ఆర్థిక, సామాజిక రంగాల్లో సమానత్వం ఏదీ?
దేశంలో ఇప్పటికీ ఆర్థిక, సామాజిక రంగాల్లో వెనకబాటుతనమే కనిపిస్తోంది. ప్రజలందరికీ ఆర్ధిక సమానత్వం ఎక్కడ ఉంది? ఈ రంగాల్లో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని సుప్రీంకోర్టు న్యాయవాది యలమంచలి శివసంతోష్కుమార్ అన్నారు.
ఐలు సెమినార్లో సుప్రీంకోర్టు న్యాయవాది యలమంచలి శివ సంతోష్కుమార్
మాట్లాడుతున్న సుప్రీంకోర్టు న్యాయవాది శివసంతోష్కుమార్, చిత్రంలో ఎమ్మెల్సీ లక్ష్మణరావు, వెంకటేశ్వర్లు, సుధాకర్బాబు, శ్రీనివాసరావు
ఈనాడు-అమరావతి: దేశంలో ఇప్పటికీ ఆర్థిక, సామాజిక రంగాల్లో వెనకబాటుతనమే కనిపిస్తోంది. ప్రజలందరికీ ఆర్ధిక సమానత్వం ఎక్కడ ఉంది? ఈ రంగాల్లో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని సుప్రీంకోర్టు న్యాయవాది యలమంచలి శివసంతోష్కుమార్ అన్నారు. కేవలం రాజకీయ రంగంలో మాత్రమే రిజర్వేషన్లు అమలు చేయటం వల్ల కొంతైనా రాజకీయ న్యాయం జరుగుతోందని చెప్పారు. 72 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇప్పటికీ పేదలు పేదలుగానే ఉండిపోయారని కొద్దిమంది వ్యక్తుల చేతుల్లోనే దేశ సంపద కేంద్రీకృతమై ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా ఉంటే అందరికి ఆర్థిక సమానత్వం ఎప్పటికి సాధ్యమవుతుందని ప్రశ్నించారు. గుంటూరులోని ఏపీ కాటన్స్ అసోసియేషన్ హాల్లో శనివారం రాత్రి భారత రాజ్యాంగ పీఠికలో పేర్కొన్న ప్రతి ఒక్కరికి ఆర్థిక, రాజకీయ, సామాజిక న్యాయం లక్ష్యాలు ఏమేరకు నెరవేరాయి అనే అంశంపై అఖిల భారత న్యాయవాదుల సంఘం(ఐలు) గుంటూరు యూనిట్ ఆధ్వర్యంలో జరిగిన సెమినార్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై కీలకోపన్యాసం చేశారు. కేంద్ర, రాష్ట్రాలు సమష్టిగా పనిచేసి దేశంలో ఆర్థిక, సామాజిక న్యాయ ఫలాలు అనేవి ప్రతి ఒక్కరికి అందించటానికి కృషి జరగాలని ఆకాంక్షించారు. అట్టడుగున ఉన్న వారికి ఆర్థిక ఫలాలు అందినప్పుడే ఆర్థిక స్వాతంత్య్రం వచ్చినట్లుగా భావించాలన్నారు. కుల,మత, ప్రాంతాలకతీతంగా విలువలతో కూడిన విద్యను అందించటం ద్వారానే ప్రతి ఒక్కరిలో మార్పు వస్తుంది. దేశంలో అనేక చట్టాలు, నిబంధనలు ఉన్నాయి. కానీ ఆచరణలో వాటి అమలు సరిగా లేక నీరుగారిపోతున్నాయని ఆవేదన చెందారు. ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ రాజకీయ రంగం వ్యాపారమయంగా మారిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్ధిక, సామాజికరంగాల్లో న్యాయం కోసం ప్రజలు నిలదీయాలని అప్పుడే మార్పు సాధ్యపడుతుందన్నారు. సమావేశంలో ఐలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రముఖ న్యాయవాది నర్రా శ్రీనివాసరావు, మరో న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు, జేకేసీ న్యాయకళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్ సుధాకర్బాబు, గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పాలడుగు వెంకటేశ్వర్లు, గుంటూరు యూనిట్ ఐలు అధ్యఋక్షుడు సయ్యద్బాబు తదితరులు హాజరై మాట్లాడారు. పలువురు న్యాయవాదులు, న్యాయ విద్యార్థులు, పుర ప్రముఖులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కన్నేసి.. కబ్జా చేసి..!
[ 24-04-2024]
వైకాపా నేతలు అధికారం అండతో అయిదేళ్లు బరితెగించారు. యథేచ్ఛగా పేదల భూములు ఆక్రమించారు. దేవుడి మాన్యాలను వదల్లేదు. ఖాళీ స్థలాలు, ప్రభుత్వ, వాగులు, వంకలు, డొంక రోడ్లు కావేవి కబ్జాకు అనర్హం అన్నట్లు భూదందాలు సాగించారు. -
వైకాపా పాలనలో బాదుడే.. బాదుడు
[ 24-04-2024]
పొన్నూరు నియోజకవర్గంలో సుమారు 55,275 విద్యుత్తు సర్వీసులు ఉన్నట్లు విద్యుత్తుశాఖ అధికారక గణాంకాలు వెల్లడించాయి. -
నాడంతా నటన.. ఓటేశాక వంచన..
[ 24-04-2024]
చంద్రబాబు పాలనలో విద్యుత్తు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయి. మేం అధికారంలోకి వచ్చాక విద్యుత్తు ఛార్జీలు పెంచబోం. -
అంతా... మా ఇష్టం
[ 24-04-2024]
పొన్నూరు రిటర్నింగ్ కార్యాలయం మార్పు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల అధికారులు అవగాహన లోపంతో తీసుకున్న నిర్ణయంతో గుంటూరు-బాపట్ల ప్రధాన రహదారిలో రాకపోకలు సాగించే వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. -
ఇదేమి చోద్యం జగన్!
[ 24-04-2024]
విజయవాడ, గుంటూరు నగరాలతో పాటు శివారు ప్రాంతాలను కలిపితే జనాభా 30 లక్షలకుపైనే. ఈ రెండు నగరాల మధ్య జాతీయ రహదారి మీదుగా నిత్యం కొన్ని వేల వాహనాలు -
కోన రఘుపతి.. ఓ భూబకాసురుడు
[ 24-04-2024]
దొంగలు, భూబకాసురులు, అవినీతిపరులకు సీఎం జగన్ వైకాపా తరఫున ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. -
శివాలెత్తిన ఎస్సై నాగశివారెడ్డి
[ 24-04-2024]
ఎమ్మెల్యే ఏలూరి నామినేషన్ పత్రాలు అందజేసేందుకు మంగళవారం పర్చూరు ఆర్వో కార్యాలయానికి వచ్చిన సందర్భంలో అక్కడ విధుల్లో ఉన్న ఎస్సై నాగశివారెడ్డి తెదేపా పర్చూరు మండల అధ్యక్షుడు షేక్ షంషుద్దీన్ను అసభ్య పదజాలంతో దూషించారు. -
నాదెండ్ల మనోహర్ నామినేషన్
[ 24-04-2024]
జనసేన, తెదేపా, భాజపా కూటమి తెనాలి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ బుధవారం నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ఆయన కార్యాలయ వర్గాలు మంగళవారం తెలిపాయి. -
అట్టహాసంగా తెదేపా అభ్యర్థుల నామినేషన్
[ 24-04-2024]
తెదేపా బాపట్ల లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు తెన్నేటి కృష్ణప్రసాద్, వేగేశన నరేంద్రవర్మ నామినేషన్ల కార్యక్రమం మంగళవారం అట్టహాసంగా జరిగింది. -
రోడ్డుపై రోడ్డు
[ 24-04-2024]
ప్రజాధనం దుర్వినియోగానికి ఇది పరాకాష్ఠ. ఓ అధికార పార్టీ నాయకుడు చెప్పాడని..పదేపదే స్పందన, సీఎంవోకు ఫిర్యాదులు చేస్తున్నాడన్న కారణంతో అధికారులు గుంటూరు పలకలూరురోడ్డు సాయిబాబానగర్ ప్రధాన రోడ్డులో బాగున్న సీసీ రహదారిపైనే యథావిధిగా మరో రోడ్డు వేస్తున్నారు. -
పండగ చేస్తానన్నావ్.. ప్రాణాలు తీస్తున్నావ్
[ 24-04-2024]
వ్యవసాయం దండగ కాదు.. పండగ చేస్తామని ఊదరగొట్టిన ముఖ్యమంత్రి జగన్ ఆచరణలో రైతులను గాలికొదిలేశారు. సాగుకు బ్యాంకుల నుంచి రుణాలు అందక.. అధిక వడ్డీలకు తెచ్చి పంట పండిస్తే గిట్టుబాటు ధర దక్కక రైతు కునారిల్లాడు.. -
‘పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసిన సీఎం’
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్ మెడికల్ సీట్లను కూడా వదల్లేదని కేటగిరీల వారీగా విభజించి పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసి సీట్లను అమ్ముకున్నారని యువనేత, -
‘తెనాలిని గంజాయికి అడ్డాగా మార్చేశారు’
[ 24-04-2024]
ఆంధ్రా ప్యారిస్ను ఇక్కడి సిటింగ్ వైకాపా ఎమ్మెల్యే గంజాయి అడ్డాగా మార్చారని పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల ఆరోపించారు.