తీరం... ప్రగతి తరంగం
కలరా విజృంభిస్తే, ఆ ఊళ్లో పదుల సంఖ్యలో జనాలు చనిపోయేవారు.. పరిశుభ్రతపై అవగాహన లేమితో అంటువ్యాధుల వ్యాపించి తీరని నష్టం జరిగేది. గ్రామాల్లో ఒకరో, ఇద్దరో విద్యావంతులు ఉండేవారు.. స్వాతంత్య్రానికి పూర్వం
75 ఏళ్ల ప్రస్థానంలో అభివృద్ధి మలుపులెన్నో
విద్య, వైద్యం, వ్యక్తిగత పరిశుభ్రతలో ప్రత్యేక స్థానం
చెరుకుపల్లి గ్రామీణ, న్యూస్టుడే
కలరా విజృంభిస్తే, ఆ ఊళ్లో పదుల సంఖ్యలో జనాలు చనిపోయేవారు.. పరిశుభ్రతపై అవగాహన లేమితో అంటువ్యాధుల వ్యాపించి తీరని నష్టం జరిగేది. గ్రామాల్లో ఒకరో, ఇద్దరో విద్యావంతులు ఉండేవారు.. స్వాతంత్య్రానికి పూర్వం కీలకమైన రంగాల్లో ఇదీ పరిస్థితి. కానీ పరాయి పాలన నుంచి దేశంలో స్వయం పాలన మొదలైన తరువాత ఎన్నో మార్పులు వచ్చాయి. ఆది నుంచి ఎంతో చైతన్యవంతమైన తీర ప్రాంతంలో ప్రగతి కెరటాలు ఉవ్వెత్తున లేచాయి. విద్య, వైద్య రంగాల్లో ముందడుగు వేయడంతో పాటు స్వచ్ఛత విషయంలో అందరికన్నా మిన్నగా నిలిచింది. స్వాతంత్య్రం సిద్ధించిన 75 ఏళ్ల ప్రస్థానంలో తీరాన వివిధ రంగాల్లో సాధించిన ప్రగతి గురించి తెలుసుకుందామా..
అక్షరం నేర్చిన పల్లె
గాంధీజీ ప్రారంభించిన కావూరులోని జాతీయ పాఠశాల
ఏ ప్రాంతలోనైనా ప్రజలు జ్ఞానవంతులైతేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. స్వాతంత్య్రానికి ముందు నుంచే ఉమ్మడి గుంటూరు జిల్లాలో బోర్డు పాఠశాలలు, ఆశ్రమం పాఠశాలలు వెలిశాయి. ఎంతోమంది ఉద్ధండులు ప్రజలకు అక్షరాలు నేర్పించారు. గొల్లపూడి సీతారాం, పాటిబండ్ల సీˆతారామయ్య వంటి ఎందరో వీధి అరుగులపై ప్రజలకు అక్షరాలు నేర్పి జ్ఞానాన్ని అందించారు. స్వాతంత్య్రం అనంతరం ఎన్నో సంస్కరణలు తీసుకురావడంతో విద్యాభివృద్ధి చోటుచేసుకుంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో అక్షరాస్యత శాతం 65 శాతం దాటింది.
విద్యకు కేంద్రం
స్వాతంత్య్రం పూర్వం నుంచే జిల్లాలో ఆశ్రమ పాఠశాలలు నడిచేవి. 1930 దశకంలో బాపూజీ గుంటూరు, బాపట్ల, చీరాల ప్రాంతంలో పర్యటించి జాతీయ పాఠశాలలకు అంకురార్పరణ చేశారు. ఆయన పిలుపుతో ఎయిడెడ్ పాఠశాలలు తెరుచుకున్నాయి. 1985 ముందు బోర్డు, సమితి బడులు, జూనియర్, డిగ్రీ కళాశాలలు పెద్దఎత్తున నడిచాయి. 1985 తరువాత మండల పరిషత్, జిల్లా పరిషత్ పాఠశాలలు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఊరువాడా వెలిశాయి. ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు అనుమతులు ఇవ్వడంతో ఇవికూడా వేల సంఖ్యలో మొదలయ్యాయి. నేడు అనేక ఇంజినీరింగ్ కళాశాలలు, వ్యవసాయ, సాంకేతిక కళాశాలలతో జిల్లా విద్యకు కేంద్రంగా మారింది. బాపట్ల జిల్లాలో విద్యాలయాల సంఖ్య ఏటేటా పెరుగుతూ వేల సంఖ్యకు చేరింది.
* 1932లో కావూరులో తిలక్ జాతీయ పాఠశాల, బాపట్ల, రేపల్లెలో పాత పట్టణంలోని బోర్డు స్కూల్ అందుబాటులోకి వచ్చిన మొదటి బడులు. 1956 నుంచి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు అందుబాటులోకి వచ్చాయి.
ఆరోగ్యమే మహాభాగ్యం
గతంలో వ్యక్తిగత శుభ్రతపై అవగాహన లేమి, వైద్య సదుపాయాలు అంతంత మాత్రం కావడంతో కలరా, మసూచి, అతిసార వంటి రోగాలు విజృంభించేవి. స్వాతంత్య్రం అనంతరం పాలకులు వైద్యశాలలు ఏర్పాటు చేసి వైద్య సేవలను విస్త్రృతం చేశారు. 1935 నాటికే బ్రిటిష్ ప్రభుత్వం జ్వరాల ఆసుపత్రిని ఇప్పుడున్న గుంటూరు కలెక్టరేట్ వద్ద నిర్వహిం చేవారు. అప్పట్లో ఇది బ్రిటిషు వారికి మాత్రమే సేవలం దించింది. బాపట్ల, రేపల్లెల్లో 1935లో ఏర్పా టైనా 1947 తరువాత ఇవి ప్రజలకు సేవలం దించడం మొదలు పెట్టాయి. 1965 నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 1980 నుంచి సబ్ సెంటర్లు ఏర్పడ్డాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రభుత్వ ఆధ్వర్యంలో వైద్యశాలల ఏర్పాటు భారీగానే జరగడంతో అంటు వ్యాధుల వ్యాప్తి 16 శాతానికి తగ్గింది.
మరుగుదొడ్డే మహామంత్రం
వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడంలో బాపూజీని ఆదర్శంగా తీసుకున్న జిల్లా వాసులు స్వాతంత్య్రం పూర్వం నుంచే మరుగుదొడ్ల వినియోగంపై అవగాహన కలిగి ఉన్నారు. నేడు స్వచ్ఛభారత్ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం బహిరంగ మలవిసర్జన రహిత పల్లెలుగా తీర్చిదిద్దింది. నాడు పల్లెల్లో రోగాలకు మరుగుదొడ్ల వాడకం లేకపోవడం, ఎక్కడపడితే అక్కడ బహిరంగ మల విసర్జన చేయడంతో అంటు రోగాలు, వ్యాధులు ప్రబలాయి. కాలంతోపాటు మార్పులతో ప్రజలను పాలకులు చైతన్యపరుస్తూ స్వచ్ఛతను సాధించారు. * 2018-19లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో 1040 గ్రామాలకు గాను 998 గ్రామాల్లో నూరుశాతం వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకుని రికార్డు సృష్టించాయి. చెరుకుపల్లి పంచాయతీకి ఉత్తమ పంచాయతీగా రెండు సార్లు కేంద్ర ప్రభుత్వం ప్రసంసా పత్రం అందించింది. ఇలాంటి గ్రామాలు ఎన్నో నేడు ఉన్నాయి. నేడు ప్రతిఒక్కరూ మరుగుదొడ్డి విని యోగించడం ద్వారా పల్లెల్లో అంటువ్యాధులు తగ్గాయని సర్వేలు చెబుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పట్టాలెక్కించలేదు.. పట్టించుకోలేదు
[ 29-03-2024]
కృష్ణా పశ్చిమ డెల్టాలోని గుంటూరు, బాపట్ల జిల్లాల పరిధిలో 5 లక్షలకుపైగా ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. ఏటా లక్షల బస్తాల ధాన్యాన్ని రైతులు పండిస్తున్నారు. -
మీ పనులకో దండం!
[ 29-03-2024]
గుంటూరు నగరపాలికలో గడప గడపకు మన ప్రభుత్వం కింద చేసిన అభివృద్ధి పనులకు పది నెలల నుంచి బిల్లులు చెల్లించలేదు. ఇవి రూ.కోట్లలో పేరుకుపోవడంతో వారు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. -
భారీ ఎత్తున సరకుల దిగుమతిపై నిఘా
[ 29-03-2024]
ఎన్నికల కోడ్ నేపథ్యంలో పెద్ద మొత్తాల్లో సరకుల లావాదేవీలు నిర్వహించే సంస్థలపై నిఘా ముమ్మరం చేసినట్లు వాణిజ్య పన్నుల శాఖ గుంటూరు-2 జాయింట్ కమిషనర్ మధుబాబు తెలిపారు. -
మౌనానికి వెలకట్టి.. ముడుపులు మూటకట్టి..
[ 29-03-2024]
ఆ అధికార పార్టీ నేత లక్ష్యం రూ.కోట్లు సంపాదించడమే.. వ్యాపారుల నుంచి వసూళ్లు సాగిస్తున్న వైనంపై ప్రతిపక్ష నేత వేసిన సూటి ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పలేకపోయారు. -
పాలకా.. ఇది తగునా?
[ 29-03-2024]
పొన్నూరు పురపాలక సంఘంలో ఎన్నికల కోడ్ సరిగా అమలు కావడం లేదు. అధికార పార్టీకి ఒక లాగా... ప్రతిపక్ష పార్టీకి మరోలా అమలు చేస్తూ అధికారులు వివక్ష చూపుతున్నారు. -
నిబంధన.. పాటించకుంటే దండన
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) అమల్లోకి వచ్చింది. దీన్ని ఎన్నికల సంఘం చూస్తుంది. జిల్లాలో కలెక్టర్ పర్యవేక్షిస్తుంటారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ఉద్యోగులు ప్రవర్తనా నియమావళి పరిధిలోకి వస్తారు. -
ప్రభుత్వం మారితేనే యువతకు భవిత
[ 29-03-2024]
ప్రజలకు తాగు నీటిని అందించలేని వైకాపా ప్రభుత్వం గంజాయి, మత్తు పదార్థాలను మాత్రం విచ్చలవిడిగా అందుబాటులోకి తీసుకొచ్చి యువతకు తీరని నష్టాన్ని కలిగిస్తోందని ఎన్డీయే గుంటూరు పార్లమెంటు అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శించారు. -
అనుమతి ఒకచోట..ప్రచారం మరోచోట
[ 29-03-2024]
ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రతి ఒక్కరూ పాటించాలని యంత్రాంగం చెబుతుంటే.. అధికార పార్టీకి చెందిన వారు ఉల్లంఘిస్తూనే ఉన్నారు. -
ఎన్నికల ప్రచారంలో వాలంటీరు హల్చల్పై ఫిర్యాదు
[ 29-03-2024]
మండలంలోని కారంపూడిపాడు గ్రామంలో ఈ నెల 22న వైకాపా అభ్యర్థి బలసాని కిరణ్కుమార్కు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వాలంటీరు కె.నరసింహరావు పాల్గొన్నారు. -
రోడ్డునే మింగేసిన ఇసుకాసురులు
[ 29-03-2024]
జనం ఇబ్బంది పడితే మాకేంటి? మా ప్రయోజనం నెరవేరితే చాలనేలా అధికార పార్టీ నేతలు వ్యవహరించారు. అక్రమార్జనకు ఉన్న ఏ అవకాశాన్ని వారు వదులుకోలేదు. -
కోడ్ ఉన్నా.. చోద్యం చూస్తున్నారు!
[ 29-03-2024]
ఈ చిత్రం చూశారా.. కృష్ణా తీరంలోని అమరావతి మండలం మల్లాది రీచ్లో గురువారం రాత్రి వేళ భారీ యంత్రాలతో ఇసుక తవ్వి లారీలకు నింపుతున్నారు. అనుమతి ఉన్న రీచ్లలో సైతం సూర్యాస్తమయం తర్వాత కూలీల చేత కూడా ఇసుక తవ్వకాలు చేయకూడదు. -
బల్లికురవ ఎస్సైపై విచారణకు ఆదేశం
[ 29-03-2024]
అధికార వైకాపా నేతల మెప్పు పొందాలని చూసినా.. బాధితులపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలనుకునే పోలీసు అధికారులు తగు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని చెప్పడానికి తాజాగా బల్లికురవ ఎస్సై నాగశివారెడ్డి ఉదంతమే ఓ నిదర్శనం. -
ఓటరు జాబితాలో మీ పేరుందా?
[ 29-03-2024]
‘సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది... త్వరలో జరగబోయే ఎన్నికల్లో 18 ఏళ్లు నిండిన వారి దగ్గర నుంచి ఓటున్న ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకోవాలి... ఎవరికి వారు తాము వేయకపోతే ఏమవుతుందనే భావన విడనాడాలి. -
నియమావళి అమలు ఇలాగేనా?
[ 29-03-2024]
ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చి 12 రోజులు గడిచింది. అమలుకు సంబంధించి ప్రత్యేకాధికారులను నియమించినా కొన్నిచోట్ల కోడ్ ఉల్లంఘనలు కనపడుతూనే ఉన్నాయి. -
గుండ్లకమ్మ జలాశయంలో మొసలి కలకలం
[ 29-03-2024]
గుండ్లకమ్మ జలాశయంలో మత్స్యకారుడి వలకు మొసలి చిక్కడంతో స్థానికంగా కలకలం రేగింది. అటవీశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. -
కన్ను పడితే కబ్జానే..
[ 29-03-2024]
తిమ్మాయిపాలెం గ్రామంలోని 7.05 ఎకరాలు నక్కలవాగు పేరుతో వాగు పోరంబోకు స్థలం ఉంది. ఇది జాతీయ రహదారికి పక్కనే రోడ్డుకు ఆనుకొని ఉండటంతో దీనిపై వైకాపా నేత గద్దలా వాలిపోయారు. -
వైకాపా ప్రచారంలో క్షేత్ర సహాయకుడు
[ 29-03-2024]
ఎన్నికల కోడ్ వచ్చినా కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు, ఒప్పంద సిబ్బంది ఇంకా వైకాపా ప్రజాప్రతినిధులతో కలిసి ప్రచారంలో పాల్గొంటున్నారు. -
మరెందుకు ఆలస్యం.. రాజీనామా చేయండి..
[ 29-03-2024]
రాజీనామా చేసేయండి.. హాయిగా పార్టీ ప్రచారంలో పాల్గొనండి అంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు వాలంటీర్లకు ఫోన్లు చేస్తున్నారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని, మళ్లీ తీసుకుంటామని ప్రస్తుతానికి అంతా చూసుకుంటామంటూ చెప్పుకొస్తున్నారు. -
ఎత్తిపోతల పథకాలు హుళక్కే
[ 29-03-2024]
పల్నాడు జిల్లాలో వైకాపా పాలన ఐదేళ్లలో కొత్తగా ఒక్క ఎత్తిపోతల పథకం నిర్మించలేదు. నీటి అనుమతులిచ్చి నిధులివ్వకుండా మొండిచెయ్యి చూపారు. -
12 మంది వైకాపా కౌన్సిలర్ల వేరు బాట
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రభావం పురపాలక సంఘంలోని పాలకపక్షంపై పడింది. చిలకలూరిపేట శాసనసభ స్థానంలో అధికార వైకాపా నియోజకవర్గ సమన్వయకర్తల మార్పు వ్యవహారం కౌన్సిలర్ల మధ్య చీలికకు దారి తీసింది. -
పక్కదారి పట్టిన రేషన్ బియ్యం
[ 29-03-2024]
రేషన్ బియ్యం పక్కదారి పట్టడంతో నరసరావుపేటకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. నెల నెలా పేదలకు బియ్యం సక్రమంగా పంపిణీ చేస్తున్నామని చెప్పే అధికారులు ఆ బియ్యం పక్కదారి పడుతున్నా పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఎన్నికల నిబంధనలు బేఖాతర్
[ 29-03-2024]
ఎన్నికల కోడ్ అమలై పదిరోజులు దాటినా నేటికీ పలు చోట్ల అధికారపార్టీ ఆగడాలకు అదుపు లేకుండా ఉంది. క్రోసూరు ఎస్టీ కాలనీ, గాదెవారిపాలెంలోని మంచినీటి పథకం ట్యాంకులకు వైకాపా రంగులు కనిపిస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: అతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
-
సీఎం రేవంత్రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ