సాయం అందుకో.. భవిత దిద్దుకో..
సత్తెనపల్లికి చెందిన ఇంజినీరింగ్ పట్టభద్రుడు షరీఫ్ ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (పీఎంఈజీపీ)కింద రూ.19 లక్షలు సాయం అందుకుని టిష్యూ కాగితం తయారీ పరిశ్రమను ఏర్పాటు చేసి తాను ఉపాధి పొందడంతోపాటు మరికొందరికి కల్పించారు.
‘పీఎంఈజీపీ’కింద రుణం యూనిట్కు రూ.50 లక్షలకు పెంపు
టిష్యూ కాగితం తయారీ యూనిట్
న్యూస్టుడే, ముప్పాళ్ల: సత్తెనపల్లికి చెందిన ఇంజినీరింగ్ పట్టభద్రుడు షరీఫ్ ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (పీఎంఈజీపీ)కింద రూ.19 లక్షలు సాయం అందుకుని టిష్యూ కాగితం తయారీ పరిశ్రమను ఏర్పాటు చేసి తాను ఉపాధి పొందడంతోపాటు మరికొందరికి కల్పించారు. బ్యాంకు నుంచి అందుకున్న రుణంలో 25 శాతం రాయితీ పొందాడు. ఇదే తరహాలో జిల్లాలో మరికొందరు యువకులు పీఎంఈజీపీ కింద గతంలో సాయం పొంది ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. యువ పారిశ్రామికవేత్తల్ని తయారు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకంలో మార్పులు చేసింది. వాటిపై అవగాహనతో సాయం పొందడం ద్వారా భవితను దిద్దుకునే అవకాశం యువతకు ఉంది.
యువతకు స్వయం ఉపాధి కల్పన.. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల్ని విరివిగా ఏర్పాటు చేసేలా ప్రోత్సహించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పీఎంఈజీపీని అమలు చేస్తోంది. గతంలో ఉన్న ప్రధానమంత్రి రోజ్గార్ యోజన.. గ్రామీణ ఉపాధి కల్పన కార్యక్రమాలు రెండింటిని కలిపి పీఎంఈజీపీగా ఇటీవలే మార్చారు. నిరుద్యోగులు, వృత్తి నైపుణ్యమున్న వారికి ఉపాధి కల్పించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. పీఎంఈజీ కింద దరఖాస్తు చేసుకుంటే యూనిట్ విలువను బట్టి రూ.50 లక్షలు వరకు రుణం పొందొచ్చు. 35 శాతం వరకు రాయితీని అందుకోవచ్చు.
దరఖాస్తు ఎలా
18ఏళ్లు నిండిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రాజెక్టు వ్యయం రూ.5 లక్షల వరకు ఎలాంటి విద్యార్హత అవసరం లేదు. తయారీ రంగంలో రూ.10 లక్షలు, సేవా రంగంలో రూ.5 లక్షలకు పైబడిన వ్యయం కలిగిన ప్రాజెక్టులకు కనీస విద్యార్హత 8వ తరగతిగా నిర్ణయించారు. www.kviconline.gov.in అనే వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. సందేహాలేమైనా ఉంటే జిల్లా పరిశ్రమల కార్యాలయానికి వెళ్లి నివృత్తి చేసుకోవచ్చు.
గరిష్ఠంగా 35 శాతం రాయితీ
పీఎంఈజీపీ ద్వారా ఉత్పత్తి పరిశ్రమలకు గరిష్ఠ పరిమితి రూ.25 లక్షలు ఉండేది. ఉత్పత్తేర సంస్థలకు రూ.10 లక్షలు అందజేసేవారు. నూతన మార్గదర్శకాల మేరకు తయారీ రంగ పరిశ్రమల యూనిట్లకు ఇచ్చే సాయాన్ని రూ.50 లక్షలకు, సేవారంగం యూనిట్లకు రూ.20 లక్షలు ఇస్తున్నారు. యూనిట్ విలువలో గరిష్ఠంగా 35 శాతం, కనిష్ఠంగా 15 శాతం రాయితీ ప్రకటించారు. జనరల్ విభాగంలో పట్టణ ప్రాంతాలకు చెందిన వారైతే 15 శాతం, గ్రామీణులకు 25 శాతం రాయితీ ఇస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులు, మాజీ సైనికులకు పట్టణ ప్రాంతాల్లో వారికి 25 శాతం, గ్రామీణ ప్రాంతాల వారికి 35 శాతం రాయితీ అందుతుంది. గతంలో ఉన్న పరిశ్రమలకు తోడు డెయిరీ, ఆక్వాకల్చర్ యూనిట్లను ఇందులోకి కొత్తగా చేర్చారు.
* స్వయం సహాయక సంఘాలు, జాతీయ చిన్నతరహా పరిశ్రమల కార్పొరేషన్, కేంద్ర గ్రామీణ పరిశ్రమల శిక్షణ సంస్థల ద్వారా వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకున్న వారికి యూనిట్ల ఏర్పాటులో ప్రాధాన్యం ఉంటుంది. కేంద్ర సూక్ష్మ, చిన్న మధ్యతరగతి పరిశ్రమలశాఖ, ఖాదీ, గ్రామ పరిశ్రమల కమిషన్(కేవీఐసీ) ద్వారా పీఎంఈజీపీ పథకాన్ని అమలు చేస్తున్నారు.
* 2022-23 ఆర్థిక సంవత్సరానికి వివిధ రంగాలకు నిధుల కేటాయింపులో సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు రుణాలిచ్చేందుకు పల్నాడు జిల్లాలో రూ.1744 కోట్ల నిధుల్ని కేటాయించారు. ప్రధాన బ్యాంకులన్నీ పీఎంఈజీపీ రుణాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ డీజీపీని బదిలీచేయండి: ఎన్నికల సంఘానికి భాజపా ఫిర్యాదు
[ 25-04-2024]
డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డిని బదిలీ చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయంలో భాజపా నేతలు మరోమారు ఫిర్యాదు చేశారు. -
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం: సినీ నటుడు నిఖిల్
[ 25-04-2024]
బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్థి ఎం.ఎం కొండయ్య గురువారం అట్టహాసంగా నామినేషన్ వేశారు. -
ఏపీలో ముగిసిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ
[ 25-04-2024]
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. -
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు: నారా లోకేశ్
[ 25-04-2024]
ఓట్లు అడగడానికి వచ్చే వైకాపా నేతలను రాజధాని రైతులు నిలదీయాలని యువనేత, మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. -
చదువులమ్మ చెట్టుకు.. రాజకీయ చెద!
[ 25-04-2024]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేరెన్నికగన్న పురాతన విద్యాసంస్థల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఒకటి. దేశ, విదేశాల్లో ఎంతో ఖ్యాతినార్జించిన ఘనత దీని సొంతం. దాదాపు పది, పదిహేను దేశాల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకునేవారు. -
యూజీడీ మూలన.. మాటలు మరుగున
[ 25-04-2024]
నా ముస్లింలు.. నా మైనార్టీలు అంటూ మాటలతో మభ్యపెట్టడమే గానీ సీఎం జగన్కు వారిపై ఏమాత్రం ప్రేమలేదని చెప్పడానికి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తికాని ఉదంతమే నిదర్శనం. -
నాడు వాతలుండవని కోతలు.. నేడు ఛార్జీల మోతలు
[ 25-04-2024]
ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్రెడ్డి రాష్ట్రమంతా తిరిగి చంద్రబాబు పాలనలో కరెంటు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయని విమర్శించారు. తాను అధికారంలోకి వచ్చాక విద్యుత్తు ఛార్జీలు పెంచబోమని హామీనిచ్చారు. -
అభిమాన నీరాజనం
[ 25-04-2024]
జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ నామినేషన్ సందర్భంగా బుధవారం తెనాలిలో నిర్వహించిన ప్రదర్శనకు ప్రజలు భారీగా తరలివచ్చారు. -
పసుపుమయమైన రేపల్లె
[ 25-04-2024]
రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నామినేషన్ దాఖలు కార్యక్రమం బుధవారం కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది. -
అక్రమంగా తవ్వారు.. ప్రాణాలు తీస్తున్నారు!
[ 25-04-2024]
రెండేళ్ల కిందట ప్రత్తిపాడుకు చెందిన నలుగురు కళాశాల విద్యార్థులు ఈతకు బోయపాలెంలోని డైట్ సమీపంలో క్వారీ గుంత వద్దకు వెళ్లారు. -
చందా.. దందా
[ 25-04-2024]
ఎన్నికలంటే ఖర్చులు ఎలా ఉంటాయో మీకు తెలియంది కాదు. -
మిత్ర ద్రోహం
[ 25-04-2024]
పాదయాత్రలో అధికారంలోకి రాగానే గోపాల మిత్రలకు నెలకు రూ.16 వేల గౌరవవేతనం ఇస్తామని హామీ ఇచ్చి గత అయిదేళ్లుగా ఒక్క రూపాయి కూడా పెంచకుండా తమని సీఎం జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని గోపాల మిత్రలు వాపోతున్నారు. -
‘పది’లో ‘ప్రత్యేక’ విజయం
[ 25-04-2024]
అమ్మ ప్రోత్సాహం..అమ్మమ్మ పర్యవేక్షణ..భవిత కేంద్ర టీచర్ల కృషి...ప్రధానోపాధ్యాయురాలి తోడ్పాటు వెరసి 16 ఏళ్ల దివ్యాంగురాలైన జి.శ్రావ్య జోసెఫిన్ పదో తరగతి పూర్తిచేసింది. -
తెదేపా ప్రచార వాహన డ్రైవర్పై వైకాపా దాడి
[ 25-04-2024]
తెలుగుదేశం పార్టీ ప్రచార వాహన డ్రైవర్పై కొందరు వైకాపా నాయకులు దాడి చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. -
ప్రజల గొంతూ తడపలేరా?
[ 25-04-2024]
2018 మార్చి 14వ తేదీన ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి పొన్నూరులో నిర్వహించిన బహిరంగ సభలో పొన్నూరు పట్టణ ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని అప్పటి తెదేపా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. -
రాజీనామా చేయకుంటే అంతుచూస్తాం
[ 25-04-2024]
వాలంటీర్లుగా మీకు ప్రతి ఇంట్లో ఎంత మంది ఓటర్లున్నారు..ఎటు అనుకూలంగా ఉన్నారో తెలుసు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 25-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు రైల్వే అధికారి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?