Andhra News : మార్కెట్ నాడిపట్టి.. లాభాలు కొల్లగొట్టి!
ప్రతికూల వాతావరణాన్ని జయించి, అరటిలో అద్భుత దిగుబడులు సాధిస్తున్నారు జిల్లా రైతులు. ముఖ్యంగా కొల్లిపర మండల పుడమిపుత్రులు పంట నాటే సమయం, దిగుబడులు, మార్కెట్ అంశాలపై పట్టు సాధించారు. తమ అపార అనుభవాన్ని రంగరించి
కొల్లిపర అరటి రైతుల ఆదర్శ ప్రయోగం
కొల్లిపర, న్యూస్టుడే
గెలలు కొనుగోలు చేస్తున్న వ్యాపారులు
ప్రతికూల వాతావరణాన్ని జయించి, అరటిలో అద్భుత దిగుబడులు సాధిస్తున్నారు జిల్లా రైతులు. ముఖ్యంగా కొల్లిపర మండల పుడమిపుత్రులు పంట నాటే సమయం, దిగుబడులు, మార్కెట్ అంశాలపై పట్టు సాధించారు. తమ అపార అనుభవాన్ని రంగరించి ప్రధాన మార్కెట్లలో ఎక్కడా పంట లభ్యంకాని ఈ కాలంలో దిగుబడులు వచ్చేలా ప్రణాళిక రచించుకొని, ప్రస్తుతం భారీ లాభాలు చవిచూస్తున్నారు. స్థానిక మార్కెట్లో ప్రస్తుతం ఒక్కో అరటి గెలను కాయలను బట్టి రూ.600 నుంచి రూ.1009 వరకు విక్రయిస్తున్నారు. మార్చి మాసాంతానికి 1788 హెక్టార్లలో ఇక్కడ అరటి పంట సాగులో ఉంది. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో 544 హెక్టార్లలోని పంట నుంచి దిగుబడులు వస్తున్నాయి. తెనాలి క్లస్టర్ పరిధిలో 345 హెక్టార్లలో ఈ పంట సాగులో ఉంది.
అరటి జనవరి, ఫిబ్రవరి, మార్చి మాసాలతో ముగుస్తుంది. ఆ సమయంలో పలు ప్రాంతాల్లో పంట దిగుబడులు అధికం. గతంలో సాగు తెచ్చిన నష్టాలు ఇక్కడి రైతులకు అనుభవాలు నేర్పించాయి. దీంతో వీరు మొక్క నాటే సమయం, దిగుబడుల కాలాన్ని చక్కగా అంచనా వేస్తున్నారు. దిగుబడులు జూన్, జులై, అగస్టు మాసాల్లో వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అత్యధిక ధరలు పలికే కర్పూర, అమృతపాణి తదితర రకాలకు ప్రాధాన్యమిస్తున్నారు.
ప్రతికూల వాతావరణాన్ని జయించారు..అరటి సాగులో యాజమాన్య పద్ధతులు కీలకం. అకాల వర్షం, ఈదురు గాలుల నుంచి పంటలను కాపాడుకోవడం ముఖ్యం. ఈ క్రమంలో గాలుల నుంచి మొక్కలను కాపాడుకునేందుకు రూ.లక్షలు వెచ్చించి వెదురు బొంగులు పాతి, మొక్కలు నేలకొరగకుండా ఆసరా పెట్టారు. బిందు సేద్యంతో వ్యవసాయ ఖర్చులు తగ్గించుకున్నారు. ఫలితంగా ఎరువుల వినియోగం, కలుపు వ్యయం గణనీయంగా తగ్గాయి. ఎకరాకు 850 నుంచి వెయ్యి మొక్కలు నాటారు.
మార్కెట్ అనుకూలం.. కర్నూలు జిల్లా మహానంది, కోనసీమ జిల్లాలోని రావులపాలెం, మహారాష్ట్రలోని నాందేడ్, చెన్నై మార్కెట్లు అరటి వ్యాపారానికి ప్రసిద్ధి. ఈ ప్రాంతాల్లో పంట దిగుబడులపై ప్రతికూల వాతావరణం తీవ్ర ప్రభావం చూపింది. దిగుబడులు గణనీయంగా తగ్గాయి. జులై, అగస్టు మాసాలు పంట దిగుబడి కాలం కానందున అరటిగెలలు తక్కువ సంఖ్యలో మార్కెట్లకు వస్తాయి. ఇది స్థానిక మార్కెట్కు కలసివచ్చింది.
తొలిసారిగా..
- దొప్పలపూడి రామయ్య, అన్నవరం
గడచిన కొన్నేళ్లుగా అరటిసాగు చేస్తున్నాం. పంట కాలంలో మార్పు అనివార్యమనుకున్నాం. పండగ వేళల్లో అరటికి మంచి డిమాండే వస్తున్న విషయాన్ని గుర్తించాం. సాగు చేపట్టే కాలంలో మార్పులు తీసుకొచ్చాం. ఇప్పుడు మార్కెట్లో గెలలకు మంచి ధర పలుకుతోంది. గెల రూ.1009 ధరకు విక్రయించాను.
లాభాలపంట
- బొల్లు రామయ్య, పిడపర్తి
మూడెకరాల్లో అరటి సాగు చేపట్టా. పెట్టుబడులకు వెరవ లేదు. తుపాను, ఈదురుగాలుల నుంచి పంటను కాపాడుకునేందుకు వెదురు బొంగులు ఏర్పాటుచేశా. సంతలో గెల రూ.900 ధర పలికింది. ఎకరాకు రూ.3 లక్షల ఆదాయం వస్తుందని ఆశిస్తున్నా.
టిష్యూ కల్చర్కు ప్రోత్సాహం
- కె.విజయమోహన్, ఉద్యానశాఖ అధికారి
అరటి సాగులో టిష్యూ కల్చర్ను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. హెక్టారుకు రూ.30,739 రాయితీగా అందిస్తోంది. టిష్యూ కల్చర్ సాగుతో లాభాలు అధికం. ఒకేసారి పంట దిగుబడి వస్తుంది. నాణ్యమైన ఉత్పత్తులకు దోహదపడుతుంది. తెనాలి క్లస్టర్ పరిధిలోని బొమ్మువానిపాలెంలో 5 ఎకరాల విస్తీర్ణంలో టిష్యూ కల్చర్ సాగును కొనసాగిస్తున్నాం. రైతులు మంచి దిగుబడులు సాధించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం: సినీ నటుడు నిఖిల్
[ 25-04-2024]
బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్థి ఎం.ఎం కొండయ్య గురువారం అట్టహాసంగా నామినేషన్ వేశారు. -
ఏపీలో ముగిసిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ
[ 25-04-2024]
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. -
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు: నారా లోకేశ్
[ 25-04-2024]
ఓట్లు అడగడానికి వచ్చే వైకాపా నేతలను రాజధాని రైతులు నిలదీయాలని యువనేత, మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. -
చదువులమ్మ చెట్టుకు.. రాజకీయ చెద!
[ 25-04-2024]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేరెన్నికగన్న పురాతన విద్యాసంస్థల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఒకటి. దేశ, విదేశాల్లో ఎంతో ఖ్యాతినార్జించిన ఘనత దీని సొంతం. దాదాపు పది, పదిహేను దేశాల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకునేవారు. -
యూజీడీ మూలన.. మాటలు మరుగున
[ 25-04-2024]
నా ముస్లింలు.. నా మైనార్టీలు అంటూ మాటలతో మభ్యపెట్టడమే గానీ సీఎం జగన్కు వారిపై ఏమాత్రం ప్రేమలేదని చెప్పడానికి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తికాని ఉదంతమే నిదర్శనం. -
నాడు వాతలుండవని కోతలు.. నేడు ఛార్జీల మోతలు
[ 25-04-2024]
ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్రెడ్డి రాష్ట్రమంతా తిరిగి చంద్రబాబు పాలనలో కరెంటు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయని విమర్శించారు. తాను అధికారంలోకి వచ్చాక విద్యుత్తు ఛార్జీలు పెంచబోమని హామీనిచ్చారు. -
అభిమాన నీరాజనం
[ 25-04-2024]
జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ నామినేషన్ సందర్భంగా బుధవారం తెనాలిలో నిర్వహించిన ప్రదర్శనకు ప్రజలు భారీగా తరలివచ్చారు. -
పసుపుమయమైన రేపల్లె
[ 25-04-2024]
రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నామినేషన్ దాఖలు కార్యక్రమం బుధవారం కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది. -
అక్రమంగా తవ్వారు.. ప్రాణాలు తీస్తున్నారు!
[ 25-04-2024]
రెండేళ్ల కిందట ప్రత్తిపాడుకు చెందిన నలుగురు కళాశాల విద్యార్థులు ఈతకు బోయపాలెంలోని డైట్ సమీపంలో క్వారీ గుంత వద్దకు వెళ్లారు. -
చందా.. దందా
[ 25-04-2024]
ఎన్నికలంటే ఖర్చులు ఎలా ఉంటాయో మీకు తెలియంది కాదు. -
మిత్ర ద్రోహం
[ 25-04-2024]
పాదయాత్రలో అధికారంలోకి రాగానే గోపాల మిత్రలకు నెలకు రూ.16 వేల గౌరవవేతనం ఇస్తామని హామీ ఇచ్చి గత అయిదేళ్లుగా ఒక్క రూపాయి కూడా పెంచకుండా తమని సీఎం జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని గోపాల మిత్రలు వాపోతున్నారు. -
‘పది’లో ‘ప్రత్యేక’ విజయం
[ 25-04-2024]
అమ్మ ప్రోత్సాహం..అమ్మమ్మ పర్యవేక్షణ..భవిత కేంద్ర టీచర్ల కృషి...ప్రధానోపాధ్యాయురాలి తోడ్పాటు వెరసి 16 ఏళ్ల దివ్యాంగురాలైన జి.శ్రావ్య జోసెఫిన్ పదో తరగతి పూర్తిచేసింది. -
తెదేపా ప్రచార వాహన డ్రైవర్పై వైకాపా దాడి
[ 25-04-2024]
తెలుగుదేశం పార్టీ ప్రచార వాహన డ్రైవర్పై కొందరు వైకాపా నాయకులు దాడి చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. -
ప్రజల గొంతూ తడపలేరా?
[ 25-04-2024]
2018 మార్చి 14వ తేదీన ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి పొన్నూరులో నిర్వహించిన బహిరంగ సభలో పొన్నూరు పట్టణ ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని అప్పటి తెదేపా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. -
రాజీనామా చేయకుంటే అంతుచూస్తాం
[ 25-04-2024]
వాలంటీర్లుగా మీకు ప్రతి ఇంట్లో ఎంత మంది ఓటర్లున్నారు..ఎటు అనుకూలంగా ఉన్నారో తెలుసు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 25-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు రైల్వే అధికారి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు