సామాజిక సేవకులు!
వారంతా గుంటూరు వైద్య కళాశాలలో సహోధ్యాయులు.. విద్యార్థులుగా ఊపిరి సలపనంత పని. ఖాళీ దొరికేది వారాంతాల్లోనే.. ఆ సమయాన్నే సామాజిక సేవకు వినియోగిస్తోంది విద్యార్థుల బృందం. సమాజ సేవలోనూ రాణిస్తున్నారు. తమ ఆలోచనలకు అనుగుణంగా
ఆదర్శంగా వైద్య విద్యార్థులు
వైద్య శిబిరంలో స్పర్శ బృంద సభ్యులు
గుంటూరు వైద్యం, న్యూస్టుడే: వారంతా గుంటూరు వైద్య కళాశాలలో సహోధ్యాయులు.. విద్యార్థులుగా ఊపిరి సలపనంత పని. ఖాళీ దొరికేది వారాంతాల్లోనే.. ఆ సమయాన్నే సామాజిక సేవకు వినియోగిస్తోంది విద్యార్థుల బృందం. సమాజ సేవలోనూ రాణిస్తున్నారు. తమ ఆలోచనలకు అనుగుణంగా కార్యక్రమాలను రూపొందించుకుని ముందుకు సాగుతున్నారు. ఇందుకోసం ‘స్పర్శ’ పేరుతో బృందాలుగా ఏర్పడి సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కొవిడ్ బాధితులకు అండగా నిలిచారు. విద్య, వైద్యం అందించే ప్రధాన లక్ష్యంతో వారు పని చేస్తున్నారు. ఇటీవలే ప్లాస్టిక్ వాడకంతో కలిగే దుష్ప్రభావాలపై ఎన్టీఆర్ స్టేడియంలో ఫ్లాష్మాబ్ నిర్వహించారు. ఆదర్శంగా నిలుస్తున్న ‘స్పర్శ’ బృందంపై ‘న్యూస్టుడే’ అందిస్తున్న ప్రత్యేక కథనం.
300 మంది సభ్యులు
2018, మే 28న స్పర్శ సంస్థ ప్రారంభమైంది. అప్పుడు ఈ సేవా బృందంలో ఆరుగురు సభ్యులుండేవారు. వీరు నిర్వహిస్తున్న కార్యక్రమాలను చూసి స్ఫూర్తి పొందినవారు సభ్యులుగా చేరేందుకు మరికొంతమంది ఆసక్తి కనబరిచారు. ప్రస్తుతం 300 మంది క్రియాశీలకంగా ఉన్నారు. అంతా యువతే. వాట్సాప్ వేదికగా ఒకరికొకరు సమన్వయం చేసుకుంటారు.
ప్రభుత్వ పాఠశాలల బాట
గుంటూరు నగరంలోని ఎంపిక చేసుకున్న ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి అక్కడ విద్యార్థులకు ఆరోగ్య విషయాలపై అవగాహన కల్పిస్తున్నారు. అంతేగాకుండా చదువు పట్ల ఆసక్తి పెరిగేవిధంగా కథలు చెప్పేవారు. పేద విద్యార్థులకు పుస్తకాలు, ఇతర సామగ్రిని సమకూర్చేవారు. విద్యార్థినులకు కౌమార దశలో వచ్చే మార్పులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను విద్యార్థినులు సవివరంగా తెలియజేస్తున్నారు. బడి మానేసిన విద్యార్థులను గుర్తించి వారిని తిరిగి పాఠశాలల్లో చేరేవిధంగా ప్రోత్సహిస్తున్నారు. చదువుకుంటే కలిగే లాభాలను తల్లిదండ్రులకు చెప్పి వారిని ఒప్పించేవారు. అనాథ, వృద్ధాశ్రమాలకు వెళ్లి వారికి అవసరమైన ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వ్యాధి తీవ్రత ఉన్నవారిని గుర్తించి ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స అందేవిధంగా చూస్తున్నారు. శివారు కాలనీల్లో నివసిస్తున్న మహిళలకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పిస్తున్నారు. నెలసరి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తున్నారు.
సరదాలు వదిలి...
స్పర్శ సభ్యులంతా సామాజిక సేవ మా బాధ్యత అని భావించే మంచి మనసున్నవారు. వైద్య విద్యార్థులకు రోజంతా తీరిక లేకుండా హడావుడి. జీవితంలో సెలవు దొరికేది ఏ వారాంతమో, ఆ కొద్ది సమయాన్నీ సేవకే కేటాయిస్తున్నారు. సమాజానికి ఎంతో కొంత చేయాలనే తపనకు తోడు సహోధ్యాయుల సహకారంతోనే ఇది సాధ్యమవుతోంది అంటాడు వంశీ.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
[ 24-04-2024]
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ పోలీస్ కమిషనర్గా పీహెచ్డీ రామక్రిష్ణను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
పింఛన్లు ఇంటివద్దే ఇచ్చేలా ఆదేశించండి: ఈసీకి చంద్రబాబు లేఖ
[ 24-04-2024]
పింఛన్దారులకు మే నెల పింఛను వారి ఇంటి వద్దే ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు కోరారు. -
వైకాపా ఎంపీ నందిగం సురేశ్పై వాలంటీర్ ఆనంద్బాబు పోటీ
[ 24-04-2024]
వైకాపా ఎంపీ నందిగం సురేశ్పై ఓ వాలంటీరు పోటీకి దిగుతున్నారు. -
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
[ 24-04-2024]
పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామంలో 50, జంగమేశ్వరపాడు గ్రామంలో 30 కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
[ 24-04-2024]
ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. -
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
[ 24-04-2024]
సీఎం జగన్పై గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ను కస్టడీకి అనుమతిస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
వైఎస్ఆర్ను తిట్టిన బొత్స.. జగన్కు తండ్రి సమానులా?: షర్మిల
[ 24-04-2024]
మంత్రి బొత్స సత్యనారాయణ తండ్రి సమానులంటూ సీఎం జగన్ (YS Jagan) చేసిన వ్యాఖ్యలపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) స్పందించారు. -
కన్నేసి.. కబ్జా చేసి..!
[ 24-04-2024]
వైకాపా నేతలు అధికారం అండతో అయిదేళ్లు బరితెగించారు. యథేచ్ఛగా పేదల భూములు ఆక్రమించారు. దేవుడి మాన్యాలను వదల్లేదు. ఖాళీ స్థలాలు, ప్రభుత్వ, వాగులు, వంకలు, డొంక రోడ్లు కావేవి కబ్జాకు అనర్హం అన్నట్లు భూదందాలు సాగించారు. -
వైకాపా పాలనలో బాదుడే.. బాదుడు
[ 24-04-2024]
పొన్నూరు నియోజకవర్గంలో సుమారు 55,275 విద్యుత్తు సర్వీసులు ఉన్నట్లు విద్యుత్తుశాఖ అధికారక గణాంకాలు వెల్లడించాయి. -
నాడంతా నటన.. ఓటేశాక వంచన..
[ 24-04-2024]
చంద్రబాబు పాలనలో విద్యుత్తు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయి. మేం అధికారంలోకి వచ్చాక విద్యుత్తు ఛార్జీలు పెంచబోం. -
అంతా... మా ఇష్టం
[ 24-04-2024]
పొన్నూరు రిటర్నింగ్ కార్యాలయం మార్పు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల అధికారులు అవగాహన లోపంతో తీసుకున్న నిర్ణయంతో గుంటూరు-బాపట్ల ప్రధాన రహదారిలో రాకపోకలు సాగించే వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. -
ఇదేమి చోద్యం జగన్!
[ 24-04-2024]
విజయవాడ, గుంటూరు నగరాలతో పాటు శివారు ప్రాంతాలను కలిపితే జనాభా 30 లక్షలకుపైనే. ఈ రెండు నగరాల మధ్య జాతీయ రహదారి మీదుగా నిత్యం కొన్ని వేల వాహనాలు -
కోన రఘుపతి.. ఓ భూబకాసురుడు
[ 24-04-2024]
దొంగలు, భూబకాసురులు, అవినీతిపరులకు సీఎం జగన్ వైకాపా తరఫున ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. -
శివాలెత్తిన ఎస్సై నాగశివారెడ్డి
[ 24-04-2024]
ఎమ్మెల్యే ఏలూరి నామినేషన్ పత్రాలు అందజేసేందుకు మంగళవారం పర్చూరు ఆర్వో కార్యాలయానికి వచ్చిన సందర్భంలో అక్కడ విధుల్లో ఉన్న ఎస్సై నాగశివారెడ్డి తెదేపా పర్చూరు మండల అధ్యక్షుడు షేక్ షంషుద్దీన్ను అసభ్య పదజాలంతో దూషించారు. -
నాదెండ్ల మనోహర్ నామినేషన్
[ 24-04-2024]
జనసేన, తెదేపా, భాజపా కూటమి తెనాలి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ బుధవారం నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ఆయన కార్యాలయ వర్గాలు మంగళవారం తెలిపాయి. -
అట్టహాసంగా తెదేపా అభ్యర్థుల నామినేషన్
[ 24-04-2024]
తెదేపా బాపట్ల లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు తెన్నేటి కృష్ణప్రసాద్, వేగేశన నరేంద్రవర్మ నామినేషన్ల కార్యక్రమం మంగళవారం అట్టహాసంగా జరిగింది. -
రోడ్డుపై రోడ్డు
[ 24-04-2024]
ప్రజాధనం దుర్వినియోగానికి ఇది పరాకాష్ఠ. ఓ అధికార పార్టీ నాయకుడు చెప్పాడని..పదేపదే స్పందన, సీఎంవోకు ఫిర్యాదులు చేస్తున్నాడన్న కారణంతో అధికారులు గుంటూరు పలకలూరురోడ్డు సాయిబాబానగర్ ప్రధాన రోడ్డులో బాగున్న సీసీ రహదారిపైనే యథావిధిగా మరో రోడ్డు వేస్తున్నారు. -
పండగ చేస్తానన్నావ్.. ప్రాణాలు తీస్తున్నావ్
[ 24-04-2024]
వ్యవసాయం దండగ కాదు.. పండగ చేస్తామని ఊదరగొట్టిన ముఖ్యమంత్రి జగన్ ఆచరణలో రైతులను గాలికొదిలేశారు. సాగుకు బ్యాంకుల నుంచి రుణాలు అందక.. అధిక వడ్డీలకు తెచ్చి పంట పండిస్తే గిట్టుబాటు ధర దక్కక రైతు కునారిల్లాడు.. -
‘పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసిన సీఎం’
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్ మెడికల్ సీట్లను కూడా వదల్లేదని కేటగిరీల వారీగా విభజించి పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసి సీట్లను అమ్ముకున్నారని యువనేత, -
‘తెనాలిని గంజాయికి అడ్డాగా మార్చేశారు’
[ 24-04-2024]
ఆంధ్రా ప్యారిస్ను ఇక్కడి సిటింగ్ వైకాపా ఎమ్మెల్యే గంజాయి అడ్డాగా మార్చారని పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల ఆరోపించారు.