సర్కారు భూములు సమర్పయామి
భూముల విలువ పెరుగుతున్నంత వేగంగా ప్రభుత్వ భూములు పరాధీనమవుతున్నాయి. ఎకరం రూ.లక్షల ధర పలుకుతుండటంతో సర్కారు భూములను ఆక్రమించి సాగు చేపట్టి ప్రైవేటు ఒప్పందాలతో ఇతరులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఈక్రమంలో కొండలు, గుట్టలు కూడా వదిలిపెట్టడం లేదు
రూ.లక్షల విలువైనవి పరాధీనం
ఈనాడు, అమరావతి, న్యూస్టుడే, నకరికల్లు
నర్శింగపాడు పురిబోడు వద్ద ఆక్రమించిన భూములు
భూముల విలువ పెరుగుతున్నంత వేగంగా ప్రభుత్వ భూములు పరాధీనమవుతున్నాయి. ఎకరం రూ.లక్షల ధర పలుకుతుండటంతో సర్కారు భూములను ఆక్రమించి సాగు చేపట్టి ప్రైవేటు ఒప్పందాలతో ఇతరులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఈక్రమంలో కొండలు, గుట్టలు కూడా వదిలిపెట్టడం లేదు. సాగుకు పనికివస్తుందంటే కొండపైకి వెళ్లి కూడా ఆక్రమణలు చేస్తున్నారు. ఇదంతా భూమి లేని నిరుపేదలు చేస్తున్నారనుకుంటే పొరపాటే. నేతల అండదండలు.. పట్టా భూములు ఉన్న రైతులు.. యంత్రాంగం సహకారంతో కొందరు యథేచ్ఛగా ఆక్రమణలు చేస్తున్నారు. దర్జాగా ఆక్రమించి సాగు చేయడమే కాకుండా బోరుబావులు తవ్వి విద్యుత్తు కనెక్షన్ తీసుకుని పంటలు సాగు చేస్తున్నారు. ఆక్రమిత భూములను కొందరు ఇతరులకు విక్రయించి సొమ్ము చేసుకోవడం గమనార్హం. ఇదీ నకరికల్లు మండలం నర్సింగపాడు గ్రామంలో పురిబోడు చుట్టూ జరిగిన ఆక్రమణల తీరు.
ఆనవాలు కోల్పోతున్న పురిబోడు
నర్సింగపాడు ఆనుకుని సర్వే నంబరు 97లో సుమారు 110 ఎకరాల్లో పురిబోడు కొండ ప్రాంతం ఉంది. ఇది ప్రభుత్వ భూమి. ఎర్రమట్టి, రాళ్లతో నిండి ఉంది. ఇక్కడ విలువైన క్రిస్టల్ ఖనిజం ఉన్నట్లు గుర్తించారు. పురిబోడులో పశువులు, గొర్రెలు మేత మేయడంతోపాటు గ్రామంలో సామాజిక అవసరాలకు ఉపయోగపడుతోంది. గతంలో నడికూడి-శ్రీకాళహస్తి రైల్వేప్రాజెక్టుకు అవసరమైన మట్టి తవ్వకాల నిమిత్తం పురుబోడు వద్ద తాత్కాలికంగా అనుమతులు ఇచ్చారు. ఇది అక్రమార్కులకు వరంగా మారింది. అప్పట్లో మట్టి తరలించగా ఏర్పడిన గోతులను చదును చేసి పంటలు సాగు చేశారు. సారవంతమైన భూములు కావడంతో ఆక్రమణలు విస్తరించాయి. ఇటీవల ఏకంగా మట్టిని అక్రమంగా తవ్వి తరలించిన తర్వాత చదును చేసి సాగుచేస్తున్నారు. సుమారు 60 ఎకరాల వరకు ఆక్రమణకు గురైంది. పురిబోడు కింద భాగంలో 1999లో 27మంది పేదలకు 17.33 ఎకరాల విస్తీర్ణంలో డీకేటీ పట్టాలు ఇచ్చారు. ఆ భూమి పోగా మిగిలిన విస్తీర్ణం ఆక్రమణలో ఉంది. ఇటీవల ఇక్కడ మట్టి తవ్వకాలు, భూముల ఆక్రమణలు విస్తరిస్తున్నాయి. ఎకరం భూమి బహిరంగమార్కెట్లో రూ.20లక్షల నుంచి రూ.25లక్షలు పలుకుతోంది.
విస్తరించిన ఆక్రమణలు
పురిబోడు చుట్టూ ఆక్రమించిన వ్యక్తులు క్రమంగా కొండపైకి వెళ్లి చదును చేయడం ఆరంభించారు. కొండపైన ఎర్రమట్టి ఉన్న ప్రాంతంలో తొలుత తవ్వకాలు చేసి రాళ్లు పక్కన పోసి మట్టి అమ్ముకుంటున్నారు. ఇలా కొన్ని సెంట్లలో తవ్విన తర్వాత ఆ ప్రాంతాన్ని చదునుగా చేసి పంటల సాగుకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. కొండపైన చదును చేసిన భూమిలో వివిధ రకాలు పంటలు పండిస్తున్నారు. ఇందులో ఎక్కువ మంది పెద్ద రైతులు ఉండటం గమనార్హం. ఇదే పరిస్థితి కొనసాగితే సామాజిక అవసరాలకు కూడా ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండదు. పురిబోడు ప్రాంతంలో కొంత విస్తీర్ణంలో ఇటీవల జగనన్న కాలనీకి కేటాయించి పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఇదంతా నకరికల్లు-కారంపూడి మార్గంలో నర్సింగపాడు వద్ద ప్రధాన రహదారి పక్కనే జరుగుతున్నా యంత్రాంగం పట్టించుకోకపోవడం గమనార్హం. గ్రామంలో రీసర్వే ప్రక్రియ చేపట్టామని, ఇందులో ప్రభుత్వ భూములు గుర్తిస్తామని నకరికల్లు తహశీల్దార్ ఎస్.సురేష్ చెప్పారు. పురిబోడు వద్ద కొందరికి డీకేటీ పట్టాలు ఇచ్చారు. రీసర్వేలో వీటిని పరిశీలించి మిగిలిన ఆక్రమణలపై చర్యలు తీసుకుంటా మన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు: నారా లోకేశ్
[ 25-04-2024]
ఓట్లు అడగడానికి వచ్చే వైకాపా నేతలను రాజధాని రైతులు నిలదీయాలని యువనేత, మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. -
చదువులమ్మ చెట్టుకు.. రాజకీయ చెద!
[ 25-04-2024]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేరెన్నికగన్న పురాతన విద్యాసంస్థల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఒకటి. దేశ, విదేశాల్లో ఎంతో ఖ్యాతినార్జించిన ఘనత దీని సొంతం. దాదాపు పది, పదిహేను దేశాల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకునేవారు. -
యూజీడీ మూలన.. మాటలు మరుగున
[ 25-04-2024]
నా ముస్లింలు.. నా మైనార్టీలు అంటూ మాటలతో మభ్యపెట్టడమే గానీ సీఎం జగన్కు వారిపై ఏమాత్రం ప్రేమలేదని చెప్పడానికి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తికాని ఉదంతమే నిదర్శనం. -
నాడు వాతలుండవని కోతలు.. నేడు ఛార్జీల మోతలు
[ 25-04-2024]
ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్రెడ్డి రాష్ట్రమంతా తిరిగి చంద్రబాబు పాలనలో కరెంటు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయని విమర్శించారు. తాను అధికారంలోకి వచ్చాక విద్యుత్తు ఛార్జీలు పెంచబోమని హామీనిచ్చారు. -
అభిమాన నీరాజనం
[ 25-04-2024]
జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ నామినేషన్ సందర్భంగా బుధవారం తెనాలిలో నిర్వహించిన ప్రదర్శనకు ప్రజలు భారీగా తరలివచ్చారు. -
పసుపుమయమైన రేపల్లె
[ 25-04-2024]
రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నామినేషన్ దాఖలు కార్యక్రమం బుధవారం కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది. -
అక్రమంగా తవ్వారు.. ప్రాణాలు తీస్తున్నారు!
[ 25-04-2024]
రెండేళ్ల కిందట ప్రత్తిపాడుకు చెందిన నలుగురు కళాశాల విద్యార్థులు ఈతకు బోయపాలెంలోని డైట్ సమీపంలో క్వారీ గుంత వద్దకు వెళ్లారు. -
చందా.. దందా
[ 25-04-2024]
ఎన్నికలంటే ఖర్చులు ఎలా ఉంటాయో మీకు తెలియంది కాదు. -
మిత్ర ద్రోహం
[ 25-04-2024]
పాదయాత్రలో అధికారంలోకి రాగానే గోపాల మిత్రలకు నెలకు రూ.16 వేల గౌరవవేతనం ఇస్తామని హామీ ఇచ్చి గత అయిదేళ్లుగా ఒక్క రూపాయి కూడా పెంచకుండా తమని సీఎం జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని గోపాల మిత్రలు వాపోతున్నారు. -
‘పది’లో ‘ప్రత్యేక’ విజయం
[ 25-04-2024]
అమ్మ ప్రోత్సాహం..అమ్మమ్మ పర్యవేక్షణ..భవిత కేంద్ర టీచర్ల కృషి...ప్రధానోపాధ్యాయురాలి తోడ్పాటు వెరసి 16 ఏళ్ల దివ్యాంగురాలైన జి.శ్రావ్య జోసెఫిన్ పదో తరగతి పూర్తిచేసింది. -
తెదేపా ప్రచార వాహన డ్రైవర్పై వైకాపా దాడి
[ 25-04-2024]
తెలుగుదేశం పార్టీ ప్రచార వాహన డ్రైవర్పై కొందరు వైకాపా నాయకులు దాడి చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. -
ప్రజల గొంతూ తడపలేరా?
[ 25-04-2024]
2018 మార్చి 14వ తేదీన ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి పొన్నూరులో నిర్వహించిన బహిరంగ సభలో పొన్నూరు పట్టణ ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని అప్పటి తెదేపా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. -
రాజీనామా చేయకుంటే అంతుచూస్తాం
[ 25-04-2024]
వాలంటీర్లుగా మీకు ప్రతి ఇంట్లో ఎంత మంది ఓటర్లున్నారు..ఎటు అనుకూలంగా ఉన్నారో తెలుసు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 25-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు రైల్వే అధికారి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్