నాణ్యమైన విద్య అందిస్తాం
నూతనంగా ఏర్పడిన బాపట్ల జిల్లాను విద్యాపరంగా రాష్ట్రంలోనే ముందు వరుసలో నిలిపేందుకు తన వంతు కృషి చేస్తానని జిల్లా విద్యాశాఖాధికారి(డీఈవో) రామారావు తెలిపారు. ఉపాధ్యాయుల సహకారంతో జిల్లాను మొదటి ఐదు స్థానాల్లో నిలిచేలా పాటుపడతానన్నారు.
‘న్యూస్టుడే’ ముఖాముఖిలో డీఈవో రామారావు
వేమూరు, న్యూస్టుడే: నూతనంగా ఏర్పడిన బాపట్ల జిల్లాను విద్యాపరంగా రాష్ట్రంలోనే ముందు వరుసలో నిలిపేందుకు తన వంతు కృషి చేస్తానని జిల్లా విద్యాశాఖాధికారి(డీఈవో) రామారావు తెలిపారు. ఉపాధ్యాయుల సహకారంతో జిల్లాను మొదటి ఐదు స్థానాల్లో నిలిచేలా పాటుపడతానన్నారు. ఈనెల 5న పాఠశాలలు పునఃప్రారంభమవుతాయని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆయా పాఠశాలల్లో తగిన వసతులను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ‘నాడు-నేడు’ కార్యక్రమం ద్వారా రెండో విడతలో వందల పాఠశాలల రూపురేఖలు మారనున్నాయన్నారు. ఇప్పటికే పాఠశాలలకు 80 శాతం పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశామని, పాఠశాల ప్రారంభం రోజునే విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లు అందిస్తామని చెప్పారు. బడులు తెరుస్తున్న నేపథ్యంలో జిల్లా విద్యాశాఖాధికారి ‘న్యూస్టుడే’ ముఖాముఖిలో మాట్లాడారు.
ప్రశ్న: రెండో విడత ‘నాడు-నేడు’ పనులు ఎంత వరకు మొదలయ్యాయి?
జవాబు: జిల్లాలో రెండో విడత నాడు-నేడు ద్వారా అభివృద్ధి చేయడానికి 469 పాఠశాలలు ఎంపికయ్యాయి. ఇందుకు సంబంధించి రూ.108 కోట్ల నిధులు మంజూరు కాగా, ఇప్పటికే రూ. 13 కోట్ల నిధులు ఆయా విద్యా కమిటీ ఖాతాల్లో జమయ్యాయి. వాటిలో రూ.3.5 కోట్ల నిధులు ఖర్చయ్యాయి. ప్రస్తుతం 222 పాఠశాలల్లో పనులు మొదలయ్యాయి. మిగతాచోట్ల ఓ వారంలో పనులను ప్రారంభించాలని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలిచ్చాం. అభివృద్ధి పనులకు సంబంధించి నిత్యం వివరాలు నాడు-నేడు యాప్లో పొందుపరచాలని కోరాం.
ప్రశ్న: ఇప్పటికే చేపట్టిన మొదట విడత పనుల మాటేమిటీ?
జవాబు: మొదటి విడత నాడు-నేడు పాఠశాలల్లో చిన్న చిన్న మరమ్మతులు అవసరమైతే చేయడానికి ప్రభుత్వం ఒక్కొక్క పాఠశాలకు రూ. 10 వేల చొప్పున నిధులను మంజూరు చేసింది. అక్కడ విద్యాకమిటీ వాటిని వినియోగించి విద్యర్థులకు ఇబ్బంది లేకుండా వసతులను కల్పించాలి.
ప్రశ్న: ఈ ఏడాదైనా సకాలంలో పాఠ్యపుస్తకాలు అందిస్తారా?
జవాబు: ప్రస్తుతం జిల్లాకు 80 శాతం పుస్తకాలు వచ్చాయి. వాటిని పాఠశాలలకు పంపిణీ కూడా చేపట్టాం. ఎనిమిదో తరగతి సిలబస్ మారడం వల్ల అవి కాస్త ఆలస్యమయ్యాయి. మూడు, నాలుగు రోజుల్లో అవి కూడా వస్తాయని సమాచారం ఉంది. బడులు తెరిచే నాటికి విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం.
ప్రశ్న: పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షణ నిర్వహణ ఎలా?
జవాబు: జిల్లాలో 2,434 మంది విద్యార్థులు వివిధ సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులు కాలేదు. వీరందరికి ఈనెల 6 నుంచి పరీక్షలు నిర్వహించడానికి 24 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశాం. పరీక్షలో తప్పిన ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించేలా పరీక్షా ఫలితాలు వెలువడిన తరవాత రోజు నుంచి వారికి ఆయా పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. నూరు శాతం ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాం.
ప్రశ్న: ఉపాధ్యాయుల కొరత ఎలా అధిగమిస్తారు?
జవాబు: ప్రస్తుతం విద్యాశాఖలో ఉపాధ్యాయులకు సంబంధించి హేతుబద్దీకరణ ప్రక్రియ జరుగుతుంది. ఇది పూర్తయితే టీచర్ల కొరతపై స్పష్టత వస్తుంది. కొన్నిచోట్ల 3, 4, 5 తరగతుల విద్యార్థులను దగ్గరలోనున్న ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తాం. దాన్ని బట్టి చూసుకుంటే ఉపాధ్యాయుల కొరత ఉండకపోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నీరివ్వలేని నీరో!
[ 18-04-2024]
సీఎం జగన్... పేదల పక్షపాతినంటారు.. ఎన్నికల్లో వారే తన స్టార్ క్యాంపెయినర్లంటారు.. వారి జీవితాలను బాగు చేసేది తనొక్కడేనంటూ గొప్పలకు పోతుంటారు.. కానీ.. తన నివాసానికి కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఉన్న మంగళగిరి ఎయిమ్స్లోని నిరుపేద రోగుల గొంతు తడపలేకపోతున్నారు. -
నారీ గళంతో జగన్ వెన్నులో వణుకు
[ 18-04-2024]
నారీ గళంతో జగన్ వెన్నులో వణుకు పుట్టాలని తెదేపా గుంటూరు ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు పశ్చిమ అభ్యర్థి గళ్లా మాధవి, తెలుగు మహిళ నాయకురాలు మాగంటి రూప, తెలంగాణ తెదేపా నాయకులు నన్నూరి నర్సిరెడ్డి పిలుపునిచ్చారు. -
కీలక ఘట్టానికి వేళాయె
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టం నేటి నుంచి ఆరంభం కాబోతోంది. గురువారం నుంచి అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేయనున్నారు. జిల్లాలో నామినేషన్ల స్వీకరణకు ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. -
నాడు ఆశల కేంద్రం.. నేడు విధ్వంసానికి నిలయం
[ 18-04-2024]
రాష్ట్ర విభజన తర్వాత తుళ్లూరు మండలంలో ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. గత తెదేపా ప్రభుత్వంలో రాత్రీ పగలు తేడా లేకుండా వేల మంది కార్మికులతో కళకళలాడిన అమరావతి వైకాపా పాలనలో విధ్వంసానికి చిరునామాగా మారింది. -
జీతాలకూ ఎదురుచూపులే..
[ 18-04-2024]
జిల్లాలోని ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి ఫిబ్రవరి, మార్చి జీతాలు రాలేదు. ఏప్రిల్ నెల జీతంతో కలిపి రెండు నెలల బకాయిలు విడులవుతాయన్న నమ్మకం లేదు. -
గుంటూరువాసికి క్రికెట్ సైట్ స్క్రీన్పై పేటెంట్
[ 18-04-2024]
జోసెల్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, జేకేసీ కళాశాల కార్యదర్శి, గుంటూరు జిల్లా మెన్, ఉమెన్ క్రికెట్ అసోసియేషన్ పూర్వ అధ్యక్షుడు, ఏసీఏ ఉమెన్స్ అకాడమీ పూర్వ ఛైర్మన్ జాగర్లమూడి మురళీమోహన్ నూతన ఆవిష్కరణకు పేటెంట్ లభించింది. -
శిరోముండనం కేసులో శిక్ష విధించడం హర్షణీయం
[ 18-04-2024]
శిరోముండనం కేసుల్లో నిందితులకు ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు జైలుశిక్ష, జరిమానా విధించడం హర్షణీయమని భీమ్ భారత్ రాష్ట్ర అధ్యక్షుడు పాగళ్ల ప్రకాష్ అన్నారు. -
ప్రాణం తీసిన ఈత సరదా
[ 18-04-2024]
స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన ఇంజినీరింగ్ విద్యార్థి నీట మునిగి మృతి చెందిన విషాదకర సంఘటన మండలంలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. -
సార్వత్రిక ఎన్నికలు సజావుగా నిర్వహిద్దాం
[ 18-04-2024]
పల్నాడు జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు హింస, రీపోలింగ్ లేకుండా విజయవంతం చేసేందుకు అధికారులు, సిబ్బంది సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శివశంకర్ కోరారు. -
విశ్రాంతిలోనూ.. మనశ్శాంతి లేదయ్యా!
[ 18-04-2024]
రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగి ప్రసాద్కు గతంలో ఒకటో తేదీనే పింఛన్ సొమ్ము బ్యాంకు ఖాతాలో జమ అయ్యేది. బీపీ, మధుమేహం సమస్యతో బాధపడుతున్న ఆయన నెల రోజులకు సరిపడా ఒకేసారి ఔషధాలు తెచ్చుకునేవారు. -
అయిదేళ్లుగా చోద్యం చూశారు!
[ 18-04-2024]
ఆంగ్లేయుల కాలంలో నిర్మించిన వంతెన ఇది. శిథిలావస్థకు చేరి అడుగు భాగం దిమ్మెలు పగుళ్లిచ్చాయి. ఇనుప రాడ్ల ఆధారంగా నిలబడింది. భారీ వాహనాలు ప్రయాణిస్తే దిమ్మెలు కదులుతున్నాయి. -
పోలీసు.. వైకాపాకు వత్తాసు
[ 18-04-2024]
సాధారణంగా ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసే తనిఖీ కేంద్రాలు(చెక్పోస్టులు) వద్ద ప్రత్యేకంగా సిబ్బందికి విధులు కేటాయిస్తారు. కానీ జిల్లాలో పోలీసుస్టేషన్లలో ఉండాల్సిన సీఐ, ఎస్సైలకు చెక్పోస్టు డ్యూటీలకు పంపడం చర్చనీయాంశమవుతుంది.
తాజా వార్తలు (Latest News)
-
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
-
కళ్యాణదుర్గంలో వైకాపా అరాచకం.. దాడిలో తెదేపా నేతకు తీవ్ర గాయాలు
-
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు
-
కేసీఆర్ను బద్నాం చేయాలనే కాఫర్ డ్యామ్ కట్టడంలేదు: కేటీఆర్
-
మల్కాజిగిరిలో భారీ మెజారిటీతో ఈటల గెలుపు: కిషన్రెడ్డి
-
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?