సాగర్ వైపు కృష్ణమ్మ పరుగులు
శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరదనీరు వచ్చి చేరుతుండటంతో దిగువనున్న నాగార్జునసాగర్ వైపు కృష్ణమ్మ వేగంగా పరుగులు తీస్తోంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకుగాను 580 అడుగులకు చేరువయ్యింది.
580 అడుగులకు చేరువలో నీటిమట్టం
నీటి కళతో జలాశయం
మాచర్ల, న్యూస్టుడే: శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరదనీరు వచ్చి చేరుతుండటంతో దిగువనున్న నాగార్జునసాగర్ వైపు కృష్ణమ్మ వేగంగా పరుగులు తీస్తోంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకుగాను 580 అడుగులకు చేరువయ్యింది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు 578 అడుగుల నీటిమట్టం దాటింది. శ్రీశైలం జలాశయానికి జూరాల, సుంకేసుల నుంచి మొత్తం 2.46 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం నుంచి సాగర్కు క్రస్ట్గేట్లు, ఏపీ, తెలంగాణ విద్యుదుత్పాదన కేంద్రాల నుంచి ఇన్ఫ్లోగా 1.91 లక్షల క్యూసెక్కులు విడుదలవుతోంది. పూర్తిస్థాయి సామర్థ్యం 312.04 టీఎంసీలుకాగా ప్రస్తుతం 276.09 టీఎంసీలకు చేరుకుంది. సాగర్ నీటిమట్టం 585 అడుగులు దాటిన తరువాత ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే నీటిని అంచనా వేస్తూ క్రస్ట్గేట్లు ఎత్తేందుకు జలవనరుల శాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి మరో 10 అడుగులు మాత్రమే ఉండటంతో జలశోభ సంతరించుకుంది. భారీగా వీస్తున్న గాలులకు జలాశయంలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. లాంచీ స్టేషన్లో లాంచీలు గట్టుకు చేరాయి. ప్రాజెక్టు వద్ద శోభను తిలకించేందుకు పర్యాటకులు బారులుదీరుతున్నారు. మంగళవారం మొహర్రం సందర్భంగా సెలవురోజు కావడంతో పర్యాటకులు తరలివచ్చారు. వాతావరణం చల్లగా ఉండటం, సన్నటి చిరుజల్లులు పడుతుండటంతో పర్యాటకులను మంత్రముగ్దుల్ని చేసింది.
పులిచింతలలో వరద నీరు విడుదల
అచ్చంపేట, న్యూస్టుడే: పులిచింతల ప్రాజెక్టులో మంగళవారం రాత్రి 7 గంటలకు వరద నీటి విడుదల కొనసాగుతోంది. ప్రాజెక్టు 13, 14, 18వ నంబరు రేడియల్ గేట్లను 1.5 మీటర్ల ఎత్తులో తెరిచి 41,418 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తికి 10,000, లీకేజి ద్వారా మరో 400 కలిపి మొత్తం 51,818 క్యూసెక్కుల నీరు దిగువకు ప్రకాశం బ్యారేజీకి వెళ్తోందని ఏఈఈ రాజశేఖర్ తెలిపారు. ఎగువ నాగార్జునసాగర్, టైల్పాండ్ ద్వారా 30,210 క్యూసెక్కుల నీరు వచ్చి చేరిందన్నారు. ప్రాజెక్టులో 40.02 టీఎంసీల నీరు నిల్వ ఉందని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోడ్ ఉన్నా.. అంబటికి లేనట్లే!
[ 28-03-2024]
ఎన్నికల నిబంధనలు అధికార పార్టీకి వర్తించవా.. ప్రతిపక్ష పార్టీలకే వర్తిస్తాయా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సాక్షాత్తు వైకాపా అభ్యర్థి నిబంధనలు ఉల్లంఘించి సమావేశాలు ఏర్పాటు చేశారు. -
ప్రవర్తన నియమావళి అమలుకు ప్రాధాన్యం : కలెక్టర్
[ 28-03-2024]
జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుకు ప్రాధాన్యం ఇచ్చి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ శివశంకర్ తెలిపారు. -
‘వైకాపాకు ఓటేస్తే అభివృద్ధిని అడ్డుకున్నట్లే’
[ 28-03-2024]
వైకాపా అరాచక పాలనతో ప్రజలు విసిగి పోయారని తాడికొండ నియోజకవర్గం తెదేపా మహిళా అధ్యక్షురాలు మైని గిరిజ పేర్కొన్నారు. -
‘వైకాపా నుంచి విముక్తికి ఎదురుచూస్తున్న ప్రజలు’
[ 28-03-2024]
వైకాపా ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని గుంటూరు పార్లమెంట్ తెదేపా ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. -
మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం విఫలం
[ 28-03-2024]
పట్టణ ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ పేర్కొన్నారు -
పట్టుతప్పితే.. ప్రాణాలు గల్లంతే
[ 28-03-2024]
దారుణంగా దెబ్బతిన్న రహదారి. పాదచారులే ప్రాణాలు అరచేత పట్టుకుని రాకపోకలు సాగించాల్సిన చోట ఇక వాహనదారుల సంగతి చెప్పాల్సిన పనే లేదు. ఎదురుగా ద్విచక్ర వాహనం వచ్చినా దిక్కుతోచని స్థితి వాహనదారులది -
నిధులు దోచేయ్
[ 28-03-2024]
అద్దంకి నియోజకవర్గంలోని ఓ మండలంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ చేతివాటం ప్రదర్శించి, అధికార వైకాపా నాయకుల అండదండలతో పనులు చేయకుండా భారీగా బిల్లులు మింగేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. -
ఆగని వాలంటీర్ల ప్రచారం
[ 28-03-2024]
పోటీలో ఉన్న అభ్యర్థుల తరఫున ప్రచారం చేయకూడదని ఎన్నికల సంఘం ఎంతచెప్పినా పలు గ్రామాల్లో వాలంటీర్లు ప్రచారం చేస్తూనే ఉన్నారు. -
మరో 52 మంది వాలంటీర్ల తొలగింపు
[ 28-03-2024]
ఈనెల 16న ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి అంబటి మురళీకృష్ణ చేబ్రోలు, పెదకాకానిలో వాలంటీర్లతో సమావేశం నిర్వహించారు -
ఆర్టీసీ నగరబాట హామీ.. నగుబాటేనోయి!
[ 28-03-2024]
గుంటూరు నగరంలో 11 లక్షల మంది నివసిస్తున్నారు. రోజు వారీగా లక్ష మందికి పైగా రాకపోకలు సాగిస్తుంటారు. 159 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో నగరం విస్తరించింది -
నేతలకు లబ్డబ్బు
[ 28-03-2024]
ఉమ్మడి గుంటూరు జిల్లాలో జనవరి నెల నుంచి ఎన్నికల సందడి మొదలైంది. టికెట్ల ఖరారు కాక ముందే ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారాలు మొదలుపెట్టారు. -
లక్ష్మీకటాక్షం ఉంటేనే దస్త్రం కదిలేది
[ 28-03-2024]
జిల్లాలో కీలకమైన రెవెన్యూ డివిజన్ ఇది. రూ.కోట్ల విలువైన భూముల దస్త్రాలు పరిష్కారానికి వస్తుంటాయి. వాటిని పరిశీలించి దరఖాస్తుదారులకు అనుకూలంగా రాయాలన్నా.. అన్నీ సక్రమంగా ఉన్నా ఉన్నతాధికారికి పంపాలన్నా పైకం ముట్టజెప్పితే కానీ ముందుకు కదలని పరిస్థితి
తాజా వార్తలు (Latest News)
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా