ఉపాధి కూలీలపై పరికరాల భారం
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీలకు నాలుగేళ్లుగా పరికరాలు ఇవ్వడం లేదు. దీంతో వారే సొంతంగా కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. వీటి కొనుగోలుకు కూలీలు ఒక్కొక్కరు రూ.500కుపైగా వెచ్చిస్తున్నారు.
నాలుగేళ్లుగా పంపిణీ లేని వైనం
పనులు చేస్తున్న కూలీలు
ఈనాడు, నరసరావుపేట, బాపట్ల: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీలకు నాలుగేళ్లుగా పరికరాలు ఇవ్వడం లేదు. దీంతో వారే సొంతంగా కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. వీటి కొనుగోలుకు కూలీలు ఒక్కొక్కరు రూ.500కుపైగా వెచ్చిస్తున్నారు. దీంతో వారిపై అదనపు భారం పడుతోంది. ఎండ నుంచి రక్షణకు నీడ ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఆచరణలో అమలు కావడం లేదు. ఉపాధి హామీ పథకానికి కేంద్రం నిధులు మంజూరు చేస్తోంది. నిబంధనల ప్రకారం కూలీల వేతనాలకు 60 శాతం, సామగ్రి విభాగం కింద 40శాతం నిధులు వెచ్చించాల్సి ఉంది. పరిపాలనా ఖర్చుల కింద ఆరు శాతం మించకుండా చూసుకోవాలి. సామగ్రి విభాగం, పరిపాలనకు వెచ్చించే నిధులు కింద పరికరాలు కొనుగోలు చేసే వెసులుబాటు ఉంటుంది. అయితే నాలుగేళ్లకుపైగా గ్రామీణాభివృద్ధి శాఖ పరికరాల కొనుగోలుకు అనుమతి ఇవ్వకపోవడంతో సరఫరా చేయలేని పరిస్థితి నెలకొంది. ఉమ్మడి జిల్లాలో గతంలో ఏడాదికి రూ.కోటి వెచ్చించి కూలీలందరికీ పరికరాలు పంపిణీ చేసేవారు. పార, గడ్డ పలుగు, బొచ్చెలు, నీడ కోసం టెంట్లు, ప్రాథమిక చికిత్సకు కిట్లు సరఫరా చేసేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. పనిచేసే ప్రదేశంలో ప్రమాదవశాత్తూ గడ్డపలుగు తగిలి గాయపడితే ప్రాథమిక చికిత్సకు కనీస సామగ్రి అందుబాటులో లేదు.
మారుతున్న ప్రాధాన్యాలు
కూలీలకు పని కల్పించడమే లక్ష్యంగా ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది. ప్రారంభంలో కూలీల సంక్షేమం కోసం అనేక సౌకర్యాలు కల్పించారు. పథకం అమలులో రాష్ట్రప్రభుత్వాల ప్రాధాన్యతలు ఏటికేడు మారడంతో కూలీలకు సౌకర్యాల కల్పనలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సామగ్రి విభాగం కింద సమకూరుతున్న నిధులను సీసీరోడ్లు, మురుగునీటి కాలువల నిర్మాణం, గ్రామ సచివాలయాలు, గ్రామ ఆరోగ్యకేంద్రాలు, అంగన్వాడీ భవనాలు, రైతుభరోసా కేంద్రాల నిర్మాణాలకు వెచ్చిస్తున్నారు. కూలీలు పనిచేయడం వల్ల సమకూరిన సామగ్రి విభాగం కింద వచ్చే నిధుల కంటే ఎక్కువగా పనులు చేపడుతుండటంతో ఎప్పటికప్పుడు సామగ్రి విభాగం నిధుల లోటు కొనసాగుతోంది. గతంలో రాష్ట్రస్థాయిలో పరికరాలు కొనుగోలు చేసి జిల్లాలకు సరఫరా చేసేవారు. ఇప్పుడు కూలీల సౌకర్యాల కోసం నిధులు వెచ్చించాలంటే గ్రామీణాభివృద్ధి ఉన్నతాధికారుల నుంచి అనుమతి తప్పనిసరి. దీంతో జిల్లాల్లో పథక సంచాలకులు పరికరాలు సమకూర్చే వెసులుబాటు లేకుండా పోయింది.
వెసులుబాటు ఉన్నా అమలుకాని వైనం
ఉమ్మడి గుంటూరు జిల్లాలో 46వేల కూలీల బృందాలు ఉన్నాయి. ఒక్కొక్క బృందంలో 20 నుంచి 25 మంది ఉంటారు. ఒక్కొక్క బృందానికి ఐదు గడ్డ పలుగులు ఇచ్చేవారు. సంఘానికి రూ.450 విలువైన పరదా పట్టలు వేసవిలో సరఫరా చేసేవారు. 9.27 లక్షల మంది కూలీలు ఉన్నారు. ఒక్కొక్క మండలానికి పని కల్పించే కూలీల సంఖ్యను బట్టి రూ.లక్ష నుంచి రూ.5లక్షల వరకు పరికరాలకు వెచ్చించేవారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో ఏప్రిల్, మే, జూన్ నెలల్లో పెద్దఎత్తున కూలీలకు పని కల్పించినందున సామగ్రి విభాగం, పరిపాలనా విభాగం కింద నిధులు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా కూలీలకు అవసరమైన పరికరాలు, ఇతర సౌకర్యాలు కల్పించే వెసులుబాటు ఉంది. అయితే ఇందుకు సంబంధించి నిధులు వెచ్చించడానికి పంచాయతీరాజ్ ఉన్నతాధికారుల నుంచి అనుమతి లేదు. మరోవైపు ప్రస్తుతం అమలులో ఉన్న ఎన్ఐసీ సాఫ్ట్వేర్లో కూలీల సౌకర్యాలకు ఆప్షన్ లేకపోవడంతో నిధులు ఉన్నా ఖర్చు చేయలేని పరిస్థితి ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. ఉపాధి హామీ పథకానికి వెచ్చిస్తున్న నిధుల్లో ఒక శాతం కూలీల సౌకర్యాల కోసం గతంలో వెచ్చించే వారు. దీనిని అమలు చేసి సౌకర్యాలు కల్పించాలని కూలీలు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పట్టాలెక్కించలేదు.. పట్టించుకోలేదు
[ 29-03-2024]
కృష్ణా పశ్చిమ డెల్టాలోని గుంటూరు, బాపట్ల జిల్లాల పరిధిలో 5 లక్షలకుపైగా ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. ఏటా లక్షల బస్తాల ధాన్యాన్ని రైతులు పండిస్తున్నారు. -
మీ పనులకో దండం!
[ 29-03-2024]
గుంటూరు నగరపాలికలో గడప గడపకు మన ప్రభుత్వం కింద చేసిన అభివృద్ధి పనులకు పది నెలల నుంచి బిల్లులు చెల్లించలేదు. ఇవి రూ.కోట్లలో పేరుకుపోవడంతో వారు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. -
భారీ ఎత్తున సరకుల దిగుమతిపై నిఘా
[ 29-03-2024]
ఎన్నికల కోడ్ నేపథ్యంలో పెద్ద మొత్తాల్లో సరకుల లావాదేవీలు నిర్వహించే సంస్థలపై నిఘా ముమ్మరం చేసినట్లు వాణిజ్య పన్నుల శాఖ గుంటూరు-2 జాయింట్ కమిషనర్ మధుబాబు తెలిపారు. -
మౌనానికి వెలకట్టి.. ముడుపులు మూటకట్టి..
[ 29-03-2024]
ఆ అధికార పార్టీ నేత లక్ష్యం రూ.కోట్లు సంపాదించడమే.. వ్యాపారుల నుంచి వసూళ్లు సాగిస్తున్న వైనంపై ప్రతిపక్ష నేత వేసిన సూటి ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పలేకపోయారు. -
పాలకా.. ఇది తగునా?
[ 29-03-2024]
పొన్నూరు పురపాలక సంఘంలో ఎన్నికల కోడ్ సరిగా అమలు కావడం లేదు. అధికార పార్టీకి ఒక లాగా... ప్రతిపక్ష పార్టీకి మరోలా అమలు చేస్తూ అధికారులు వివక్ష చూపుతున్నారు. -
నిబంధన.. పాటించకుంటే దండన
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) అమల్లోకి వచ్చింది. దీన్ని ఎన్నికల సంఘం చూస్తుంది. జిల్లాలో కలెక్టర్ పర్యవేక్షిస్తుంటారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ఉద్యోగులు ప్రవర్తనా నియమావళి పరిధిలోకి వస్తారు. -
ప్రభుత్వం మారితేనే యువతకు భవిత
[ 29-03-2024]
ప్రజలకు తాగు నీటిని అందించలేని వైకాపా ప్రభుత్వం గంజాయి, మత్తు పదార్థాలను మాత్రం విచ్చలవిడిగా అందుబాటులోకి తీసుకొచ్చి యువతకు తీరని నష్టాన్ని కలిగిస్తోందని ఎన్డీయే గుంటూరు పార్లమెంటు అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శించారు. -
అనుమతి ఒకచోట..ప్రచారం మరోచోట
[ 29-03-2024]
ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రతి ఒక్కరూ పాటించాలని యంత్రాంగం చెబుతుంటే.. అధికార పార్టీకి చెందిన వారు ఉల్లంఘిస్తూనే ఉన్నారు. -
ఎన్నికల ప్రచారంలో వాలంటీరు హల్చల్పై ఫిర్యాదు
[ 29-03-2024]
మండలంలోని కారంపూడిపాడు గ్రామంలో ఈ నెల 22న వైకాపా అభ్యర్థి బలసాని కిరణ్కుమార్కు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వాలంటీరు కె.నరసింహరావు పాల్గొన్నారు. -
రోడ్డునే మింగేసిన ఇసుకాసురులు
[ 29-03-2024]
జనం ఇబ్బంది పడితే మాకేంటి? మా ప్రయోజనం నెరవేరితే చాలనేలా అధికార పార్టీ నేతలు వ్యవహరించారు. అక్రమార్జనకు ఉన్న ఏ అవకాశాన్ని వారు వదులుకోలేదు. -
కోడ్ ఉన్నా.. చోద్యం చూస్తున్నారు!
[ 29-03-2024]
ఈ చిత్రం చూశారా.. కృష్ణా తీరంలోని అమరావతి మండలం మల్లాది రీచ్లో గురువారం రాత్రి వేళ భారీ యంత్రాలతో ఇసుక తవ్వి లారీలకు నింపుతున్నారు. అనుమతి ఉన్న రీచ్లలో సైతం సూర్యాస్తమయం తర్వాత కూలీల చేత కూడా ఇసుక తవ్వకాలు చేయకూడదు. -
బల్లికురవ ఎస్సైపై విచారణకు ఆదేశం
[ 29-03-2024]
అధికార వైకాపా నేతల మెప్పు పొందాలని చూసినా.. బాధితులపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలనుకునే పోలీసు అధికారులు తగు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని చెప్పడానికి తాజాగా బల్లికురవ ఎస్సై నాగశివారెడ్డి ఉదంతమే ఓ నిదర్శనం. -
ఓటరు జాబితాలో మీ పేరుందా?
[ 29-03-2024]
‘సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది... త్వరలో జరగబోయే ఎన్నికల్లో 18 ఏళ్లు నిండిన వారి దగ్గర నుంచి ఓటున్న ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకోవాలి... ఎవరికి వారు తాము వేయకపోతే ఏమవుతుందనే భావన విడనాడాలి. -
నియమావళి అమలు ఇలాగేనా?
[ 29-03-2024]
ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చి 12 రోజులు గడిచింది. అమలుకు సంబంధించి ప్రత్యేకాధికారులను నియమించినా కొన్నిచోట్ల కోడ్ ఉల్లంఘనలు కనపడుతూనే ఉన్నాయి. -
గుండ్లకమ్మ జలాశయంలో మొసలి కలకలం
[ 29-03-2024]
గుండ్లకమ్మ జలాశయంలో మత్స్యకారుడి వలకు మొసలి చిక్కడంతో స్థానికంగా కలకలం రేగింది. అటవీశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. -
కన్ను పడితే కబ్జానే..
[ 29-03-2024]
తిమ్మాయిపాలెం గ్రామంలోని 7.05 ఎకరాలు నక్కలవాగు పేరుతో వాగు పోరంబోకు స్థలం ఉంది. ఇది జాతీయ రహదారికి పక్కనే రోడ్డుకు ఆనుకొని ఉండటంతో దీనిపై వైకాపా నేత గద్దలా వాలిపోయారు. -
వైకాపా ప్రచారంలో క్షేత్ర సహాయకుడు
[ 29-03-2024]
ఎన్నికల కోడ్ వచ్చినా కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు, ఒప్పంద సిబ్బంది ఇంకా వైకాపా ప్రజాప్రతినిధులతో కలిసి ప్రచారంలో పాల్గొంటున్నారు. -
మరెందుకు ఆలస్యం.. రాజీనామా చేయండి..
[ 29-03-2024]
రాజీనామా చేసేయండి.. హాయిగా పార్టీ ప్రచారంలో పాల్గొనండి అంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు వాలంటీర్లకు ఫోన్లు చేస్తున్నారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని, మళ్లీ తీసుకుంటామని ప్రస్తుతానికి అంతా చూసుకుంటామంటూ చెప్పుకొస్తున్నారు. -
ఎత్తిపోతల పథకాలు హుళక్కే
[ 29-03-2024]
పల్నాడు జిల్లాలో వైకాపా పాలన ఐదేళ్లలో కొత్తగా ఒక్క ఎత్తిపోతల పథకం నిర్మించలేదు. నీటి అనుమతులిచ్చి నిధులివ్వకుండా మొండిచెయ్యి చూపారు. -
12 మంది వైకాపా కౌన్సిలర్ల వేరు బాట
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రభావం పురపాలక సంఘంలోని పాలకపక్షంపై పడింది. చిలకలూరిపేట శాసనసభ స్థానంలో అధికార వైకాపా నియోజకవర్గ సమన్వయకర్తల మార్పు వ్యవహారం కౌన్సిలర్ల మధ్య చీలికకు దారి తీసింది. -
పక్కదారి పట్టిన రేషన్ బియ్యం
[ 29-03-2024]
రేషన్ బియ్యం పక్కదారి పట్టడంతో నరసరావుపేటకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. నెల నెలా పేదలకు బియ్యం సక్రమంగా పంపిణీ చేస్తున్నామని చెప్పే అధికారులు ఆ బియ్యం పక్కదారి పడుతున్నా పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఎన్నికల నిబంధనలు బేఖాతర్
[ 29-03-2024]
ఎన్నికల కోడ్ అమలై పదిరోజులు దాటినా నేటికీ పలు చోట్ల అధికారపార్టీ ఆగడాలకు అదుపు లేకుండా ఉంది. క్రోసూరు ఎస్టీ కాలనీ, గాదెవారిపాలెంలోని మంచినీటి పథకం ట్యాంకులకు వైకాపా రంగులు కనిపిస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: అతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
-
సీఎం రేవంత్రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ