స్ఫూర్తి కెరటాలు..ఈ గురుశిష్యులు!
తమ, తమ విభాగాల్లో బరువులు ఎత్తడంలో పోటీపడుతూ కళ్లు చెదిరే ప్రదర్శనల ద్వారా రాష్ట్ర, జాతీయ పోటీల్లో పతకాల పంట పండిస్తూ నారీ శక్తిని చాటుతున్నారు గురుశిష్యులైన కొల్లిపర నాగశిరీష, నాగం జ్ఞానదివ్య. తెనాలి మండలం కఠెవరంలోని
‘పవర్ లిఫ్టింగ్’లో కళ్లు చెదిరే ప్రదర్శనలు చేస్తున్న వైనం
తెనాలి టౌన్, న్యూస్టుడే : తమ, తమ విభాగాల్లో బరువులు ఎత్తడంలో పోటీపడుతూ కళ్లు చెదిరే ప్రదర్శనల ద్వారా రాష్ట్ర, జాతీయ పోటీల్లో పతకాల పంట పండిస్తూ నారీ శక్తిని చాటుతున్నారు గురుశిష్యులైన కొల్లిపర నాగశిరీష, నాగం జ్ఞానదివ్య. తెనాలి మండలం కఠెవరంలోని మాతృశ్రీ స్పోర్ట్స్ అకాడమీలో సాధన చేస్తూ ముందంజ వేస్తున్న వీరి స్ఫూర్తిదాయక ప్రస్థానాన్ని తెలుసుకుందాం.
అంతర్జాతీయ పోటీలకు.. జ్ఞానదివ్య
సాధన చేస్తున్న జ్ఞానదివ్య
తెనాలి మండలం కఠెవరం గ్రామానికి చెందిన నాగం జ్ఞానదివ్య ఇటీవలే ఇంటర్ పూర్తి చేశారు. ఫిట్నెస్ కోసం తమ గ్రామంలోనే అందుబాటులో ఉన్న అకాడమీకి 2021లో వచ్చారు. ఈ క్రమంలో ఈమెలోని సత్తాను గమనించిన గురువు నాగశిరీష ఈమెను ‘పవర్ లిఫ్టింగ్’ వైపు మరలేలా చేశారు. నిరంతర సాధనతో తర్ఫీదు కొనసాగించిన దివ్య తొలి ఏడాదే రాష్ట్ర స్థాయిలో సత్తా చాటి రెండు బంగారు పతకాలు గెలుచుకున్నారు.
* ఈ ఏడాది ఏప్రిల్లో కేరళలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో మూడు విభిన్న విభాగాల్లో మూడు బంగారు, మేలో అనకాపల్లిలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల పోటీల్లో వెండి, జూన్ 9న మంగళగిరిలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో బంగారు పతకాలను తన ఖాతాలో వేసుకున్నారు. తద్వారా ‘ఓవరాల్ స్ట్రాంగ్ ఉమన్’ టైటిల్ను సొంతం చేసుకున్నారు.
* ఈనెల 8 నుంచి హైదరాబాద్లో జరగనున్న జాతీయస్థాయి పోటీలకు హాజరవనున్నారు.
* కేరళలో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో మూడు బంగారు పతకాలు గెలుచుకున్న నేపథ్యంలో ఆగస్టు 26 నుంచి టర్కీలోని ఇస్తాంబుల్లో జరగనున్న అంతర్జాతీయ పోటీలకు ఈమెను ఎంపిక చేస్తూ తాజాగా ‘పవర్ లిఫ్టింగ్ ఇండియా అసోసియేషన్’ ధ్రువపత్రం పంపింది.
లక్ష్యం: అంతర్జాతీయ పోటీల్లో పతకం సాధించి, తెనాలి ఖ్యాతిని నలు దిశలా చాటుతానని చెప్తున్నారు జ్ఞానదివ్య.
జాతీయ స్థాయిలో జయకేతనం ఎగురవేస్తున్న నాగశిరీష
నాగశిరీష
గుంటూరుకు చెందిన కొల్లిపర నాగశిరీష చదువుతో పాటు క్రీడలపై ఆసక్తితో ఎన్టీఆర్ స్టేడియంలో సాధన చేస్తూ 2004లో పరుగు పోటీల్లో రెండు విభాగాల్లో రాష్ట్ర స్థాయిలో బంగారు పతకాలు అందుకున్నారు. ఆపై క్రీడల కోటాలో ఉద్యోగం, ఫిట్నెస్ కోసం పవర్లిఫ్టింగ్ వైపు వచ్చారు. తొలుత గుంటూరు, మంగళగిరి, ఆపై కఠెవరంలో గురువులు శ్రీనివాసరావు, సంథాని, కోటేశ్వరరావు, సుభాన్వలి, వెంకట్రామిరెడ్డి వద్ద సాధన చేశారు.
* తొలుత రాష్ట్ర స్థాయిలో విజయాలు సాధించి, తర్వాత 2005, 2006, 2007 సంవత్సరాల్లో జాతీయస్థాయి పోటీల్లో బంగారు పతకాలు, 2007లోనే ‘స్ట్రాంగ్ ఉమన్’ టైటిల్ను సొంతం చేసుకున్నారు.
* 2008లో పోటీ పరీక్షల అనంతరం క్రీడల కోటాలో పోలీసు విభాగంలో ఎస్సైగా ఉద్యోగం వచ్చినా, వెళ్లకుండా క్రీడలపై ఆసక్తితో 2008 డీఎస్సీ ద్వారా వ్యాయామ ఉపాధ్యాయినిగా ఎంపికయ్యారు. 2009లో ఉద్యోగంలో చేరి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహించి, 2019 నుంచి తెనాలి మండలం నందివెలుగు జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులను క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్నారు. 2010లో పోలీసు కానిస్టేబుల్ మస్తాన్వలితో ఈమెకు వివాహమైంది. తెనాలిలో స్థిరపడిన ఈమెకు భర్త ప్రోత్సాహం జత కావడంతో తిరిగి తాను నేరుగా పోటీల్లో పాల్గొనడం ప్రారంభించారు.
* 2018లో పాండిచ్చేరిలో జరిగిన ‘సౌత్ ఇండియా స్పోర్ట్స్ మీట్’లో పవర్లిఫ్టింగ్లో సీˆనియర్ విభాగంలో బంగారు పతకం గెలుచుకున్నారు.
* అనంతరం వరసగా రాయ్పూర్, బీహార్లలో 2018, 2019 సంవత్సరాల్లో జరిగిన ‘ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ ఎంప్లాయీస్ స్పోర్ట్స్ మీట్’లో పవర్లిఫ్టింగ్లో వెండి, బంగారు పతకాలు సాధించారు. అవే పోటీలు ఇటీవలె (జూన్ 22) న్యూదిల్లీలో జరగ్గా.. తొలిసారిగా వెయిట్లిఫ్టింగ్లో సత్తా చాటి, జాతీయ స్థాయి పోటీని ఎదుర్కొని కాంస్య పతకం గెలుచుకున్నారు.
లక్ష్యం: అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని పతకాలు గెలుచుకోవడంతో పాటు మరింత మంది విద్యార్థులను క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ డీజీపీని బదిలీచేయండి: ఎన్నికల సంఘానికి భాజపా ఫిర్యాదు
[ 25-04-2024]
డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డిని బదిలీ చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయంలో భాజపా నేతలు మరోమారు ఫిర్యాదు చేశారు. -
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం: సినీ నటుడు నిఖిల్
[ 25-04-2024]
బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్థి ఎం.ఎం కొండయ్య గురువారం అట్టహాసంగా నామినేషన్ వేశారు. -
ఏపీలో ముగిసిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ
[ 25-04-2024]
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. -
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు: నారా లోకేశ్
[ 25-04-2024]
ఓట్లు అడగడానికి వచ్చే వైకాపా నేతలను రాజధాని రైతులు నిలదీయాలని యువనేత, మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. -
చదువులమ్మ చెట్టుకు.. రాజకీయ చెద!
[ 25-04-2024]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేరెన్నికగన్న పురాతన విద్యాసంస్థల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఒకటి. దేశ, విదేశాల్లో ఎంతో ఖ్యాతినార్జించిన ఘనత దీని సొంతం. దాదాపు పది, పదిహేను దేశాల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకునేవారు. -
యూజీడీ మూలన.. మాటలు మరుగున
[ 25-04-2024]
నా ముస్లింలు.. నా మైనార్టీలు అంటూ మాటలతో మభ్యపెట్టడమే గానీ సీఎం జగన్కు వారిపై ఏమాత్రం ప్రేమలేదని చెప్పడానికి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తికాని ఉదంతమే నిదర్శనం. -
నాడు వాతలుండవని కోతలు.. నేడు ఛార్జీల మోతలు
[ 25-04-2024]
ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్రెడ్డి రాష్ట్రమంతా తిరిగి చంద్రబాబు పాలనలో కరెంటు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయని విమర్శించారు. తాను అధికారంలోకి వచ్చాక విద్యుత్తు ఛార్జీలు పెంచబోమని హామీనిచ్చారు. -
అభిమాన నీరాజనం
[ 25-04-2024]
జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ నామినేషన్ సందర్భంగా బుధవారం తెనాలిలో నిర్వహించిన ప్రదర్శనకు ప్రజలు భారీగా తరలివచ్చారు. -
పసుపుమయమైన రేపల్లె
[ 25-04-2024]
రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నామినేషన్ దాఖలు కార్యక్రమం బుధవారం కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది. -
అక్రమంగా తవ్వారు.. ప్రాణాలు తీస్తున్నారు!
[ 25-04-2024]
రెండేళ్ల కిందట ప్రత్తిపాడుకు చెందిన నలుగురు కళాశాల విద్యార్థులు ఈతకు బోయపాలెంలోని డైట్ సమీపంలో క్వారీ గుంత వద్దకు వెళ్లారు. -
చందా.. దందా
[ 25-04-2024]
ఎన్నికలంటే ఖర్చులు ఎలా ఉంటాయో మీకు తెలియంది కాదు. -
మిత్ర ద్రోహం
[ 25-04-2024]
పాదయాత్రలో అధికారంలోకి రాగానే గోపాల మిత్రలకు నెలకు రూ.16 వేల గౌరవవేతనం ఇస్తామని హామీ ఇచ్చి గత అయిదేళ్లుగా ఒక్క రూపాయి కూడా పెంచకుండా తమని సీఎం జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని గోపాల మిత్రలు వాపోతున్నారు. -
‘పది’లో ‘ప్రత్యేక’ విజయం
[ 25-04-2024]
అమ్మ ప్రోత్సాహం..అమ్మమ్మ పర్యవేక్షణ..భవిత కేంద్ర టీచర్ల కృషి...ప్రధానోపాధ్యాయురాలి తోడ్పాటు వెరసి 16 ఏళ్ల దివ్యాంగురాలైన జి.శ్రావ్య జోసెఫిన్ పదో తరగతి పూర్తిచేసింది. -
తెదేపా ప్రచార వాహన డ్రైవర్పై వైకాపా దాడి
[ 25-04-2024]
తెలుగుదేశం పార్టీ ప్రచార వాహన డ్రైవర్పై కొందరు వైకాపా నాయకులు దాడి చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. -
ప్రజల గొంతూ తడపలేరా?
[ 25-04-2024]
2018 మార్చి 14వ తేదీన ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి పొన్నూరులో నిర్వహించిన బహిరంగ సభలో పొన్నూరు పట్టణ ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని అప్పటి తెదేపా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. -
రాజీనామా చేయకుంటే అంతుచూస్తాం
[ 25-04-2024]
వాలంటీర్లుగా మీకు ప్రతి ఇంట్లో ఎంత మంది ఓటర్లున్నారు..ఎటు అనుకూలంగా ఉన్నారో తెలుసు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 25-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు రైల్వే అధికారి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
లండన్లో ఖలిస్థానీ అనుకూలవాదుల దుశ్చర్య కేసు.. కీలక నిందితుడి అరెస్టు
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట