జ్వరాలతో గైర్హాజరు
పాఠశాలల్లో విద్యార్థుల హాజరుశాతం బాగా తగ్గుముఖం పడుతోంది. దీనికి పిల్లల్లో నెలకొన్న అనారోగ్య కారణాలేనని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ప్రభుత్వం ఏ రోజుకారోజు విద్యార్థుల అటెండెన్స్ను ఈ-హాజరు రూపంలో తెలుసుకుంటోంది.
పాఠశాలల్లో తగ్గుతున్న పిల్లల హాజరు
ఈనాడు-అమరావతి: పాఠశాలల్లో విద్యార్థుల హాజరుశాతం బాగా తగ్గుముఖం పడుతోంది. దీనికి పిల్లల్లో నెలకొన్న అనారోగ్య కారణాలేనని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ప్రభుత్వం ఏ రోజుకారోజు విద్యార్థుల అటెండెన్స్ను ఈ-హాజరు రూపంలో తెలుసుకుంటోంది. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల్లోపే ప్రధానోపాధ్యాయులు నేరుగా స్కూళ్ల వారీగా విద్యార్థుల హాజరు వివరాలను యాప్లో అప్లోడ్ చేస్తున్నారు. ఉన్నతాధికారులు వాటిని పరిశీలించగా వేసవి సెలవుల అనంతరం స్కూళ్లు ప్రారంభమైన తర్వాత హాజరుతో పోలిస్తే ప్రస్తుతం కొంచెం తగ్గినట్లు వెల్లడైంది. పాఠశాల విద్యాశాఖ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు సోమవారం అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులతో మాట్లాడగా కొందరేమో సీజనల్ వ్యాధుల బారిన పడ్డారని, మరికొందరు వ్యవసాయ పనులు కావటం వల్లే కుటుంబీకులతో కలిసి పొలం పనులకు వెళుతున్నారని తెలియజేశారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో కలిపి 3600 వరకు ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ప్రభుత్వ, స్థానిక సంస్థల ఆధ్వర్యంలో ఉన్నాయి. ప్రైవేటు, ఎయిడెడ్లో మరో వెయ్యి దాకా స్కూళ్లు ఉన్నాయి. వాటన్నింటిలో కలిపి 1-10 చదివే విద్యార్థులు సుమారు 5 లక్షల మంది ఉన్నారు. వీరిలో సగటున 10 నుంచి 13 శాతం మంది విద్యార్థులు స్కూళ్లకు గైర్హాజరవుతున్నారని ఉపాధ్యాయవర్గాల సమాచారం.
ఈ-హాజరుకు సిగ్నళ్ల సమస్యలు
పిల్లలు, ఉపాధ్యాయుల హాజరును ఆన్లైన్లో నమోదు చేయాలన్న ఆదేశాల్లో భాగంగా కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఉన్న స్కూళ్లల్లో సిగ్నల్స్ వంటి సాంకేతిక సమస్యలతో హాజరు నమోదుకు అవరోధం ఏర్పడుతోంది. ఒకరు హాజరు నమోదు చేసుకున్న తిరిగి రెండో వ్యక్తికి హాజరు వేయటానికి కొద్ది నిమిషాల పాటు వేచి ఉండాల్సి వస్తోంది. ఉన్నతాధికారులు ఈ-హాజరును ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం ఫిజికల్గా చూస్తే కొంచెం పిల్లలు ఎక్కువగానే ఉంటారు. ఈ ఫిజికల్ డేటా మొత్తాన్ని సాయంత్రంలోపు అప్డేట్ చేయటంతో సాయంత్రానికి కొంత గైర్హాజరీ శాతం తగ్గుతోందని, సాయంత్రం దాకా ఉన్న డేటాను పరిగనలోకి తీసుకుని ఉన్నతాధికారులు ప్రశ్నిస్తే బాగుంటుందని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
[ 24-04-2024]
ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. -
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
[ 24-04-2024]
సీఎం జగన్పై గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ను కస్టడీకి అనుమతిస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
వైఎస్ఆర్ను తిట్టిన బొత్స.. జగన్కు తండ్రి సమానులా?: షర్మిల
[ 24-04-2024]
మంత్రి బొత్స సత్యనారాయణ తండ్రి సమానులంటూ సీఎం జగన్ (YS Jagan) చేసిన వ్యాఖ్యలపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) స్పందించారు. -
కన్నేసి.. కబ్జా చేసి..!
[ 24-04-2024]
వైకాపా నేతలు అధికారం అండతో అయిదేళ్లు బరితెగించారు. యథేచ్ఛగా పేదల భూములు ఆక్రమించారు. దేవుడి మాన్యాలను వదల్లేదు. ఖాళీ స్థలాలు, ప్రభుత్వ, వాగులు, వంకలు, డొంక రోడ్లు కావేవి కబ్జాకు అనర్హం అన్నట్లు భూదందాలు సాగించారు. -
వైకాపా పాలనలో బాదుడే.. బాదుడు
[ 24-04-2024]
పొన్నూరు నియోజకవర్గంలో సుమారు 55,275 విద్యుత్తు సర్వీసులు ఉన్నట్లు విద్యుత్తుశాఖ అధికారక గణాంకాలు వెల్లడించాయి. -
నాడంతా నటన.. ఓటేశాక వంచన..
[ 24-04-2024]
చంద్రబాబు పాలనలో విద్యుత్తు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయి. మేం అధికారంలోకి వచ్చాక విద్యుత్తు ఛార్జీలు పెంచబోం. -
అంతా... మా ఇష్టం
[ 24-04-2024]
పొన్నూరు రిటర్నింగ్ కార్యాలయం మార్పు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల అధికారులు అవగాహన లోపంతో తీసుకున్న నిర్ణయంతో గుంటూరు-బాపట్ల ప్రధాన రహదారిలో రాకపోకలు సాగించే వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. -
ఇదేమి చోద్యం జగన్!
[ 24-04-2024]
విజయవాడ, గుంటూరు నగరాలతో పాటు శివారు ప్రాంతాలను కలిపితే జనాభా 30 లక్షలకుపైనే. ఈ రెండు నగరాల మధ్య జాతీయ రహదారి మీదుగా నిత్యం కొన్ని వేల వాహనాలు -
కోన రఘుపతి.. ఓ భూబకాసురుడు
[ 24-04-2024]
దొంగలు, భూబకాసురులు, అవినీతిపరులకు సీఎం జగన్ వైకాపా తరఫున ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. -
శివాలెత్తిన ఎస్సై నాగశివారెడ్డి
[ 24-04-2024]
ఎమ్మెల్యే ఏలూరి నామినేషన్ పత్రాలు అందజేసేందుకు మంగళవారం పర్చూరు ఆర్వో కార్యాలయానికి వచ్చిన సందర్భంలో అక్కడ విధుల్లో ఉన్న ఎస్సై నాగశివారెడ్డి తెదేపా పర్చూరు మండల అధ్యక్షుడు షేక్ షంషుద్దీన్ను అసభ్య పదజాలంతో దూషించారు. -
నాదెండ్ల మనోహర్ నామినేషన్
[ 24-04-2024]
జనసేన, తెదేపా, భాజపా కూటమి తెనాలి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ బుధవారం నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ఆయన కార్యాలయ వర్గాలు మంగళవారం తెలిపాయి. -
అట్టహాసంగా తెదేపా అభ్యర్థుల నామినేషన్
[ 24-04-2024]
తెదేపా బాపట్ల లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు తెన్నేటి కృష్ణప్రసాద్, వేగేశన నరేంద్రవర్మ నామినేషన్ల కార్యక్రమం మంగళవారం అట్టహాసంగా జరిగింది. -
రోడ్డుపై రోడ్డు
[ 24-04-2024]
ప్రజాధనం దుర్వినియోగానికి ఇది పరాకాష్ఠ. ఓ అధికార పార్టీ నాయకుడు చెప్పాడని..పదేపదే స్పందన, సీఎంవోకు ఫిర్యాదులు చేస్తున్నాడన్న కారణంతో అధికారులు గుంటూరు పలకలూరురోడ్డు సాయిబాబానగర్ ప్రధాన రోడ్డులో బాగున్న సీసీ రహదారిపైనే యథావిధిగా మరో రోడ్డు వేస్తున్నారు. -
పండగ చేస్తానన్నావ్.. ప్రాణాలు తీస్తున్నావ్
[ 24-04-2024]
వ్యవసాయం దండగ కాదు.. పండగ చేస్తామని ఊదరగొట్టిన ముఖ్యమంత్రి జగన్ ఆచరణలో రైతులను గాలికొదిలేశారు. సాగుకు బ్యాంకుల నుంచి రుణాలు అందక.. అధిక వడ్డీలకు తెచ్చి పంట పండిస్తే గిట్టుబాటు ధర దక్కక రైతు కునారిల్లాడు.. -
‘పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసిన సీఎం’
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్ మెడికల్ సీట్లను కూడా వదల్లేదని కేటగిరీల వారీగా విభజించి పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసి సీట్లను అమ్ముకున్నారని యువనేత, -
‘తెనాలిని గంజాయికి అడ్డాగా మార్చేశారు’
[ 24-04-2024]
ఆంధ్రా ప్యారిస్ను ఇక్కడి సిటింగ్ వైకాపా ఎమ్మెల్యే గంజాయి అడ్డాగా మార్చారని పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
-
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
-
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
-
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు