ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెన్షన్
‘చదువు రాని వాడికి తిండి దండగ’ అని ఓ విద్యార్థిని చీదరించుకున్న ఉదంతంలో బాధ్యులైన ఇద్దరు ఉపాధ్యాయులపై గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి పి.శైలజ మంగళవారం సస్పెన్షన్ వేటు వేశారు. గుంటూరు వేణుగోపాల్నగర్లోని
విద్యార్థి ఆత్మహత్య నేపథ్యంలో చర్యలు
ఈనాడు-అమరావతి: ‘చదువు రాని వాడికి తిండి దండగ’ అని ఓ విద్యార్థిని చీదరించుకున్న ఉదంతంలో బాధ్యులైన ఇద్దరు ఉపాధ్యాయులపై గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి పి.శైలజ మంగళవారం సస్పెన్షన్ వేటు వేశారు. గుంటూరు వేణుగోపాల్నగర్లోని కోనబాల ప్రభాకర్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ బాలుడిని కొద్దిరోజుల క్రితం ఇద్దరు ఉపాధ్యాయులు కించపరిచేలా మాట్లాడటంతో మనస్తాపం చెంది రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. దీన్ని తీవ్రంగా పరిగణించిన డీఈఓ తొలుత ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయులు రమాదేవి, హైమారావుపై సస్పెండ్ వేటువేసి విచారణకు ఆదేశించారు. హెచ్ఎం మంజులత మరో ఉపాధ్యాయురాలు కల్యాణికి షోకాజ్ నోటిసులిచ్చారు. డివిజన్ ఉప విద్యాశాఖ అధికారి సుధాకర్రెడ్డిని ఘటనపై విచారణ చేసి పూర్తిస్థాయి నివేదిక అందజేయాలన్నారు. మంగళవారం ఉదయాన్నే గుంటూరు ఎంఈఓ ఖుద్దూస్ను అసలు ఏం జరిగిందో ప్రాథమిక నివేదిక ఇవ్వాలని డీఈఓ కోరటంతో ఆయన మంగళవారం ఉదయం స్కూల్కు వెళ్లి విచారించి ప్రాథమిక నివేదిక అందజేశారు. చదువులో వెనకబడుతున్నారని, రెగ్యులారిటీ లేదని టీచర్లు కోపగించుకుని ఉండొచ్చు తప్పిస్తే అన్నం ప్లేటు లాక్కోలేదని, టీసీ తీసుకుని వెళ్లాలని సూచించలేదని సస్పెన్షన్కు గురైన ఇద్దరు ఉపాధ్యాయులు ప్రాథమిక విచారణలో తెలియజేసినట్లు సమాచారం.
సమగ్ర శిక్ష ఏపీసీ బాధ్యతలు డీఈవోకే
నగరపాలకసంస్థ(గుంటూరు), న్యూస్టుడే: గుంటూరు జిల్లా సమగ్ర శిక్ష అడిషినల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ బాధ్యతలు డీఈవో శైలజకు అప్పగిస్తూ పాఠశాల విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఎస్ఎస్ఏ ఏపీసీగా ఉన్న వెంకటప్పయ్యను గతంలోనే పల్నాడు జిల్లా నరసరావుపేట ఉపవిద్యాశాఖాధికారిగా నియమించారు. కానీ ఆయనను గుంటూరు సమగ్ర శిక్ష ఏపీసీగా రిలీవ్ చేయలేదు. తాజాగా ఆయనను రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం వెంకటప్పయ్య సత్తెనపల్లి ఉపవిద్యాశాఖాధికారిగా, పల్నాడు ఎస్ఎస్ఏ ఏపీసీగా ఇన్ఛార్జి బాధ్యతలతోపాటు డీఈవో ఇన్ఛార్జిగా కూడా వ్యవహరిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దశ‘దిశ’లా.. ఆక్రందనలే..!
[ 19-04-2024]
వైకాపా ప్రభుత్వ పదవీకాలం ముగుస్తున్నా ఇప్పటికీ ఆ చట్టానికి కోరలు లేవు. దాన్ని పార్లమెంట్ ఆమోదించలేదు. ఉనికిలో లేని చట్టం గురించి పదేపదే ప్రచారం చేసుకోవడం జగన్ సర్కార్ తీరుగా మారింది. -
జీవితాన్ని కలరా‘జే’సింది..
[ 19-04-2024]
రేపల్లెకు చెందిన మధు ప్రభుత్వ మద్యం తాగి పక్షవాతానికి గురై మంచానికి పరిమితమయ్యాడు. చేతివృత్తి చేసుకుంటూ భార్య ఇద్దరు పిల్లలను పోషించుకునే అతను మద్యం తాగేవాడు. -
సమస్యలు విలీనమై.. బడికి దూరమై..
[ 19-04-2024]
పాఠశాలల విలీనం వల్ల లాభం లేకపోగా టీచర్లకు, పిల్లలకు బాగా అన్యాయం జరిగింది. కొందరు టీచర్లు దూరాన ఉన్న ఉన్నత పాఠశాలలకు వెళ్లలేక పదోన్నతులు వదులుకోవడంతో నష్టపోయారు. అదేవిధంగా పిల్లల పరంగా చూస్తే సర్కారీ బడులకు దూరమయ్యారు. -
ఆరోగ్యం చిదిమేసి.. బతుకుల్ని బుగ్గి‘జే’సి..
[ 19-04-2024]
మద్యపాన నిషేధం చేస్తామని జగన్మోహన్రెడ్డి ఓట్లు దండుకుని తీరా అధికారంలోకి వచ్చాక ఆ మాటే మరిచారు. స్వయంగా ప్రభుత్వమే మద్యం వ్యాపారానికి తెరతీసింది. నాసిరకం మద్యం పోసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడింది. -
అండ నేనన్నావు.. గుదిబండలా మార్చావు..
[ 19-04-2024]
జిల్లాలో వైకాపా ప్రభుత్వ అయిదేళ్ల పాలనలో ఒక్క కొత్త పరిశ్రమ రాకపోగా ఉన్నవి చాలా వరకు మూతపడ్డాయి. పత్తి ఆధారిత పరిశ్రమలైన జిన్నింగ్ పూర్తిగా ఎత్తేయగా.. స్పిన్నింగ్ మిల్లులు అదే దిశగా నడుస్తున్నాయి. -
యువనేతపై ఉప్పొంగిన అభిమానం
[ 19-04-2024]
లోకేశ్ తరఫున నామినేషన్ పత్రాల సమర్పణ సందర్భంగా గురువారం మంగళగిరిలో జనసేన, భాజపా, తెదేపా, ఎమ్మార్పీఎస్ శ్రేణులు భారీ ప్రదర్శన నిర్వహించారు. -
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వినియోగానికి ఆటంకాలు
[ 19-04-2024]
వైకాపా ప్రభుత్వంపై ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. ఇదే అదనుగా పోలింగ్ విధుల్లో పాల్గొనే ఉద్యోగులు అందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోకుండా వ్యూహాత్మకంగా ఉన్నతాధికారులు ఆటంకాలు కలిగిస్తున్నారని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఆరోపిస్తున్నాయి. -
కోన ఆస్తుల విలువ రూ.24.20 కోట్లు
[ 19-04-2024]
బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే కోన రఘుపతి తన కుటుంబ ఆస్తుల విలువను రూ.24.20 కోట్లుగా గురువారం దాఖలు చేసిన ఎన్నికల నామినేషన్ అఫిడవిట్లో పేర్కొన్నారు. -
నలిగిపోతున్న నాలుగో సింహం
[ 19-04-2024]
ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ కల్పించడంలో పోలీసులు పగలు, రాత్రి కష్టపడుతుంటారు. శాంతిభద్రతలను పరిరక్షించే క్రమంలో సంఘ విద్రోహశక్తుల చేతిలో ప్రాణత్యాగాలకు సైతం వెనకాడరు. -
కర్షకుల కష్టాలు కనిపించవా..?
[ 19-04-2024]
పెదవడ్లపూడి ఉన్నత వాహినిపై ఎత్తిపోతల పథకం పూర్తి చేసి రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే ఆర్కే హామీ ఇచ్చారు. కానీ అమలు చేయడం మర్చిపోయారు. -
వైకాపా ప్రభుత్వ నిర్ణయ లోపం.. విద్యార్థులకు శాపం
[ 19-04-2024]
‘మీ పిల్లలు బడిలో భోజనం చేయకపోతే మీకు వస్తున్న ప్రభుత్వ పథకాలు నిలిచేపోయే అవకాశం ఉంది’అని తల్లిదండ్రుల సమావేశాల్లో ఉపాధ్యాయులు చెబుతున్నా.. నాణ్యత లేకపోవడంతో చాలా మంది విద్యార్థులు -
‘అవినీతి పాలనకు చరమగీతం పాడుదాం’
[ 19-04-2024]
అసమర్థ, అవినీతి పాలనకు చరమగీతం పాడుదామని గుంటూరు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. కొల్లిపరలో గురువారం సాయంత్రం నిర్వహించిన రోడ్షోలో ఆయన మాట్లాడుతూ వైకాపా పాలకులకు పోలవరం పట్టలేదు, -
ఎప్పటికి తొలగిస్తారో!
[ 19-04-2024]
పట్టణ పరిధి జీబీసీ రహదారిలో విద్యుత్తు స్తంభానికి సీఎం జగన్, స్థానిక ఎమ్మెల్యే రోశయ్య, వైకాపా నేతల ఫొటోలతో కూడిన బోర్డు ఉంది. -
మొదలైన నామినేషన్ల పర్వం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో గురువారం నుంచి జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల పర్వం మొదలైంది. ఈ క్రమంలో నెల రోజులుగా పలు విధాలుగా ప్రచార కార్యక్రమాలు చేపట్టిన పార్టీలు ఇప్పటికే నామినేషన్ పత్రాలు పూర్తి చేసి మంచి ముహూర్తం కోసం వేచి ఉన్నారు. -
ఫోన్పే చేయమన్నాడు.. అదృశ్యమయ్యాడు!
[ 19-04-2024]
అద్దంకి పురపాలక కార్యాలయం వద్ద మంచినీటి కుళాయి రుసుం చెల్లించేందుకు వచ్చిన వృద్ధుడ్ని ఓ ఘరానా దొంగ మోసగించాడు. ఈ సంఘటన గురువారం ఉదయం పురపాలక పన్నుల విభాగం వద్ద జరిగింది.