన. వీరిలో 25 నుంచి 30 శాతం చిన్నారులే ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
గోరు వెచ్చటి నీరు తాగుతా,..
- పి.ప్రసాదరాజు(68), విశ్రాంత ఉద్యోగి, ముత్యాలంపాడు, విజయవాడ
రోజూ ఐదు గంటలకు నిద్రలేస్తా, గోరు వెచ్చటి నీరు అరలీటరు తాగుతా, అనంతరం వాకింగ్కు వెళతా. ఇంటికి వచ్చి స్నానాదులు ముగించుకుని 3 రాగి ఇడ్లీ తింటాను. తిరిగి మధ్యాహ్నం వరకు ఏ రకమైన ఆహారం తీసుకోను. వ్యాపార పనులు చూసుకుంటా 12గంటలకు ఎక్కువ ఆకుకూరలతో తక్కువ అన్నం తింటాను. కొద్ది సేపు నడుస్తా. సాయంత్రం 5గంటలకు మొలకెత్తిన పెసలు, క్యారెట్, ఉల్లి, ఎర్రదుంప, నానబెటివ్టన శనగలు వంటివి తింటాను. రాత్రి 8గంటలకు రెండు గోధుమ రొట్టెలు నూనె లేకుండా తింటా..మితాహారంతో భేషుగ్గా ఉన్నాను.
సమయ పాలన పాటించాలి
- డాక్టర్ సిహెచ్ మనోజ్ కుమార్, మణిపాల్ ఆసుపత్రి
సమయ పాలన తప్పక పాటించాలి.ఉదయం అల్పాహారం 40శాతం, మధ్యాహ్నం భోజనం 40శాతం, రాత్రి 20శాతం ఉండే విధంగా చూసుకోవాలి. ఆకుకూరలు, కాయగూరలు 50శాతం ఉండాలి. 30శాతం మేర ప్రోటీన్లు ఉండాలి. 20శాతం మేర నూనె పదార్ధాలు, ఇతరాలు ఉండాలి. అన్నం, ఉప్పు తగ్గించాలి. రాత్రి నిద్ర కనీసం 8గంటలుండాలి. నిద్రకు ఉపక్రమించేందుకు 2 గంటల ముందు ఆహారం తీసుకోవాలి.
బరువు అదుపు.. అదే ఆరోగ్యానికి మదుపు
‘గతంలో నా శరీర బరువు 75 కిలోలు ఉండేది. యోగసనాలు, ధ్యానం, ప్రాణాయామానికి రోజులో గంటసేపు కేటాయించడం, మితాహారంతో తొమ్మిది కిలోల బరువు తగ్గాను. ఇప్పుడు శరీరం తేలిగ్గా, ఉత్సాహంగా ఉంటోంది’ అని సత్తెనపల్లికి చెందిన ఆతుకూరు లక్ష్మి(47) చెబుతున్నారు. ఒత్తిడితో కూడిన జీవితంలో ఉన్నా ఎప్పుడూ మితాహారాన్ని, వ్యాయామాన్ని నిర్లక్ష్యం చేయలేదు. ఫలితంగా ఆరు పదుల వయసు దాటినా దీర్ఘకాలిక వ్యాధులేవీ దరిచేరకుండా నిత్య యువకుడిలా ఉన్నానని విశ్రాంత ఉద్యోగి వరప్రసాదరావు(65) చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం జగన్పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు
[ 19-04-2024]
ఏప్రిల్ 16న భీమవరంలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. -
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
[ 19-04-2024]
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. -
గుంటూరు జిల్లాలో ప్రబలిన డయేరియా.. 100 మందికి పైగా అస్వస్థత
[ 19-04-2024]
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం మంచాలలో డయేరియా ప్రబలింది. వాంతులు, విరేచనాలతో గ్రామంలో 100 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. -
దశ‘దిశ’లా.. ఆక్రందనలే..!
[ 19-04-2024]
వైకాపా ప్రభుత్వ పదవీకాలం ముగుస్తున్నా ఇప్పటికీ ఆ చట్టానికి కోరలు లేవు. దాన్ని పార్లమెంట్ ఆమోదించలేదు. ఉనికిలో లేని చట్టం గురించి పదేపదే ప్రచారం చేసుకోవడం జగన్ సర్కార్ తీరుగా మారింది. -
జీవితాన్ని కలరా‘జే’సింది..
[ 19-04-2024]
రేపల్లెకు చెందిన మధు ప్రభుత్వ మద్యం తాగి పక్షవాతానికి గురై మంచానికి పరిమితమయ్యాడు. చేతివృత్తి చేసుకుంటూ భార్య ఇద్దరు పిల్లలను పోషించుకునే అతను మద్యం తాగేవాడు. -
సమస్యలు విలీనమై.. బడికి దూరమై..
[ 19-04-2024]
పాఠశాలల విలీనం వల్ల లాభం లేకపోగా టీచర్లకు, పిల్లలకు బాగా అన్యాయం జరిగింది. కొందరు టీచర్లు దూరాన ఉన్న ఉన్నత పాఠశాలలకు వెళ్లలేక పదోన్నతులు వదులుకోవడంతో నష్టపోయారు. అదేవిధంగా పిల్లల పరంగా చూస్తే సర్కారీ బడులకు దూరమయ్యారు. -
ఆరోగ్యం చిదిమేసి.. బతుకుల్ని బుగ్గి‘జే’సి..
[ 19-04-2024]
మద్యపాన నిషేధం చేస్తామని జగన్మోహన్రెడ్డి ఓట్లు దండుకుని తీరా అధికారంలోకి వచ్చాక ఆ మాటే మరిచారు. స్వయంగా ప్రభుత్వమే మద్యం వ్యాపారానికి తెరతీసింది. నాసిరకం మద్యం పోసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడింది. -
అండ నేనన్నావు.. గుదిబండలా మార్చావు..
[ 19-04-2024]
జిల్లాలో వైకాపా ప్రభుత్వ అయిదేళ్ల పాలనలో ఒక్క కొత్త పరిశ్రమ రాకపోగా ఉన్నవి చాలా వరకు మూతపడ్డాయి. పత్తి ఆధారిత పరిశ్రమలైన జిన్నింగ్ పూర్తిగా ఎత్తేయగా.. స్పిన్నింగ్ మిల్లులు అదే దిశగా నడుస్తున్నాయి. -
యువనేతపై ఉప్పొంగిన అభిమానం
[ 19-04-2024]
లోకేశ్ తరఫున నామినేషన్ పత్రాల సమర్పణ సందర్భంగా గురువారం మంగళగిరిలో జనసేన, భాజపా, తెదేపా, ఎమ్మార్పీఎస్ శ్రేణులు భారీ ప్రదర్శన నిర్వహించారు. -
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వినియోగానికి ఆటంకాలు
[ 19-04-2024]
వైకాపా ప్రభుత్వంపై ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. ఇదే అదనుగా పోలింగ్ విధుల్లో పాల్గొనే ఉద్యోగులు అందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోకుండా వ్యూహాత్మకంగా ఉన్నతాధికారులు ఆటంకాలు కలిగిస్తున్నారని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఆరోపిస్తున్నాయి. -
కోన ఆస్తుల విలువ రూ.24.20 కోట్లు
[ 19-04-2024]
బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే కోన రఘుపతి తన కుటుంబ ఆస్తుల విలువను రూ.24.20 కోట్లుగా గురువారం దాఖలు చేసిన ఎన్నికల నామినేషన్ అఫిడవిట్లో పేర్కొన్నారు. -
నలిగిపోతున్న నాలుగో సింహం
[ 19-04-2024]
ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ కల్పించడంలో పోలీసులు పగలు, రాత్రి కష్టపడుతుంటారు. శాంతిభద్రతలను పరిరక్షించే క్రమంలో సంఘ విద్రోహశక్తుల చేతిలో ప్రాణత్యాగాలకు సైతం వెనకాడరు. -
కర్షకుల కష్టాలు కనిపించవా..?
[ 19-04-2024]
పెదవడ్లపూడి ఉన్నత వాహినిపై ఎత్తిపోతల పథకం పూర్తి చేసి రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే ఆర్కే హామీ ఇచ్చారు. కానీ అమలు చేయడం మర్చిపోయారు. -
వైకాపా ప్రభుత్వ నిర్ణయ లోపం.. విద్యార్థులకు శాపం
[ 19-04-2024]
‘మీ పిల్లలు బడిలో భోజనం చేయకపోతే మీకు వస్తున్న ప్రభుత్వ పథకాలు నిలిచేపోయే అవకాశం ఉంది’అని తల్లిదండ్రుల సమావేశాల్లో ఉపాధ్యాయులు చెబుతున్నా.. నాణ్యత లేకపోవడంతో చాలా మంది విద్యార్థులు -
‘అవినీతి పాలనకు చరమగీతం పాడుదాం’
[ 19-04-2024]
అసమర్థ, అవినీతి పాలనకు చరమగీతం పాడుదామని గుంటూరు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. కొల్లిపరలో గురువారం సాయంత్రం నిర్వహించిన రోడ్షోలో ఆయన మాట్లాడుతూ వైకాపా పాలకులకు పోలవరం పట్టలేదు, -
ఎప్పటికి తొలగిస్తారో!
[ 19-04-2024]
పట్టణ పరిధి జీబీసీ రహదారిలో విద్యుత్తు స్తంభానికి సీఎం జగన్, స్థానిక ఎమ్మెల్యే రోశయ్య, వైకాపా నేతల ఫొటోలతో కూడిన బోర్డు ఉంది. -
మొదలైన నామినేషన్ల పర్వం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో గురువారం నుంచి జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల పర్వం మొదలైంది. ఈ క్రమంలో నెల రోజులుగా పలు విధాలుగా ప్రచార కార్యక్రమాలు చేపట్టిన పార్టీలు ఇప్పటికే నామినేషన్ పత్రాలు పూర్తి చేసి మంచి ముహూర్తం కోసం వేచి ఉన్నారు. -
ఫోన్పే చేయమన్నాడు.. అదృశ్యమయ్యాడు!
[ 19-04-2024]
అద్దంకి పురపాలక కార్యాలయం వద్ద మంచినీటి కుళాయి రుసుం చెల్లించేందుకు వచ్చిన వృద్ధుడ్ని ఓ ఘరానా దొంగ మోసగించాడు. ఈ సంఘటన గురువారం ఉదయం పురపాలక పన్నుల విభాగం వద్ద జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆగంతుకుడి అనుమానాస్పద కదలికలు.. ఇరాన్ కాన్సులేట్ వద్ద కలకలం!
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!