logo

అమ్మఒడి వచ్చిందా..? రాలేదు!

ఆజాదీకా అమృత్‌ మహోత్సవాల వేళ తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి చేదు అనుభవం ఎదురైంది.

Updated : 07 Aug 2022 06:42 IST

ఆజాదీకా అమృత్‌ మహోత్సవాల వేళ తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి చేదు అనుభవం ఎదురైంది. గుంటూరులో తిరంగా ర్యాలీ అనంతరం ఎన్‌టీఆర్‌ స్టేడియంలో సభ నిర్వహించారు. ఈ సందర్భంలో మాట్లాడుతూ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాకే నిజమైన స్వాతంత్య్రం వచ్చిందని అన్నారు. అనంతరం ‘అమ్మఒడి’ వచ్చిందా అని అడగ్గా రాలేదంటూ విద్యార్థులు చేతులు అడ్డంగా ఊపడంతో ఆమె నిరాశచెందారు. తాను స్వాతంత్య్రం గురించి అడుగుతున్నానంటూ ప్రసంగం ముగించారు.

- ఈనాడు గుంటూరు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని