నాట్కో క్యాన్సర్ కేంద్రం రోగులకు వరం..
క్యాన్సర్ చికిత్స అంటే మాటలు కాదు. వ్యాధి నిర్ధారణకు చేపట్టే పరీక్షల నుంచి చికిత్స కోసం వాడే మందుల వరకు అంతా రూ.లక్షలతోనే వ్యవహారం. ఆర్థికంగా స్థాయి ఉన్నవారు కూడా కొన్నిసార్లు భరించలేని పరిస్థితి. ఇక పేదలు, మధ్య తరగతి ప్రజల సంగతి వేరే చెప్పాల్సిన పనే లేదు.
అందుబాటులోకి అత్యాధునిక యంత్రాలు
ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.8.52 కోట్లు
క్యాన్సర్ చికిత్స అంటే మాటలు కాదు. వ్యాధి నిర్ధారణకు చేపట్టే పరీక్షల నుంచి చికిత్స కోసం వాడే మందుల వరకు అంతా రూ.లక్షలతోనే వ్యవహారం. ఆర్థికంగా స్థాయి ఉన్నవారు కూడా కొన్నిసార్లు భరించలేని పరిస్థితి. ఇక పేదలు, మధ్య తరగతి ప్రజల సంగతి వేరే చెప్పాల్సిన పనే లేదు. ఈ నేపథ్యంలో కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా క్యాన్సర్ బాధితులకు ఉచితంగా సేవలు అందించేందుకు సర్వజనాసుపత్రిలో ‘నన్నపనేని లోకాదిత్యుడు, సీతారావమ్మ స్మారక నాట్కో క్యాన్సర్ సెంటర్’ను రూ.45 కోట్ల వ్యయంతో నాట్కో ట్రస్టు నిర్మించి ప్రభుత్వానికి అప్పగించింది. రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లతో ఆధునిక పరికరాలను సమకూర్చింది. ఈ కేంద్రాన్ని 2020, జులై 1న ప్రారంభించారు. అది ప్రారంభించి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ‘న్యూస్టుడే’ అందిస్తున్న ప్రత్యేక కథనం.
నాట్కో ట్రస్టు సాయం
నాట్కో క్యాన్సర్ కేంద్రానికి వచ్చే రోగులకు అవసరమైన కొన్ని ఔషధాలను ఉచితంగా అందజేస్తున్నారు. నాట్కో ట్రస్టు ద్వారా గత రెండేళ్లలో సుమారు రూ.2 కోట్ల విలువైన మందులను సూపరింటెండెంట్కు అందజేశారు. ఆ భవన నిర్వహణకు ప్రతి నెలా రూ.5 లక్షలు ఖర్చు చేస్తున్నారు. తాజాగా రూ.కోటి వ్యయంతో మామోగ్రామ్ పరికరాన్ని కొనుగోలు చేస్తున్నారు.
సీటీ సిమ్యులేటర్
శరీరంలోని అన్ని భాగాలను ఐదారు నిమిషాల్లోనే స్కాన్ చేస్తుంది. క్యాన్సర్ కణితులను గుర్తిస్తుంది. క్యాన్సర్ గడ్డ పరిమాణం ఎంత? ఏ మేరకు రేడియోథెరపీ ఇవ్వాలి? తదితర పరీక్షలన్నీ సీటీ సిమ్యులేటర్ యంత్రంపై నిర్ధారిస్తారు. అనంతరం రేడియోథెరపీ చికిత్స చేస్తారు.
నమూనా కేంద్రం
నాట్కో క్యాన్సర్ కేంద్రాన్ని ఓ నమూనా ఆసుపత్రిగా తీర్చిదిద్దాలని ప్రభుత్వ సంకల్పం. దీని నమూనాను, ఇక్కడ రోగులకు అందుతున్న సేవలను రాష్ట్రంలోని ఇతర ప్రభుత్వాసుపత్రుల్లోనూ అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్ర విభజన అనంతరం క్యాన్సర్ రోగులకు ఇది రిఫరల్ ఆసుపత్రిగా మారింది.
బ్రాకీ థెరపీ
గర్భాశయ ముఖద్వార(సర్వైకల్) క్యాన్సర్ రోగులకు ఈ పరికరంతో ఎంతో ప్రయోజనం కలుగుతోంది. గతంలో వీరికి చికిత్స అందించేందుకు 18 గంటల సమయం పట్టేది. అప్పటి వరకు రోగి ఆసుపత్రిలోనే ఉండాల్సి వచ్చేది. ఈ ఆధునిక పరికరం అందుబాటులోకి వచ్చిన తర్వాత కేవలం 15 నిమిషాల్లోనే చికిత్స పూర్తవుతుంది. కణితి మళ్లీ పెరగకుండా గురి చూసి చికిత్స అందిస్తారు.
లీనియర్ యాక్సిలేటర్ యంత్రం
క్యాన్సర్ రోగులకు రేడియేషన్ థెరపీ ఇచ్చేందుకు అత్యంత ఆధునిక యంత్రం లీనియర్ యాక్సిలేటర్ పరికరం అందుబాటులో ఉంది. ఈ నూతన పరికరంతో క్యాన్సర్ కణితి ఎక్కడుందో, రేడియేషన్ ఎక్కడివ్వాలో సరిగ్గా దాన్ని కేంద్రంగా తీసుకుని.. చుట్టూ అన్ని వైపుల నుంచీ రేడియేషన్ ఇస్తూ పోతారు. దీనివల్ల సాధారణ కణజాలం ప్రభావితం కాదు. ఇటువంటి పరికరం రాష్ట్రంలోని ఏ ప్రభుత్వాసుపత్రిలోనూ ఇప్పటి వరకు అందుబాటులో లేదు. రేడియేషన్ ఇచ్చే సమయంలో బాధా ఉండదు. కానీ క్యాన్సర్ కణజాలం మాత్రం రేడియేషన్ ప్రభావానికి గురై క్రమేపీ నశించిపోతుంటుంది.
సమర్థ చికిత్సలతో
సర్వజనాసుపత్రి నాట్కో క్యాన్సర్ కేంద్రానికి వస్తే క్యాన్సర్ను జయించవచ్చనే నమ్మకం బాధితుల్లో కలుగుతోంది. అందువల్లే కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందినప్పటికీ ఫలితం కనిపించక ప్రాణాపాయస్థితిలో వస్తున్నవారూ అధికంగానే ఉంటున్నారు. రోగుల వివరాలను ఆరోగ్యశ్రీ పథకంలో నమోదు చేసి చికిత్స అందించినందున జీజీహెచ్కి రూ.8.52 కోట్ల ప్రోత్సాహక నగదు అందింది.
జట్టుగా.. కలిసికట్టుగా వ్యూహం
క్యాన్సర్ చికిత్స అన్నది చాలా సందర్భాల్లో ఎవరో ఒక వైద్యుడితో అయిపోయేది కాదు. భిన్న విభాగాలకు చెందిన వైద్యులు ఒక జట్టుగా ఏర్పడి, ఇవ్వాల్సిన చికిత్స గురించి సమగ్రంగా చర్చించి, వాళ్ల అభిప్రాయాలను తీసుకుని ఆ ప్రకారం చికిత్స చేయడం వల్లే జీజీహెచ్లో రోగులకు పూర్తి ప్రయోజనం దక్కుతుంది. ఇక్కడికి వచ్చే రోగులను ఆహ్లాదకరమైన వాతావరణంలో చికిత్స అందించేవిధంగా మౌలిక సదుపాయాలు కల్పించారు. క్యాన్సర్ ఆనవాళ్లను తొలి దశలోనే పట్టుకునే యంత్రాలను అందుబాటులోకి తెచ్చారు. ప్రజల్లో క్యాన్సర్ వ్యాధి పట్ల, దీని లక్షణాలను ముందే గుర్తించడం పట్ల అవగాహన పెంచుతున్నారు. క్యాన్సర్ను నిర్మూలించే కీమోథెరపీ, రేడియోథరపీ, శస్త్రచికిత్స విధానాలు అందుబాటులో ఉన్నాయి. క్యాన్సర్ చికిత్సకు ఆంకాలజిస్ట్లే కాదు, అనుభవజ్ఞులైన పెథాలజిస్ట్లు, రేడియాలజిస్ట్లు, ఫిజిస్ట్ ఇలా అందరూ ఉన్నందున రోగులకు మెరుగైన చికిత్స సాధ్యమవుతోంది. నూతనంగా శస్త్రచికిత్స మందిరాన్ని నిర్మించినందున ఈ కేంద్రంలోనే శస్త్రచికిత్సలను ప్రారంభించారు. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా అత్యాధునిక వైద్య సేవలను అందిపుచ్చుకుంటూ ఉచితంగా నాణ్యమైన సేవలు అందిస్తోంది.
రోగులు ఏం చేయాలి
సర్వజనాసుపత్రికి చికిత్సకు వచ్చేవారు సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు నాట్కో క్యాన్సర్ కేంద్రంలో తమ పేర్లను నమోదు చేసుకోవాలి. అక్కడి నుంచి వైద్యుల వద్దకు పంపుతారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే తప్పకుండా తీసుకురావాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ డీజీపీని బదిలీచేయండి: ఎన్నికల సంఘానికి భాజపా ఫిర్యాదు
[ 25-04-2024]
డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డిని బదిలీ చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయంలో భాజపా నేతలు మరోమారు ఫిర్యాదు చేశారు. -
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం: సినీ నటుడు నిఖిల్
[ 25-04-2024]
బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్థి ఎం.ఎం కొండయ్య గురువారం అట్టహాసంగా నామినేషన్ వేశారు. -
ఏపీలో ముగిసిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ
[ 25-04-2024]
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. -
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు: నారా లోకేశ్
[ 25-04-2024]
ఓట్లు అడగడానికి వచ్చే వైకాపా నేతలను రాజధాని రైతులు నిలదీయాలని యువనేత, మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. -
చదువులమ్మ చెట్టుకు.. రాజకీయ చెద!
[ 25-04-2024]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేరెన్నికగన్న పురాతన విద్యాసంస్థల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఒకటి. దేశ, విదేశాల్లో ఎంతో ఖ్యాతినార్జించిన ఘనత దీని సొంతం. దాదాపు పది, పదిహేను దేశాల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకునేవారు. -
యూజీడీ మూలన.. మాటలు మరుగున
[ 25-04-2024]
నా ముస్లింలు.. నా మైనార్టీలు అంటూ మాటలతో మభ్యపెట్టడమే గానీ సీఎం జగన్కు వారిపై ఏమాత్రం ప్రేమలేదని చెప్పడానికి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తికాని ఉదంతమే నిదర్శనం. -
నాడు వాతలుండవని కోతలు.. నేడు ఛార్జీల మోతలు
[ 25-04-2024]
ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్రెడ్డి రాష్ట్రమంతా తిరిగి చంద్రబాబు పాలనలో కరెంటు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయని విమర్శించారు. తాను అధికారంలోకి వచ్చాక విద్యుత్తు ఛార్జీలు పెంచబోమని హామీనిచ్చారు. -
అభిమాన నీరాజనం
[ 25-04-2024]
జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ నామినేషన్ సందర్భంగా బుధవారం తెనాలిలో నిర్వహించిన ప్రదర్శనకు ప్రజలు భారీగా తరలివచ్చారు. -
పసుపుమయమైన రేపల్లె
[ 25-04-2024]
రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నామినేషన్ దాఖలు కార్యక్రమం బుధవారం కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది. -
అక్రమంగా తవ్వారు.. ప్రాణాలు తీస్తున్నారు!
[ 25-04-2024]
రెండేళ్ల కిందట ప్రత్తిపాడుకు చెందిన నలుగురు కళాశాల విద్యార్థులు ఈతకు బోయపాలెంలోని డైట్ సమీపంలో క్వారీ గుంత వద్దకు వెళ్లారు. -
చందా.. దందా
[ 25-04-2024]
ఎన్నికలంటే ఖర్చులు ఎలా ఉంటాయో మీకు తెలియంది కాదు. -
మిత్ర ద్రోహం
[ 25-04-2024]
పాదయాత్రలో అధికారంలోకి రాగానే గోపాల మిత్రలకు నెలకు రూ.16 వేల గౌరవవేతనం ఇస్తామని హామీ ఇచ్చి గత అయిదేళ్లుగా ఒక్క రూపాయి కూడా పెంచకుండా తమని సీఎం జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని గోపాల మిత్రలు వాపోతున్నారు. -
‘పది’లో ‘ప్రత్యేక’ విజయం
[ 25-04-2024]
అమ్మ ప్రోత్సాహం..అమ్మమ్మ పర్యవేక్షణ..భవిత కేంద్ర టీచర్ల కృషి...ప్రధానోపాధ్యాయురాలి తోడ్పాటు వెరసి 16 ఏళ్ల దివ్యాంగురాలైన జి.శ్రావ్య జోసెఫిన్ పదో తరగతి పూర్తిచేసింది. -
తెదేపా ప్రచార వాహన డ్రైవర్పై వైకాపా దాడి
[ 25-04-2024]
తెలుగుదేశం పార్టీ ప్రచార వాహన డ్రైవర్పై కొందరు వైకాపా నాయకులు దాడి చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. -
ప్రజల గొంతూ తడపలేరా?
[ 25-04-2024]
2018 మార్చి 14వ తేదీన ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి పొన్నూరులో నిర్వహించిన బహిరంగ సభలో పొన్నూరు పట్టణ ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని అప్పటి తెదేపా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. -
రాజీనామా చేయకుంటే అంతుచూస్తాం
[ 25-04-2024]
వాలంటీర్లుగా మీకు ప్రతి ఇంట్లో ఎంత మంది ఓటర్లున్నారు..ఎటు అనుకూలంగా ఉన్నారో తెలుసు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 25-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు రైల్వే అధికారి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?