విద్యార్థులే ఉద్యోగులు!
కరోనా దెబ్బకు మధ్యతరగతి, పేద కుటుంబాల ఆర్థిక పరిస్థితి రెండేళ్లల్లో అట్టడుగుస్ధాయికి చేరింది. ఈ పరిస్ధితుల్లో పలువురు విద్యార్థులు చదువుకుంటూనే ఏదో ఒక పార్ట్టైం ఉద్యోగం చేసుకునేందుకు గుంటూరులో ఆసక్తి చూపిస్తున్నారు. ఎవరి సహాయం లేకుండా
గుంటూరులో ఎల్లెడలా విస్తరిస్తున్న సేవా రంగం
న్యూస్టుడే-పట్టాభిపురం: కరోనా దెబ్బకు మధ్యతరగతి, పేద కుటుంబాల ఆర్థిక పరిస్థితి రెండేళ్లల్లో అట్టడుగుస్ధాయికి చేరింది. ఈ పరిస్ధితుల్లో పలువురు విద్యార్థులు చదువుకుంటూనే ఏదో ఒక పార్ట్టైం ఉద్యోగం చేసుకునేందుకు గుంటూరులో ఆసక్తి చూపిస్తున్నారు. ఎవరి సహాయం లేకుండా తమ చదువులకు అవసరమైన ఫీజులను తామే కట్టుకుంటున్నారు. ఆహారాన్ని ఇంటికి చేర్చే.. స్విగ్గి, జొమాటో, అమెజాన్, ఫ్లిప్కార్ట్, జియోమార్ట్, బిగ్బాస్కెట్తో సహా పదుల సంఖ్యలో ఈకామర్స్ సంస్థల సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇంకా అనేక కొత్త సంస్థలు కూడా వస్తూనే ఉన్నాయి. కొందరు ప్రైవేటు కళాశాలల్లో వార్డెన్లుగా, జూనియర్ లెక్చరర్లుగా, హోమ్ ట్యూషన్లు చెబుతూ డబ్బు సంపాదిస్తున్నారు. కొవిడ్ తర్వాత ఈకామర్స్ సంస్థలకు విపరీతమైన గిరాకీ పెరిగింది. గుంటూరు నగరంలోనే వేలాదిగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు ప్రస్తుతం వర్క్ఫ్రం హోమ్ ద్వారా విధులు నిర్వహిస్తున్నారు. అందుకే ఈకామర్స్ సంస్థల సేవలకు బాగా గిరాకీ పెరిగింది. ఆహారం, ప్రయాణం, వైద్యం, ఇంటికి అవసరమయ్యే నిత్యవసరాలు ఇలా.. అన్నీ ఇంటికే తెప్పించుకుంటున్నారు. డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలల్లో చదువుతున్న వందలాది మంది విద్యార్థులు పార్ట్టైం కొలువులు చేసుకుంటూ తమ కాళ్ల పై తాము నిలబడుతున్నారు. ఫుల్టైం ఉద్యోగాలు చేసేవాళ్లు సాయంత్రం నుంచి ఇళ్లకు వెళ్లిపోతుంటారు. ఆ సమయంలో విద్యార్థులు రంగంలోకి దిగి రాత్రి వరకూ విధులు నిర్వహిస్తున్నారు. రాత్రి సమయంలోనే హోటళ్ల నుంచి ఆహారం తెప్పించుకుంటున్న వారి సంఖ్య ఎక్కువ ఉంటోంది. ప్రస్తుతం చదువులు పూర్తిచేసి ఇంటి దగ్గర ఖాళీగా ఉన్న యువత కూడా వీటిలో చేరుతున్నారు. సరైన ఉద్యోగం వచ్చేలోగా ఖాళీగా ఉండకుండా ఎంతోకొంత ఆదాయం సంపాదించుకునేందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నానని అశోక్నగర్కు చెందిన పవన్ తెలియజేశారు. ప్రైవేటు కొలువులు చేస్తున్న వాళ్లు, దుకాణాల్లో పనిచేస్తున్న వాళ్లు.. కూడా చాలామంది ఈ సంస్థల్లో సాయంత్రం నుంచి సేవలు అందిస్తున్నారు. ఎప్పుడు ఖాళీ ఉంటే.. అప్పుడు తమ స్మార్ట్ఫోన్ను ఆన్ చేస్తే.. చాలు. ఉపాధి వెతుక్కుంటూ వస్తోందని, ఓపిక ఉన్నంత వరకూ పనిచేసుకోవచ్చని త్రినాధ్ వివరించారు. స్టడీ అవర్స్లో విద్యార్థుల సందేహాలు నివృత్తి చేసేందుకు గంటల వంతున పని చేస్తున్నట్లు కల్యాణ్ వెల్లడించారు.
పోటా పోటీతో పెరిగిన సేవల విస్తరణ..
విద్యార్థులే ఒకరి ద్వారా మరొకరు రిఫరెన్స్లు ఇచ్చుకుంటూ సంబంధిత సంస్థల్లో చేరుతున్నారు. ద్విచక్రవాహనం ఉంటే మాతో కలిసి పనిచేసుకోవచ్చంటూ విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. ఒకవైపు కమీషన్లు పెంచుతూ, మరోవైపు సేవలను విస్తరిస్తున్నాయి. ప్రస్తుతం కొన్ని సంస్థలు చిన్న బిస్కెట్ ప్యాకెట్ నుంచి ఏది కావాలన్నా ఇంటికే తెచ్చి ఇస్తున్నాయి. ఉదయం కళాశాలకు వెళుతూ.. సాయంత్రం నుంచి రాత్రి వరకూ ఓ నాలుగైదు గంటలు పనిచేసి.. నెలకు కనీసం ఓ రూ.10-15వేలు సంపాదించుకుంటున్న విద్యార్థులూ ఉన్నారు.
ఎంత సమయం పనిచేస్తే అంత ఆదాయం... ఒక విద్యార్థి రోజుకు కేవలం మూడు గంటలే పనిచేసి తర్వాత తన చదువుపై ధ్యాస పెడుతుంటాడు. మరొకరు పది గంటలు పనిచేస్తుంటారు. ఎవరు ఎంత సమయం పనిచేశారనే దాని ఆధారంగానే ఆదాయం కూడా వస్తోంది. ఒక్కో డెలివరీకి రూ.30 నుంచి రూ.50 వరకూ కమీషన్ ఇస్తారు. కొవిడ్ తర్వాత డెలివరీ బాయ్లకు టిప్లు కూడా ఇవ్వొచ్చంటూ చాలా సంస్థలు అధికారికంగా తమ యాప్లలో ఆప్షన్ పెట్టాయి. ఒక్కో విద్యార్థి నెలకు కనీసం రూ.10 వేల నుంచి రూ.15,000 వరకూ ఈ పార్ట్టైం కొలువల ద్వారానే సంపాదిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం జగన్పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు
[ 19-04-2024]
ఏప్రిల్ 16న భీమవరంలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. -
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
[ 19-04-2024]
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. -
గుంటూరు జిల్లాలో ప్రబలిన డయేరియా.. 100 మందికి పైగా అస్వస్థత
[ 19-04-2024]
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం మంచాలలో డయేరియా ప్రబలింది. వాంతులు, విరేచనాలతో గ్రామంలో 100 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. -
దశ‘దిశ’లా.. ఆక్రందనలే..!
[ 19-04-2024]
వైకాపా ప్రభుత్వ పదవీకాలం ముగుస్తున్నా ఇప్పటికీ ఆ చట్టానికి కోరలు లేవు. దాన్ని పార్లమెంట్ ఆమోదించలేదు. ఉనికిలో లేని చట్టం గురించి పదేపదే ప్రచారం చేసుకోవడం జగన్ సర్కార్ తీరుగా మారింది. -
జీవితాన్ని కలరా‘జే’సింది..
[ 19-04-2024]
రేపల్లెకు చెందిన మధు ప్రభుత్వ మద్యం తాగి పక్షవాతానికి గురై మంచానికి పరిమితమయ్యాడు. చేతివృత్తి చేసుకుంటూ భార్య ఇద్దరు పిల్లలను పోషించుకునే అతను మద్యం తాగేవాడు. -
సమస్యలు విలీనమై.. బడికి దూరమై..
[ 19-04-2024]
పాఠశాలల విలీనం వల్ల లాభం లేకపోగా టీచర్లకు, పిల్లలకు బాగా అన్యాయం జరిగింది. కొందరు టీచర్లు దూరాన ఉన్న ఉన్నత పాఠశాలలకు వెళ్లలేక పదోన్నతులు వదులుకోవడంతో నష్టపోయారు. అదేవిధంగా పిల్లల పరంగా చూస్తే సర్కారీ బడులకు దూరమయ్యారు. -
ఆరోగ్యం చిదిమేసి.. బతుకుల్ని బుగ్గి‘జే’సి..
[ 19-04-2024]
మద్యపాన నిషేధం చేస్తామని జగన్మోహన్రెడ్డి ఓట్లు దండుకుని తీరా అధికారంలోకి వచ్చాక ఆ మాటే మరిచారు. స్వయంగా ప్రభుత్వమే మద్యం వ్యాపారానికి తెరతీసింది. నాసిరకం మద్యం పోసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడింది. -
అండ నేనన్నావు.. గుదిబండలా మార్చావు..
[ 19-04-2024]
జిల్లాలో వైకాపా ప్రభుత్వ అయిదేళ్ల పాలనలో ఒక్క కొత్త పరిశ్రమ రాకపోగా ఉన్నవి చాలా వరకు మూతపడ్డాయి. పత్తి ఆధారిత పరిశ్రమలైన జిన్నింగ్ పూర్తిగా ఎత్తేయగా.. స్పిన్నింగ్ మిల్లులు అదే దిశగా నడుస్తున్నాయి. -
యువనేతపై ఉప్పొంగిన అభిమానం
[ 19-04-2024]
లోకేశ్ తరఫున నామినేషన్ పత్రాల సమర్పణ సందర్భంగా గురువారం మంగళగిరిలో జనసేన, భాజపా, తెదేపా, ఎమ్మార్పీఎస్ శ్రేణులు భారీ ప్రదర్శన నిర్వహించారు. -
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వినియోగానికి ఆటంకాలు
[ 19-04-2024]
వైకాపా ప్రభుత్వంపై ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. ఇదే అదనుగా పోలింగ్ విధుల్లో పాల్గొనే ఉద్యోగులు అందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోకుండా వ్యూహాత్మకంగా ఉన్నతాధికారులు ఆటంకాలు కలిగిస్తున్నారని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఆరోపిస్తున్నాయి. -
కోన ఆస్తుల విలువ రూ.24.20 కోట్లు
[ 19-04-2024]
బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే కోన రఘుపతి తన కుటుంబ ఆస్తుల విలువను రూ.24.20 కోట్లుగా గురువారం దాఖలు చేసిన ఎన్నికల నామినేషన్ అఫిడవిట్లో పేర్కొన్నారు. -
నలిగిపోతున్న నాలుగో సింహం
[ 19-04-2024]
ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ కల్పించడంలో పోలీసులు పగలు, రాత్రి కష్టపడుతుంటారు. శాంతిభద్రతలను పరిరక్షించే క్రమంలో సంఘ విద్రోహశక్తుల చేతిలో ప్రాణత్యాగాలకు సైతం వెనకాడరు. -
కర్షకుల కష్టాలు కనిపించవా..?
[ 19-04-2024]
పెదవడ్లపూడి ఉన్నత వాహినిపై ఎత్తిపోతల పథకం పూర్తి చేసి రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే ఆర్కే హామీ ఇచ్చారు. కానీ అమలు చేయడం మర్చిపోయారు. -
వైకాపా ప్రభుత్వ నిర్ణయ లోపం.. విద్యార్థులకు శాపం
[ 19-04-2024]
‘మీ పిల్లలు బడిలో భోజనం చేయకపోతే మీకు వస్తున్న ప్రభుత్వ పథకాలు నిలిచేపోయే అవకాశం ఉంది’అని తల్లిదండ్రుల సమావేశాల్లో ఉపాధ్యాయులు చెబుతున్నా.. నాణ్యత లేకపోవడంతో చాలా మంది విద్యార్థులు -
‘అవినీతి పాలనకు చరమగీతం పాడుదాం’
[ 19-04-2024]
అసమర్థ, అవినీతి పాలనకు చరమగీతం పాడుదామని గుంటూరు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. కొల్లిపరలో గురువారం సాయంత్రం నిర్వహించిన రోడ్షోలో ఆయన మాట్లాడుతూ వైకాపా పాలకులకు పోలవరం పట్టలేదు, -
ఎప్పటికి తొలగిస్తారో!
[ 19-04-2024]
పట్టణ పరిధి జీబీసీ రహదారిలో విద్యుత్తు స్తంభానికి సీఎం జగన్, స్థానిక ఎమ్మెల్యే రోశయ్య, వైకాపా నేతల ఫొటోలతో కూడిన బోర్డు ఉంది. -
మొదలైన నామినేషన్ల పర్వం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో గురువారం నుంచి జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల పర్వం మొదలైంది. ఈ క్రమంలో నెల రోజులుగా పలు విధాలుగా ప్రచార కార్యక్రమాలు చేపట్టిన పార్టీలు ఇప్పటికే నామినేషన్ పత్రాలు పూర్తి చేసి మంచి ముహూర్తం కోసం వేచి ఉన్నారు. -
ఫోన్పే చేయమన్నాడు.. అదృశ్యమయ్యాడు!
[ 19-04-2024]
అద్దంకి పురపాలక కార్యాలయం వద్ద మంచినీటి కుళాయి రుసుం చెల్లించేందుకు వచ్చిన వృద్ధుడ్ని ఓ ఘరానా దొంగ మోసగించాడు. ఈ సంఘటన గురువారం ఉదయం పురపాలక పన్నుల విభాగం వద్ద జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత