దేశభక్తికి ప్రతీక... జాతీయ పతాక
పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో పైలాన్, 100 అడుగుల ఎత్తున భారీ జాతీయ పతాక ఆవిష్కరణ దేశభక్తికి ప్రతీకగా నిలుస్తుందని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖా మంత్రి విడదల రజిని అన్నారు. ఆజాదీ కా అమృత్మహోత్సవాల్లో భాగంగా నరసరావుపేటలో
నరసరావుపేటలో 100 అడుగుల ఎత్తున జాతీయ పతాక రెపరెపలు
నరసరావుపేటలో సిద్ధమైన సభా వేదిక
నరసరావుపేట అర్బన్, న్యూస్టుడే: పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో పైలాన్, 100 అడుగుల ఎత్తున భారీ జాతీయ పతాక ఆవిష్కరణ దేశభక్తికి ప్రతీకగా నిలుస్తుందని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖా మంత్రి విడదల రజిని అన్నారు. ఆజాదీ కా అమృత్మహోత్సవాల్లో భాగంగా నరసరావుపేటలో గుంటూరు క్రాస్రోడ్డులో ఏర్పాటు చేసిన పైలాన్, 100 అడుగుల స్తంభంపై జాతీయ పతాకాన్ని ఆదివారం ఆవిష్కరించారు. మంత్రి రజిని ఆజాదీ పార్కును ముందుగా ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి 15 అడుగుల ఎత్తు, 22 వెడల్పు ఉన్న జాతీయ పతాకాన్ని కలెక్టర్ శివశంకర్, ఎస్పీ రవిశంకర్తో కలిసి ఆవిష్కరించారు. అనంతరం జెండా వందనం చేశారు. పార్కు అభివృద్ధి, పైలాన్ ఏర్పాటు, జాతీయపతాకం ఏర్పాటుకు సహకరించిన దాతలు డాక్టర్ కారసాని శ్రీనివాసరెడ్డి, భూమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నాతాని వెంకటేశ్వర్లు, పొన్నపాటి విజయకృష్ణారెడ్డి, పాతూరి శ్రీనివాసరావు, ఆర్.రామచంద్రారెడ్డిని మంత్రి సత్కరించారు. మంత్రి రజిని, కలెక్టర్, ఎస్పీలు మొక్కలు నాటారు.
స్వాతంత్య్ర వేడుకల ఏర్పాట్ల పరిశీలన
రొంపిచర్ల, న్యూస్టుడే: నరసరావుపేట డీఎస్ఏ స్టేడియంలో ఆగస్టు 15న నిర్వహించే స్వాతంత్య్ర వేడుకల ఏర్పాట్లను కలెక్టర్ శివశంకర్ లోతేటి ఆదివారం పరిశీలించారు. సభావేదిక, వేడుకల ప్రాంగణంలో పల్నాడు జిల్లా వైభవం చాటి చెప్పేలా స్వాతంత్య్ర సమర యోధుల చిత్ర పదర్శన, పర్యాటక ప్రదేశాలు, చరిత్ర, మహనీయుల గత గుర్తులు, ప్రభుత్వ పథకాల ప్రదర్శనలు ఉండాలని సూచించారు. పలు శాఖల స్టాళ్లు, శకటాలు ప్రదర్శన వంటివి అత్యంత రమణీయంగా ఉండాలన్నారు. పోలీసుల గౌరవ వందనం తదితర కార్యక్రమాలతోపాటు అవార్డుల పంపిణీపై అధికారులతో చర్చించారు. సోమవారం ఉదయం 9 గంటలకు జరిగే వేడుకలకు ముఖ్యఅతిథిగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి కారుమూరు వెంకట నాగేశ్వరరావు హాజరవుతున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
రిమోట్ కంట్రోల్ సాయంతో పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి రజిని, ఎమ్మెల్యే గోపిరెడ్డి, కలెక్టర్ శివశంకర్, ఎస్పీ రవిశంకర్రెడ్డి తదితరులు
త్రివర్ణ శోభ
ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా ఆదివారం వినుకొండ పట్టణంలో 800 మీటర్ల జాతీయ జెండాతో ప్రదర్శన నిర్వహిస్తున్న స్థానిక గీతాంజలి పాఠశాల విద్యార్థులు - న్యూస్టుడే, వినుకొండ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుంటూరు జిల్లాలో ప్రబలిన డయేరియా.. 100 మందికి పైగా అస్వస్థత
[ 19-04-2024]
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం మంచాలలో డయేరియా ప్రబలింది. వాంతులు, విరేచనాలతో గ్రామంలో 100 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. -
దశ‘దిశ’లా.. ఆక్రందనలే..!
[ 19-04-2024]
వైకాపా ప్రభుత్వ పదవీకాలం ముగుస్తున్నా ఇప్పటికీ ఆ చట్టానికి కోరలు లేవు. దాన్ని పార్లమెంట్ ఆమోదించలేదు. ఉనికిలో లేని చట్టం గురించి పదేపదే ప్రచారం చేసుకోవడం జగన్ సర్కార్ తీరుగా మారింది. -
జీవితాన్ని కలరా‘జే’సింది..
[ 19-04-2024]
రేపల్లెకు చెందిన మధు ప్రభుత్వ మద్యం తాగి పక్షవాతానికి గురై మంచానికి పరిమితమయ్యాడు. చేతివృత్తి చేసుకుంటూ భార్య ఇద్దరు పిల్లలను పోషించుకునే అతను మద్యం తాగేవాడు. -
సమస్యలు విలీనమై.. బడికి దూరమై..
[ 19-04-2024]
పాఠశాలల విలీనం వల్ల లాభం లేకపోగా టీచర్లకు, పిల్లలకు బాగా అన్యాయం జరిగింది. కొందరు టీచర్లు దూరాన ఉన్న ఉన్నత పాఠశాలలకు వెళ్లలేక పదోన్నతులు వదులుకోవడంతో నష్టపోయారు. అదేవిధంగా పిల్లల పరంగా చూస్తే సర్కారీ బడులకు దూరమయ్యారు. -
ఆరోగ్యం చిదిమేసి.. బతుకుల్ని బుగ్గి‘జే’సి..
[ 19-04-2024]
మద్యపాన నిషేధం చేస్తామని జగన్మోహన్రెడ్డి ఓట్లు దండుకుని తీరా అధికారంలోకి వచ్చాక ఆ మాటే మరిచారు. స్వయంగా ప్రభుత్వమే మద్యం వ్యాపారానికి తెరతీసింది. నాసిరకం మద్యం పోసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడింది. -
అండ నేనన్నావు.. గుదిబండలా మార్చావు..
[ 19-04-2024]
జిల్లాలో వైకాపా ప్రభుత్వ అయిదేళ్ల పాలనలో ఒక్క కొత్త పరిశ్రమ రాకపోగా ఉన్నవి చాలా వరకు మూతపడ్డాయి. పత్తి ఆధారిత పరిశ్రమలైన జిన్నింగ్ పూర్తిగా ఎత్తేయగా.. స్పిన్నింగ్ మిల్లులు అదే దిశగా నడుస్తున్నాయి. -
యువనేతపై ఉప్పొంగిన అభిమానం
[ 19-04-2024]
లోకేశ్ తరఫున నామినేషన్ పత్రాల సమర్పణ సందర్భంగా గురువారం మంగళగిరిలో జనసేన, భాజపా, తెదేపా, ఎమ్మార్పీఎస్ శ్రేణులు భారీ ప్రదర్శన నిర్వహించారు. -
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వినియోగానికి ఆటంకాలు
[ 19-04-2024]
వైకాపా ప్రభుత్వంపై ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. ఇదే అదనుగా పోలింగ్ విధుల్లో పాల్గొనే ఉద్యోగులు అందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోకుండా వ్యూహాత్మకంగా ఉన్నతాధికారులు ఆటంకాలు కలిగిస్తున్నారని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఆరోపిస్తున్నాయి. -
కోన ఆస్తుల విలువ రూ.24.20 కోట్లు
[ 19-04-2024]
బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే కోన రఘుపతి తన కుటుంబ ఆస్తుల విలువను రూ.24.20 కోట్లుగా గురువారం దాఖలు చేసిన ఎన్నికల నామినేషన్ అఫిడవిట్లో పేర్కొన్నారు. -
నలిగిపోతున్న నాలుగో సింహం
[ 19-04-2024]
ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ కల్పించడంలో పోలీసులు పగలు, రాత్రి కష్టపడుతుంటారు. శాంతిభద్రతలను పరిరక్షించే క్రమంలో సంఘ విద్రోహశక్తుల చేతిలో ప్రాణత్యాగాలకు సైతం వెనకాడరు. -
కర్షకుల కష్టాలు కనిపించవా..?
[ 19-04-2024]
పెదవడ్లపూడి ఉన్నత వాహినిపై ఎత్తిపోతల పథకం పూర్తి చేసి రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే ఆర్కే హామీ ఇచ్చారు. కానీ అమలు చేయడం మర్చిపోయారు. -
వైకాపా ప్రభుత్వ నిర్ణయ లోపం.. విద్యార్థులకు శాపం
[ 19-04-2024]
‘మీ పిల్లలు బడిలో భోజనం చేయకపోతే మీకు వస్తున్న ప్రభుత్వ పథకాలు నిలిచేపోయే అవకాశం ఉంది’అని తల్లిదండ్రుల సమావేశాల్లో ఉపాధ్యాయులు చెబుతున్నా.. నాణ్యత లేకపోవడంతో చాలా మంది విద్యార్థులు -
‘అవినీతి పాలనకు చరమగీతం పాడుదాం’
[ 19-04-2024]
అసమర్థ, అవినీతి పాలనకు చరమగీతం పాడుదామని గుంటూరు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. కొల్లిపరలో గురువారం సాయంత్రం నిర్వహించిన రోడ్షోలో ఆయన మాట్లాడుతూ వైకాపా పాలకులకు పోలవరం పట్టలేదు, -
ఎప్పటికి తొలగిస్తారో!
[ 19-04-2024]
పట్టణ పరిధి జీబీసీ రహదారిలో విద్యుత్తు స్తంభానికి సీఎం జగన్, స్థానిక ఎమ్మెల్యే రోశయ్య, వైకాపా నేతల ఫొటోలతో కూడిన బోర్డు ఉంది. -
మొదలైన నామినేషన్ల పర్వం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో గురువారం నుంచి జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల పర్వం మొదలైంది. ఈ క్రమంలో నెల రోజులుగా పలు విధాలుగా ప్రచార కార్యక్రమాలు చేపట్టిన పార్టీలు ఇప్పటికే నామినేషన్ పత్రాలు పూర్తి చేసి మంచి ముహూర్తం కోసం వేచి ఉన్నారు. -
ఫోన్పే చేయమన్నాడు.. అదృశ్యమయ్యాడు!
[ 19-04-2024]
అద్దంకి పురపాలక కార్యాలయం వద్ద మంచినీటి కుళాయి రుసుం చెల్లించేందుకు వచ్చిన వృద్ధుడ్ని ఓ ఘరానా దొంగ మోసగించాడు. ఈ సంఘటన గురువారం ఉదయం పురపాలక పన్నుల విభాగం వద్ద జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సింగ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?